సాక్షి, తిరుమల : తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. బుధవారం 62,351 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,676 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.86కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment