Nara Lokesh Babu
-
‘డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి’
రాజమండ్రి: మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు.వైఎస్సార్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ ద్వారా అత్యంత పాదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకి రూ.4 వేల కోట్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. 2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఐదేళ్లలో ఇసుక పేరుతో 19 జీవోలు ఇచ్చి రకరకాలుగా ఇసుక దోపిడీకి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చినవైఎస్సార్సీపీ ఇసుక విధానంలోనే దోపిడీ జరిగి ఉంటే, ఉచిత ఇసుక అంటూ ఖజానాకి ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్న కూటమి వల్ల ఇంకెంత నష్టం జరిగి ఉండాలని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారని,వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు.ఆయన ఇంకా ఏమన్నారంటే.. 80 లక్షల టన్నుల ఇసుక నెలరోజుల్లో లేపేశారుఒకపక్క డీఎస్సీ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరలేపింది. గత ప్రభుత్వంలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారంటూ ఈనాడు పత్రిక రాయించి ఒక అక్రమ కేసును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక అక్రమాల గురించి చంద్రబాబు అండ్ కో మాట్లాడటమే పెద్ద జోక్. ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందేమో చూపించాలి. మా ప్రభుత్వంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున, ఐదేళ్లలో నాలుగువేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేసి మొత్తం దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవక ముందే సగం ఇసుకను టీడీపీ నాయకులు కాజేశారు. గోదావరి జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే కేవలం ఇసుక ద్వారానే నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారు.ఇసుక విధానంపై రోజుకో మాటచంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వాదించినట్టుగా గత ఐదేళ్లవైఎస్సార్సీపీ పాలనలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారనేది వారి దృష్టిలో నిజమే అయినా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకెన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగి ఉండాలి? ఈ రెండేళ్లలో ఎంత ఇసుకను దోచేశారు. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకి చేరకుండా ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? ఇప్పుడే కాదు, 2014-19లో కూడా మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేశారు. అదే వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఆరోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా వారి మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూటమి నాయకుల ఇసుక దందాను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి అందుకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షించేదాకా పోరాడుతాం. నాడు పారదర్శకంగా ఇసుక ఈ టెండర్లు.. ఖజానాకి రూ.4 వేల కోట్ల ఆదాయంగత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశాం. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందేలా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ పాం మీద ఈ-టెండర్లు నిర్వహించాం. రీచ్ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేయడం జరిగింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించాం. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చాం. ప్రజలకు ఒకవైపు తక్కువ ధరకు ఇస్తూనే మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేశాం. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేశాం.డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలిసంక్షేమం, అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించడానికి నారా లోకేష్ చేసిన సవాల్నువైఎస్సార్సీపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా నేను స్వీకరిస్తున్నా. దీనిపై బహిరంగ చర్చకు ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. డీఎస్సీలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూటిగా చెప్పగలరా? సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రాలేదని చెబుతున్నారు. కానీ, ఇదే నవీన్ ప్రభుత్వం తన ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ రాకుండా చేసిందని హైకోర్టును కూడా ఆశ్రయించారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా మీడియా ముందుకొచ్చివైఎస్సార్సీపీ, డీఎస్సీ రాసి ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు చెబితే డీఎస్సీలో ఎలాంటి మోసం జరగలేదని ప్రజలు నమ్ముతారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు కేటాయించారు? ఏ నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగాలిచ్చారో బయటపెట్టాలి. టీచర్ ఉద్యోగం కోసం రూ. 15 లక్షలు వసూలు చేశారని బయటకొచ్చిన ఆడియో టేపుల ద్వారా స్పష్టంగా తేలిపోయింది. దీనికి కూడా మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి
నెల్లూరురూరల్: డీఎస్సీ–2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని శ్రీపొట్టిశ్రీరాములు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టామని, ఆ ఆరోపణలకు తూతూమంత్రంగా అధికారులు ఖండన ఇచ్చారని, మేం లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదన్నారు.డీఎస్సీ అక్రమాలపై జూన్ 1న కలెక్టరేట్ల ముట్టడిని నిర్వహిస్తున్నామని, ఈ స్కాంపై ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా పోస్టులు అమ్ముకుందన్నారు. అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక కూడా తుది జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయని, మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్టు రెండూ ప్రకటించకుండా ఎంపిక చేసిన అభ్యర్థులకు నేరుగా మెసేజ్ల ద్వారా సమాచారం ఇచ్చారన్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రభుత్వం పిలిచిందని, కానీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని, అటు వారిని రిజెక్టెడ్ జాబితాలోనూ చూపలేదని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.అభ్యర్థులు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా, బేఖాతరు చేస్తూ అప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు కోర్టుకు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. డీఎస్సీ ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం, సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం, తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేశారన్నారు. అలా పరీక్ష రాసిన అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ పరిశీలించే వీలు లేకుండా చేశారన్నారు.మామూలుగా ఏ పరీక్షలో అయినా, మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత సెలక్షన్ లిస్టు తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని, కానీ, ఈ డీఎస్సీ–2025లో మాత్రం మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థులకు ఒక పోస్టుకు ఒకరిని చొప్పున మాత్రమే ఎంపిక చేసి, సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారని, చివరకు వారికి కూడా మొండిచేయి చూపారన్నారు. అందుకే డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. బయటపడ్డ లోకేష్ స్కాముల చిట్టా..
-
నువ్వు చేసేది నువ్వు చెయ్యి.. దానికి ఫలితం ఖచ్చితంగా మేమిస్తాం
-
అసలు ఏలా స్కామ్ చేశారంటే? సంచలన నిజాలు బయటపెట్టిన DSC అభ్యర్థి
-
స్కాం ఎలా చేశారంటే..? కోట్లల్లో డీల్.. బయటపడ్డ లోకేష్ DSC స్కాం
-
హైబ్రిడ్ వంకాయలు, టమాటాలు చూశా.. హైబ్రిడ్ మహానాడు ఏందిరా స్వామి
-
వీళ్ళ బండారం ఎలా బయట పడిందంటే క్లుప్తంగా వివరించిన అంబటి
-
కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ (ఫొటోలు)
-
విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నమంత్రి నారా లోకేష్..
-
ఎన్టీఆర్ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు)
-
మహానాడులో లోకేష్ వ్యాఖ్యలపై ఇరకాటంలో టీడీపీ
-
‘సకల శాఖల మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే’
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అనంతపురం..డీఎస్సీ స్కాంపై విద్యార్థి సంఘాల ఆగ్రహంఅనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విద్యార్థి విభాగం నేతలువిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఉరేసుకుని విద్యార్థుల వినూత్న నిరసనటీడీపీ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్విద్యార్థి విభాగం నేతల ఆందోళనకు సంఘీభావం తెలిపిన డీఎస్సీ అభ్యర్థులు గుంటూరు..పానుగంటి చైతన్య వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షుడు కామెంట్స్..ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు.అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించకుండా ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందిప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఒక అక్రమాల పుట్టడీఎస్సీ పరీక్ష గందరగోళంగా మారిందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారించాలివిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిమాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్...ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీపరీక్షలు నిర్వహించే వారు ఎలా డీఎస్సీ పరీక్ష రాస్తారులోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారుస్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగాలను లోకేష్ అమ్ముకున్నారులోకేష్ కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..దేశంలో చంద్రబాబు లాంటి దరిద్రపు ప్రభుత్వం ఎక్కడా లేదుయువకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందిడీఎస్సీ లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలినారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలికర్నూలు..ఎమ్మెల్యే వీరుపాక్షి కామెంట్స్..రాష్ట్రంలో చంద్రబాబు పాలన రాక్షస పాలన.రాష్ట్రంలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మార్చి అభ్యర్థులను రోడ్డున పడేశారు.మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందివిద్యాశాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.డీఎస్సీలో మెరిట్ విద్యార్థుల పేర్లను మంత్రి లోకేష్ తప్పించారు.అభ్యర్థులు నుండి నేరుగా డబ్బులు ముట్టినట్లు సమాచారం.డీఎస్సీలో అన్యాయం జరిగిందని అడిగితే కేసులు పెడుతున్నారు.డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ..డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరుబాట..డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలి పార్టీ శ్రేణుల ఆందోళన..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నేతలు..కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవి బాబు తదితరులు..నెల్లూరు..నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనడీఎస్సీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై ఆందోళననియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆగ్రహంనిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి, కూటమి ప్రభుత్వ పరిపాలన లోపంపై మండిపాటుఎస్వీ యూనివర్సిటీ ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమంలో భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.భూమన కామెంట్స్..డీఎస్సీ అక్రమాలకు బాధ్యత చేస్తూ రాజీనామా చేయాలిఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారుఓసీ ఓపెన్ కటాఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు అన్యాయం చేశారుబీసీ, ఎస్సీ, ఎస్టీలు మెరిట్లో వచ్చినా రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేశారు, ఓపెన్ కేటగిరిలో అన్యాయం చేశారుఓపెన్ కేటగిరి కటాఫ్ బయట పెట్టాలిరిజర్వేషన్ లేకుండా కొన్ని లక్షలు మందికి అన్యాయం చేశారుదీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.స్పోర్ట్స్ కోటాలో అదనపు కోట కలిపి, శాప్ చైర్మన్ రవినాయుడు అర్హత లేని వారికి ఉద్యోగాలు3.50 లక్షలు మంది డీఎస్సీ రాస్తే.. వాళ్లకు కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చాయిప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వ్యాఖ్యలు..మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలిదీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.సకల శాఖ మంత్రి నారా లోకేష్ భారీ ఎత్తున కోట్లు అవినీతికి పాల్పడ్డారు -
జూమ్ లోకి కొడాలి నాని, వంశీ వస్తే ప్యాంటు తడుపుకున్నావ్.. లోకేష్ వ్యాఖ్యలపై రోజా రెటైర్లు
-
నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ.. మాట్లాడితే గొడ్డలి గొడ్డలి.. కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
లోకేష్ మహానాడు.. రికార్డింగ్ డ్యాన్సులు.. పరువు తీశారు కాదయ్యా..
-
లోకేశ్.. నీ ఘన చరిత్ర అందరికీ తెలుసులే!
సాక్షి, అమరావతి: డీఎస్సీలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్కు వైఎస్సార్సీపీ హితవు పలికింది. చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. పూర్తి మెరిట్ జాబితాను విడుదల చేసి డీఎస్సీ ఆశావహులకు నిజాయితీగా సమాధానం చెప్పాలే తప్ప డైవర్షన్ పాలిటిక్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే సమాజం హర్షించదని హెచ్చరించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్టు చేసింది. డీఎస్సీ కుంభకోణంపై ప్రశ్నలకు లోకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ‘వెబ్సైట్ నుంచి మెరిట్ జాబితాను ఎందుకు తొలగించారు?, పారదర్శకత లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఎందుకు ఇచ్చారు?, రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?’ అంటూ చురకలు అంటించింది. ‘మిమ్మల్ని (లోకేశ్ను) ఇంటర్మీడియెట్ పాస్ చేయించడానికి ఇప్పటి మంత్రి నారాయణ పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే. ఆ రోజుల్లో మీకోసం నారాయణ పడ్డ కష్టం వల్లే ఇప్పటికే మీమధ్య అనుబంధం అంత బలంగా ఉందనేది తెలిసినవారు అందరూ చెప్పుకుంటారు. అంతేకాదు.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మీరు తీసుకున్న డిగ్రీ వెనుక ఒక పారిశ్రామికవేత్తనుంచి తీసుకున్న ముడుపుల కథ ఉందని మర్చిపోకండి. ఆ రోజుల్లో ఆ ముడుపులను మీ ఫీజులు రూపంలో చెల్లించిన వాస్తవ కథ తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు ఉంది. అలాంటి మీరు డిగ్రీల గురించి, పరీక్షల గురించి చెబితేం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది’ అని లోకేశ్ వ్యవహర శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. -
హామీలు మరిచి ‘మహా’ నాటకం!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్లు.. సెవెన్లు ఇస్తామంటూ అందరినీ నమ్మించి రెండేళ్లైనా వాటి ఊసే లేకుండా పాలన సాగించిన చంద్రబాబు కనీసం ఈ మహానాడులోనైనా వాటి గురించి ప్రస్తావిస్తారని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశను మిగిలిస్తూ ‘డిజిటల్’ పేరుతో గొప్ప హైడ్రామాను రక్తి కట్టించారు! సూపర్ సిక్స్లు, సెవెన్లు సహా ప్రజలకు ఇచ్చిన 143 హామీలను ఎందుకు అమలు చేయలేదో.. పోనీ ఎప్పటి నుంచి చేస్తారో.. మహానాడులో కనీసం చర్చించిన పాపాన పోలేదు. చంద్రబాబు కొత్త పథకాలు ఇవ్వకపోగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఎందుకు రద్దు చేశారో.. అందుకు కారణాలేమిటో చెప్పలేదు. దాదాపు రూ.పది వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయి? వాటిని ఎప్పుడిస్తారో చెప్పలేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చి అంపశయ్యపైకి చేర్చారు. రోగులకు ‘ఆసరా’ ఊసే లేదు. అక్కచెల్లెమ్మలకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం మాటే లేదు. వైఎస్ జగన్ హయాంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం దాకా ప్రతి ఊరిలో కళకళలాడిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు – నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు భ్రష్టు పట్టించారంటే సమాధానం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు ఉచిత పంటల బీమా ఎగరగొట్టారు.. ఇన్పుట్ సబ్సిడీ ఎందుకివ్వడం లేదో చెప్పలేదు. కనీవిని ఎరుగని రీతిలో అన్నదాతలు ఎరువుల కోసం రోడ్లపైకి చేరుకుని అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురిస్తే దాని గురించి మహానాడులో కనీసం చర్చ లేదు. మళ్లీ సమస్య తలెత్తకుండా ఏం చేస్తారో చెప్పలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏకంగా 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయో సమాధానం లేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఎటుపోయిందో చెప్పలేదు. అమరావతి పేరుతో విచ్చలవిడిగా స్కామ్లు చేస్తూ... ఆచరణ సాధ్యమైన రాజధాని కారిడార్ ‘మావిగన్’ ఎందుకు వద్దో చెప్పడం లేదు. మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్..! లక్షలాది మంది యువతకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చ లేదు. ఇక మహిళలకు రిజర్వేషన్లు.. చినబాబు చొరవ అంటూ మరో హైడ్రామా! వైఎస్ జగన్ ప్రభుత్వం నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో 33 శాతం పదవులు మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు? ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో మహానాడులో చర్చ లేదు. వైఎస్ జగన్ హయాంలో మహిళలే కేంద్రంగా పాలన సాగించి సింహభాగం పథకాలతో వారికి లబ్ధి చేకూర్చితే.. మహిళా సాధికారతకు కూటమి సర్కారు తూట్లు పొడిచింది. హామీల అమలు, పాలనను గాలికి వదిలేసి ‘రెడ్బుక్’ బెదిరింపులతో అరాచకంగా వ్యవహరిస్తోంది. మొత్తంగా మహానాడులో బోరు కొట్టించే ప్రసంగాలు.. జగన్పై వ్యక్తిగత విమర్శలు మినహా ఏ ఒక్క అంశంపైనా నిర్మాణాత్మకంగా చర్చించిన దాఖలాలు లేవు. ఎందుకంటే.. పాలన పడకేసిన చంద్రబాబు సర్కారులో మట్టి నుంచి ఇసుక, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్, మద్యం దాకా దేంట్లో చూసినా దోపిడీనే..! ప్రాంగణాలు వెలవెల.. మహానాడు పేరుతో చంద్రబాబు నిర్వహించిన రెండు రోజుల డిజిటల్ డ్రామా అట్టర్ఫ్లాప్ అయింది. టీడీపీ కార్యర్తలు కూడా ఈ డ్రామాను పట్టించుకోకపోవడంతో అన్నిచోట్లా మహానాడు ప్రాంగణాలు వెలవెలబోయాయి. అయినా సరే రికార్డులు సృష్టించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. మహానాడుకు వర్చువల్గా 11 లక్షల మంది హాజరైనట్లు పేర్కొన్నారు. టీడీపీ యాప్ ద్వారా ఈ హాజరును తీసుకున్నట్లు సంబరపడ్డారు. నిజానికి మహానాడుకు స్పందన లేకపోవడంతో నాయకులు జనాన్ని తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. అనేక చోట్ల ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు, ఇతర నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక వచ్చిన కొద్ది మంది కూడా వెనుతిరిగారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని కదిపినా ఇదేం మీటింగ్? అని విసుక్కోవడం మహానాడు ప్రత్యేకతగా నిలిచింది. పోటాపోటీగా పొగడ్తలు.. మహానాడు ఆద్యంతం అదే పనిగా వైఎస్ జగన్ను తిట్టడం, చంద్రబాబును పొగిడేందుకు నేతలు పోటీలు పడ్డారు. ఎన్టీఆర్ జయంతిని నిర్వహిస్తున్నట్టుగా చంద్రబాబు జయంతిని చిరకాలం నిర్వహించేలా ‘బాబునాడు’ చేద్దామని ఆయన వేదికపైన ఉండగానే నేతలు చెప్పడాన్ని బట్టి వారి అతి ఏ స్థాయికి వెళ్లిందో చూడవచ్చు. లోకేశ్ రాష్ట్రానికి కాదు.. దేశానికి దిక్సూచి అని, పులి కడుపున పులే పుడుతుందంటూ.. ఆయన పెద్ద పులి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి అందం ఆ కుటుంబాల్లో నారా దేవాన్‡్షకే వచ్చిందంటూ మోకా ఆనంద్సాగర్ అనే నేత పొగడ్తలు కురిపించారు. వైఎస్సార్సీపీని చంపేయాలని టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ అనుచిత వ్యాఖ్యలు చేసి లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయతి్నంచారు. వీటిని వింటూ చంద్రబాబు, లోకేశ్ చిరునవ్వులు చిందించారు. ఎన్టీఆర్ కోసం ఉత్తుత్తి తీర్మానం ఎప్పటిలానే ఈ మహానాడులో పలు ఉత్తుత్తి తీర్మానాలు చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని మరోసారి ఆమోదించారు. ఈసారి ఆ తీర్మానాన్ని చంద్రబాబు పెట్టడం గమనార్హం. భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడిన చంద్రబాబే తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల పాలనలో చేయని వాటిని చేసినట్లు, జరగని వాటిని జరిగినట్లు చూపించడానికి చంద్రబాబు తాపత్రయపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా చేశామంటూ పచ్చి అబద్ధాలు చెప్పుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే అమలు చేసేసినట్లు చెప్పారు. లోకేశ్ జెన్జీ కామెడీ! మహానాడులో నారా లోకేశ్ పబ్లిసిటీకి పరాకాష్టగా ఆయన జెన్జీ యువతతో సమావేశమై సంభాíÙంచినట్లు ఓ యూట్యూబ్ లింకు ఇచ్చారు. అందులో నలుగురంటే నలుగురే పార్టీ కార్యకర్తలు కూర్చోగా వారితో లోకేశ్ పిచ్చాపాటీగా మాట్లాడారు. దాన్నే జెన్జీ సమావేశంగా ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా షేర్ చేసుకోవడం గమనార్హం. -
ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు
-
ఏపీలో జరిగింది.. దగా డీఎస్సీ: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆయన శాఖను గాలికి వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి ఉద్ధరిస్తున్నానని చెబుతున్నాడు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన చేసిన తప్పుడు పనులు అన్నీ ఇన్నీ కాదు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘99 పైసలుకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా. అమరావతిలో అడుగుకు రూ. 20 వేల రూపాయలకు కాంట్రాక్టులు ఇచ్చి పోగేసుకుంటున్నారు కదా. గురువుల నియామకంలో కూడా తప్పుడు పనులు చేయడమేనా?. సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా ఉండదా మీకు?. 16 వేలపై చిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. చంద్రబాబు, లోకేష్ నీచాతి నీచాలకు పాల్పడ్డారు. మెగా డీఎస్సీ నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘మెరిట్ లిస్టు ఇవ్వరు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు. ఫోన్లకు మాత్రం మెసేజ్లు పెడతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా?. సిగ్గు లేకుండా విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చిన వాళ్లు అన్నమేనా తినేది. డీఎస్సీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. తప్పుడు పనులు చేయడం మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా?. ప్రతీ ప్రభుత్వ సంస్థలో నియామకాలు చేసినపుడు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారు..డీఎస్సీ, టెట్ పరీక్ష రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారంట. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారు. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలు పెట్టారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల కింద నేరుగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇది తప్పుకాదా... ఇంతకంటే నీచం మరొకటి ఉందా?. ఏపీలో దగా డీఎస్సీ.. అతిపెద్ద మెగా స్కామ్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనా 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే దమ్ముందా ఇదే నా ఛాలెంజ్...బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగ్లు కొట్టడం కాదు. ఖలేజా ఉంటే.. నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిపితే 421 మంది వివరాలు బయటపెట్టండి. మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టేలేనోళ్లకు మీకెందుకు సినిమా డైలాగ్లు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటాడు. లోకేష్ స్కామ్లు చేసి డబ్బులు తీసుకుంటాడు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశారనే నమ్మకం ఉంటే మెరిట్ లిస్ట్ బయటపెట్టండి. డీఎస్సీపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
చెప్పులపార్టీ... నువ్వా నీతులు చెప్పేది
-
జూమ్ లోకి కొడాలి నాని, వంశీ వస్తే ప్యాంటు తడుపుకున్నావ్...
-
మహానాడులో చంద్రబాబుకి ‘సన్’స్ట్రోక్!
తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ఫీలయ్యే ‘‘మహానాడు’’ గతకొన్నేళ్లుగా రాజకీయ సెటైర్లకు కేంద్రబిందువుగా మారుతోంది. టెక్నాలజీ వినియోగంలో తాము దేశానికి మార్గదర్శకులమని చెప్పుకునే ఆ పార్టీ పెద్దకు.. ఈసారి హైబ్రిడ్ మహానాడు చేదు అనుభవమే మిగులుస్తోంది. ఈ వర్చువల్ ప్రయోగం ఆయనో షాక్లా మారడమే కాదు.. సీనియర్ల నుంచి పెదవి విరుపులకు కారణమైందనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.ఒకవైపు టీడీపీ వర్గాలు, వాటి అనుకూల మీడియాలు రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షల మంది వర్చువల్గా పాల్గొన్నారని భారీ లెక్కలు చెబుతుండగా.. మరోవైపు అంతటా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న వీడియోలు అదే మీడియా చానెళ్ల ద్వారా బయటకు వస్తున్నాయి. కృష్ణాజిల్లాలోని మోపిదేవి సెంటర్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు కార్యక్రమం అయితే ఈ విమర్శలకు ప్రధాన ఉదాహరణగా మారింది. భారీ టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. కుర్చీలు మాత్రం ఖాళీగా కనిపించాయి. చంద్రబాబు ప్రసంగం జరుగుతున్న సమయంలో కూడా కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. “రండి బాబు రండి” అంటూ నేతలు కార్యకర్తలను బ్రతిమాలుకున్నా స్పందన ఆశించిన స్థాయిలో రాలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.నేతల తంటాలుమహానాడులో జనం ఉన్నట్లు కవరింగ్ చేసుకునేందుకు టీడీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు లేకపోవడంతో పాత రికార్డింగ్ వీడియోలు ప్లే చేశారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు, భోజనాలు ఏర్పాటు చేసి జనాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పొదుపు సంఘాల మహిళలను తప్పనిసరిగా హాజరు కావాలంటూ స్థానిక నేతల ద్వారా ఒత్తిళ్లు తెచ్చారన్న ప్రచారం కూడా వినిపించింది.అయితే టీడీపీ మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. “యాప్ రిజిస్ట్రేషన్, టైం టు టైం అటెండెన్స్, డిసిప్లిన్, వర్చువల్ కనెక్టివిటీ”తో మహానాడు ఘనవిజయమైందని చెబుతోంది. తెలంగాణ, అండమాన్ నుంచి కూడా కార్యకర్తలు పాల్గొన్నారని.. ఒక్కో క్లస్టర్లో 300 మందికిపైగా హాజరయ్యారని పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది.అంతా లోకేష్ వల్లే.. ఈ హైబ్రిడ్ మోడల్ వెనుక నారా లోకేష్ సలహా కీలకంగా ఉందన్న ప్రచారం పార్టీలోనే వినిపిస్తోంది. డిజిటల్ ఫార్మాట్తో భారీ ఇంపాక్ట్ వస్తుందని భావించినా.. చివరికి అది రివర్స్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే.. “లోకేష్బాబు మాట వినొద్దు సర్” అంటూ కొందరు టీడీపీ సీనియర్లు ముందుగానే చంద్రబాబును హెచ్చరించారట. కార్యకర్తల ఉత్సాహం, ప్రత్యక్ష హాజరు, రాజకీయ వేడి లేకుండా మహానాడు ప్రభావం తగ్గిపోతుందని చెప్పినా.. చివరకు అదే నిజమైందన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే నడుస్తోందట. ఈ ప్రయోగం విఫలమైందనే ఫీలింగ్లో చంద్రబాబు కూడా ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.ఇదిలా ఉంటే.. గతేడాది కడపలో జరిగిన మహానాడులో ఎన్టీఆర్ వారసత్వం, పార్టీ భవిష్యత్తు, లోకేష్ నాయకత్వంపై భారీ ఎమోషనల్ హైప్ క్రియేట్ చేసిన టీడీపీ.. ఈసారి మాత్రం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత ప్రయోగానికి వెళ్లి బొక్కబొర్లా పడింది. అప్పట్లో “ఎన్టీఆర్ దిగొచ్చి చంద్రబాబు, లోకేష్లను చూసి గర్వపడ్డారు” అన్నట్టుగా ఏఐతో వైరల్ చేసిన వీడియోలు, విజువల్స్తో నవ్వులపాలయ్యారు. ఇప్పుడు అదే లోకేష్ సూచించిన హైబ్రిడ్ మోడల్తో సొంత నేతల నుంచే విమర్శల పాలవుతోంది.“డిజిటల్ కనెక్టివిటీతో కొత్త రాజకీయ సంస్కృతి” తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈసారి వర్చువల్ మహానాడును భారీగా ప్లాన్ చేసినప్పటికీ.. గ్రౌండ్లో కనిపించిన ఖాళీ కుర్చీలు మాత్రం పార్టీ అంచనాలను తారుమారు చేశాయన్న చర్చ సాగుతోంది. “గతేడాది ఎమోషన్తో హైప్.. ఈసారి యాప్లతో టైప్” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ టీమ్ టెక్నాలజీ ప్రెజెంటేషన్, యాప్ అటెండెన్స్, డిజిటల్ మానిటరింగ్పైనే ఎక్కువ దృష్టి పెట్టి.. కార్యకర్తల భావోద్వేగ కనెక్ట్ను మిస్ అయ్యిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఈ ఏడాది మహానాడు ముగింపునకు ఒకరోజు ముందే టీడీపీకి గ్రౌండ్ రియాలిటీని చూపెట్టింది. వచ్చే ఏడాది ఇలాంటి “వర్చువల్ ప్రయోగాలు” వద్దని పార్టీ సీనియర్లు చంద్రబాబుకి స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. మొత్తానికి టెక్నాలజీతో రాజకీయాలను మార్చేస్తామని చెప్పిన టీడీపీకి.. ఈసారి “డిజిటల్ మహానాడు” మాత్రం సోషల్ మీడియాలో సెటైర్ల సునామీగా మారిపోయింది. -
ప్లేస్ నువ్వే చెప్పు ఇదే నా ఛాలెంజ్
-
ఛీ..ఛీ.. కొంచమైనా సిగ్గుండాలి.. లోకేష్ రాజీనామా చేయ్?
-
బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్
-
ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని.. బాబు రెండేళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ వల్ల నష్టాలు జరగకుండా చూడాలన్నారు.‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా చూడాలి. చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలు అందరూ చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్కు వంగి దండాలు పెట్టడమే తెలుసు. లోకేష్ ఉన్న ఒక్క శాఖను నడపలేక పోతున్నారు.. జగన్తో చంద్రబాబు చర్చకు రావాలి. ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు. సింగిల్ వచ్చే సింహం జగన్. గుంపులు గుంపులుగా వచ్చేది వాళ్లు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో: పేర్ని నానిమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీల పేరుతో బాండ్లు ఇచ్చి మోసం చేసింది. రెండేళ్లలో ప్రజలను ఎలా మోసం చేశారో జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలు చేపడుతున్నాం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. సర్ పై అప్రమత్తంగా ఉండాలి. ఒక్క వైఎస్సార్సీపీ ఓటు కూడా పోకుండా చూడాలి. గొడ్డలి పార్టీ అని చంద్రబాబు డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహానాడు కాదు దగానాడు: రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలి. అందుకే బాబు మోసాల మానిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తున్నాం. జూన్ 4 నుంచి మా పార్టీ కార్యాచరణ మొదలవుతుంది. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో మీరు ప్రారంభించి పూర్తి చేసిన పనులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి కాగానే విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఇవాళ ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తుంటే పట్టించుకోరు.. మీరు మంత్రిగానే పనికి రారు.. మిమ్మల్ని పార్టీ అధ్యక్షుని ఎలా చేశారు?. ప్రశ్నిస్తా అన్న నాయకుడు ఏం చేస్తున్నారో తెలియదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు గతంలో ఎందుకు అమలు చేయలేదు?. మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇవ్వాలి కదా. ఇప్పుడే ఎందుకు అన్నీ గుర్తు వస్తున్నాయి’ అని ప్రశ్నించారు. -
విద్యా కిట్లు ఇవ్వలేమని చేతులెత్తేసిన నారా లోకేష్..
-
లోకేశ్ శాఖ అక్రమాలపై పవన్ ప్రశ్నించరా?
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ శాఖలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ నిలదీశారు. మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్ జరిగిందని, ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి మెరిట్ లిస్ట్ దాచిపెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో విచారణగానీ, సీబీఐతో దర్యాప్తుగానీ జరిపించాలని డిమాండ్ చేశారు.ఆయన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ–2025 పరీక్ష రాసే వ్యక్తికే ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ప్రశ్నాపత్రాలు లీకైన తర్వాత కూడా ఆ ఉద్యోగిని ఎందుకు సస్పెండ్ చేయలేదని, ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రతిభ ఆధారంగా 1.20 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. గోదావరి కలుషితం కాకుండా వైఎస్ జగన్ చర్యలు గోదావరి కలుషితం కాకుండా ఉండాలని గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.756 కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపిందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ద్వారా ఏఆర్సీపీ స్కీమ్లో రూ.88 కోట్లు తీసుకొచి్చనట్లు తెలిపారు. పేపర్ మిల్లు నుంచి వచ్చే కలుషిత నీటిని పూర్తిగా శుద్ధిచేసిన తర్వాతే గోదావరిలో వదలాల్సి ఉందన్నారు.తమ హయాంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల కోసం కాంట్రాక్టర్ను బెదిరించి పనులు ఆపేశారని విమర్శించారు. ట్రీట్మెంట్ పేరుతో రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతూ నేరుగా కలుషిత నీటిని గోదావరిలోకి వదులుతున్నారన్నారు. దీంతో ప్రజల్లో కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. పవన్కళ్యాణ్ ఎస్టీపీ చానల్ను పరిశీలించి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాలని సూచించారు.ఇసుక మాఫియా అక్రమాలకు అంతేలేదు రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయిందని చెప్పారు. గ్యామన్ ఇండియా బ్రిడ్జిని రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పంచుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. బ్రిడ్జి స్తంభాల వద్ద విపరీతంగా ఇసుక తవ్వేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చిట్టీల మాఫియా రెచ్చిపోతున్నాయని తెలిపారు. గ్యామన్ ఇండియా బ్రిడ్జి వద్ద జరుగుతున్న ఇసుక దోపిడీ, పేపర్ మిల్లు కాలుష్యంపై పవన్కళ్యాణ్ రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. -
జగన్ ప్రశ్నలకు తండ్రీకొడుకుల మైండ్ బ్లాక్
-
అవినీతి డీల్ గా మారిన AP మెగా DSC..!
-
TDP ఎంపీ కేశినేని చిన్నికి ఈడీ షాక్ లోకేష్ వర్గంలో గుబులు
-
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్మీడియాలో హైలైట్గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మెగా కాదు దగా డీఎస్సీ.. బాబు,లోకేష్ పై జగన్ ఫైర్
-
జగన్ మాస్టర్ ప్లాన్.. బాబు, లోకేష్ వెన్నులో టెన్షన్ షురూ..
-
ఒకసారి అద్దంలో చూసుకో.. ఏం పీకుతామో ఎన్నికల్లో చూపిస్తాం
-
నువ్వు ఎవడురా కూలగొట్టడానికి.. నీ అబ్బ జాగీరా.. తోపుదుర్తి మాస్ వార్నింగ్!
-
లోకేష్ సమక్షంలోనే ఎమ్మెల్యే వరదకు అవమానం
సాక్షి ప్రతినిధి, కడప: పసుపు జెండాను నమ్ముకున్న సీనియర్లకు విలువ లేదు.. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కనీస మర్యాద లేదు! అంతా తానై, తన కోటరీ చెబితేనే అపాయింట్మెంట్లు అనే చందంగా సాగింది వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. అటు కడప, ఇటు కొండాపురంలో జరిగిన సమావేశాల సరళి చూస్తే, కేవలం తన చుట్టూ భజన చేసే ‘అనుకూల’ వర్గానికే లోకేష్ పెద్దపీట వేశారని, జెండా మోసిన కార్యకర్తలను రోడ్డుపై నిలబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్వాన్ వద్దే వరదరాజులరెడ్డికి అవమానం రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి మంత్రి లోకేష్ పర్యటనలో తీవ్ర అవమానం ఎదురైంది. శుక్రవారం ఉదయం లోకేష్ను కలిసేందుకు మైనార్టీ నేత ముక్తియార్తో కలిసి వరదరాజులరెడ్డి ఆయన కార్వాన్ వద్దకు వచ్చారు. అయితే ఒక నియోజకవర్గ ఎమ్మె ల్యే, సీనియర్ నేత అని కూడా చూడకుండా.. ‘ముందస్తు అనుమతి లేదు, అపాయింట్మెంట్ కష్టమే‘ అంటూ లోకేష్ పర్సనల్ సెక్రెటరీ ముఖం మీదే చెప్పేయడం గమనార్హం. దాదాపు గంటసేపు పడిగాపులు కాసినా లోకేష్ నుంచి పిలుపు రాకపోవడంతో, వరదరాజులరెడ్డి తీవ్ర అవమానంతో వెనుతిరగాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే ఇక తమ గతేంటని ‘తెలుగు తమ్ముళ్లు’ చెవులు కొరుక్కుంటున్నారు. జాతీయ ఉపాధ్యక్షుడికే స్టేజీ కింద స్థానం దీనికి ముందు గురువారం సాయంత్రం జరిగిన కడప నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ అవమానాల పర్వం కొనసాగింది. పార్టీ జెండానే సర్వస్వంగా భావించే ఎంతోమంది కిందిస్థాయి నాయకులకు ఈ సమావేశంలో అసలు అనుమతే దక్కలేదు. ఒకవేళ లోపలికి వెళ్లగలిగినా, సీనియర్లకు దక్కిన మర్యాద శూన్యం. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న హరిప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి లాంటి కీలక నేతలను సైతం స్టేజీపైకి రానివ్వలేదు. వీరంతా స్టేజీ కిందనే కూర్చోవాల్సి రావడంపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కోటరీతోనే ఏకాంత చర్చలు ప్రజాప్రతినిధి అయిన వరదరాజులరెడ్డిని గంటల తరబడి బయట నిలబెట్టిన లోకేష్.. అదే సమయంలో ప్రొద్దుటూరు మాజీ ఇన్ఛార్జీ గండ్లూరు ప్రవీణ్కుమార్రెడ్డిని కార్వాన్ లోపలికి పిలిపించుకుని ఏకాంత చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. కేవలం తనకు అనుకూలంగా ఉండే వారికే లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీని నమ్ముకున్న కష్టజీవులకు మొండిచేయి ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు. లోకేష్ రెండు రోజుల పర్యటన జిల్లా టీడీపీలో తీవ్ర నైరాశ్యాన్ని, అసంతృప్తిని మిగిలి్చంది. -
ఆగని బాబు దుబారా ఖర్చులు
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి దుబారా ఖర్చులకు తెరతీశారు. తన కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను తానే అమలు చేయడం లేదు. వచ్చే నెల జూన్ 13 నుండి 16 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు లోకేష్ కూడా సింగపూర్కి వెళ్లనున్నారు.ఇటీవల పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై చంద్రబాబు స్పందించారు. కేబినెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించాలని, నేతలు వినియోగిస్తున్న వాహనాల సంఖ్యను తగ్గించాలని, ఏడాది పాటు విదేశీ పర్యటనలు వద్దని అన్నారు.కానీ చంద్రబాబు మోదీ సూచనలను పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, లోకేష్తో పాటు ఇతర నేతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలను వినియోగిస్తూ దుబారా చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్లు సింగపూర్ పర్యటనతో మేమింతే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను పాటించని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్కు వెళ్లనున్నారు. సింగపూర్ పర్యటన నిమిత్తం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓవైపు చంద్రబాబు,నారా లోకేష్ ఇలా ఉంటే.. కూటమి ఎమ్మెల్యేలు సైతం సోకుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో ‘నో వెహికల్ డే’పై విమర్శల మోతఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో చంద్రబాబు ప్రతి శుక్రవారం ‘నో వెహికల్ డే’ పాటించాలని ఆదేశించినా, ఆ నిర్ణయం అమలులోనే అభాసుపాలు అవుతున్నాయి.కర్నూలు జిల్లాకర్నూలు జిల్లాలో భూగర్భ ఘనంగా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన సందర్భంగా భారీ కాన్వాయ్తో ప్రయాణించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. పత్తికొండ నుండి జియో మైసూర్ గోల్డ్ పరిశ్రమకు ఆయన కాన్వాయ్ వెళ్ళగా, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాం బాబు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇదేనా పొదుపు?అంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లారంపచోడవరంలో టీడీపీ ఎమ్మెల్యే శిరీషా రాణి అధికారిక పర్యటన సందర్భంగా కాన్వాయిలో ఒక్క వాహనం కూడా తగ్గకుండా ప్రయాణించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. తిమ్మాపురం గ్రామంలో పలు పార్టీ కార్యక్రమాలకు ఆమె వాహనాల కాన్వాయ్తోనే హాజరయ్యారు. సీఎం ఆదేశాలను లెక్కచేయకుండా ఎమ్మెల్యే కాన్వాయ్తో రావడం చూసి ప్రజలు ఇదేనా పొదుపు?అని ప్రశ్నిస్తున్నారు.నంద్యాల జిల్లాడోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా ‘నో వెహికల్ డే’ ఆదేశాలను తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు ప్రయాణం చేస్తానంటూ పోస్టర్లు వేయించి, వాస్తవానికి కార్లలోనే తిరుగుతున్న ఆయన ప్రవర్తన ప్రజల్లో అసంతృప్తిని రేపింది. ఇంధన పొదుపు పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ, అమలులో మాత్రం విఫలమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. -
అంతా నా ఇష్టం..! బాబు మాటలను లెక్కచేయని లోకేష్..
-
రూల్స్ పెట్టేది బాబు.. రూట్లు మార్చేది లోకేష్, పవన్!
“ఖర్చులు తగ్గించాలి.. విదేశీ పర్యటనలు తగ్గించాలి..” అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తర్వాతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ‘పొదుపు’ మంత్రం వినిపించింది. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉందని, మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ ఆ మాటలు కేబినెట్ హాల్లోనే ఆగిపోయాయా?.. బయటకు రాగానే గాల్లో కలిసిపోయాయా? అనే చర్చ మొదలైంది.మోదీ చెప్పిన పొదుపు సూత్రాలు ఇంకా ప్రజల చెవుల్లో మోగుతుండగానే.. మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనకు రెడీ అయ్యారు. జూన్ 2 నుంచి 6 వరకు ఆయన విదేశీ టూర్కు జీవో కూడా వెలువడింది. ఏపీ కేబినెట్లో ఏడాది పాటు మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నా.. కొద్ది రోజుల్లోనే ఆ నిర్ణయాన్ని తుంచేసినట్టయ్యింది. నో కాన్వాయ్ డే అంటూ చంద్రబాబు హడావిడి చేస్తే.. అదే రోజు లోకేష్ తన కాన్వాయ్తో హల్ చల్ చేశారు. ఇక కడప పర్యటనకు కూడా లోకేష్ ప్రత్యేక విమానంలో వెళ్లడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక విమాన ప్రయాణాలపై ఇప్పటికే ఉన్న విమర్శలతో కలిసిపోవడంతో “పొదుపు” అనే మాట ప్రజలకు మాత్రమేనా?.. మంత్రులకు మినహాయింపులా? అనే ఎద్దేవా పెరిగింది.సోషల్ మీడియాలో అయితే సెటైర్లు మామూలుగా లేవు. “ప్రజలకు పొదుపు క్లాసులు.. నేతలకు స్పెషల్ ఫ్లైట్ పాసులు” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. మోదీ ఇచ్చిన పిలుపుతో చంద్రబాబు చెప్పిన మాటలు.. అంతా స్టంటేనా? అనే ప్రశ్న హాట్టాపిక్ అయ్యింది. ఇదంతా “మోదీ చెప్పినా వినం” అనే వాళ్ల తీరును ప్రతిబింబిస్తోంది.ఇదీ చదవండి: పొదుపు పేరుతో చెప్పేవన్నీ సోది కబుర్లే: వైఎస్ జగన్ -
బాలయ్య అల్లుడికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. Yes Lokesh.. Both Are Not Same అని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇంత దారుణమైన పరిపాలన చంద్రబాబు ఓవైపు చేస్తూ.. మరోవైపు తన కొడుకు చేత Both are not the same అని పబ్లిక్ మీటింగ్స్లో డైలాగ్స్ చెప్పించడం ఏంటని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మిస్టర్ లోకేష్.. Yes, both can never be same. వెన్నుపోటుతో పార్టీని, పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి, ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. both can never be sameప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్. ఆరు నూరైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.పనులు చేసి చూపించడం మా స్టైల్. పబ్లిసిటీతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డం మీ స్టైల్. both can never be sameవిద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజలచెంతకే పాలన, గృహనిర్మాణం, మహిళా సాధికారిత, మహిళా రక్షణలో “దిశ’’లాంటి విప్లవాత్మక కార్యక్రమలు మాకున్న చరిత్ర. వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. both can never be sameఐదేళ్లలో పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇంటివద్దకే డీబీటీ కింద రూ.2.73 లక్ష కోట్లు ఇవ్వడం మా గవర్నెన్స్, రెండేళ్లలో 3.6లక్షలకోట్లు అప్పులు చేసి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను గాలికి వదిలేసి దోచేయడం మీ గవర్నెన్స్. both can never be sameబాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం. both can never be same అని అన్నారు. అలాగే, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని, నలుగురిని కనమంటున్నాడు. అలా కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబూ నువ్వు ఎందుకు కనలేదు? ఒక్కరితోనే ఎందుకు ఆపావ్? నీ కొడుకు లోకేష్ కూడా ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టాడు? నీకొడుకైనా నువ్వు చెప్తున్న దాన్ని పాటించాలి కదా?. నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా మూలనపడేశావు.మెడికల్ కాలేజీలకు, నాడు -నేడు స్కూళ్లకు డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదుకాని, అమరావతిలో బిల్డింగుల అద్దాలకు రూ.2,540 కోట్లు. ముగ్గురు నలుగురిని కంటే, వారికి కనీసం మంచి భోజనమైనా పెట్టే పరిస్థితి కుటుంబాలకు ఉంటుందా? వారి చదువులు ఏం కావాలి? వారి నాణ్యమైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది?. ముగ్గురు, నలుగుర్ని కనాలంటూ మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా చూడ్డం, వారిని చులకన చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇలా మాట్లాడటం తప్పు. మహిళలు బాగుంటనే కుటుంబాలు బాగుంటాయి’ అని చెప్పుకొచ్చారు. -
పెట్రోల్ ధరలపై లోకేష్ దొర అన్న మాటలు.. వీడియోలు ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
బాబు.. కేంద్రం గడ్డి పెట్టలేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తో పాటు ఇచ్చిన 143 హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. పెట్రోలు, డీజిలు రేట్లు తగ్గిస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కూడా చంద్రబాబుది వెన్నుపోటేనని అన్నారు. పెట్రోల్, డీజిల్పై కృత్రిమ కొరత సృష్టించింది ఎవరు?. సంక్షోభంలో కూడా స్కాములు చేశారు అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష పార్టీగా ఈ రెండేళ్లుగా మేం చంద్రబాబును అడుగుతున్నది ఏంటంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారు. వాటి సంగతి ఏమైందని మేమే కాదు, ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ఇది తప్పవుతుందా?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు ఎప్పుడు?. 2014-19 మధ్య చంద్రబాబుకు కోవిడ్ లాంటి గడ్డు పరిస్థితులు లేవు. కానీ, 2015 ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిలుపై లీటర్కు రూ.4ల చొప్పున అకారణంగా పెంచాడు. కానీ, మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల మధ్య, మేము గతంలో చంద్రబాబు పెంచిన దాని కన్నా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచాం. దానిమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నానా యాగీ చేశారు.పైగా మొన్న ఎన్నికలకు ముందు, అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీదున్న ట్యాక్స్లు తగ్గించి, వాటి రేట్లు తగ్గిస్తానంటూ చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటికే రూ.4లు లీటర్ పెట్రోల్, డీజిల్ మీద పెంచారు. చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారమే డీజిల్, పెట్రోల్పై రూ.8 తగ్గించాలి కదా?. ఇలా తగ్గించకపోగా సంక్షోభంలో కూడా స్కాములు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అందులో కూడా తనకు, తన వాళ్లకు సంపద పెంచుకునే ప్రయత్నం చేశాడు.ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరారు. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి తక్షణ చర్యలు తీసుకోలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా, వారి అవసరాలను తీర్చాల్సింది పోయి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్ లెట్ల నుంచి పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణం. ఇలాంటి మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా?. అసలు విషయాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ లేఖ రాసింది. రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని గడ్డిపెట్టింది’ అని చెప్పుకొచ్చారు. -
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్
-
ఏపీకి ముగ్గురు సీఎంలు
-
మీరు హెలికాప్టర్ లో తిరిగి పాపం నిమ్మల రామనాయుడితో 10KM సైకిల్ తొక్కిస్తారా?
-
లోకేష్ ఆశలపై నీళ్లు.. మోదీ నిర్ణయంతో నిరాశ
-
నీతులు చెప్పే ముందు నువ్వు పాటించు బాబుపై లక్ష్మీ పార్వతి ఫైర్
-
నటి పూనం కౌర్ ట్వీట్ పై లక్ష్మీ పార్వతి సంచలన రియాక్షన్
-
ఇప్పుడు మీ నాన్నగారు.. చేతకాని, పనికి మాలిన వాడు అని చెప్పండి
-
లోకేష్... ఇప్పుడు దిగు సెల్పీలు విడదల రజిని మాస్ ర్యాగింగ్
-
పిల్లల్ని కనడానికి వేలం పాటనా..? లోకేష్ కు ఎందుకు చెప్పలేదు
-
ఫ్లాష్బ్యాక్ తిరగేస్తే!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు. ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే. కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేశ్లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి ప్రాంతాలలో నివసిస్తున్న మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు. కేవలం ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించడం వల్ల ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్ కనుక ఆయిల్ పై ఉన్న పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు వచ్చాయి కదా!. తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం లేదని చంద్రబాబు పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. అమరావతి నిర్మాణాలలో భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న దుబారాను అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నీ కొడుకును నలుగురు బిడ్డల్ని కనమను
-
పెట్రో ధరల పెంపుపై నిరసన జ్వాలలు
వైఎస్సార్సీపీ నిరసనల అప్డేట్స్.. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టి.. అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్యులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ట్యాక్సులు తగ్గించి ధరలు తగ్గిస్తామని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. “లోకేష్ కాదు.. ఆయన పేరు లవ్ క్యాష్” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.విజయవాడ పశ్చిమలో వెలంపల్లి నిరసనవిజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యాధరపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ మర్చిపోయారని విమర్శించారు.విజయవాడలో దేవినేని అవినాష్ వినూత్న నిరసనఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆటో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఎడ్లబండిపై బైక్లను ఎక్కించి నిరసన వ్యక్తం చేసిన దేవినేని అవినాష్.. ఎడ్లబండి లాగుతూ “ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి” అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లాలో దేవభక్తుని చక్రవర్తి పాదయాత్రకృష్ణాజిల్లాలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో తాడిగడప నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇంధనం వాడకం తగ్గించుకోవాలని సలహాలు ఇవ్వడం చేతకాని ప్రభుత్వ లక్షణమని విమర్శించారు.నెల్లూరులో కాకాణి, చంద్రశేఖర్ రెడ్డి రిక్షా ర్యాలీనెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రిక్షాపై నిరసన ర్యాలీ నిర్వహించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ సాగింది. “పెట్రోల్ బంక్ దగ్గర సెల్ఫీలు దిగిన లోకేష్.. ఇప్పుడు ప్రజల బాధలు చూడాలి” అంటూ కాకాణి విమర్శించారు.బొబ్బిలి, విజయనగరంలో వినతిపత్రాలువిజయనగరం జిల్లా బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కైకలూరులో దూలం నాగేశ్వరరావు నిరసనఏలూరు జిల్లా కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రాష్ట్ర ప్రజలపై భారీ భారం మోపుతున్నారని విమర్శించారు.తాడేపల్లిగూడెంలో వడ్డీ రఘురామ్ ఆధ్వర్యంలో ఆందోళనతాడేపల్లిగూడెంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.పెందుర్తిలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ నిరసనవిశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.గుడివాడలో పోలీసుల అడ్డంకులుగుడివాడలో వైఎస్సార్సీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడి నడుము విరిగిపోయిందని నేతలు మండిపడ్డారు.అనంతపురంలో భారీ ర్యాలీఅనంతపురంలో లలిత కళాపరిషత్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతోందని నేతలు ఆరోపించారు.రైల్వే కోడూరులో దున్నపోతుతో నిరసనపెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి టోల్గేట్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలను ఎనుములకు కట్టేసి లాగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వామపక్ష నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కొత్తపేటలో వినూత్న నిరసనపెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్తపేట ఆర్డీవో కార్యాలయం వరకు ఒక రిక్షాపై మోటార్ సైకిల్ను ఎక్కించి, స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్రెడ్డి నిరసనపాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లు, ఆటోలను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కాటసాని శివనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ చేపట్టారు. కల్లూరులోని కాటసాని రాంభూపాల్రెడ్డి స్వగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్టేట్ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, పెద్దపాడు శ్రీధర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నంద్యాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ.. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల నూనెపల్లి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా తదితరులు పాల్గొన్నారు.ఉదయగిరిలో వినూత్న నిరసన పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా ఎద్దుల బండి నడుపుతూ నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీ అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.సైకిల్ తొక్కుతూ పేర్ని కిట్టు వినూత్న నిరసనరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రిక్షా తొక్కుతూ, ఎడ్ల బండిపై కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు.కాకినాడలో వైఎస్సార్సీపీ ధర్నా రాష్ట్రంలో పెంచిన ఇంధన ధరలను నిరసిస్తూ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొన్నారు. అనంతరం సర్పవరం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబుకు ప్రచారం తప్ప పరిపాలన చేతకాదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారా?” అంటూ మండిపడ్డారు.ఒంగోలులో శాంతియుత నిరసన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడాన్ని నిరసిస్తూ ఒంగోలు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవన్ వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, వెంకటేశ్వర్లు నాయుడు, కసుకుర్తి అదెన్న, కటారి శంకర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.గుడివాడలో ఆర్డీఓకు వినతిపత్రంరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుడివాడలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మట్ట జాన్ విక్టర్, పేయ్యల ఆదాము, పొట్లూరు కృష్ణారావు, లోయ రాజేష్, తోట నాగరాజు, రేమల్లి నీలాకాంత్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, అడబాల అప్పారావు, కలపాల కిరణ్, జోషీ, చుండూరు శేఖర్, పిన్నమనేని రాఘవేందర్రావు, దేశిరెడ్డి రామ్మోహన్రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గంట శీను, ఆడప హర్ష, వన్నెం రెడ్డి దినేష్ తదితరులు పాల్గొన్నారు.పెనుకొండలో నిరసన ర్యాలీపెనుకొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.కోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాదయాత్రకోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ధరలు తగ్గించకపోతే మరింత తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.కడపలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు.పత్తికొండలో తాడుతో ఆటో లాగిన శ్రీదేవికర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తాడుతో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. రైతులు పాత వ్యవసాయ పద్ధతులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.బండి ఆత్మకూరులో ఎద్దుల బండ్లతో ర్యాలీనంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లపై ర్యాలీ నిర్వహించారు. మోటార్ బైక్లను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు.ధర్మవరం, పుట్టపర్తి, కదిరిలో నిరసనలుశ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి, కదిరి ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.వాల్మీకిపురంలో చింతల రామచంద్రారెడ్డి ర్యాలీఅన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనతిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.విశాఖలో ఎడ్లబండిపై కేకే రాజువిశాఖలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఎడ్లబండిపై ప్రయాణిస్తూ తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు.పులివెందులలో బొలెరోకు తాళ్లు కట్టి నిరసనపులివెందులలో వైఎస్సార్సీపీ నాయకులు బొలెరో వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ర్యాలీజమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ర్యాలీరాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: బొత్సచీపురుపల్లి: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను విచ్చలవిడిగా పెంచుతూ సామాన్య ప్రజలపై ప్రభుత్వం మోయలేని భారం మోపుతోందని నిరసిస్తూ చీపురుపల్లి జంక్షన్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అమలాపురంలో వైఎస్సార్సీపీ నిరసన అమలాపురం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, జున్నూరి రామారావు, కటకంశెట్టి ఆదిత్య, కుడిపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజాకుమారి, రెడ్డి సత్య నాగేంద్రమణి, కుడిపూడి భరత్, కొనుకు బాపూజీ, ఇళ్ల శేషారావు, ఖాదర్, సత్యం కాపు, అంబికా శ్రీను, జానా గణేష్, కేత భానుతేజ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీమార్కాపురం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ యర్రగొండపాలెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. రాజాంలో వినూత్న నిరసన.. విజయనగరం జిల్లా: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజేష్ తలే ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటారు వాహనాన్ని పడుకోబెట్టి దానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజాం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సిరిపురం జగన్మోహన్రావు, నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అద్దంకిలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసనఅద్దంకి పట్టణంలోని 20వ వార్డులో గల పెట్రోల్ బంకు వద్ద పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘గుద్దుడే గుద్దుడు’ పేరుతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేసి, పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పలమనేరులో వైఎస్సార్సీపీ భారీ ధర్నాపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా పలమనేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పలమనేరు సిల్క్ ఫామ్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రొద్దుటూరులో భారీ నిరసనవైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ప్రొద్దుటూరులో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇంధన ధరలు అధికంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వినూత్నంగా ఆటో నడుపుతూ తన నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సింగనమలలో వైఎస్సార్సీపీ భారీ నిరసనవైఎస్సార్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సింగనమల మండల కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ సూచనలతో చేపట్టిన ఈ నిరసన ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్ద ప్రారంభమై తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం. మోహన్ రెడ్డి, నాయకులు శ్రీరామ రెడ్డి, వంశీ గోకుల రెడ్డి, కొర్రపాడు గువ్వల శ్రీకాంత్ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మండపేటలో వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీతూర్పుగోదావరి జిల్లా మండపేటలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.మంగళగిరిలో వైఎస్సార్సీపీ భారీ నిరసనగుంటూరు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్రావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.జి.మాడుగులలో ఎమ్మెల్యే విశ్వేశ్వరాజు నిరసన అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు గారి ఆధ్వర్యంలో జి.మాడుగుల మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్యకొండం నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి కుడా సురేష్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుబ్బడి శేఖర్, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకట గంగరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిర్మ పండన్న, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ విభాగాల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తాడిపత్రిలో నిరసనతాడిపత్రి మాజీ శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా తాడిపత్రిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తాడిపత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రం అందజేశారు.మండపేటలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భారీ నిరసన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా మండపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. పి.గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన తెలుగు దేశం పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి దేశంలోనే అత్యధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తోందని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారి పిలుపుతో, పి.గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు శ్రీ చింతలపాటి శ్రీనివాసరాజు గారి సూచనల మేరకు పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.పెట్రో ధరల పెంపుపై మడకశిరలో ధర్నా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మడకశిర పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మడకశిర స్థానిక నాయకులు ఎస్.ఎల్. ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైయస్ఆర్ సర్కిల్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో..రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉరవకొండలో నియోజకవర్గ సమన్వయకర్త& మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి వినుత్నంగా ట్రాక్టర్ లాగి నిరసన తెలియజేశారు. అనంతరం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.రాయదుర్గం:వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ మెట్టు గోవిందరెడ్డి గారి ఆదేశాల మేరకు...పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథరెడ్డి, ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాయదుర్గం పాత బస్టాండ్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తూ తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు.రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసనరాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పాల్గొన్న ఈ నిరసనలో ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర రావు సారథ్యంలో గోదావరి రైల్వే స్టేషన్ నుంచి సబ్ కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా తరలివెళ్లిన పార్టీ శ్రేణులు అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిళారెడ్డి, వాసంశెట్టి గంగాధర రావు, రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ, జిల్లా మహిళాధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నాయకులు మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, సప్పా ఆదినారాయణ, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, హసీనా, షేక్ నిజామ్, బూడిద శరత్కుమార్, అమీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. -
ప్రజల మెదళ్లలోకి విష ప్రచారం.. రెచ్చిపోతున్న చంద్రబాబు TDP యూట్యూబ్ ఛానళ్లు
-
పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే అధికం: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలి.. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు మోసం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధర ఏపీలోనే ఉందని.. ప్రజల మీద రోజుకు రూ.10 కోట్ల భారం వేయటం దుర్మార్గం అని ధ్వజమెత్తారు.ఏపీతో పోల్చితే తెలంగాణ లో 3, తమిళనాడు 10, కర్ణాటకలో 7 రూపాయలు తక్కువ. ఏపీలో మాత్రం టాక్సుల పేరుతో దోచుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. ధరలు తగ్గించకపోగా కార్లు, బైకుల మీద ప్రయాణం చేయొద్దంటూ నీతులు చెప్తారా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రతినెలా ఈవెంట్లు చేస్తూ మరింత వృథా చేస్తున్నారు’’ అని వెల్లంపల్లి నిలదీశారు.‘‘పెట్రోలు, డీజిల్పై టాక్స్లు ఎందుకు తగ్గించటం లేదు?. చంద్రబాబు నీతి కబుర్లు ఆపి, టాక్సులు తగ్గించాలి. లీటరు పెట్రోలు మీద 28లు ప్రభుత్వానికి వస్తాయని లోకేష్ ఆనాడు చెప్పారు. అందులో సగం తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారు. ప్రజల మీద ఈ బాదుడు ఆపకపోతే పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
బాబు మాట లెక్క చేయని లోకేష్.. క్యాబినెట్ నిర్ణయంపై ధిక్కారం!
-
కాన్వాయ్ తగ్గించుకుంది.. ప్రత్యేక విమానాల్లో తిరగడానికా బాబూ..?
సాక్షి, అమరావతి: ‘ప్రజా ప్రతినిధులు కాన్వాయ్లను కుదించుకోవాలి. ఎక్కువ వాహనాల శ్రేణితో ప్రయాణించవద్దు. విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు సాధ్యమైనంత వరకూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను వాడితే బాగుంటుంది. అవసరమైతే సైకిళ్లు వాడండి, పాదయాత్రగా వెళ్లండి..’ సీఎం చంద్రబాబు చెప్పిన పొదుపు సూత్రాలు ఇవి. కానీ ఇవి కేవలం ఇతరులకు చెప్పడం కోసమేగానీ, తనకు, తన కుమారుడు లోకేశ్కు మాత్రం వర్తించవని మరుక్షణమే నిరూపించేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో వీరి దుబారా మామూలుగా లేదు. విడివిడిగా ప్రత్యేక విమానాల్లో వెళ్లడమే కాకుండా, కేంద్ర మంత్రి వద్ద తమ మెహర్భానీని చూపించుకోవడం కోసం సభకు భారీగా జన సమీకరణ చేయాలని పథక రచన చేశారు. ఇందుకు ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకున్నారు. వీటి ఇంధనానికి ఎంత వృథా ఖర్చన్నది ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదేం పొదుపు సూత్రం బాబూ..అంటూ సామాజిక మాధ్యమాల్లో తండ్రీ కొడుకులపై ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘కాన్వాయ్లో వాహనాలను తగ్గించుకుంటున్నామని చెబితే ఏదో అనుకున్నాం. తీరా చూస్తే ప్రత్యేక విమానాల్లో తిరుగడం కోసమని తర్వాత అర్థం అయ్యింది’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘చంద్రబాబు బంగ్లా సోకులకు రూ.6.5 కోట్లు మంజూరు చేయడం కూడా పొదుపులో భాగమేనా’ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు పొదుపు మంత్రం పెద్ద డ్రామా అని తేలిపోయింది. -
‘చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు’
సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఆదా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు మాటలు నిజమేనని ప్రజలు నమ్మారు. చంద్రబాబు ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తి వెళ్ళారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి రెండేళ్లలో రూ.120 కోట్లు ఖర్చు చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవరు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రతి ఒక్కరూ ముగ్గురు నలుగురు పిల్లలను కనాలని చెప్పారు. ఆ సూత్రం లోకేష్కు ఎందుకు వర్తింపు చేయలేదు. పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెట్టి.. అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు ఇంటి మరమ్మత్తుల కోసం రూ.6.50 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో 3 లక్షల 70 వేల కోట్లు అప్పు ఈ రెండేళ్లలో చంద్రబాబు సాధించారు.టీడీపీ వైఎస్సార్సీపీ బోథ్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. వైఎస్సార్సీపీ వైఎస్ ఆశయాల నుంచి పుట్టింది. టీడీపీ వైస్రాయ్ హోటల్ నుంచి పుట్టింది. టీడీపీది బీరు బారు పార్టీ.. వైఎస్సార్సీపీది విద్యా వైద్య విధానం పార్టీ. వైఎస్ జగన్ను చూస్తే నరనరాన భయం చంద్రబాబు లోకేష్లో కనిపిస్తుంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర మొత్తానికి గుండు కొట్టిస్తున్నారు. ఎక్కడ ఏ కొండ కనిపించిన గుండు కొడుతున్నారు. కూటమి భూ అక్రమాలు మీద వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అవసమైతే వైఎస్ జగన్ ఈ పోరాటంలో పాల్గొంటారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే ఆ భారం ప్రజలు మీద పడకుండా వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. -
అన్న రూల్స్ పెడతాడు.. మనం పాటించాలి..
-
దుబారాలో మనమే టాప్.. బాబు.. లోకేష్ జల్సాలు
-
‘పొదుపు’ పబ్లిసిటీకే..
సాక్షి, అమరావతి : ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఉంది మంత్రి లోకేశ్ తీరు. పొదుపు మంత్రం ఎదుటి వారికే తప్ప తనకు కాదని ఆయన నిరూపించారు. తన వాహన కాన్వాయ్ తగ్గించుకుంటున్నానని గురువారం మీడియాలో తెగ పబ్లిసిటీ చేసుకున్న కొద్దిసేపటికే ఆయన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లడం గమనార్హం. ఒకవైపు సమావేశాలను వర్చువల్గా నిర్వహించుకోవాలని.. డీజిల్, పెట్రోల్ వాహనాల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని హడావుడి చేసి ఆయన మాత్రం అత్యంత ఖర్చుతో ప్రత్యేక విమానాన్ని వినియోగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం చెప్పిన కొద్దిసేపటికే.. వెలగపూడిలో గురువారం ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలు పొదుపు పాటించాలని, ఉద్యోగులు సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారు. కానీ, లోకేశ్ బయటకొచ్చి ప్రత్యేక విమానాన్ని ఉపయోగించడం ఏమిటని పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాను వినియోగిస్తున్న ప్రత్యేక విమానం (వీటీ–సీవీబీ)లో లోకేశ్ బయల్దేరి పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. అక్కడి పర్యటనలో నేతలు భారీగా వాహనాలు ఉపయోగించి హడావుడి చేశారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి భారీ సంఖ్యలో వాహనాలతో ధర్మవరం వెళ్లారు. 23 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో దుబారా.. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో 23 నెలలుగా కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాధనం దుబారా జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎం తనయుడు ప్రత్యేక విమానాల్లో తరచూ విదేశీ పర్యటనలు చేయడం, అమరావతి నుంచి హైదరాబాద్కి విడివిడిగా నిత్యం వెళ్లడం సర్వసాధారణమైంది. మంత్రులు కూడా అదేబాటలో పయనిస్తూ జిల్లాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు. ఇటీవలే తొమ్మిది మంది మంత్రులు, పదుల సంఖ్యలో అధికారులు సింగపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సైతం అనధికారికంగా ఎస్కార్ట్ వాహనాలు వినియోగిస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు పొదుపు చర్యలు ప్రకటించినా ఆచరణలో మాత్రం విచ్చలవిడిగా దుబారా జరుగుతోంది. లోకేశ్ సింగపూర్ ప్రయాణ ఖర్చు రూ.7.82 లక్షలు ఈ నెల 11న జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి సింగపూర్ వెళ్లిన ఐటీ శాఖ మంత్రి లోకేశ్ విదేశీ ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.7.82 లక్షలకు పరిపాలన అనుమతిస్తూ ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఢిల్లీలోని ఏపీ భవన్లో సీఎం నివాస బంగ్లాకు రూ.6.50 కోట్లతో ఆధునిక హంగులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
లోకేష్ జల్సాలు..స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తికి..భారీ కాన్వాయ్ లో చక్కర్లు
-
2 వాహనాలతో మోదీ కాన్వాయ్ 8 వాహనాలతో లోకేష్ కాన్వాయ్
-
ఆ తండ్రీకొడుకులకు టైమ్ దగ్గర పడింది!
-
సీనియర్లకు మొండిచేయి.. జూనియర్లకే అందలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖలో పాలన గాడి తప్పింది. చట్టాలు చిత్తు కాగితాల్లా మారాయి. అర్హతలున్న సీనియర్లను పక్కనబెట్టి అత్యంత జూనియర్లను ఉన్నత స్థాయి పోస్టుల్లో నియమించడం చంద్రబాబు ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పేరున్న నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో సర్వసాధారణమైంది. సర్వీస్ రూల్స్ను పట్టించుకోకుండా గతేడాది డిసెంబర్లో అనర్హులకు పదోన్నతులు కల్పించి డీఈవోలుగా నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు జిల్లాలకు తప్ప.. మిగిలిన 23 జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్లు, (ఏడీ), ఈ కేడర్లో జూనియర్లు డీఈవోలుగా చలామణి అవుతున్నారు.కనీస అర్హత బీఈడీ లేనివారు సైతం డీఈవో బాధ్యతల్లో ఉన్నారు. ఈ అంశంపై రాష్ట్రాధికారులకు, మంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. ఈ నెల 5వ తేదీలోగా అన్ని శాఖల్లో పదోన్నతులు పూర్తి చేయాలని జీఏడీ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు విద్యాశాఖలో చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియారిటీకి, అర్హతలకు తిలోదకాలు సర్వీస్ రూల్స్ ప్రకారం రెగ్యులర్ పోస్టుకు ఏ అర్హతలు ఉండాలో పూర్తి అదనపు బాధ్యతలు ఇవ్వాలన్నా అవే అర్హతలు ఉండాలి. కానీ ఈ ప్రభుత్వంలో నిబంధనలకు తిలోదకాలిచ్చి కరెన్సీకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం 13 జిల్లాల డీఈవోలను బదిలీలు చేసింది. అంతకు ముందు మరికొందరిని సర్దుబాటు పేరుతో జిల్లాలకు నియిమించింది. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా సీనియారిటీని పట్టించుకోలేదు. డీఈవోల నియామకంలో తొలుత డిప్యూటీ డైరెక్టర్లకు అవకాశం కల్పించాలి. కానీ వారిని ప్రాధాన్యం లేని శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇక గతేడాది పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సుమారు 100 మంది అసిస్టెంట్ డైరెక్టర్ల సీనియారిటీ లిస్టును విడుదల చేసింది.ఇందులో అత్యంత జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లను 23 జిల్లాలకు డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, 78 డీవైఈవో పోస్టుల్లో అసిస్టెంట్ డైరెక్టర్లను నియమించాల్సి ఉన్నా, పూర్తిగా టీచర్లను అదనపు బాధ్యతల్లో నియమించారు. ఈ పోస్టుల్లో ఖచ్చితంగా బీఈడీ అర్హత ఉండాలి, కానీ ఫిజికల్ డైరెక్టర్లను డీవైఈవో పోస్టుల్లో నియమించడం ఈ ప్రభుత్వంలోనే చెల్లింది. సమగ్ర శిక్షలో కీలకమైన అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ల పోస్టుల్లో విద్యాశాఖ అధికారులనే నియమించాలి. కానీ రెవెన్యూ శాఖలోని ఆర్డీవోలు, లెక్చరర్లను నియమించారు.సాధారణంగా డైట్లో పనిచేసే లెక్చరర్కు ఎంఈడీ అర్హతతోపాటు 55 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే డైట్లో ప్రిన్సిపాల్గా నియమించాలంటే ఎంఈడీ, 55 శాతం మార్కులతోపాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి. ఈ నిబంధనలను తుంగలోకి తొక్కి ఎంఈడీ అర్హత లేనివారిని డైట్ ప్రిన్సిపాళ్లుగా నియమించారు. రెండు మూడురోజుల్లో డీఈవో బదిలీలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఇందులోనూ పాత విధానమే అనుసరించినట్టు చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా మంత్రి లోకేశ్ కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారమంతా ఆయనకు తెలిసే జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విద్యాశాఖను పట్టించుకోని మంత్రి లోకేశ్ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక్క పాఠశాల విద్యాశాఖలోనే సుమారు 1.85 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కమిషనరేట్లో అడ్మిని్రస్టేషన్ విభాగం డైరెక్టర్, అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వారి కింద జూనియర్ సహాయకులు, సమగ్ర శిక్ష, డీఈవో కార్యాలయాలు, ఆర్జేడీ, ఎస్సీఈఆర్టీ, బాల భవన్, వయోజన విద్య, ఐటీ, మోడల్ స్కూల్స్, ఎస్సెస్సీ బోర్డు, ఓపెన్ స్కూల్ తదితర కార్యాలయాల్లో మరో 7 వేల మంది అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇవిగాక ఇంటర్ విద్య, ఉన్నత విద్య అంతా కలిసి 2.50 లక్షల మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. కానీ, రెండేళ్లలో మంత్రి లోకేశ్ కలిసింది కేవలం ఆయా శాఖల్లోని కమిషనర్లను మాత్రమే. దీంతో ఉన్నతాధికారులు చేసిందే సర్వీసుగా, వారు నియమించిన వారే అధికారిగా తయారైంది. -
కూటమి అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారు
-
ఫీజులపై లోకేష్ కు విద్యార్థి లేఖ వైరల్ అవుతున్న న్యూస్
-
రాజకీయ స్వలాభం కోసమే.. బాబు చెప్పు చేతుల్లో ఏపీ పోలీసులు
-
మంగళగిరి TDP ఆఫీస్ వద్ద ప్రజలు ధర్నా
-
ఎర్రచందనం దొంగలతో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు.. Liveలో ఆధారాలు
-
ప్యాలెస్ కోసం నారా వారి స్కెచ్.. ఎర్రచందనం దొంగలతో బాబు, లోకేశ్
-
దశరథ రామి రెడ్డి పై టీడీపీ గుండాలు దాడి మిథున్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
వెలగపూడి ప్యాలెస్లో ‘భూ’మాయాజాలం!
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులదీ ఇదే పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలకు మాత్రం వారు ఎలా కావాలంటే అలా ప్లాట్లను సీఆర్డీఏ కేటాయించడం.. అందులో మార్పులు చేయడం చేసేస్తోంది. దీనికి తార్కాణం రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో శాశ్వత సచివాలయం టవర్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవంతులు నిర్మిస్తున్న ప్రాంతానికి కూత వేటు దూరంలో, వెలగపూడికి సమీపంలో అత్యాధునిక వసతులతో రూ.వందల కోట్ల వ్యయంతో సీఎం చంద్రబాబు కుటుంబం 25 వేల గజాల్లో (5.17 ఎకరాలు) నిర్మిస్తున్న ప్యాలెస్సే అందుకు తార్కాణం. రాజధానిలోని వెలగపూడిలో కంచెర్ల సాంబశివరావుకు చెందిన సర్వే నంబరు 142–బీ, 142–సీ, 89లోని 4.41 ఎకరాలు, కంచెర్ల శాంతికిరణ్కు చెందిన సర్వే నంబరు 136–సీ, 160, 163–బీ, 184–బీలోని 11.10 ఎకరాలు, కంచెర్ల ఓంకార్కు చెందిన సర్వే నంబరు 136–సీ, 85, 89లోని 14.01 ఎకరాలు.. మొత్తం 29.52 ఎకరాలను భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఇందుకుగానూ రాజధాని ప్రధాన ప్రాంతం వెలగపూడిలో సర్వే నంబరు 111, 112, 113, 122, 150, 152, 239లోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల శాంతికిరణ్, కంచెర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్ల కింద ఇచ్చింది. ఆ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు 2025 ఏప్రిల్ 2న కొనుగోలు చేశారు. ఆ మేరకు మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొనుగోలు చేసిన భూమికి ఉత్తరం వైపున పాసివ్ జోన్ (హరిత ప్రాంతం), దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలం, తూర్పు వైపున 17 మీటర్ల రోడ్డు, పశ్చిమ వైపున 25 మీటర్ల రోడ్డును హద్దులుగా పేర్కొన్నారు. రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతాన్ని హరిత ప్రాంతంగా ఎవరి కోసం మార్చారు? నారా బ్రాహ్మణి 25 వేల గజాలను కొనుగోలు చేశాక ఆ ప్లాటు హద్దులు మారిపోయాయి. దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా సీఆర్డీఏ మార్చేసింది. 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలం హరిత ప్రాంతంగా మారిపోయింది. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారని రాజధాని రైతులు నిలదీస్తున్నారు. ఆ భూమి రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతంగా ఉండి ఉంటే.. ఎకరం చొప్పున రాజధానికి భూములు ఇచ్చిన ముగ్గురు రైతులకు వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించే అవకాశం ఉండేదంటున్నారు. చెరువుల్లో, ముంపు ప్రాంతంలో రైతులకు కేటాయించిన రెసిడెన్షియల్ ప్లాట్లను.. ఆ ఖాళీ స్థలంలోకి మార్చే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని రైతులు మండి పడుతున్నారు. ఇక భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన నివాస స్థలాలు (రెసిడెన్షియల్ ప్లాట్) గజం రూ.50 వేలు పలుకుతుందని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో సీఆర్డీఏ లెక్కగట్టింది. వాణిజ్య (కమర్షియల్) ప్లాట్ ధర రూ.2.70 కోట్లుగా చూపింది. ఎకరం భూమిని సమీకరణ కింద ఇచ్చిన రైతులకు.. పదేళ్లపాటు కౌలు కింద రూ.7,25,000, నివాస స్థలం (వెయ్యి గజాలు.. గజం రూ.50 వేల చొప్పున) రూ.5 కోట్లు, వాణిజ్య స్థలం రూ.2.70 కోట్లు వెరసి రూ.7,77,25,000 ప్రయోజనం చేకూరుతుందని సీఆర్డీఏ లెక్కలు వేసింది. ఈ లెక్కన 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేయడం వల్ల సీఆర్డీఏకు రూ.18.35 కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవ ధర గజం రూ.7,500 లేనా? లేక మోసం చేశారా?వెలగపూడిలో సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి 25 వేల గజాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారంటే గజం ధర రూ.7,500. అక్కడ రెసిడెన్షియల్ స్థలం ధర వాస్తవంగా గజం రూ.7,500లేనా అని మేధావులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారా? అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉంటే.. రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొట్టినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆదాయపు పన్ను కూడా ఎగ్గొట్టినట్లేనని తేల్చి చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కోడలు కొనుగోలు చేసిన భూమి ధరను బట్టి చూస్తే.. ప్రధాన రాజధాని ప్రాంతంలో ఎకరం ధర రూ.3.63 కోట్లే. రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.47,387 కోట్లను చంద్రబాబు సర్కార్ అప్పు చేసింది. ఈ లెక్కన ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాలంటే కనీసం 15 వేల ఎకరాలు అమ్మాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు లెక్కలు వేస్తున్నారు. కానీ.. రాజధాని ప్రాంతంలో అంత భూమి అందుబాటులో లేదు. ఈ లెక్కన అప్పు తీర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి.. అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి నిధులు కేటాయించాల్సిందే. అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ సిటీ ఎలా అవుతుందని మేధావులు, ఆర్థిక వేత్తలు నిలదీస్తున్నారు. ఆ ఎకరం శ్మశానమే.. వెలగపూడిలో సర్వే నంబరు 163–బీలో ఎకరం శ్మశానం భూమి. ఇప్పటికీ ఆ భూమిలో సమాధులు ఉన్నాయి. రాజధాని భూ సమీకరణ కోసం వెలగపూడిలో 2015 జనవరి 3న సీఆర్డీఏ జారీ చేసిన నోటిఫికేషన్లోనూ 163–బీలో ఎకరం శ్మశానంగా స్పష్టం చేసింది. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూమిని సమీకరిస్తూ జారీ చేసిన 9.22 ఫార్మ్లో మాత్రం ఆ భూమి కంచెర్ల శాంతి కిరణ్దిగా పేర్కొనడం గమనార్హం. ఎవరి ఒత్తిళ్లతో శ్మశానం భూమిని శాంతి కిరణ్కు చెందినదిగా మార్చారని వెలగపూడి రైతులు నిలదీస్తున్నారు. 163–బీలో శ్మశానం ఉన్న ఎకరం భూమి కంచెర్ల శాంతికిరణ్దిగా చూపుతూ.. దానికిగాను కేటాయించిన వెయ్యి గజాల రెసిడెన్షియల్ స్థలంతోపాటు 25 వేల గజాలను కంచెర్ల శాంతికిరణ్ కుటుంబ సభ్యుల నుంచి సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కొనుగోలు చేయడం గమనార్హం. -
అది రెడ్ బుక్ కాదు.. అది బ్లడ్ బుక్! తండ్రి కొడుకులపై రజిని ఫైర్
-
అమరావతి టూ హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. లోకేష్ సమాధానం.. ఇది మాములు ర్యాగింగ్ కాదు
-
చంద్రబాబు ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారు: విడదల రజిని
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబుకు అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని వైఎస్సార్సీపీ నేత విడదల రజిని మండిపడ్డారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శనివారం రజిని మీడియా సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని కూడా గాలికి వదిలేశారన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 66లక్షల 35 వేల పెన్షన్లు అర్హులకు అందజేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారని తెలిపారు.కూటమి ప్రభుత్వం రికార్డుస్థాయిలో అప్పులు చేస్తుందని ఆ నిధులను ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెచ్చిన అప్పులతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విలాసాలు చేస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ సరదాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీని గాలికి వదిలేసి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ జరుగుతోందని దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏకంగా అడుగుకు రూ.18,500 పైనే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీన్ని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు.అమరావతిలో అద్దాలకే రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఆ వృథా డబ్బు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవన్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం అందేది స్కూళ్లు బాగుపడేవి కానీ చంద్రబాబుకు అమరావతి, అవినీతి తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఆరోగ్య శ్రీకి రూ.4 వేల కోట్ల బకాయి పెట్టారని.జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగిందని వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విడదల రజిని మండిపడ్డారు. -
క్రెడిట్ చోరీ, డీజిల్ చోరీ, కొత్త అప్పులు, కేసులు, వేధింపులు.. ఇవేనా సార్ మన లక్ష్యాలు, కొత్త లక్ష్యాలు!
క్రెడిట్ చోరీ, డీజిల్ చోరీ, కొత్త అప్పులు, కేసులు, వేధింపులు.. ఇవేనా సార్ మన లక్ష్యాలు, కొత్త లక్ష్యాలు! -
గొడ్డలి పార్టీ ఎవరిదో గూగుల్ ని అడిగితే సరి.. అడుగుదామా బాబూ ?
-
లోకేశ్ తీరు... ఏపీకి చేటే!
అసందర్భమైన మాటలు ఎప్పుడైనా పరువు తక్కువే. రాజకీయ నేతలైతే మరీ ఎక్కువ. నోరు జారారో అంతే సంగతులు. ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ఏపీ కీలక మంత్రి లోకేశ్ ఇప్పుడు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలు వేదికపై ఉండగానే లోకేశ్ అసత్యాలు, అతిశయోక్తులతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసి నగుబాటుకు గురయ్యారు. కొద్దోగొప్పో విషయ పరిజ్ఞానమున్న వీరు సభ నుంచి వెళ్లిపోయాకైనా మంత్రి హోదాలో లోకేశ్ వైఖరిపై చర్చించకుండా ఉంటారా? ‘‘జి అంటే తమకు గూగుల్ అని.. వారికి గొడ్డలి’’ అన్న లోకేశ్ వ్యాఖ్య ఎంత అనుచితమైందో చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. పైగా ఒక ఐటీ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి విమర్శలు చేశారంటే లోకేశ్ ఆ పార్టీకి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్న వ్యక్తి వచ్చి గూగుల్ తమదేనని చెప్పుకుంటారని లోకేశ్ అన్నారు. ఎవరేం చేసిందీ ప్రజలకు తెలియదనుకోవాలా? ఈయన చెప్పే ప్రతిమాటనూ అతిథులు నమ్మేస్తారని అనుకోవాలా? గతంలో అదాని డేటా సెంటర్కు జగన్ శంకుస్థాపన చేసినప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు రాలేదా? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా ఏపీకి అన్ని వనరులు ఉన్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ ఒన్గా ఉన్నామని, పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య వచ్చిన ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉండి, పరిష్కరించడానికి చొరవ చూపుతామని చెప్పారు. అది రాష్ట్రంపై ఉండాల్సిన కమిట్మెంట్. లోకేశ్ మాత్రం అసందర్భ వ్యాఖ్యలు చేసి రాష్ట్రానికి నష్టం చేశారనిపిస్తుంది. అందువల్లే లోకేశ్కు సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబు చెప్పే పరిస్థితి ఆయనకు ఎంతవరకు ఉందన్నది సందేహమే. గతంలో ఆయన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సభలో ఏది మాట్లాడినా, ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదు కనుక. సామాజిక మాధ్యమాలు బాగా వచ్చాక ఆయన చెబుతున్న విషయాలలోని పొంతన లేని సంగతులు, గతంలో ఏమి మాట్లాడింది, ఇప్పుడు ఏమి చెబుతున్నది వెల్లడించే వీడియోలను ప్రదర్శిస్తున్నారు.చంద్రబాబును లోకేశ్ ఫాలో అవ్వదలిస్తే ఆయన ఇష్టం. హుందాతనం లేని రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనే ప్రజలలో పరపతి కోల్పోతారు. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని లోకేశ్ అనగానే టీడీపీ కేడర్ చేసిన పలు అరాచకాలను ఎత్తి చూపుతూ... అసలు గొడ్డలి పార్టీ మీది కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ప్రశ్నలు వేశారు. గతంలో వైఎస్ రాజారెడ్డిని బాంబులు వేసి హత్య చేసిన వారు టీడీపీలోనే ఉన్నందున ఈ పార్టీ బాంబుల పార్టీ అవుతుందా అని అడిగారు. ఈ కూటమి ప్రభుత్వంలో లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలపై నిలదీస్తున్నారు.ఈ రెండేళ్లలో హత్యలకు గురైన వారి వివరాలు వెల్లడిస్తున్నారు.ఉదాహరణకు వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను ఒక టీడీపీ నేత నడిరరోడ్డుపై నరికి హత్య చేశారు.పల్నాడులోని పిన్నెల్లిలో సాల్మన్ అనే వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తపై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.వైఎస్ ఆర్ కడప జిల్లా వేంపల్లె వద్ద కొందరు టిడిపి వర్గీయులు గొడ్డళ్లతో వైఎస్సార్సీపీ నేత నాగభూషణరెడ్డిని నరికి చంపారు. ఇలా ఒకటి కాదు.ఈ రెండేళ్లలో జరిగిన ఘటనలలో పలుచోట్ల అరాచకశక్తులుగా మారిన టీడీపీ కార్యకర్తలు గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేశారు. వీటికి సంబంధించిన వార్తలన్నిటిని ఒకచోటకు తెచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరింది టీడీపీ కార్యకర్తలే కదా!ఈ అరాచకాలన్నిటికి తెలుగుదేశం పార్టీ జవాబుదారి అవుతుందా? లోకేశ్ వీటిని విస్మరించి తన తండ్రి మాదిరే దబాయించి మాట్లాడితే జనం నమ్ముతారా?చంద్రబాబుకు కుదిరింది కనుక తాను కూడా అలానే మాట్లాడతానని నిర్ణయించుకుంటే ఆయనకే నష్టం. అందులోను అదాని,గూగుల్,తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఇలా ప్రసంగిస్తే, ఈ గొడ్డలి గొడవ ఏమిటని వారు అడిగితే ఏమి చెబుతారు? ఏపీలో శాంతి భద్రతలు లేవని లోకేశ్ జవాబు ఇస్తారా?ఎంత ఇతర రాష్ట్రాలలో ఉన్నా,రెడ్ బుక్ గురించి వారికి మాత్రం తెలియకుండా ఉంటుందా?గతంలో జిందాల్ అనే ఊరిశ్రామికవేత్తను ఒక మోసకారి నటి కేసులో ఇరికించడానికి యత్నించిన ఘటన ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియదా?అదే జిందాల్ కు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడే అవార్డు అందించారే.ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న వార్తలకు, జనం చేస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వలేక చంద్రబాబు కూడా పలు సభలలో గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీపై మీద అర్థం లేని విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఇప్పుడు అదే గాత్రాన్ని లోకేశ్ అందుకున్నట్లుగా ఉంది.విశాఖపట్నంలో అన్న ఆంగ్ల పదం అక్షరాలలో జి ఉందని, జి అంటే గూగుల్ అని ఆయన అనగానే అంతా ఆశ్చర్యపోయారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉంటుంది కాని విశాఖలో ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉన్నట్లే ఎ అనే లెటర్ కూడా ఉందని,అంటే అదాని గా తీసుకోవచ్చని,అదాని డేటా సెంటర్ ను జగన్ తీసుకువచ్చారని వైఎస్సార్సీపీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుతుందోకాని, ఏపీ మాత్రం తీరని అప్రతిష్టే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కిల్లర్ పార్టీ ?.. 23 నెలల్లో 740 దారుణ హత్యలు
-
టెన్త్ ఉత్తీర్ణత 85.25 శాతం
సాక్షి, అమరావతి: గతనెలలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలు గతేడాది కంటే కాస్త మెరుగుపడ్డాయి. ఉత్తీర్ణత గతేడాది కంటే 4.11 శాతం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తీర్ణత 2024లో వచ్చిన 86.69 శాతాన్ని దాటలేకపోయింది. పదోతరగతి పరీక్ష ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు. 2025–26 విద్యా సంవత్సరంలో 6,18,131 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 5,26,954 మంది (85.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికలు 2,67,321 మంది (87.90 శాతం), బాలురు 2,59,633 మంది (82.68 శాతం) ఉన్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో 5,83,645 మంది హాజరవగా, 5,03,539 మంది పాసయ్యారు. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన 30,129 మందిలో 19,834 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు మాధ్యమాలతో పాటు హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా భాషల్లోను స్వల్పసంఖ్యలో పరీక్షలు రాశారు. ఈ ఏడాది పరీక్షల్లో పాసైన వారిలో అత్యధికంగా 83.69 శాతం మంది ప్రథమ శ్రేణి సాధించారు. 11.87 శాతం మంది ద్వితీయ శ్రేణి సాధించగా 4.44 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాసయ్యారు.పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07 శాతం ఉత్తీర్ణత గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదోతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో టాప్లో నిలిచింది. ఈ జిల్లా టాప్లో నిలవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 96.07 శాతం ఉత్తీర్ణతతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండోస్థానంలోను, 91.08 శాతం ఉత్తీర్ణతతో విజయనగరం జిల్లా మూడోస్థానంలోను నిలిచాయి.మూడోస్థానంలో ప్రైవేటు స్కూళ్లు ఈ ఏడాది మొత్తం 12,089 ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 5,044 ప్రైవేటు పాఠశాలలుండగా మిగిలినవి వివిధ యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మొత్తం 2,161 స్కూళ్లు 100 శాతం ఫలితాలను సాధించాయి. మరో 16 పాఠశాలలు ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. సున్నా ఫలితాలు వచ్చిన 16 పాఠశాలల్లో 11 ప్రైవేటు స్కూళ్లున్నాయి. రాష్ట్రంలోని 12 యాజమాన్య పాఠశాలల్లో.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచాయి. తర్వాత బీసీ సంక్షేమశాఖ స్కూళ్లు 96.02 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో నిలిచాయి. విద్యార్థుల సంఖ్య పరంగా రెండోస్థానంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఉత్తీర్ణతలో 95.29 శాతంతో మూడోస్థానంలో ఉన్నాయి.నేటి నుంచి రీ కౌంటింగ్ దరఖాస్తులకు అవకాశం పదోతరగతి పరీక్ష తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశమిచ్చింది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వారి స్కూల్ లాగిన్ ద్వారా శుక్రవారం నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1000 ఫీజు చెల్లించాలి.అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు మే 9 పదోతరగతి తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు త్వరలో టైమ్టేబుల్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. విద్యార్థులు శుక్రవారం నుంచి మే 9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో మే 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడుకు పైగా సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలి. వెనుకబడ్డ కీలక జిల్లాలు రాష్ట్రంలో ఆది నుంచి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు విద్యాకేంద్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో ఆ జిల్లాల మెరుపులు కనిపించలేదు. గుంటూరు జిల్లా 8వ స్థానంలో నిలవగా కృష్ణాజిల్లా 10, ఎన్టీఆర్ జిల్లా 11 స్థానాల్లో నిలిచి ప్రగతిపరంగా ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడ్డాయి. ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా 24వ స్థానానికే పరిమితమైంది. -
అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు
-
లోకేష్ రాసిపెట్టుకో... నా ప్రాణం పోయినా సరే అబ్బా కొడుకుకు అంబటి వార్నింగ్
-
జనంలో జగన్ ట్రెండ్.. దారికొచ్చిన బాబు, లోకేష్
-
ఎరువు మొత్తం.. డీజిల్లో కాలిపోయిందిగా!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తీవ్రస్థాయిలో తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన కారణమనే విషయాన్ని మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు గుర్తించారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ ప్రభుత్వాన్ని రాయడానికి కూడా వీలులేని విధంగా బూతులు తిడుతున్నారు. ఎన్నికల ముందు వారు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లను పోస్టింగ్లతో ఏకిపడేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలపై తండ్రి, కొడుకు చేసిన ప్రసంగాల వీడియోలను బయటకు తెచ్చి ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ సెటైర్లు, మీమ్స్తో ఆడుకుంటున్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికి డీజిల్ను తక్కువ ధరకు వారికి మళ్లించి ప్రజల నోట్లో మట్టికొట్టడాన్ని మేధావులు సైతం తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మరోసారి చంద్రబాబు, లోకేశ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. దీంతో ఆ పార్టీల కేడర్లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. ప్రజల దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటూ వారు మథనపడుతున్నారు.ఇదేం రాజకీయం.. విచిత్రంగా ఉంది ప్రజలు ఇబ్బందిపడితే పడనీ.. అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు.. కార్పొరేట్ల లాభాలు పోకూడదు... సామాన్యుడి ఎకానమీ నాశనం అయినా పర్లేదు.. అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బందిపడినా పర్లేదనే ధోరణి కాదా ఇది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇవ్వాల్సిన డీజిల్ను వారికి ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలివ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. కొరత వచ్చిన తరువాత కూడా కాంట్రాక్టర్లకు సరఫరా ఆగకూడదని ఆదేశాలివ్వడం దారుణం. సామాన్యుడి ఎకానమీ, పేదవాడి ఎకానమీ పడిపోయినా పర్లేదుగానీ కాంట్రాక్టర్ల ఎకానమీని మాత్రం కాపాడాలి. వారి లాభాలు మాత్రం నిరాటంకంగా కొనసాగాలి.. అనుకునేది ఏం రాజకీయం ఇది. సామాన్యులకు అనుకూలం అయిన రాజకీయం అయితే కాదు. పోనీ డీజిల్ను బల్క్లో మళ్లించకపోతే అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? వారం ఆలస్యమవుతుందేమో, అంతకు మించి ఏమవుతుంది. అంటే ఈ డైవర్షన్ అమరావతి కోసం కూడా కాదు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం మాత్రమే. తక్కువ ధరలకు కాంట్రాక్టర్లకు డీజిల్ ఇస్తున్నప్పుడు నిర్మాణ ఖర్చులు కూడా తగ్గాలి కదా. కానీ ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అధిక ఖర్చులపై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు అన్నారు కదా.. డీజిల్ తక్కువకు ఇస్తున్నందున రూ.12 వేలకు చేయమని అనగలరా. ఐఏఎస్ అధికారులు కనీస అవగాహన లేకుండా ఆదేశాలిస్తారా? వాటివెనుక కచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, కారణాలు ఉన్నాయి. ఇంధన కొరతపై ముఖ్యమంత్రి సమీక్ష తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. పనికిమాలిన ఆర్డర్ ఏంటిది, కాంట్రాక్టర్లు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని సీఎం అడగాలి కదా. – ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు -
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం ఉత్తీర్ణత,, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 👉పదో తరగతి పరీక్షా ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో https://education.sakshi.com/en తోపాటుగా https://results.bse.ap.gov.in/ ఈ వైబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్క క్లిక్తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... 👉పది ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.👉మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు. ఏపీలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు.ఒక్క క్లిక్తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... -
‘డీఎస్సీ డీల్స్’లో ప్రలోభాల పర్వం
సాక్షి, అమరావతి: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల కుంభకోణంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాలు సాక్ష్యాలతో సహా బయటపడటంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హేయంగా అంగడి సరుకులా డీఎస్సీ పోస్టులను సీఎం బంధువుగా చెప్పుకుంటూ అమ్మేసిన ‘మాస్టర్మైండ్’ మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.మూడు రోజులకుపైగా విచారణ పేరుతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కాలయాపన చేసి కనీసం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేయలేకపోయింది. బుధవారం రాష్ట్ర క్రీడా సంఘాలను శాప్ ఎంపికల్లో ఎక్కడా తప్పు జరగలేదని, క్రీడాకారులు తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందలేదని స్టేట్మెంట్లు ఇవ్వాలని ‘మాస్టర్మైండ్’ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, అవినీతికి కొమ్ముకాసి అభాసుపాలు కాలేమని, ప్రభుత్వం చెప్పినట్టు తలాడించలేమని క్రీడా సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో శాప్ పరువు పోతోందని, కాపాడాలని క్రీడా సంఘాలను వేడుకోవడం గమనార్హం. విచారణ పేరుతో పిలిచిన క్రీడాకారులు ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతుండటం కొసమెరుపు. మాస్టర్మైండ్ గేమ్లో చిక్కుకున్నశాప్ ఉన్నతాధికారులు డీఎస్సీ డీల్స్లో కీలకమైన ‘మాస్టర్ మైండ్’ గేమ్లో శాప్ ఉన్నతాధికారులు సైతం చిక్కుకుపోతున్నట్టు శాప్ వర్గాలే విమర్శిస్తున్నాయి. మరోవైపు ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ ఎలా విచారణ చేస్తుంది? అందులో శాప్ అధికారులే కమిటీ సభ్యులుగా ఎలా ఉంటారు? ఈ ఒక్క విచారణతోనే నిజనిర్ధారణ చేసేస్తుందా? వాస్తవాలు బయటకు రావాలంటే కచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే ఇంటి దొంగలు బయటపడతారు’ అని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, డీఎస్సీలో స్పార్ట్స్ కోటా ఉపాధ్యాయ పోస్టుల అమ్మకం ద్వారా మాస్టర్మైండ్ ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లను దండుకున్నట్టు ఆరోపణలు రావడంతో శాప్లో జరుగుతున్న మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. ఉన్న పోస్టులు రద్దు.. ఉద్యోగాలు అడగొద్దుచంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖాళీగా ఉన్న సర్కారు పోస్టులను భర్తీ చేయకపోగా.. మంజూరైన పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కారు అదే బాటలో పయనిస్తోంది. సమాచార శాఖలో రెండు అటెండర్ పోస్టులను రద్దుచేసి.. వాటి స్థానే ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టు భర్తీ చేసేందుకు అనుమతించింది. అంటే మంజూరైన నాలుగో తరగతి పోస్టుల్ని రద్దు చేసి నిరుద్యోగుల ఆశలకు గండికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉండగా ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులన్నింటినీ రద్దు చేశారు. అవసరమైన చోట ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 2014–19 మధ్య చంద్రబాబు సాధారణ పరిపాలన, పోలీసు శాఖలతోపాటు అనేక విభాగాల్లో మంజూరైన పోస్టులను రద్దు చేసి వాటి స్థానే ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని మాత్రమే భర్తీ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తున్నారు. సమాచార శాఖలో ఖాళీగా ఉన్న రెండు డార్క్ రూమ్ అటెండర్ల పోస్టులను రద్దు చేస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాటిస్థానే రూ.44,570–1,27,480 వేతన స్కేలుతో ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టును మంజూరు చేశారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులనే రద్దు చేయడం అంటే శాశ్వతంగా ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగాలనేవి ఇక నిరుద్యోగులకు అందని ద్రాక్షగా మిగిలిపోనున్నాయి. -
నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయనున్నారు. ఫలితాలను sakshieducation.com, మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009, results. bse.ap.gov.inలో చూడవచ్చు. -
అన్ని నేనే చేశా.. సొమ్మొకడిది.. సోకొకడిది..!
-
పోలీసు కస్టడీలో పూడి శ్రీహరి
-
విశాఖపట్టణం లో "జి" అంట Vizagలో "V" అంటే మాత్రం "వెన్నుపోటు"
-
అందరి ముందు లోకేష్ నవ్వులపాలు
-
చేతకాని దద్దమ్మలు, నారా లోకేష్ ఎక్కడికో పారిపోయాడు
-
‘రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి.. ఏబీఎన్ మూసివేత కోరుకుంటున్నారా?’
వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా, రాధాకృష్ణపై ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు సహా వినతి పత్రాలు అందజేస్తున్నారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భూమన కామెంట్స్..తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటూ అక్రమ కేసులు పెట్టారురాధాకృష్ణ వైఎస్సార్సీపీపై ఉలుకు పలుకు రాతల్లో రాసిన రాతలు పట్ల సభ్య సమాజం తలదించుకుంటోదిఆయన క్షమాపణ చెప్పకుండా, విచ్చలవిడిగా రాష్ట్రం మీదకు వదిలేస్తున్నారుమాపై విషపు రాతలు రాసే వారికి ఈ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందినేను నిజాయితీకి కట్టుబడి ఉన్నా అని సుద్దులు చెప్తున్న రాధాకృష్ణ..ఆయన మాటలపై ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదురాధాకృష్ణ వాడిన పద ప్రయోగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాంవిశాఖ..విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు కామెంట్స్..రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ కనిపించలేదు.రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ నడుస్తోంది..ప్రజా సమస్యలను డైవర్షన్ చేయడం కోసం చంద్రబాబు తన అద్దె మైక్లను తెరపైకి తెస్తున్నారు.మావిగన్ అంశాన్ని పక్కతోవ పట్టించడం కోసం రాధాకృష్ణతో తప్పుడు రాతలు రాయించారు.మహిళలను కించపరిచే విధంగా చెత్త పలుకులో రాతలు రాయించారు..సభ్య సమాజం తలదించుకునేలా రాధాకృష్ణ రాతలు రాశారు..రాధాకృష్ణ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సమన్వయంతో వ్యవహరించాము.రాధాకృష్ణ పై ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు..పోలీసుల అధికారి పార్టీకి బానిసల్లా పనిచేస్తున్నారు..రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలి..కేసు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.పోలీసులు తీరుపై రాధాకృష్ణపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము.గుంటూరు..మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ కామెంట్స్...వైఎస్సార్సీపీ కార్యకర్తల సతీమణులు అవమానించిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి.ఇప్పటికే 175 నియోజకవర్గాలలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాంఇప్పటి వరకు రాధాకృష్ణపై ఒక కేసు కూడా నమోదు చేయలేదుపోలీసులు రాధాకృష్ణపై కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటుఅధికార పార్టీకి ఒకలా.. ప్రతిపక్ష పార్టీకి మరోలా పోలీసులు చట్టాన్ని అమలు చేస్తున్నారుఆంధ్రజ్యోతి అక్షరమే మా ఆయుధం అని చెప్పుకుంటుంది ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి ఆభరణంవెంటనే ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలిక్షమాపణ చెప్పని పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏబీఎన్ క్లోజ్ అవుతుందివైఎస్సార్ జిల్లాజిల్లా ఎస్పీని కలిసి ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు కోరిన వైఎస్సార్సీపీ నేతలుజిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నార్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డినేతల కామెంట్స్..వైఎస్సార్సీపీ నేతలను నొటికొచ్చినట్లు మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న నేతలుఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కనీసం పోలీసు శాఖ స్పందించడం లేదు.ఆయన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్చిన్న సోషల్ మీడియా పోస్టులకే కేసులు కడుతున్న ప్రభుత్వం..రాధాకృష్ణపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించిన నేతలువిజయవాడ..ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్రాధాకృష్ణ బూతు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాంకానీ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదువైఎస్సార్సీపీ వాళ్లు కేకు కోసినా.. మేక కోసినా కేసులు పెడుతున్నారుమాపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారుమా ఇంట్లో మహిళలపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదుమేం ఇచ్చే వినతిపత్రం తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారుమా వినతిపత్రం తీసుకోవడానికి సీపీ, డీసీపీ భయపడిపోతున్నారుమహిళలంటే గౌరవం ఉంటే చంద్రబాబు, లోకేష్, రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలిపోలీసులు మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలిమాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్..పోలీసులు మా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారుచంద్రబాబు, టీడీపీ నేతల ఇళ్లలో ఉన్నవారే మహిళలా?.మా ఇంట్లో వారు మహిళలు కాదా. అంబటి రాంబాబును అరెస్ట్ చేసినపుడు ఉపయోగపడిన చట్టం రాధాకృష్ణకు వర్తించదా?.రాధాకృష్ణను ఎందుకు అరెస్ట్ చేయరుమాజీ మంత్రి జోగి రమేష్ కామెంట్స్..ఏబీఎన్ ఒక బూతు ఛానల్మా కుటుంబంలోని మహిళలను కించపరిచారుచంద్రబాబు, లోకేష్, పవన్, బీజేపీ నేతలకు నాదొక సూటి ప్రశ్నరాధాకృష్ణ మాట్లాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా?చంద్రబాబు.. నిన్ను అన్నారో లేదో తెలియని మాటలకు గుక్కపెట్టి ఏడ్చావుగారాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేకపోయారుమేం శాంతియుతంగా నిరసన చేయడానికి వెళ్తే దాడి చేశారని విమర్శించారుచంద్రబాబు ఇదేనా నీ సంస్కారంచంద్రబాబు ఎల్లవేళలా అధికారంలో ఉంటారనుకుంటున్నారా?.రాధాకృష్ణ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలిలేకపోతే ఏదో ఒకరోజు రాధాకృష్ణకు నడిరోడ్డుపై శిక్ష తప్పదుమాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలిరాధాకృష్ణ తప్పు చేసినా చంద్రబాబు, లోకేష్, పవన్, టీడీపీ మంత్రులు సమర్థిస్తున్నారుఏ మొహం పెట్టుకుని మీరు రాధాకృష్ణ వ్యాఖ్యలు సమర్థిస్తారురాధాకృష్ణను చూసి చంద్రబాబు భయపడుతున్నాడుఎక్కడ తన గురించి పేపర్లో రాస్తాడోనని చంద్రబాబు భయపడుతున్నాడుమహిళా బిల్లు వ్యతిరేకించిన ముఖ్యమంత్రితో ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారుమళ్లీ సిగ్గు లేకుండా మహిళా బిల్లు పై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెడతామంటున్నారుఇప్పటికైనా రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలిలేకపోతే పోలీసులు రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలి.మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్..రాధాకృష్ణ పై ఫిర్యాదు తీసుకోవాలన్నా పోలీసులు భయపడుతున్నారుఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందిప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందితన కుటుంబ సభ్యులను ఏదో అన్నారని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారుమీ ఇళ్లలో వారే మీకు మహిళలా?మా ఇళ్లలో వారు మహిళలుగా కనిపించడం లేదాతన తల్లిని ఏదో అన్నారని పవన్ పూనకం వచ్చినట్లు ఊగిపోయారుఇప్పుడు పవన్ ఏమైపోయారు?.మహిళలంతా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.విశాఖ..వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్..రాధాకృష్ణ ఒక బ్రోకర్.ఇటు వంటి బ్రోకర్ను బొక్కలో వేయాలి.చంద్రబాబు కొంతమంది పిచ్చి కుక్కలను తయారు చేస్తున్నారు..చంద్రబాబు తయారు చేసిన పిచ్చి కుక్కలు ఇష్టానుసారంగా మొరుగుతున్నాయి..మావిగన్కు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది .మావిగన్ నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి. -
లోకేశ్ ఏంటిది?.. ఆరు నెలలకు నిద్ర లేచిన మంత్రి టీమ్..
సాక్షి, అమరావతి: క్వాంటమ్ కంప్యూటింగ్... ఈ పదాన్ని చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో బాగా ప్రచారం చేస్తోంది. ఎటువంటి సమస్యకైనా మిల్లీ సెకన్లలో పరిష్కారం చూపించే సత్తా ఉందంటూ ఊదరగొడుతోంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ను పర్యవేక్షించే మంత్రి నారా లోకేశ్ శాఖ మాత్రం తప్పుడు జీవోలు జారీ చేసే శాఖగా మారిపోయింది. ఏకంగా జీవోల్లో కంపెనీల పేర్లనే మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. తీరా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. తప్పు జరిగిన ఆరు నెలల తర్వాత నిదానంగా నిద్రలేచిన లోకేశ్ టీం తప్పులను సరిదిద్దుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో చంద్రబాబు బడాయి మాటల బండారం ప్రపంచానికి తెలిసిపోయింది. అసలేం జరిగిందంటే... కంపెనీల పేర్లనే పూర్తిగా మార్చేసి జీవోలు.. గతేడాది నవంబర్ నెలలో ఐటీ శాఖ ఎస్సీఐసీబీ వెంచర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థ రూ.550 కోట్లతో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జీవో ఎంఎస్ నెంబర్ 49.., క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లతో ఐటీ ఎన్క్లౌంజర్స్, పీసీబీ బేరబోర్డు యూనిట్ ఏర్పాటును ఆమోదిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 60ను ప్రభుత్వం విడుదల చేసింది.అయితే జీవోల్లో కంపెనీల పేర్లను ఒకదానికి బదులు ఇంకో కంపెనీ పేరును పేర్కొంటూ అధికారులు కళ్లు మూసుకొని ఉత్తర్వులు జారీ చేసేశారు. ఒక జీవో జారీ చేసే ముందు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ శాఖ అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ, ఫైనాన్స్, సీఎస్, సీఎంవో ఇలా అనేక మందిని దాటుకొని రావాల్సి ఉంటుంది. అలాంటిది... ఎక్కడా కూడా జరిగిన పొరపాటును గుర్తించలేదంటే ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలల తర్వాత పేర్లు మార్చి... జీవోలు బయటకు రాగానే కంపెనీల యాజమాన్యాలు జరిగిన తప్పును వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దడానికి ఏకంగా ఆరు నెలల సమయం తీసుకొంది. చివరకు జనవరిలో విశాఖ కేంద్రంగా జరిగిన సీఐఐ పెట్టుబడుల సమావేశంలో ఈ రెండు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడూ కూడా ఆ కంపెనీల ప్రతినిధులు జరిగిన తప్పిదాన్ని మరోసారి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నవంబర్ 2025లో జారీ చేసిన తప్పుడు జీవోలను సవరిస్తూ ఏప్రిల్ 2026లో జీవోలను జారీ చేశారు.జీవో జారీ అయ్యే సమయంలో వివిధ దశల్లో ఒక గుమస్తా అనుకోకుండా చేసిన తప్పు వల్ల కంపెనీల పేర్లు మారాయంటూ చేతులు దులిపేసుకున్నారు. తప్పుడు జీవోల్లోని పేర్లు మార్చేందుకే ఆరు నెలల సమయం తీసుకున్నారని.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనా అని పలువురు పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
‘చమురు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించలేరా బాబూ’
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలుఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది. డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?చంద్రబాబు అనుభవం ఏమైంది?కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. -
లోకేష్ ఎక్కడ? ఎవరికీ తెలియకుండా రహస్య ప్రాంతానికి..
-
సిలబస్ లో లేని ప్రశ్నలు.. లోకేష్ మళ్లీ అదే తప్పు
-
జగన్ జగన్ అంటూ జపం నిద్రలో తండ్రీకొడుకు కలవరింతలు..!?
-
నిరుద్యోగులకు వయోగండం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపుపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించిన పాలకులు, వారి వయో పరిమితి పెంపుపై మాత్రం స్పందించకపోవడంపై ఆందోళన నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలకు 34 ఏళ్ల వయసు ఉండగా, ఈ పరిమితిని కొన్నేళ్లుగా 42 ఏళ్లకు పెంచుతున్నారు. అయితే, 2023లో సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్లకు 44 ఏళ్లకు పెంచాలని గత ప్రభుత్వంలో సీఎంకు నారా లోకేశ్ లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్సీలు సైతం పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖలు రాశారు. ఎన్నికల సమయంలో లోకేశ్ నిర్వహించిన యువగళం సభల్లోనూ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ అధికాకంలోకి వచ్చాక మాత్రం ఇచ్చిన హామీ మేరకు వయసు పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిపై నిర్ణయం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినప్పటికీ రెండు నెలలుగా అటు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని అక్కడి ప్రభుత్వం 46 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు భరోసా కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం గతేడాది ఇచ్చిన డీఎస్సీ–2025లో అభ్యర్థుల వయోపరిమితిని 44 సంవత్సరాలు చేసింది. కానీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం తప్పించుకుంటోంది. గతేడాది జూలైలో అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా వయో పరిమితి పెంచలేదు.హామీ విస్మరిస్తే ఊరుకోం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 47 సంవత్సరాలకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని లోకేశ్ ఎందుకు విస్మరిస్తున్నారు? రాష్ట్రంలో యూపీఎస్సీ మాదిరిగా ఏటా నోటిఫికేషన్స్ రావడం లేదు. కొన్ని నోటిఫికేషన్లపై న్యాయ వివాదాలతో ఏళ్ల తరబడి భర్తీ పూర్తి కావడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకోవాలి. వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. లేకపోతే నిరుద్యోగుల ఆందోళన తప్పదు. – ఎంబేటి రామచంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ ఏటా 75 వేల మందికి అన్యాయం ఏపీపీఎస్సీ ఓటీపీఆర్లో నమోదైన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 75 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. రెండు నెలలుగా వయో పరిమితి పెంపుపై ప్రభుత్వంగానీ, గతంలో హడావుడి చేసిన నారా లోకేశ్గానీ స్పష్టతనీయడం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీని నీరుగార్చిందన్న అపవాదును మూటగట్టుకొంది. దాదాపు 7 నెలలుగా సర్వీస్ కమిషన్కు రెగ్యులర్ చైర్మన్ను నియమించకుండా ఇన్చార్జితోనే నెట్టుకొస్తోంది. దీంతో కమిషన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అభ్యర్థుల వయోపరిమితిపై మాత్రం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. -
కుదిరితే అరెస్ట్.. లేదంటే నరుకుడే.. ఆంధ్రాలో అరాచకాలు
-
విజయమ్మకు బర్త్ డే విషెస్.. నీ అమ్మమ్మగా చెప్తున్నా లోకేష్ నీకు..!
-
మీ మేనత్తలు అంటే మీ అమ్మకు రోత. లోకేష్ కు ఇచ్చిపడేసిన లక్ష్మీపార్వతి
-
విజయమ్మ అంటే ఎందుకంత ప్రేమ లోకేష్.... లోకేష్ ట్వీట్ పై రాచమల్లు సంచలన కామెంట్స్
-
లోకేష్.. అమ్మమ్మ అంటూ ఎప్పుడైనా వచ్చావా?: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి/హైదరాబాద్: చంద్రబాబు, లోకేష్.. మీ బతుకంతా నాటకాలు, మోసాలే అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. లోకేష్ మీ కుటుంబ చరిత్ర తెలుసుకో అంటూ హితవు పలికారు. కన్న తండ్రి ఎన్టీఆర్పై చెప్పులేసి అవమానిస్తుంటే.. మీ అమ్మ భువనేశ్వరి ఏనాడైనా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. కుటుంబాలను చీల్చి మీరు ఏం సాధించలేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించిన మావిగన్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మావిగన్పై కూటమి నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ ముందు నీ స్థాయి ఎంత లోకేష్?. నీ బిల్డప్ ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా?. లోకేష్ ఈవీఎంల ద్వారా గెలిచారు. చంద్రబాబు, లోకేష్ మీ కుటుంబ చరిత్ర తెలుసుకోండి. చంద్రబాబు, లోకేష్ అడ్డదారుల్లో అమృతం తాగే రకం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.అలాగే, లోకేష్.. ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా?. మీ మేనత్తలు అంటే మీ అమ్మకు ఎంతో రోత. అసలు వాళ్లు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా?. లోకేష్.. మీ కుటుంబం పట్ల.. మీకే ప్రేమాభిమానాలు లేవు. చంద్రబాబు, లోకేష్.. మీ బతుకంతా నాటకాలు, మోసాలే. లోకేష్.. ఏనాడైనా అమ్మమ్మ అంటూ నా దగ్గరికి వచ్చావా?. అసలు నా పుట్టినరోజు నీకు తెలుసా?. కన్న తండ్రిపై చెప్పులేసి అవమానిస్తుంటే.. మీ అమ్మ ఏనాడైనా మాట్లాడిందా?. కుటుంబాలను చీల్చి మీరు ఏం సాధించలేరు. కాంగ్రెస్లో మీ నాన్నే.. బీజేపీలో మీ నాన్నే ఉన్నారు కదా లోకేష్. చివరకు కమ్యూనిస్టుల్లోనూ చంద్రబాబే ఉన్నారని అన్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కృషి చేశారు. మహిళలకు వైఎస్ జగన్ 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. మంచి లీడర్ అంటే వైఎస్ జగన్లా ఉండాలి. చంద్రబాబు, లోకేష్ రాజకీయాలను చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారు అని విమర్శించారు. -
లోకేశ్ దిగజారుడు రాజకీయం!
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ అంతకంటే దిగువకు దిగజారి రాజకీయ విశ్లేషకులను నివ్వెరపోయేలా చేసే సీఎం చంద్రబాబునాయుడు కంటే ఆయన తయుడు లోకేశ్ మరింత దిగజారిపోయారంటూ సామాజిక మధ్యమాల్లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వైఎస్ విజయ అని సంబోధిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన నారా లోకేశ్ ఇప్పుడు రాజకీయంగా మరింతగా దిగజారుతూ వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారంటూ ఎత్తిచూపుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి గతంలో ఎప్పుడైనా నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారా.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దిగజారుడు రాజకీయాల్లో భాగంగానే ఎన్నడూ లేని రీతిలో వైఎస్ విజయమ్మపై లేని ప్రేమను ఒలకబోస్తూ లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 19) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మను పులువురు నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. అయితే గతంలో ఎన్నడూ విజయమ్మకు శుభాకాంక్షలు తెలుపని, కనీస గౌరవం ఇవ్వని సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్.. ప్రస్తుతం దిగజారుడు రాజకీయంలో భాగంగానే ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. -
తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్
-
సీనియర్లను కరివేపాకులా తీసేస్తున్న లోకేష్.. నేతల శాపనార్థాలు
-
నా ప్రాణం పోయినా ఏ ఒక్కడిని వదలను.. అంబటి రాంబాబు ఉగ్రరూపం
-
ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ(ఏప్రిల్ 18, శనివారం) గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు.‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు...నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్పై చర్యలు లేవు...దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికైనా ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయండి. అంబటిని భయపెట్టాలనుకుంటే మీది పొరపాటే. ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. -
ఖర్చు వెనక్కిస్తే...ఎమ్మెల్యే పదవికి రాజీనామా! హాట్ కామెంట్స్
-
సీనియర్లను విస్మరించి... సన్నిహితులకు అందలం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రకటించిన కమిటీల పట్ల సొంత పార్టీలోనే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ను ప్రమోట్ చేసుకోవడమే లక్ష్యంగా కమిటీల కూర్పు చేసినట్టుగా స్పష్టమవుతోంది. ఊహించినట్టుగానే మంత్రి లోకేశ్ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలన్నీ తన చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్వహిస్తుండడం పట్ల పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో ఏకంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడం పట్ల సీనియర్లు రగిలిపోతున్నారు.గతేడాది మేలో జరిగిన మహానాడు సందర్భంగా ప్రకటించాల్సిన ఈ కమిటీలను ఏడాదిపాటు నానుస్తూ బుధవారం ప్రకటించారు. 29 మందితో పొలిట్బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో లోకేశ్తోపాటు ఆయన సన్నిహితులకు పెద్ద పీట వేయడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా లోకేశ్ వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే వారికి కీలక పదవులు కట్టబెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కిలారి రాజేష్కు కట్టబెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు లోకేశ్ సన్నిహితుడు సానా సతీష్కు పార్టీ అధికారంలోకి రాగానే రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. త్వరలో ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా పార్టీలో కీలకమైన జాతీయ ఉపాధ్యక్ష పదవిని సైతం సతీష్కు కట్టబెట్టారు. అప్రాధాన్య పదవులపై సీనియర్లలో అసంతృప్తి రాష్ట్ర అధ్యక్ష పదవిని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మరోసారి కట్టబెట్టారు. మరోవైపు తమకు అప్రాధాన్య పదవులు కట్టబెట్టారన్న అసంతృప్తి పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. గతంలో పొలిట్బ్యూరోతోపాటు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని అధికార ప్రతినిధిగా పరిమితం చేశారు. మంత్రి పదవులు ఆశిస్తున్న సోమిరెడ్డితోపాటు బొండా ఉమా, కూన రవి కుమార్, కన్నా లక్ష్మీనారాయణ, కళా వెంకట్రావు వంటి వారికి పార్టీలో అప్రాధాన్య పదవులు కట్టబెట్టడం ద్వారా వారిని మంత్రి పదువుల రేసు నుంచి తప్పించారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.మరోవైపు నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న దేవినేని ఉమ, కంభంపాటి రామ్మోహనరావు, బుద్దా వెంకన్న, చింతకాయల విజయ్, పరుచూరి అశోక్బాబు, పీతల సుజాత, భాష్యం రామకృష్ణ వంటి వారికి పార్టీ పదవులతో సరిపెట్టి పక్కన పెట్టారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి నిప్పంటించిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన పిడుగురాళ్ల మాధవికి పొలిట్బ్యూరోలో చోటు కల్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వక పోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. -
వెంట్రుక కూడా పీకలేవు .. నీకు ఇక మంగళమే, బాబుకు పేర్ని నాని వార్నింగ్
-
బాబు, లోకేష్.. పర్యవసానాలు అనుభవిస్తారు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: టీడీపీ వాళ్ల కళ్లల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు.. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దగ్గరున్న వారిని భయపెట్టాలనుకుంటున్నారా?.. లోకేష్ ఒక్కడికే విద్య తెలుసు అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పూడి శ్రీహరిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. ఏం నేరం చేశారని శ్రీహరిని అరెస్ట్ చేయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఒక విలేకరిగా ఎదిగి పైకొచ్చిన వ్యక్తి పూడి శ్రీహరి. మీరు చేసేది చట్టబద్ధమైన చర్య అయితే ప్రెస్ మీట్ పెట్టి శ్రీహరిని అరెస్ట్ చేయించండి. శ్రీహరి ఏమైనా నేరాలు చేశాడా?. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు.సోషల్ మీడియా కేసుకు ఇలా తీసుకెళతారా. చంద్రబాబు మీరు ఏం నేర్పిస్తున్నారు?. మీ తప్పులను ప్రశ్నిస్తున్నందుకు 20 నెలల నుంచి అందరినీ లోపల వేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మంగళహారతి పాడేందుకు జనం సిద్ధమైపోయారు. తప్పుడు కేసులు పెట్టి శ్రీహరిని ఓ 15 రోజులు జైల్లో పెట్టగలరు.. అంతకంటే ఏం చేయగలరు?. జైలు నుంచి బయటకి వచ్చాక జగన్ దగ్గర పనిచేయకుండా ఆపగలరా?. ఒకవేళ శ్రీహరి తప్పు చేస్తే అందరి ముందు అరెస్ట్ చేయండి. అలా కాకుండా దొంగతనంగా ఎత్తుకెళ్లడం దేనికి.. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు సీజ్ చేయడం దేనికి?. ఎవరిని భయపెడదామనుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు పోకడగలకు ఏ ప్రభుత్వాలు పోలేదు. రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుకున్న వాడు బతికిబట్టకట్టలేదు.40 ఏళ్ల ఇండస్ట్రీ అని నీతులు చెప్పడం సరికాదు. ఏపీలో పోలీసు వ్యవస్థను పతనావస్థకు తీసుకెళుతున్నారు. మీ కొడుకు మాటలు విని వ్యవస్థను నాశనం చేస్తే పర్యవసనాలు మీరు అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఏమైపోతారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఏం చేయలేరు. మీ కేసులు అరెస్టులు జగన్ వెంట జెండా మోయకుండా ఆపలేరు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. తప్పుడు పనులు మానుకోవాలని లోకేష్ సూచిస్తున్నాం’ అని హితవు పలికారు. -
ఆటలో అరటిపండు.. చివరికి పవన్ నెత్తిన స్కామ్
-
ఏ ప్రైవేట్ కంపెనీకి ఇస్తావా ఇచ్చుకో... మా ప్రభుత్వం వచ్చాక మాత్రం
-
మార్చి 12న లోకేష్ వచ్చాడు.. 16న బోట్ల దొంగతనం.. జగన్ కౌంటర్లకు నవ్వులే నవ్వులు
-
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వ(వైఎస్సార్సీపీ) హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చంద్రబాబు సర్కార్ను వైఎస్ జగన్ నిలదీశారు.మత్స్యకారుల నుంచి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబ్టి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి. కళ్లుమూసి తెరిచే లోపే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి
-
రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?: మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్.. అలాంటి వ్యక్తి రెడ్బుక్ పేరుతో ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దంటూ మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమే. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.‘‘అది అసాధ్యం కాబట్టే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మంత్రులకు సింగపూర్లో శిక్షణా తరగతులు అంట. అవినీతి చేసి జైలు పాలయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో శిక్షణ ఇప్పిస్తారా?. గతంలో అమరావతి రైతులను కూడా ఇలాగే సింగపూర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారు. రాధాకృష్ణ ఉన్మాదాన్ని సమర్థించిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీళ్లు మరింత ఉన్మాదంతో వ్యవహరిస్తూ వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేస్తున్నారు’’ అంటూ మార్గాని భరత్ దుయ్యబట్టారు.‘‘కొన్ని ఫేక్ ఛానల్స్తో ఉన్మాదపు ట్రోల్స్ చేస్తున్నారు. నారా లోకేష్.. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైం మీకే ఇబ్బంది పెడుతుందని గుర్తించాలి. డైవర్షన్ రాజకీయాల కోసం ఏం చేసినా సహిస్తామనుకోవద్దు. మావిగన్ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేకంటే మావిగన్ బెటర్ అన్న చర్చ జరుగుతోంది...అమరావతిలో రాజధాని కడితే నయా రాయపూర్, గాంధీనగర్ లాగ అవుతుంది. సాయంత్రం అయితే అధికారులు విజయవాడ, గుంటూరు వెళ్తారేగానీ అమరావతిలో ఎవరూ ఉండరు. జనంలేని అమరావతిలో రాజధాని కడతారా?. జనం ఉన్న మావిగన్లో రాజధాని నిర్మిస్తారా?. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటితరం అమరావతిని చూడలేదు’’ అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. -
‘మా బాబును రాష్ట్రపతి తెగ పొగిడేశారు తెలుసా!’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గాలికొదిలేసి.. ప్రచార ఆర్భాటాల కోసం టీడీపీ బృందం హస్తిన బాట పట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోమవారం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, టీడీపీ కూటమి ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు వారంతా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. బాబును పొగిడారంటూ ప్రచారం భేటీ అనంతరం టీడీపీ వర్గాలు తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం చంద్రబాబును రాష్ట్రపతి ‘ఇంటెలిజెంట్, విజనరీ’ అని ప్రశంసించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం గొప్ప విషయమని రాష్ట్రపతి అన్నట్టుగా లోకేశ్ బృందం ప్రచారం చేస్తోంది. రాష్ట్రపతితో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే వైఎస్సార్సీపీపైన, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన విమర్శలు గుప్పించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఐదు కోట్ల ఆంధ్రులను అవమానిస్తోందంటూ అక్కసు వెళ్లబోశారు. -
ఫీజుల వసూళ్ల పేరుతో వడ్డీ వ్యాపారమా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలు ఫైనాన్స్ కంపెనీలతో కుమ్మక్కై విద్యార్థుల తల్లిదండ్రులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చదువులు పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా వచ్చే విద్యా సంవత్సరానికి మొదటి టర్మ్ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.నిర్ణీత సమయంలో ఫీజులు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మెసేజ్లు పంపి మరీ విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు 6, 9 నెలల కాలపరిమితితో విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తూ ఈఎంఐల రూపంలో అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా సంస్థల ముసుగులో ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెడితే ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు.వైఎస్సార్సీపీ హయాంలో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ వేసి ఇలాంటివి జరగకుండా అడ్డుపడిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో విద్యను వ్యాపారం చేసి ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేశ్కి విద్యాశాఖపై ఏమాత్రం నియంత్రణ, అవగాహన లేదని.. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
లోకేష్ కి చిప్ దొబ్బింది అంటే... జోగి రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
మీ అమ్మ భువనేశ్వరిగారే చెప్పు తీసుకుని కొట్టమని చెప్తారు..
-
ఖజానాపై ‘ప్రత్యేక విమానం’ మోత!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని, ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని, సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఒకవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుతున్న విలాసవంతమైన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. చంద్రబాబు ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు, ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల టూర్లకు, చివరికి ప్రతి శనివారం హైదరాబాద్లోని సొంత ఇంటికి వెళ్లొచ్చేందుకు కూడా ప్రత్యేక హెలికాప్టర్, విమానాలనే వినియోగిస్తున్నారు.దీంతో రెండేళ్లలోనే సీఎం చంద్రబాబు (వీవీఐపీ) ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.109.04 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.54.41 కోట్లు, 2025–26 ఆరి్థక సంవత్సరంలో రూ.54.63 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసింది. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరంలోనూ చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు అద్దె చెల్లింపు కోసం బడ్జెట్లో రూ.54.63 కోట్లను కేటాయించారు. సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లాలన్నా తాడేపల్లిలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక వారాంతంలో చంద్రబాబు పక్క రాష్ట్ర హైదరాబాద్లో ఉన్న తన సొంత ఇంటికి సైతం ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. దీంతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల భారం ప్రభుత్వ ఖజానాపై భారీగా పడుతోంది.పవన్, లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినా పవన్కళ్యాణ్, లోకేశ్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల ఖర్చు గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
ఎమ్మెల్యే మాధవి రెడ్డికి బిగ్ షాక్..
సాక్షి, కడప: కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆకస్మిక తనిఖీలు చేసి హడావుడి చేద్దామనుకున్న పచ్చ పార్టీకి ఎమ్మెల్యే.. అక్కడున్న పరిస్థితి చూసి అవాక్కయ్యారు. చేసేదేమీ లేక ముక్కుమూసుకుని బయటకు వచ్చేశారు. దీంతో, కూటమి సర్కార్ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో ఓ ప్రజా ప్రతినిధి చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తన నియోజకవర్గంలోని పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు షాక్ ఇవ్వాలనుకున్నారు. ఇందులో భాగంగా కడప నగరం ముతరాసుపల్లి జడ్పీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన వెంటనే అక్కడి పరిస్థితులను చూసి మాధవి రెడ్డి జడుసుకున్నారు. స్కూల్లోని బాత్రూమ్లను చూసి ఒక్కసారిగా ముక్కు మూసుకుని బయటకు వచ్చారు. దీంతో, కూటమి ప్రభుత్వ పాలనలో పాఠశాలల పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. అనంతరం, మండుటెండలో మట్టిలో పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసి ఎమ్మెల్యే మాధవి రెడ్డి అవాక్కయ్యారు. నాణ్యత లేని భోజనం పెట్టడాన్ని చేసి ఎమ్మెల్యే ఖంగుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు.. ప్రతి రోజూ భోజనం బాగాలేదు అని మాధవికి చెప్పడం మరో విశేషం. ఇలా ఒక్కో సమస్యను విద్యార్థులు.. మాధవి రెడ్డి దృష్టికి తీసుకురావడంతో రివర్స్లో ఆమెకే షాక్ తగిలినట్టు అయ్యింది. దీంతో, చెప్పేది, చేసేదీ ఏమీ లేక మాధవి రెడ్డి అక్కడి నుంచి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్పై నెటిజన్లు మండితున్నారు. రాష్ట్రంలో స్కూల్స్ నిర్వహణపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. -
లోకేష్ ను నమ్మి మోసపోయా
-
నారా లోకేష్ కు టీడీపీ క్యాడర్ బిగ్ షాక్
-
మీ కుటుంబాల అడ్రస్ చెప్పమంటావా.. బాబు, పవన్, లోకేష్ కు ఇచ్చిపడేసిన జగన్
-
లోకేష్, పవన్ ఇప్పటికీ షటిల్ సర్వీసులే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో చంద్రబాబు పట్టపగలే దోపిడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. 12ఏళ్లలో మనస్పూర్తిగా చంద్రబాబు అమరావతిలో ఉన్నారా?. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా?. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?. 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీస్ చేశారు. ఇప్పుడు కూడా హైదరాబాద్కు షటిల్ సర్వీసే చేస్తున్నారు. పవన్, లోకేష్ నాలుగు రోజులు కూడా అమరావతిలో ఉండటం లేదు. పవన్, లోకేష్లకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. విమానాల్లో తిరుగుతున్నారు..షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. మేము అప్పుడు, ఇప్పుడు ఇదే చెబుతున్నాం. కానీ, ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నాడు.అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు. అమరావతి కోసం ఏడేళ్లలో మొత్తం 8000 కోట్లు ఖర్చు చేశారు. ఏడేళ్లలో 8000 కోట్లు ఖర్చు పెడితే రూ.2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది. అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అయ్యిందా?. అమరావతిలోనే వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు. -
కోట్ల స్కాం..? TTD భూములపై లోకేష్ కన్ను
-
తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రూ.1000 కోట్ల భూమిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ దందాకు సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ అని చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘కారు చౌకగా అమ్మడమే కాకుండా 15 ఏళ్ల పాటు జీఎస్టీ రియింబర్స్ చేస్తారట. స్టాండ్ డ్యూటీ కూడా రియింబర్స్మెంట్ చేస్తారట. ఎటువంటి ప్రకటన లేకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల్లో నారా లోకేష్ భాగస్వామిగా ఉన్నారా?. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా 22 ఎకరాలు 94 కోట్లుకు కూటమి ప్రభుత్వం అమ్మేస్తోంది. వందల కోట్లు దోపిడికి శ్రీకారం చుట్టారు.టూరిజం స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి అంటే పీపీపీ విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వడం దారుణం. దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణంప్రభుత్వం ప్రకటన ఎక్కడా లేకుండా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది. లోకేష్ ఈ రెండు సంస్థల బినామీనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం. లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో జీవోలో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏంటి?. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి. -
వైద్య విద్య అందించలేని తండ్రీకొడుకులు బాబు,లోకేష్ పై AISF నేతలు ఫైర్
-
వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించిందని.. ఆర్డీటీ సేవలకు కేంద్రం ఓకే చెప్పిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనన్నారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ శైలజానాథ్ మండిపడ్డారు.‘‘వారి క్రెడిట్ చోరీని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి మేము చాలా పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా?. ఆర్డీటీకి 21 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపేసింది. ఆ టైంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. కల్యాణదుర్గం ఇన్ఛార్జ్ తలారి రంగయ్య అమిత్షాని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోస్టు కార్డుల ఉద్యమం నుండి పార్లమెంటులో నిరసన వరకు చాలా పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితాన్ని టీడీపీ నేతలు కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు’’ అంటూ శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
‘ఇనార్బిట్’ చుట్టూ ఇగో పాలిటిక్స్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కలి్పంచే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్ .. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. మాల్ను ప్రారంభించిన రహేజా గ్రూప్ ప్రతినిధులు, ఇనార్బిట్మాల్ సీఈవో రజనీష్ మహాజన్ , పోర్టు చైర్మన్ అంగముత్తు గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..
-
యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్
-
చంద్రబాబు పరిస్థితి మన్మధుడు సినిమాలో బ్రహ్మనాదంలా... బాబుపై జడ శ్రవణ్ సెటైర్లు
-
నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి
-
‘జాబ్ క్యాలెండర్ను లోకేష్ జోక్ క్యాలెండర్గా మార్చేశారు’
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్ని జోక్ కేలండర్గా మార్చారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్లో డేట్లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్..వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్ దుయ్యబట్టారు. -
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
రోశయ్య తాత గుర్తొస్తున్నాడట.. లోకేష్ పై తాడిపత్రి చంద్రశేఖర్ పంచులు
-
నోరు జారిన లోకేష్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
-
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
టైం ఇస్తున్న కేసులు క్లోజ్ చేయాలి.. పోలీసులకు లోకేష్ వార్నింగ్
-
99 పైసలకి కాకపోతే ఊరికే ఇస్తా, నా ఇష్టం అంటున్న నారా లోకేష్


