తిరుపతి అర్బన్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరా భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో సరికొత్త పంథాలో కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు చానెల్ సీఈవో ఏవీ నరసింహారావు తెలిపారు. ఈ కొత్త కార్యక్రమాల్లో భాగంగా ‘పూజకు వేళాయె’ అనే కార్యక్రమం శనివారం ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. అలాగే 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భక్తిగీత మాలిక కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రసారమవుతుందన్నారు. ఇదేరోజు ప్రారంభం కానున్న భక్తిచైతన్యం కార్యక్రమం ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుందన్నారు.