
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి విశాఖపట్నం జిల్లాలో తిరిగి యాత్రను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా పవన్ యాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మలివిడత యాత్ర విశాఖ జిల్లాలో మూడు నుంచి నాలుగు రోజులపాటు ఉంటుందని.. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment