Janasena Party
-
Lakshmi : బెదిరింపులు ఎక్కువయ్యాయి
-
అవును నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది: Kiran Royal
-
పళ్ళు చూపించి ఫోటోలు దిగడం కాదు ...అభివృద్ధి అంటే..
-
సినిమాల్లో డబ్బులు చాలకే ఈ ప్రజారాజ్యం,జనసేన పార్టీలు : KA Paul
-
కిరణ్ నిజ స్వరూపం బయటపడటంతో ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
-
కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు
-
మార్గదర్శి స్కాం దేశంలోనే చాలా పెద్దది: మిథున్ రెడ్డి
-
మహిళలపై పవన్ కు ఉన్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నలు
-
జనసేన నేత చేతిలో మోసపోయిన బాధితురాలు లక్ష్మిపై కేసు, అరెస్ట్
-
పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మీటింగ్ కి డబ్బులు కావాలి.. కిరణ్ రాయల్ బాగోతం బట్టబయలు చేసిన లక్ష్మి
-
నేను అన్ని రిలీజ్ చేస్తే కిరణ్ రాయలు పుట్టగతులు ఉండవు
-
కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు
-
ఎవరీ కిరణ్ రాయల్?
ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు. ఆధునిక సమాజంలో ఆడవారికి ఆకాశంలో సగం అంటూ అగ్రపీఠం వేశారు. అయితే కొందరు మాత్రం మహిళలను ఆటబొమ్మలుగానే చూస్తున్నారు. వంటింటి కుందేళ్లుగానే భావిస్తున్నారు. మళ్లీ ఆటవిక యుగంలోకే నెట్టేస్తున్నారు. ఇదే కోవలో జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ వారి పార్టీ అధినేత గొంతు చించుకుంటూ ఉంటే.. అనుయాయుడు మాత్రం అతివల జీవితాలతో ఆడుకుంటున్నారు. ‘చిల్లర’ వేషాలు వేస్తూ సాఫీగా సాగుతున్న సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్న వనితలను కల్లబొల్లి కబుర్లతో లోబరుచుకుని రూ.కోట్లు కాజేస్తున్నారు. ప్రశ్నించిన వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టిన సదరు కిరణ్వారు.. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో స్వప్రకటిత నేతగా హల్చల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడని చెప్పుకుంటూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్రాయల్ నా జీవితం నాశనం చేశాడు. రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడు. నన్ను అప్పుల పాలు చేసేశాడు. అడిగితే మమల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు’’ అంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియో.. వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జనసేనలో సదరు కిరణ్రాయల్ కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆ పారీ్టకి తలనొప్పిగా మారాయి. దీనిపై పవన్కల్యాణ్ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. కిరణ్ రాయల్పై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటి వెలుగులోకి.. కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ రాసలీలలు ఒక్కోక్కటే వెలుగులోకి వస్తున్నాయి. నమ్మించి మోసం చేసిన కిరణ్ రాసలీలల భాగోతాన్ని బాధిత మహిళ బట్టబయలు చేసింది. మరో వివాహితతో సైతం కిరణ్ శారీకర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది. ఈ క్రమంలోనే జనసేన పారీ్టలోని ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పార్టీ పదవులను పావులుగా చూపి లోబరుచుకున్నట్లు నగరంలో సైతం చర్చ జరుగుతోంది. కామాంధుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితులతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనలా కిరణ్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకురావాలని, మహిళలను మోసగించే దుర్మార్గుడికి శిక్షపడేందుకు ఆధారాలు ఇవ్వాలని లక్ష్మి కోరుతున్నారు.మాయమాటలతో మహిళలకు వల!తనకున్న మాటకారితనం, హావభావాలతో మహిళలను ఆకట్టుకునేవాడు. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇతర మహిళలను వలలో వేసుకోవడం పరిపాటిగా మార్చుకున్నాడు. అందులో భాగంగా తన పక్కింటిలో ఉన్న లక్ష్మీరెడ్డి కుటుంబంతో చనువు పెంచుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమెను బుట్టలో వేసుకున్నాడు. చివరకు ఆ కుటుంబం విడిపోవడానికి కారకుడయ్యాడు. అతడి మోజులో పడిన ఆ మహిళ కుటుంబాన్ని వదలి కిరణ్ వెంట నడిచింది. రాజకీయంగా ఎదుగుతున్న తనకు ఆర్థిక అండ అవసరమని గుర్తించి ఆమెకున్న ఎకరం భూమిని అమ్మించి సొమ్ము చేసుకున్నాడు. పలు దఫాలుగా రూ.1.32కోట్ల నగదును చేయి బదులుగా తీసుకున్నట్లు ఆ మహిళ ఆధారాలను బయటపెట్టింది. దీంతో పాటు 300గ్రాముల బంగారు నగలను కాజేశాడని వెల్లడించింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతూనే మరో మహిళను ముగ్గులోకి దింపాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఇద్దరి మహిళల మధ్య చిచ్చురేగింది. దీనిపై నిలదీయడంతో లక్ష్మీని దూరం పెడుతూ వచ్చాడు. నిన్ను నమ్ముకుని సర్వస్వం నీకే ఇచ్చేశాను.. నీ కారణంగా నా కుటుంబం రోడ్డున పడింది. నా బిడ్డలు అనాథలయ్యారని లక్ష్మి వేడుకున్నా కఠిన మసస్తత్వం కరగలేదు. దీంతో ఆమె తనకు ఇవ్వాల్సిన నగదు బంగారం తిరిగి ఇవ్వాలని కిరణ్ను అడగడంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలోనే ఆ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించి, పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ చంపేస్తానంటూ బెదిరించాడు. ఆమెపై నేరుగా దాడి చేసినట్లు వాయిస్ రికార్డులో కిరణ్ ఒప్పుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నిన్ను చంపి బెయిల్పై తిరిగొస్తా.... నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తా... నీలాంటి వాళ్లను చాల మందిని చూశా... నా వెంట్రుక కూడా ఏవరూ పీకలేరు...నీవల్ల ఏమవుతుందో అది చేసుకో...అంటూ దారుణంగా మాట్లాడిన ఆడియో, వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మొత్తం వ్యవహారంపై బాధితురాలు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.సస్పెన్షన్కు రంగం సిద్ధం! సనాతన ధర్మ పరిరక్షణకు పాటుబడతానని, మహిళలకు రక్షణ కవచంలా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి జనసేన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ రాయల్ వికృత పోకడలపై వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహిళను చంపేస్తానంటూ బెదిరించిన కిరణ్ రాయల్ను పార్టీ నుంచి నేడో, రేపో సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆధారాలు వెలుగు చూసినా పార్టీ అధిష్టానం రెండు రోజులుగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు సైతం కిరణ్రాయల్ అక్రమాలపై కచ్చితమైన ఆధారాలతో పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్కు స్పష్టం చేశారు.ఎవరీ కిరణ్? కిరణ్ రాయల్ జీవితం అంతా వివాదాస్పదంగానే ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చిన కిరణ్ తన బతుకును గ్రూప్ థియేటర్స్ నుంచి ప్రారంభించాడు. చిరంజీవి సినిమాలకు బ్లాక్లో టెకెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైల్వేస్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిళ్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు అతను కిరణ్గానే అందరికీ పరిచయం. కిళ్లీ కొట్టులో మాదకద్రవ్యాలను సైతం విక్రయించే ఈ స్థాయికి ఎదిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్గా చిన్నపాటి కార్యక్రమాలు చేపడుతూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. మెగా ఫ్యాన్కు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవిలోనూ కొనసాగాడు. ఈ క్రమంలో తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. తదనంతరం కిరణ్ ‘‘రాయల్’’గా అవతరించాడు. ఇంతలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆయనకు రాజకీయ ప్రాధాన్యం లభించింది. ఆపై పవన్కల్యాణ్కు దగ్గరవుతూ జనసేనలోనూ కొనసాగాడు. తిరుపతిలో ఆ పారీ్టలో చేరేందుకు ముఖ్యనేతలెవ్వరూ మొగ్గు చూపకపోవడంతో కిరణ్ రాయలే పెద్ద దిక్కుగా మారాడు.దర్శన టికెట్లలో అవినీతి తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందిన రోజులల్లో కిరణ్ అక్రమాల భాగోతం తిరుమలకు పాకింది. తన అభిమాని కావడం, పార్టీ వ్యవహారాలు చూస్తుండడంతో శ్రీవారి దర్శన సిఫార్సు లేఖల వ్యవహారం మొత్తం కిరణ్కు అప్పగించారు. ఈ క్రమంలోనే సిఫార్సు లేఖలను కిరణ్రాయల్ అక్రమంగా రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం చిరంజీవి చెవిన పడడంతో ఆయన పలు మార్లు కిరణ్ని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలం పాటు కిరణ్ను పక్కన పెట్టారు. నాగబాబు ద్వారా మంతనాలు నడిపి మళ్లీ మెగా కుటుంబం పంచన చేరాడు. తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారంలో ఆయనపై పలు కేసులు నమోదవడం గమనార్హం. ‘గో బ్యాక్ ఆరణి అంటూ’.. జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పేరును ఖరారు చేయడంతో కిరణ్ రాయల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు ఆరణితో సఖ్యతగా ఉన్నా తనకు లొంగలేదన్న అక్కసుతో తిరుపతి నగరం అంతా ‘గోబ్యాక్ ఆరణి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు. ఎన్నికల సమయంలో ఈ ఫ్లెక్సీల అంశం రాజకీయంగా కుదిపేసింది. జనసేనలోనే ఉంటూ ఆ పారీ్టకి నష్టం చేకూర్చేలా వ్యవహరించడం ముఖ్యనేతలకు నచ్చలేదు. మెగా ఫ్యాన్ అసోసియేషన్ నేత కావడంతో మందలించి వదిలేశారు. ఎన్నికలలో ఆరణికి వ్యతిరేకంగా పనిచేశాడని ఆధారాలతో సహా పవన్కల్యాణ్కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఎమ్మెల్యేతో ఉప్పు నిప్పుగా ఉంటూ వచ్చాడు. మళ్లీ కొద్దిరోజులుగా ఎమ్మెల్యే ఇంటి వైపునకు వెళ్లివస్తున్నాడు. ఇంతలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం ఆ పారీ్టలో సంచలనంగా మారింది. అలాగే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులను టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డాడు. అసభ్యంగా దూషిస్తూ తీవ్రమైన విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ ఈఓ, కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ను సైతం బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
అయిపాయే.. చేతులెత్తేసిన చంద్రబాబు! (ఫొటోలు)
-
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో మరోసారి కలకలం
-
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఫ్యూచర్ సీఎం లోకేశే: భరత్
-
పిఠాపురం పవన్ కల్యాణ్ సభలో వీర మహిళ లక్ష్మీకి తీవ్ర అవమానం
-
జనసేన రేవ్ పార్టీ వీడియో కలకలం
-
పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు చేదు అనుభవం
-
ప్రజల వ్యక్తిగత సమాచారం జనసేన చేతికి ఎలా వెళ్లింది?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా ఉల్లంఘన జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేసింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ డేటాను అడ్డంపెట్టుకొని సామాన్య పౌరులను జనసేన కార్యకర్తలు వేధిస్తున్నారని ఆరోపించింది. ఇది పాలనా పతనాన్ని బట్టబయలు చేస్తోందని పేర్కొంది. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో రాజకీయ గూండాయిజం రాజ్యమేలుతోందని, ఫలితంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న జనసేన పార్టీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రజల సున్నితమైన డేటా నిమిషాల్లోనే జనసేన కార్యకర్తలకు ఎలా చేరుతోందని ప్రశ్నించింది. పోలీసులు, కూటమి కార్యకర్తలు కుమ్మక్కై పని చేస్తున్నారా లేక పోలీసులే తమ వద్ద ఉండాల్సిన పరికరాలను వారి చేతికే ఇచ్చేసి వాడుకోమని చెప్పారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. డేటా ఉల్లంఘన విషయంలో పరిశోధించడానికి పోలీసులను జవాబుదారీగా ఉంచడానికి, బెదిరింపులను అరికట్టడానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. -
ప్రభుత్వం దగ్గరే ఉండాల్సిన రహస్య సమాచారం జనసేన సోషల్ మీడియాలో...
-
వేలం పాట వేసి బెల్ట్ షాపులు నడుపుతున్న ఎమ్మెల్యే అనుచరులు
-
జనసేన నేత లైంగిక వేధింపులు..
-
కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నటుడు పోసానిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డిపై.. సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రిమాండ్ తిరుపతి సబ్జైలులో రిమాండ్లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు. ఇద్దరి అరెస్టు కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసుజనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో సోషల్మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్కళ్యాణ్లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్రెడ్డి, సిరిగిరి అర్జున్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
పవన్ కళ్యాణ్ ఇది చూడు నా కూతుర్లను ఎలా తిట్టారో
-
..అలా అయితే మీరు చాలా శాఖలు తీసుకోవాల్సి వస్తుంది సార్!
-
జనసేన ఎమ్మెల్యే ఎక్కడ?
సాక్షి టాస్క్ఫోర్స్: ఎమ్మెల్యే ఎక్కడ? అని మంత్రి నాదేండ్ల జనసేనులను ఆరా తీశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన ఏకై క ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న పౌరసరఫరాల మంత్రి, పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ రెండు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారు. సూపర్ సిక్స్ పథకాల్లోని దీపం–2 పథకం కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రమైన తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హాజరు కావాల్సిఉంది. అయినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాలేదు. అలాగే మంత్రి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనూ స్థానిక ఎమ్మెల్యే లేరు. మంత్రి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో నాదేండ్ల మనోహర్ జనసేన జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. జిల్లా నాయకులంతా హాజరైనా ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాకపోవడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరా తీశారు. -
కాకినాడలో రోడ్డెక్కిన టీడీపీ - జనసేన విభేదాలు
-
అమ్మాయిలపై లైంగిక వేధింపుల్లో బిజీబిజీగా కూటమి ఎమ్మెల్యేలు
-
జనసేన ఆఫీస్ దగ్గరే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరీక్షణ
-
పరిపాలనకు ‘తిరు’క్షవరం
వారెవ్వా! ఎంతటి వంచనాశిల్ప చాతుర్యము. శకుని మామ అనేవాడు బతికే ఉంటే ఈ చతురత ముందు మోకరిల్లి పొర్లు దండాలు పెట్టి ఉండేవాడే! జగన్మోహన్రెడ్డి తిరుమల దర్శనా నికి వెళ్తే పెద్ద ఎత్తున అల్లరి జరగాలి. ఆయన మీద రాళ్లు రువ్వాలి. దాడులకు తెగబడాలి. అందుకు ఏర్పాట్లు కూడా జరి గాయి. వేలాదిమందిని సమీకరించి పెట్టుకున్నారు. వైసీపీ వాళ్లను గృహనిర్బంధం చేశారు. జగన్ యాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ ఆ పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా జగన్మోహన్రెడ్డి వెళ్లి ఉంటే విధ్వంసానికి రంగం సిద్ధం. అందుకు నెపాన్ని కూడా ఆయన పైనే∙వేయడా నికి స్క్రిప్టు రెడీ.పరిస్థితిని గమనించి జగన్మోహన్రెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ వెళ్లలేదనే ప్రచారం ప్రారంభం. ఈ ప్రచారానికి సాక్షాత్తూ ముఖ్య మంత్రే నాయకత్వం వహించారు. ఆయన ప్రెస్మీట్ నుంచి సందేశాన్ని అందుకున్న కూటమి నాయకులు పొట్టోడు, పొడు గోడు అనే తేడా లేకుండా డిక్లరేషన్ దండకాన్ని అందుకున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే జరిగింది.తన వంద రోజుల పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఓ అభూతకల్పన సృష్టించారు. నిజా నిజాలు నిలకడ మీద తేటతెల్లమవుతున్నాయి. దేవస్థానం మార్కెటింగ్ విభాగం వారి నాణ్యతా పరీక్షలను దాటుకొని ప్రసాదం తయారీ చెంతకు కల్తీ నెయ్యి వెళ్లే పరిస్థితే అక్కడున్న వ్యవస్థలో ఉండదు. అందువల్లనే కొన్ని డజన్ల పర్యాయాలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు వెనక్కు మళ్లాయి. అట్లా వెనక్కు పంపిన ట్యాంకర్లలోని ఒక శాంపుల్నే గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పంపించింది. మైసూర్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ల్యాబ్కు పంపించే సంప్ర దాయానికి భిన్నంగా ఈసారి గుజరాత్కు పంపించారు.పంపించడానికి ఒకరోజు ముందు ఎన్డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్లతో టీటీడీ ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ భారత రాష్ట్ర పతి, ప్రధాని, చీఫ్ జస్టిస్లకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి గవర్నింగ్ బాడీ సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ లేఖలు రాశారు.మైసూర్ ల్యాబ్కు కూడా ఇదే కంటైనర్లోని శాంపుల్ను పంపించినట్టు విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిందా? లేదా? వస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నది ఓ అంతుచిక్కని రహస్యం. వేణుగోపాల్ లేఖ మీద విచారణ జరిగితే చాలా అంశాలు బయటకు రావచ్చు.కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దేశీయ గోసంపద వృద్ధి లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. కానీ ఎన్డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్లు ఆ కార్యక్రమాలకు తూట్లు పొడుస్తూ సంకర జాతి జెర్సీ ఆవులను ప్రోత్సహించారని కూడా వేణుగోపాల్ ఆరోపించారు.తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వారు సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి ఈ వివాదమంతా జరుగుతున్నది. వారు ఆన్లైన్ టెండర్లో పాల్గొని కేజీ నెయ్యికి 319 రూపాయలు కోట్చేసి ఎల్–వన్గా వచ్చినందువల్ల ఆనవాయితీ ప్రకారం 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆ డెయిరీకి అప్పగించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన జూన్ నెలలోనే వారు నెయ్యి సరఫరాను ప్రారంభించారు. ఈ నెయ్యి ధర మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంత తక్కువ ధరకు మంచి నెయ్యిని ఎట్లా సరఫరా చేస్తారన్నది ఆయన ప్రశ్న.డెయిరీ నిర్వాహకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆవు పాల సేకరణ ధర 35 రూపాయల లోపే వుంటే రూ.300లకు కిలో చొప్పున నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయడం అసాధ్య మేమీ కాదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆవు పాల సేకరణ ధర అంతకంటే తక్కువే ఉన్నది. కనుక ఏఆర్ డెయిరీ కోట్ చేసిన ధర అభ్యంతరకరమైనదేమీ కాదని డెయిరీ నిర్వాహకుల అభిప్రాయం. ఏఆర్ డెయిరీని ఆపేసిన తర్వాత పిలిచిన టెండ ర్లలో యూపీకి చెందిన ఆల్ఫా ఫుడ్స్ అనే డెయిరీ ఎల్–వన్గా నిలిచింది. వాళ్లు రూ. 475 కోట్ చేశారు. పద్ధతి ప్రకారం ఎల్–వన్గా ఉన్న ఆల్ఫా ఫుడ్స్ 65 శాతం సరఫరా కాంట్రా క్టును, ఎల్–టూగా ఉన్న నందినీ డెయిరీ వారు 35 శాతం సర ఫరా కాంట్రాక్టును దక్కించుకున్నారు.నందినీ డెయిరీ లోగోలోనే సంకర జాతి జెర్సీ ఆవు బొమ్మ ఉంటుందనీ, వాళ్లు సరఫరా చేసేది దేశీ ఆవు నెయ్యి కాదని స్వదేశీ గో ఉద్యమకారులు అభ్యంతరాలు చెబు తున్నారు. ఇది మరో చర్చనీయాంశం. ఇక ఎల్–వన్గా వున్న ఆల్ఫా ఫుడ్స్ డెయిరీ ప్లాంట్కు తిరుపతి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంత దూరాభారాన్ని మోస్తూ అక్కడినుంచి వాళ్లే సరఫరా చేస్తారా లేక అదే పేరుతో స్థానిక డెయిరీలు ఏవైనా ఆ పని చేస్తాయా, అనే చర్చ కూడా జరుగు తున్నది. ఆల్ఫా డెయిరీ అనేది అన్లిస్టెడ్ కంపెనీయే కనుక అదేమీ అసాధ్యమైన వ్యవహారం కాదు. ఇక్కడింకో విచిత్రమైన విషయం ఏమిటంటే నెయ్యి నాణ్యత మీద చంద్రబాబు ఆరోప ణలు చేసిన రోజున అంటే సెప్టెంబర్ 19న ఆయన కుటుంబ యాజమాన్యంలోని హెరిటేజ్ డెయిరీ షేర్ విలువ రూ. 565. సరిగ్గా వారం రోజుల్లో సెప్టెంబర్ 27 నాటికి అది రూ.635 దాటింది. మొత్తంగా చూస్తే వారం రోజుల్లో హెరిటేజ్ సంపద 600 కోట్లు పెరిగింది. ఇది యాదృచ్ఛికమేనా?ఇక డిక్లరేషన్ విషయానికొద్దాం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆధారాలు సుమారు 15 వందల ఏళ్ల క్రితం వరకూ చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. తిరు మలలో అన్యమతస్థులకు ప్రవేశం లేదనిగానీ, వారు డిక్లరేషన్ ఇస్తే తప్ప ప్రవేశించడానికి వీల్లేదని గానీ ఎన్నడూ లేదు. ఈ డిక్లరేషన్ వ్యవహారం 1987లోనే ప్రారంభమైంది. అన్యమత స్థులు శ్రీ వేంకటేశ్వరునిపై భక్తి విశ్వాసాలున్నాయని ప్రకటిస్తూ ఒక ఫామ్పై సంతకం చేసి వెళ్లవచ్చునని నిబంధనను తీసు కొచ్చారు. ఇదో అర్థం లేని నిబంధన. ఎవరైనా దేవుడిని ఎందుకు దర్శించుకుంటారు? ఆ దేవునిపై భక్తి విశ్వాసాలు ఉంటేనే కదా!తిరుమలేశుని దర్శనానికి రోజుకు సుమారు ఐదొందల నుంచి వెయ్యిమంది వరకు అన్యమతస్థులు వస్తుంటారని అంచనా. వారంతా అత్యంత భక్తి విశ్వాసాలతో తిరుమల దేవ స్థానం నిర్ణయించిన సంప్రదాయ డ్రెస్ కోడ్ను పాటిస్తూ దర్శనం చేసుకుంటారు. అంతే తప్ప రోజుకు ఒక్క డిక్లరేషన్ కూడా రాదు. డ్రెస్ కోడ్ను పాటించినంతవరకు దేవస్థానం సిబ్బంది కూడా ఎవరినీ డిక్లరేషన్ అడగదు.గత రెండు రోజులుగా బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి చేస్తున్న హడావిడి విచిత్రంగా ఉన్నది. స్వామివారి వెండి వాకిలి చెంతనున్న బీబీ నాంచారమ్మ మూర్తిని కూడా రోజుకోసారి డిక్లరేషన్ ఇవ్వాలని ఈ సరికొత్త హిందూ భక్తులు డిమాండ్ చేస్తారేమోనన్న అనుమానం కూడా వస్తు్తన్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రి. ఆ హోదాలో ఐదేళ్ల పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కూడా ఆరేడుసార్లు స్వామి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా దర్శించుకున్నారు. ఆయన చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించడానికి ముందూ, ముగించిన తర్వాత కూడా కాలినడకన వెళ్లి వేంకటనాథుని దర్శనం చేసుకున్నారు.ఇంతకంటే విశ్వాస ప్రకటన ఇంకేముంటుంది? కాగితం మీద రాసి సంతకం పెట్టి తీరాలనడం వితండవాదం కాక మరేమిటి? ఈ దేశంలో మరే ఆలయంలోనైనా, మసీదులోనైనా, చర్చిలోనైనా, గురుద్వారాలోనైనా ఇటువంటి పట్టింపులు న్నాయా? మతం పేరుతో చేసే ఈ రకమైన పిడివాదనలను నూటా ముప్పయ్యేళ్ల కిందనే స్వామి వివేకానందుడు ఈసడించుకున్నారు. మతం అనేది పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో, సంస్థలు పెట్టుకొనే నిబంధనల్లో ఉండదు. అది ఆత్మకూ పరమాత్మకూ మధ్యన ఉండే సంబంధమని లండన్ (1895)లో వివేకానందుడు ప్రకటించారు. షికాగోలో జరిగిన విశ్వవ్యాప్త సర్వమత సమ్మేళనంలో హైందవ విశిష్టతను విజయ పతాకంగా ఎగరేసి ప్రశంసలందుకున్న వివేకానందుని కంటే గొప్ప హిందువులా ఈ నడమంత్రపు నామాలవారు?సహనం హిందూమతపు సహజ భూషణమని ఆయన ప్రకటించారు. సర్వమత సహనాన్ని పాటిస్తాం. అన్ని మతాలు సత్యమైనవనే నమ్ముతాం. ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ సము ద్రంలో చేరినట్టే, అన్ని రకాల ఆరాధనా మార్గాలూ ఆ సర్వే శ్వరుడినే చేరుతాయి. ఇది హిందూమత సారమని వివేకానందుడు ప్రకటించారు. ఏది ఆ స్ఫూర్తి? అటువంటి సహనం నిన్న మొన్నటి వీరాలాపాల్లో కనిపించలేదే? కాషాయ వస్త్రాలు ధరించినవారు కూడా కళ్లెర్రజేసి పళ్లు కొరకడం సమంజసమేనా? హైందవాన్ని అర్థం చేసుకున్నవారేనా వీరు? లేక రాజకీయం కోసం, పబ్బం గడుపుకోవడం కోసం మతం రంగు పులుము కున్న పౌండ్రక వాసుదేవులా?బీజేపీ సంగతి జగమెరిగిన సత్యమే. ఆ పార్టీ మనుగడకు హిందూమత భావోద్వేగాలే ఆలంబన. ఆర్థిక వృద్ధి, పారిశ్రా మికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి కబుర్లన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దాని పలుకుబడికి ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకోసం కొత్త స్థావరాలు కావాలి. హిందూ ఎజెండా ఎత్తడానికి అవకాశం దొరికితే అది ఊరుకుంటుందా? ఆంధ్రలో వారి భాగస్వామి చంద్రబాబు ఆ ఎజెండా వారి మెడలో వేశారు. తిరుమలలో జగన్మోహన్రెడ్డిని అడ్డుకుంటామంటూ తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీ అను యాయులు తరలివెళ్లారు.కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఈమధ్య కాషాయ పార్టీ కంటే ఘాటుగా హిందూ భావజాలాన్ని ప్రకటి స్తున్నారు. ఈ సందర్భాన్ని కూడా ఆయన బాగానే ఉపయోగించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కిందకు ఆలయాల పరిపాలనను తీసుకురావాలనే డిమాండ్ కూడా చేశారు. ఇది ఎప్పట్నుంచో ఆరెస్సెస్ పరివారం చేస్తున్న డిమాండే! ఆలయాల నియంత్రణ మొత్తం కేంద్రం కనుసన్నల్లోకి రావాలనేది వారి సంకల్పం. జమిలి ఎన్నికల ఉద్దేశం కూడా అదే! రాష్ట్రాల స్థాయిని తగ్గించి కేంద్రీకృత అధికారాన్ని పాదుకొల్పడం వారి ఎజెండా. అందుకోసం ఈ దేశంలోని బహుళత్వాన్నీ, భిన్నసంప్రదాయాలనూ కొనసాగించడానికి, గౌరవించడానికి వారు ఇష్టపడరు.ఇక చంద్రబాబు ప్రస్తుతం ఏడుకొండలవాడే దిక్కనే పరి స్థితుల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క అడుగూ ముందుకుపడలేదు. వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేని ఏకైక రాష్ట్ర పాలకుడుగా ఇప్పటికే అపఖ్యాతి పాల య్యారు. వరదల నియంత్రణ కోసం పాటించవలసిన కనీస పాలనా పద్ధతులను కూడా పాటించలేక విజయవాడ మునకకు కారణమయ్యారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలను అటకెక్కించారు. గ్రామ స్వరా జ్యానికి తూట్లు పొడిచారు. నాలుగు నెలలు నిండకముందే జనంలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూపై ఒక కల్పిత కథను సృష్టించారు. దాని చుట్టూనే రాజకీయాలు తిప్పి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంచుకున్న మార్గం చాలా ప్రమాద కరమైనది. భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
'పేర్ని నాని ఇంటి వద్ద' జన సైకోలు ఓవరాక్షన్
-
‘పంతం’ నెగ్గింది.. నిందితుల వైపే కూటమి సర్కారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడలో దళిత వైద్యుడిపై దాడి ఘటనలో కూటమి పెద్దలు పంతం నెగ్గించుకున్నారు. దళిత సమాజాన్ని చిన్నబుచ్చి నోరెత్తకుండా కట్టడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీ దళిత ప్రొఫెసర్ వివాదాన్ని కంచికి చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ రంగరాయ కళాశాల ప్రొఫెసర్, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలిచింది. ఈ ఘటనపై నాలుగు రోజుల్లో నాలుగు మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బూతు పురాణం విప్పి దాడి చేయడం, అనుచరుల దౌర్జన్యం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. దళిత వైద్యుడిపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును అన్నివర్గాలూ ముక్తకంఠంతో ఖండించాయి. ఆదినుంచీ అదే ప్రయత్నం వివిధ వర్గాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో కూటమి పెద్దలు తెరవెనుక చక్రం తిప్పి కేసును రాజీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఘటన జరిగిన రోజున కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంతపాటిల్ నేరుగా రంగంలోకి దిగారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వారు చొరవ తీసుకున్నారని అంతా భావించారు. కానీ.. ఈ వ్యవహారంలో దగ్గరుండి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ నరసింహం ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై ఇచ్చిన ఫిర్యాదును ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లతో జిల్లా పోలీస్ యంత్రాంగం తొక్కిపెట్టడం విమర్శల పాలైంది. ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వైద్యుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీస్ యంత్రాంగం మొదటినుంచీ చేస్తున్న ప్రయత్నంగానే కనిపించింది. ప్రాయశ్చిత దీక్ష చేస్తే సరిపోతుందా? అధికారం ఉంది కదా అని అన్యాయంగా ఒక దళిత వైద్యుడిని బూతు పురాణంతో దారుణంగా అవమానించి చంపేస్తానంటూ దాడికి దిగిన ఎమ్మెల్యే నానాజీ నాటకీయంగా క్షమాపణలు చెప్పి.. ప్రాయశ్చితమంటూ దీక్ష చేస్తే సరిపోతుందా అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఘటనకు బాధ్యుడైన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడైన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడాన్ని వైద్యవర్గాలు ఆక్షేపిస్తున్నాయి. చివరకు కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం కేసు తీవ్రతను తగ్గించి ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులకు కొమ్ముకాసిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. బెయిల్బుల్ సెక్షన్లతో సరి చివరకు ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై కూటమి ప్రభుత్వం బెయిల్బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి తీవ్రతను తగ్గించేసింది. సెక్షన్ 292 బీఎన్ఎస్ (భారత న్యాయసంహిత) పబ్లిక్ న్యూసెన్స్ (రూ.200 జరిమానా), 115(2) బీఎన్ఎస్ స్వల్ప గాయాలు, చేతులతో కొట్టడం (ఏడాది జైలు, రూ.1,000 జరిమానా) 351 బీఎన్ఎస్ వ్యక్తి పరువు తీయడం, శారీరకంగా, మానసికంగా బెదిరించడం (126(2) రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ ప్రకారం నెల జైలు, రూ.500 జరిమానా) వంటి సెక్షన్లతో సరిపెట్టారు. ఎమ్మెల్యే నానాజీ మరో 10 మందిపై నమోదు చేసిన ఈ సెక్షన్లన్నీ బెయిల్కు అవకాశం ఉన్నవే కావడం గమనార్హం. దళితుడైన వైద్యుడిని తీవ్రంగా అవమానించి.. చంపేస్తానని బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా ప్రభుత్వ ఒత్తిడితో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా బెయిల్కు అవకాశం ఉన్న సెక్షన్లతో కేసును నీరుగార్చేశారు. -
విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు తర్వాత నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ‘ఎక్స్’లో చేసిన రెండు పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తినీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’అన్న బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్ను ఆయన రాసుకొచ్చారు. అలాగే ‘మీరు విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు.ప్రతి కథకు మూడు పార్శా్వలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం’అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్ను కూడా పోస్టు చేశారు. జానీ మాస్టర్ గురించి ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించకపోయినా పరోక్షంగా మద్దతు పలికారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పారీ్టలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించడం వల్లే నాగబాబు ఇలా స్పందించారని అంటున్నారు. జానీ మాస్టర్.. తప్పు చేస్తే అంగీకరించండి: మంచు మనోజ్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్టు నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ స్పందించారు. ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. ‘జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు నా అభినందనలు.ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి..’అని మనోజ్ పేర్కొన్నారు. ‘ఇచి్చన మాట ప్రకారం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. పరిశ్రమలోని మహిళలకు గొంతుగా నిలపండి. మీరు ఒంటరిగా లేరని, మీ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం..’అంటూ మనోజ్ పోస్టు చేశారు. -
బయటకొస్తున్న జానీ అరాచకాలు.. భయపడుతున్న కొరియోగ్రాఫర్స్!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.తాజాగా కొరియోగ్రాఫర్ జానీకి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న జానీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జానీ మరింత రెచ్చిపోయారు. తన తోటి కొరియోగ్రాఫర్లను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’)సభ్యత్వం ఇవ్వకుండా వేధింపులు..జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జానీ మాస్టర్ దారుణాలకు అడ్డులేకుండా పోయింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేశారు. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్ జంకుతున్నారు.గాలిస్తున్న పోలీసులు..యువతి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను జమ్మూకశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అతని కోసం లడఖ్ బయలుదేరి వెళ్లారు. త్వరలోనే జానీమాస్టర్ అరెస్ట్ అయ్యే అవకాశముంది. -
జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు
మణికొండ: సినిమాల్లో నృత్య దర్శకునిగా పనిచేస్తూ పాపులర్ అయిన జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అతని సహాయకురాలు (21) పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్డోర్ షూటింగ్లలో పాల్గొన్నప్పుడు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలుమార్లు వేధింపులకు గురి చేశాడని వివిధ ఆధారాలతో ఆమె ఆదివారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మతం మార్చుకుని అతడిని వివాహం చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాధితురాలు ఉండేది నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో కావటంతో రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 1371/2024 ప్రకారం సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపులు), 323(2) గాయపర్చడం వంటి సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు.ఇదిలా ఉండగా జానీ మాస్టర్కు గతంలోను నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోచేరి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కేసు తమ స్టేషన్కు వచ్చిందని, విచారణ చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి తెలిపారు. మరో పక్క సఖీ బృందం బాధితురాలి వద్ద రహస్య ప్రదేశంలో వివరాలు సేకరించింది. బాధితుల గోప్యతను కాపాడాలి‘ఓ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత వ్యక్తుల తాలూకు ముసుగు లేని ఫొటోలను, వీడియోలను ఉపయోగించవద్దని, ఒకవేళ ఇప్పటికే ఉపయోగించినట్లయితే వెంటనే తీసివేయాలని కోరుతున్నాం’ అని తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఓ నోట్ని విడుదల చేసింది. బాధిత పార్టీల గోప్యతను కాపాడాలని అన్ని ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్థిస్తున్నాం.. అంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి తరఫున గౌరవ కార్యదర్శి కె.ఎల్.దామోదర్ప్రసాద్ ఆ నోట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ ‘వ్యవహారం’లో స్పందించిన జనసేనపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశంసాక్షి, అమరావతి: మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై హైదరాబాద్లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై ఆ పార్టీ స్పందించింది. ఈ మేరకు జనసేన కార్యాలయం పార్టీ ప్రతినిధి వేములపాటి అజయ్కుమార్ పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ (జానీ మాస్టర్)ని ఆదేశించడమైనది. ఆయనపై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది..’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
లైంగిక ఆరోపణలు.. జానీ మాస్టర్పై నామమాత్రపు చర్యలు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ.. జానీ మాస్టర్ వద్ద కొన్నాళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళా డ్యానర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగి పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. ప్రస్తుతం యువతి ఆరోపణలపై నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు.కాగా పవన్ కల్యాణ్ అభిమాని అయిన జానీ మాస్టర్.. గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీ జానీ మాస్టర్ను స్టార్ క్యాంపెయినర్గా కూడా నియమించింది. ఈ క్రమంలో ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో.. జనసేన పార్టీ కేవలం నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాత్రమే జనసేన ఆదేశించింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే జానీ మాస్టర్పై కేసు నమోదైనా కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని చెప్పడం గమనార్హం.అయితే జానీ మాస్టర్పై నమోదైన ఎఫ్ఐఆర్లో మహిళా కొరియోగ్రాఫర్ కీలక విషయాలు వెల్లడించింది. 2017లో డీషోలో జానీ మాస్టర్ తో పరిచయం అయిందని, ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరినట్లు తెలిపింది.చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లిన సమయంలోఅక్కడ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. షూటింగ్కు సంబంధించిన వాహనంలోనూ పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది.పలుమార్లు షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేశారని పేర్కొంది. గత నెల 28న అనుమానాస్పద పార్శిల్ తన ఇంటి ముందు ఉందని.. దానిపై ‘ఇదే నీ చివరి షూటింగ్’ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని.. జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. -
లంకలను ముంచిన మట్టి తవ్వకాలు
కృష్ణా నది గట్టుకు గండి పడి గ్రామాలను ముంచెత్తిన వరద ముంపులో బాపట్ల జిల్లాలోని 27 లంక గ్రామాలు వేలాది ఎకరాల వాణిజ్య పంటల మునక జనజీవనం అతలాకుతలం భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కరకట్టపైకి నీరు ఏ క్షణమైనా కరకట్టకు గండిపడే ప్రమాదం ఇదే జరిగితే జలదిగ్బంధంలో చిక్కుకోనున్న రేపల్లె సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి నేతల అక్రమార్జన బాపట్ల జిల్లాలో 27 లంక గ్రామాల ప్రజలకు తీరని కష్టాలు తెచి్చపెట్టింది. తమ జేబులు నింపుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీ నేతలు యథేచ్ఛగా కృష్ణానది సమీపంలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు చేపట్టడం కొంపముంచింది. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక అరవింద వారధి సమీపంలో కూటమి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాల వల్ల కృష్ణానది గట్టు వరదకు ముందే బలహీనపడింది. గత రెండు రోజులుగా వరద పెరిగి సోమవారం సాయంత్రానికి దాదాపు 12 లక్షల క్యూసెక్కులకు చేరడంతో అరవింద వారధి సమీపంలో కృష్ణానదికి గండి పడింది. దీంతో కొల్లూరు మండలంలోని పెసర్లంక, చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం తదితర 22 గ్రామాలతోపాటు భట్టిప్రోలు మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, పల్లెపాలెం, రేపల్లె మండలంలోని పెనుమూడి పల్లెపాలెం కలిపి మొత్తం 27 గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ గ్రామాల్లో 60 శాతం ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. మరో 30 శాతం ఇళ్లల్లోకి నీరు చేరింది. ఈ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు డాబాలపైకి ఎక్కారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 40 శాతం మందికి కూడా చేరని ఆహారం.. లంక గ్రామాలను ముంచెత్తిన వరదనీరు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బోట్ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం పంపుతున్న తాగునీరు, ఆహారం పట్టుమని 40 శాతం మందికి కూడా అందలేదు. డాబాలపైన వంట చేసుకుందామన్నా మంచినీరు అందుబాటులో లేదు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సరిపడా బోట్లు లేక అధికారులు మిన్నకుండి పోయారు. ఉన్నవారిని కూడా బయటకు తీసుకురాలేని దుస్థితి నెలకొంది. ఇక చాలా పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఒక్క చిలుమూరు లంక నుంచి మాత్రమే కొద్దిమంది గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు. వరద ప్రాంతాలకు స్థానిక పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడిలు కొల్లూరులోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.రైతులకు భారీ దెబ్బ.. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలైన కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లో భారీ ఎత్తున పసుపు, అరటి, మొక్కజొన్న, కంద, తమలపాకులు, బొప్పాయి, జామ, కొబ్బరి, కూరగాయలు తదితర వాణిజ్య, ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వరదకు ఈ రెండు మండలాల్లోని వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. వాణిజ్య పంటలు రోజుల తరబడి నీటిలో నానడంతో పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.రేపల్లె పట్టణానికి పొంచి ఉన్న ప్రమాదం.. వరద ఉధృతికి భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కృష్ణా కరకట్టపైకి నీరు చేరుతోంది. దీంతో అధికారులు, గ్రామస్తులు అప్రమత్తమై మట్టి, ఇసుక సంచులు వేసి కట్టకు గండిపడకుండా ప్రయత్నిస్తున్నారు. రావి అనంతవరం గ్రామం వద్ద కరకట్ట నుంచి నీరు లీకు అవుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. వరద మరింత పెరిగితే ఆయా ప్రాంతాల్లో కరకట్టకు గండి పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే వరద ఉధృతికి భట్టిప్రోలు, రేపల్లె పట్టణం నీట మునగొచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్కడా కనిపించకపోవడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మట్టి అక్రమ తవ్వకాలే గండికి కారణం కృష్ణా నదికి తొలిరోజు ఆదివారం 8.79 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పెసర్లంక సమీపంలోని అరవింద వారధి వద్ద కృష్ణానది గట్టుకు భారీ గండి పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు నదికి ఇరువైపులా పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. దీంతో నది గట్లు, కరకట్ట రోజురోజుకు బలహీనపడుతూ వచ్చాయి. కరకట్ట దెబ్బతినకుండా చూడాల్సిన కృష్ణా నది పరిరక్షణ విభాగం ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అక్రమ తవ్వకాలు అడ్డుకుని.. దెబ్బతిన్న కట్టను బలోపేతం చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణానది ఒడ్డు కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లో మరింత బలహీనంగా మారింది. చాలా చోట్ల పూర్తిగా దెబ్బతింది. ఇలాగే 2009 అక్టోబర్ 6న కరకట్ట తెగిపోయి రేపల్లె పట్టణం నీటిలో మునిగింది. అప్పట్లో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచి్చంది. ప్రస్తుతం కేవలం 8.79 లక్షల క్యూసెక్కుల వరదకే అరవింద వారధి వద్ద మరోమారు గండిపడింది. ఇప్పటికైనా కృష్ణా కరకట్టలో అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
బడులు తెరిచారు.. బరువు మోపారు.. 'వందనమేదీ'!
వెంటనే పిల్లలందరికీ ఇవ్వాలి..నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఆరో తరగతి, మరో అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరవగానే మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. – పదముత్తం లక్ష్మి, ఏరూరు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లాసాక్షి, అమరావతి: ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకంఅమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి.. పథకాలు అందుకోండి..’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిచోటా చాటింపు వేసిన సీఎం చంద్రబాబు ఒకపక్క పాఠశాలలు పునఃప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి నారా లోకేశ్తోపాటు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలు దాదాపు కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.15 వేల కోట్లు అవసరం. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కోటి మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరుదాటాక తెప్ప తగలేయడంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.ఖర్చులు తడిసిమోపెడు..పాఠశాలలు తెరవటమే ఆలస్యం.. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మ ఒడి’ పథకం నాలుగేళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింత కల్పించింది. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే వంద శాతం పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా రూ.6,400 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.26 వేల కోట్లకుపైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. భావి పౌరుల భవితవ్యానికి భరోసా కల్పిస్తూ వెలుగులు పంచిన ఈ పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి ‘‘తల్లికి వందనం’’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన కూటమి సర్కారు స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలున్న కుటుంబాలు తమకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డారు. ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ‘తల్లికి వందనం’పై ఇంతవరకూ కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలయాపన.. కోతలు2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విదిలించారు. ఇప్పుడు తల్లికి వందనంపైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ పథకం వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వ పెద్దల్లో కూటమి సర్కారులో గుబులు రేపుతోంది. ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం కావడం ఇందుకు కారణం. దీంతో వలంటీర్లను గౌరవ వేతనం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామన్న హామీని గాలికి వదిలేసినట్లే... ‘తల్లికి వందనం’ కూడా లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఈ ఏడాది కాలయాపన చేసి అనంతరం రకరకాల నిబంధనలతో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల రుణమాఫీపైనా ఇదే విధానం అనుసరించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అదే జరిగితే తమ పిల్లల చదువులు నాశనమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రాప్ అవుట్స్కు అడ్డుకట్ట..బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకానికి విద్యార్థి హాజరును ప్రామాణికంగా తీసుకుంది. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మాత్రం కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. జీఈఆర్...2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ఈ నిర్ణయం నూరు శాతం ఉపయోగపడింది.జూన్లోనే జమకు గత సర్కారు ఏర్పాట్లు..పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో 2019 జూన్లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్లోనే అంతకుముందు సంవత్సరం హాజరును బట్టి రూ.15 వేలు చొప్పున అందిస్తూ రూ.వెయ్యి టాయిలెట్ మెయింట్నెన్స్ ఫండ్కి, మరో రూ.వెయ్యి స్కూల్ నిర్వహణ నిధికి జమ చేసింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అందించి చదువులకు భరోసా కల్పించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే పథకాన్ని నూరు శాతం పారదర్శకతతో అమలు చేసింది. 2022–23కి సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. జూలై వచ్చినా తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.మాట ప్రకారం డబ్బులివ్వాలిగత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా సకాలంలో నగదు నా ఖాతాలో జమ చేశారు. పిల్లల చదువుల కోసం అది ఎంతో ఉపయోగపడేది. కూటమి పార్టీలు ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాయి. బడులు ఇప్పటికే తెరిచినా కొత్త ప్రభుత్వం ఇంత వరకు ఏమీ చెప్పడం లేదు. చేసేదేమీ లేక రూ.15 వేలు అప్పు చేసి పిల్లలకు అవసరమైనవి కొన్నాం. మాట ప్రకారం పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వాలి. – పద్మ, విద్యార్థి తల్లి, పుత్తూరు, తిరుపతి జిల్లాపాత వాటికి పేర్లు మార్చారే కానీపిల్లలు స్కూళ్లకు వెళుతున్నా ఏ పథకం అందలేదు. పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ పథకం ద్వారా డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. ఇలాగే ఉంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే పథకాలు అందేలా చూడాలి. – సి.జానకి, జల్లావాండ్లపల్లె, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదునా కుమార్తె లిఖిత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇంతవరకూ మాకు అమ్మ ఒడి డబ్బులు పడలేదు. గతంలో ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు. అసలు డబ్బులు పడతాయో లేదో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. పిల్లల చదువుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది. – మరడాన జ్యోతి, రామభద్రపురం, విజయనగరం జిల్లాబడులు మొదలైనా ఆ ఊసే లేదు గతంలో స్కూళ్లు తెరవగానే అమ్మ ఒడి అందేది. పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడేవి. ఈసారి బడులు ప్రారంభమైనా ఇంతవరకూ ఆ ఊసే లేదు. అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టత లేదు. గతంలో ఉన్న లబ్ధిదారులందరికీ అమ్మఒడి ఇవ్వాలి. – రమణమ్మ, అంకేపల్లి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా పిల్లలను ఆదుకోండయ్యా..! పాఠశాలలు తెరిచి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందలేదు. మా పిల్లలను ఆదుకుని పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి. – పి.రామలక్ష్మమ్మ, మల్లూరు, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా -
జనసేన కార్యకర్తల ఓవర్ యాక్షన్
-
ఉద్యాన పంటల సాగు.. ‘ఉపాధి’తో అనుసంధానం
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ బుధవారం విజయవాడలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన సోదరుడు నాగబాబుతో కలిసి అధికారిక కార్యాలయానికి వచ్చిన ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో సొంత భవనాలు లేని గిరిజన గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై పవన్ సంతకం చేసినట్టు తెలిపింది. అదే విధంగా ఉద్యాన పంటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే మరో ఫైల్ మీద కూడా పవన్ సంతకం చేసినట్టు వివరించింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి అభినందనలు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. శాఖలవారీగా సమీక్ష ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో శాఖాపరమైన విధుల్లో పాల్గొన్నారు. ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష చేశారు. సాయంత్రం అటవీ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవన్ను కలిసిన సీఎస్ నీరభ్కుమార్ బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ ప్రత్యేకంగా కలిశారు. -
ఏపీ కి ప్రత్యేక హోదా తేవాలి బాబు కు అఖిల పక్షాల డిమాండ్
-
జనసేనకు డిప్యూటీ స్పీకర్?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్ప టికే జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించిన విషయం తెలిసిందే. 21 మంది ఎమ్మెల్యే లున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు అంగీకరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు మూడో వంతు పదవులు వస్తాయని పవన్కళ్యాణ్ చెప్పేవారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి జనసేన పార్టీ నుంచి అవనిగడ్డ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. బుద్ధప్రసాద్ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరారు. బొలిశెట్టి తొలినుంచీ జనసేనలోనే ఉన్నారు. నిజంగా అవకాశం వస్తే వీరిద్దరిలో ఒకరు ఆ పదవిలో కూర్చోవడం ఖాయమని చెబుతున్నారు. మరోవైపు స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరును పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా ఈ నెల 19వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ప్రొటెం స్పీకర్తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని సమాచారం. -
పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
-
సేమ్ సీన్ రిపీట్.. నిరాశలో పవన్
-
గెలుపుపై ఆశలు లేవు..పవన్ కళ్యాణ్ సైలెంట్
-
డాబుశౌరి కబుర్లు... ఓటమి భయంతో బెంబేలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్ మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టలదొర వాగ్దానాలుమచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలÔౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలÔౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు.ఈ ప్రశ్నలకు బదులేవి? ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలÔౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు. 👉ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు? 👉 దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలÔౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు. 👉 నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు. 👉 తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు.టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలÔౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలÔౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
సాక్షి, అమరావతి: గాజుగ్లాసు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గింది. తమ పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకే రిజర్వ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను టీడీపీ ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదంటూ ఎన్నికల సంఘం నివేదించడంతో హైకోర్టు ఆ దిశగా ఉత్తర్వులివ్వడానికి సిద్ధమైంది. దీంతో టీడీపీకి పరిస్థితి అర్థమైంది. తమ పిటిషన్ను కొట్టేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించి, హైకోర్టు అనుమతి కోరింది. వెంటనే హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులిచ్చారు. పొత్తు నేపథ్యంలో గాజుగ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకుగానీ, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకుగానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రు. -
ఒకరి వెంట మరొకరు..
సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జులు డీఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్బై చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రెబల్గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెప్పారు. టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్, రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్ అభ్యర్థి -
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
-
జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం
-
జనసేన రెబల్స్ కు గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్..!
-
గ్లాసు గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం
-
అమెరికా జీవితాన్నివదిలేసి పవన్ కళ్యాణ్ కోసం వస్తే..!
-
పిఠాపురంలో పవన్ అష్టకష్టాలు
-
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్ల మీదుగా సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
పవన్ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత ఆస్తులు మాయ అని, ఆయన పెళ్లాల లెక్కలూ మాయే అని వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్లో ఆదాయం, ఆస్తులపై మాయ చేస్తున్నట్లు పెళ్లాలు, గొళ్లేల విషయంలోనూ మాయచేస్తున్నావే అని దెప్పిపొడిచారు. పవన్ ఏ భార్యతో ఎంతకాలం ఉన్నారు, ఒక భార్యతో సంసారం చేస్తూ మరొకరితో పిల్లలను కన్న విషయం, ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు, వీటన్నింటిపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు. మహేశ్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధం చెప్పాడని, అందులో వివరాలపై విచారణ చేయించాలని అన్నారు.‘ఐదేళ్ల ఆయన సంపాదన రూ.114.76 కోట్లు అని చెప్పారు. అందులో రూ.73 కోట్లు పన్నులు, పార్టీ డొనేషన్ రూ.20 కోట్లు అని చెప్పారు. ఇవన్నీ పోను ఇంకా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడు’ అని నిలదీశారు. ‘పవన్ ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే. రూ.90 కోట్ల ఆస్తులు 2018 – 2024 మధ్యలో కొన్నారు. ఇది రిజిస్టర్ విలువే. వాటి మార్కెట్ విలువ రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఉంటుంది.ఇదే సమయంలో ఆయన చేసిన సినిమాలు నాలుగే. వాటిలో యావరేజ్గా ఆడినవి రెండు. మిగతావి డిజాస్టర్ అయ్యాయి. అయినా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా లేక జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెడితే వచ్చాయా? కరోనా సమయంలో 2021లో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే.. అప్పుడు కూడా ఆయన రూ.33 కోట్ల ఆస్తులు కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు పసుపు కరోనా ఏమైనా కాటేసిందా’ అని ధ్వజమెత్తారు.ఈ మధ్య ముగ్గురు నలుగురు పెళ్లాలు అంటేనే పవన్ గింజుకుంటున్నారని, మరి వలంటీర్లను ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అంటే వారికి కోపం రాదా అని ప్రశ్నించారు. ‘అన్న చిరంజీవిని పదే పదే అవమానిస్తున్నది పవనే. కానిస్టేబుల్ కొడుకునంటారు గానీ, చిరంజీవి సినిమా భిక్ష పెట్టడం వల్లే పవర్ స్టార్ అయ్యానని ఎక్కడా చెప్పరు. తల్లిని అవమానించిన లోకేశ్, చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ ఈరోజు తల్లిని కూడా అవమానించారు’ అని అన్నారు.ఓటమి భయంతో ఇష్టానుసారం పేలుతున్న పవన్ఓటమి భయంతోనే పవన్ సీఎం జగన్పై ఇష్టానుసారం పేలుతున్నారన్నారు. కాపుల్ని, కార్యకర్తలను కూడా కించపరుస్తున్నారని చెప్పారు. పోటీ చేసిన రెండుచోట్లా ప్రజలు కాళ్ళు, కీళ్ళు విరగ్గొట్టినా పవన్కు బుద్ధి రాలేదన్నారు. తనని ఒక్కడినైనా గెలిపించాలని, ప్లీజ్ అంటూ అడుక్కునే పవన్ ఒక పార్టీకి అధ్యక్షుడేనా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్ని నమ్ముకున్నారని, ప్రజలు కూడా సీఎం జగన్ని నమ్మారని తెలిపారు. అందుకే సీఎం జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్నందునే సీఎం జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.కూటమి కాదది.. కుమ్మక్కు రాజకీయంటీడీపీ, జనసేన, బీజేపీలది కూటమి కాదని, కుమ్మక్కు రాజకీయమని మహేశ్ ధ్వజమెత్తారు. పోటీ చేసేదంతా చంద్రబాబు మనుషులేనని, పార్టీలే మారతాయని చెప్పారు. జనసేన, బీజేపీ అభ్యర్థులు చంద్రబాబు గుంపులో నుంచి వచ్చిన వారేనన్నారు. ఈ గుంపును హైనాలు, గుంటనక్కలు, తోడేళ్లు అనక ఇంకేమనాలని ప్రశ్నించారు. వాళ్లు ప్రజల కోసం కూటమి కట్టలేదని, ప్రజల ఆస్తులను దోచుకునేందుకు, పేదల నోట్లో మట్టికొట్టేందుకు, భూములు కొట్టేసి రూ.లక్షల కోట్లు సంపాదించేందుకేనని అన్నారు.జనసేన అధ్యక్షుడు పవనే సీఎం అభ్యర్థి అని చాలా కాలం సోషల్ మీడియాలో రాగం తీశారని, తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పారని, ఆ తర్వాత 21 సీట్లతో సరిపెట్టారని, వీటిలోనూ నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లేనని చెప్పారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇలాగే ఉంటాయని అన్నారు. -
Yalamanchili: సుందరానికి షాక్
విశాఖ సిటీ: నోటి దురదతో అందరినీ దుర్భాషలాడడం.. వ్యాపారం పేరుతో మహిళకు మోసం.. నిరసనల పేరుతో పరిశ్రమలకు బ్లాక్మెయిలింగ్.. తాజాగా మత్స్యకార నాయకుడిపై హత్యాయత్నం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. యలమంచిలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. స్థానికంగా ప్రజాబలం లేనప్పటికీ.. మత్స్యకారులపై దాడులకు పాల్పడినప్పటికీ.. ఐవీఆర్ఎస్ సర్వేలో అతడికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. ఆయనకు జనసేనకు టికెట్ ఇవ్వడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లోనే కాకుండా.. సొంత పార్టీ నేతలు సైతం విజయ్ అభ్యరి్థత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. అతడికి వ్యతిరేకంగా జనసేన పార్టీ రెబల్ అభ్యరి్థగా మత్స్యకార నాయకుడు ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. విజయ్కు వ్యతిరేకంగా పూడిమడకతో పాటు మరికొన్ని గ్రామాల్లో జనసేన నాయకులు, అభిమానులు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారు.సుందరపు సోదరులపై సీపీకి ఫిర్యాదు సుందరపు సోదరులు వ్యాపారం పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేశారు. ముందు సుందరపు సతీష్ రూ.23 లక్షలు, తరువాత సుందరపు విజయ్కుమార్ రూ.17 లక్షలు పెట్టుబడులు రూపంలో తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సదరు మహిళ 2020లో అప్పటి నగర పోలీస్ కమిషనర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు సుందరపు వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకువస్తున్నారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ ముద్దాడ 2012లో మరణించారు. అతని మరణం అనంతరం వచ్చిన డబ్బుతో భార్య శ్రీదేవి ముద్దాడ, ఇద్దరి పిల్లలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి పరిచయం ఉన్న సుందరపు సతీ‹Ùకుమార్(సుందరపు విజయ్కుమార్ సొదరుడు) 2013లో కలిసి ఒక వ్యాపారం కోసం చెప్పాడు.ఆమెను అక్కా అని పిలిచే సతీష్ కర్నాటకలో బల్లారి హెవీ మోటల్ వెహికల్ వ్యాపారంలో రూ.23 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.1.8 లక్షలు రిటర్న్స్ వస్తాయని నమ్మించారు. దీనికి 2013, ఫిబ్రవరిలో ఆమె తన వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రూ.23 లక్షలు ఎటువంటి ఒప్పంద పత్రాలు లేకుండానే సతీష్కు డబ్బులు ఇచ్చారు. తొలి నాలుగు నెలలు రిటర్న్స్ ఇవ్వని సతీష్ ఆ తరువాత ఒక ఏడాది పాటు కేవలం 80 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన డబ్బులు జీతాలు, వాహనాలకు ఖర్చు అవుతుందని చెప్పేవాడు. ఆ తరువాత నుంచి అది కూడా ఇవ్వడం మానేశాడు. డబ్బులు కోసం అతడికి ఆడగగా వ్యాపారంలో నష్టం వచ్చిందని, అసలు కూడా రాదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఆమె తీసుకున్న రుణం తీర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.కొద్ది రోజులకు విజయ్కుమార్.. కొద్ది రోజులకు విజయ్కుమార్.. శ్రీదేవిని కలిసి రిలయన్స్ టెలీకాంలో 4జీ కేబుల్ ప్రాజెక్టుకు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాలని కోరాడు. ముందు అతని సోదరుడు చేసిన మోసం కారణంగా ఆ ప్రతిపాదనను శ్రీదేవి తిరస్కరించారు. అయితే విజయ్కుమార్ ఆమెను రిలయన్స్ ఆఫీస్కు తీసుకువెళ్లి అక్కడి ప్రతినిధులతో మాట్లాడించాడు. మంచి ఆదాయం వస్తుందని, గత వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి మంచి అవకాశమని, సంస్థ నుంచి బిల్లులు కూడా నేరుగా ఆమె అకౌంట్లోనే పడతాయని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి నమ్మి తన భర్త ఫ్లాట్పై లోన్ తీసుకొని రూ.17 లక్షలు సుందరపు విజయ్కుమార్కు ఇచ్చారు.విజయ్కుమార్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో శ్రీదేవి ఆ పనులు చూసుకోవడం ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ పూర్తయినప్పటికీ.. ఆమె ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో ఆమె నేరుగా రిలయన్స్ ఆఫీస్కు వెళ్లి వాకబు చేయగా ఆ పనులకు సంబంధించి బిల్స్ విజయ్కుమార్ అకౌంట్కు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో డబ్బు కోసం శ్రీదేవి.. సుందరపు విజయ్కుమార్ను అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం విని షాక్కు గురయ్యారు. పనులు చేయించిన ఉద్యోగికి రూ.10 వేలు మాత్రమే ఇస్తామని, మహిళ కాబట్టి ఆమెకు నెలకు రూ.20 వేలు చొప్పున ఎన్ని నెలలు పనిచేస్తే అంత డబ్బు ఇవ్వాలని విజయ్ తన మనిíÙకి పురమాయించాడు. దీంతో పెట్టుబడి డబ్బులు ఇవ్వాలని అడిగినా విజయ్కుమార్ ఆమెను పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఆమె అతడిని డబ్బు కోసం అడగగా కొద్ది నెలల్లో ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. అయినప్పటికీ డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో శ్రీదేవి అప్పటి నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.మత్స్యకార నేతపై హత్యాయత్నంయలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పూడిమడక గ్రామ నివాసి, అదే పార్టీకి చెందిన మత్స్యకారుడు ఎర్రిçపల్లి కిరణ్పై దాడి, హత్యా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఘటనతో పూడిమాడకతో పాటు తీర ప్రాంతవాసులు, ఉమ్మడి విశాఖలో మత్స్యకారులు సుందరపు విజయ్కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడిమడకకు చెందిన కిరణ్ చురుగ్గా జనసేన పారీ్టలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీంతో జనసేన అధినాయకులు సైతం అతడిని అభినందించారు. అయితే సుందరపు విజయ్కుమార్ మాత్రం కిరణ్పై కక్ష గట్టి దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కిరణ్, అతని కుటుంబ సభ్యులు, పూడిమడక గ్రామస్తులు పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి సుందరపు విజయ్కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా మత్స్యకార నేత కిరణ్ జనసేన రెబల్ అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సుందరపు విజయ్కుమార్కు జనసేన టికెట్ ఇవ్వడం పట్ల మత్స్యకారులు తీవ్రస్థాయి మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుందరపు వర్గీయులలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఎన్నికల వేళ.. పవన్ సంపద సృష్టి
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆదాయ, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న రూ.16.14 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 1,060 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కోనుగోలు చేసినట్లు చూపగా.. 2024 ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517.6 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్ అందులో పేర్కొన్నారు. అంతేకాక.. వ్యక్తిగతంగా తన పేరిట రూ. 209.13 కోట్లు స్థిర చరాస్తులుగానూ, రూ.65.76 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భార్య అన్నా లెజినోవా, అఫిడవిట్లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో రూ.28.47 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తుల్లో 10 శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందు కొనడం గమనార్హం. ఆ పిల్లలకు ఒక రకంగా.. ఈ పిల్లలకు మరో రకంగా.. ఇదిలా ఉంటే.. అఫిడవిట్లో పవన్ తన పిల్లలు దేశాయి అకీరా నందన్, దేశాయి ఆద్య (వీరిద్దరూ రేణుదేశాయి–పవన్కళ్యాణ్ పిల్లలు)తో పాటు పోలీనా అంజని, మార్క్ శంకర్ (పవన్కళ్యాణ్–అన్నా లెజినోవా పిల్లలు) పేర్లతో ఉన్న ఆస్తులూ వెల్లడించారు. ఆ అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరికి ఆస్తుల కేటాయింపులో పవన్ వ్యత్యాసం చూపించారు. విడాకులిచ్చిన రేణుదేశాయి పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం. చదివింది పదో తరగతే.. ఇక పవన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. అది కూడా ఎస్ఎస్ఎల్సీ (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) రద్దయి, దాని స్థానంలో ఎస్ఎస్సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్ఎల్సీ చదవడం గమనార్హం. ఇంటర్లో మేథమేటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు అరడజను సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్.. అవన్నీ హంబక్ అని అఫిడవిట్లో కుండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్లో వివరించారు. తనపై మొత్తం 8 కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొనగా.. తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీగా చెబుతూ.. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని 197 పోలింగ్ బూత్ 1120 నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు. పవన్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో తనకెలాంటి ఆదాయం లేకపోగా, రూ.1,10,62,939 నష్టం వచ్చిందని.. అయితే, 2019–20లో రూ.4.51 కోట్లు, 2020–21లో రూ.12.86 కోట్లు, 2021–22లో 30.09 కోట్లు, 2022–23 ఆర్థిక ఏడాదిలో 12.20 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తన భార్య, పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటరŠన్స్ వివరాలు లేవు. చరాస్తులు.. ► పవన్కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో రూ.3.15 లక్షలు ఉన్నాయని.. బ్యాంకుల్లో డిపాజిట్లుగా రూ.16.48 కోట్లు.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.15.48 లక్షలు.. ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో రూ.3.02 కోట్లు.. ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం రూ.3.65 కోట్లు.. అలాగే, రూ.14.01 కోట్లు విలువ చేసే కార్లు, వాహనాలున్నాయని.. రూ.2.34 కోట్ల బంగారు ఆభరణాలు.. రూ.14.51 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు.. ఇతర రూపాల్లో మరో రూ.1.79 కోట్లు కలిపి మొత్తం చర ఆస్తుల రూపంలో రూ.41.65 కోట్లుగా చూపించారు. ► తన వద్ద రూ.32 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్తో పాటు పది కార్లు (రెండు బెంజి, మూడు మహీంద్రా స్కార్పియాలు, రేంజ్ రోవర్, రెండు టయోటాలు, జీపు, టాటా పికప్ ట్రక్ వాహనాలున్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో రూ.19,340లు.. బ్యాంకు డిపాజిట్లు రూపంలో రూ.86.05 లక్షలు.. రూ.13.97 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు కలిపి మొత్తంగా రూ.ఒక కోటి చరాస్తులున్నాయి. ► పిల్లలు దేశాయి అకీరా నందన్ పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.89.38 లక్షలు.. దేశాయి ఆద్య పేరిట రూ 87.77 లక్షల బ్యాంకు డిపాజిట్లు.. పోలీనా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.85.92 లక్షలు.. మార్క్ శంకర్ పేరిట రూ.86.25 లక్షలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకీరా నందన్కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ► మరోవైపు.. మొత్తం రూ.65.76 కోట్ల మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్ పేర్కొంటూ, అందులో రూ.17.56 కోట్లు బ్యాంకులకు, మరో రూ.46.70 కోట్లు 15 మంది వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్లో వివరించారు. స్థిరాస్తులు.. ► హైదరాబాద్ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో 18.02 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ. 10.42 కోట్లు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.52.85 కోట్ల విలువచేసే ఏడుచోట్ల స్థలాలు (శేరిలింగంపల్లి మండల పరిధిలో రెండు, మంగళగిరి మండల పరిధిలో నాలుగు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న నాలుగు స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో కోనుగోలు చేసినట్లు వివరించారు. ► ఆ ఏడింటిలో ఒకటి మంగళగిరిలోని స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని.. మిగిలినవి తను కొనుగోలు చేసినవన్నారు. ► హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రూ. 3.14 కోట్లు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. è రూ.1.95 కోట్లు విలువచేసే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతిగా ఇచ్చానన్నారు. è రూ.22 కోట్లు విలువ చేసే హైదరాబాద్ జూబీహిల్స్లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలీనా అంజని, మార్క్ శంకర్ ఇద్దరికీ చేరి సగం వాటాగా బహుమతిగా అందజేసినట్లు పవన్ పేర్కొన్నారు. పవన్కళ్యాణ్ నామినేషన్ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలను వారు బేఖాతరు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి ఉండగా అంతకుమించి లోపలకు అనుమతించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థుల అనుచరులు ఉండాలన్న నిబంధననూ లెక్కచేయలేదు. అక్కడ నినాదాలూ చేశారు. బీజేపీ నేతలకు పరాభవం.. కూటమిలో సభ్యులైన టీడీపీ నేతలకు మాత్రమే విలువనిచ్చిన పవన్కళ్యాణ్.. అప్పటివరకూ ర్యాలీలో తనతో పాటు తిప్పుకున్న బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజుకు నామినేషన్ కేంద్రంలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. తనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కృష్ణంరాజు అసహనానికి గురయ్యారు. తరువాత పోలీసులు వర్మ కుమారుడు గిరీష్ వర్మతో పాటు ఆయన్ను లోపలకు పంపించారు. ఇక నామినేషన్ వేసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి ఒకసారి ర్యాలీగా పిఠాపురం చేరుకోవడానికే పవన్ అనుమతి తీసుకున్నారు. అయితే, రెండుసార్లు తిరగడం గమనార్హం. -
మా‘లోకం’ అనుకుంటే... మా పుట్టి ముంచేస్తోంది!
ఆక్రమణలు.. అక్రమాలు చేయడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పుడు అదే విద్యను రాజకీయ రంగంలో ప్రదర్శిస్తున్నారు. టీడీపీ కంచుకోటను డబ్బుమూటలతో కుదేలు చేస్తూ.. జనసేన బలం పెంచుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా.. భవిష్యత్తులో టికెట్ కోసం ఎవరికాళ్లూ పట్టుకోకూడదన్న ఉద్దేశంతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మా‘లోకం’ అంటూ తిరుగుతున్న పసుపుచొక్కా నాయకులు.. ఆమె చర్యలతో కలవరపడుతున్నారు. టీడీపీ పుట్టిమునిగిపోతోందంటూ మదనపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కూటమి అభ్యర్థిగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు లోకం మాధవి ఒంటెత్తు పోకడలు టీడీపీ నాయకులకు కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన టీడీపీ నాయకులు ఆమె తీరుతో బెంబేలెత్తిపోతున్నారు. మంచి ప్యాకేజీలతో చేరికలకు తెరతీయడంతో టీడీపీ కార్యకర్తలు సైతం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీడీపీ కండువాలను పక్కనపెట్టి జనసేన కండువాలు వేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి మాటెలా ఉన్నా తమ పార్టీకి నెల్లిమర్ల నియోజకవర్గంలో నూకలు చెల్లినట్లేనని టీడీపీ స్థానిక నాయకులకు బెంగపట్టుకుంది. వారంతా పలాస వచ్చిన చంద్రబాబు వద్దకు స్వయంగా వెళ్లి ‘మహాప్రభో... మాధవి మన పుట్టి ముంచేలా ఉంద’ని మొరపెట్టుకున్నా అధినేత నీళ్లు నమలడం తప్ప ఏమీ భరోసా ఇవ్వలేకపోయారట! తొలి నుంచి ఆక్రమణలే లక్ష్యం... జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలైన లోకం మాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామ పరిధిలో రెండు దశాబ్దాల కిందటే భూములు కొనుగోలు చేశారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ ముసుగులో సమీపంలోనున్న ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలిబాటలన్నీ కలిపేసి రోడ్డు వేసేశారు. కల్వర్టులను వారే కట్టేశారు. ఆ భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. అవతల ఉన్న భూముల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తమ భూముల్లోకి వెళ్లడానికి తోవలేక, మిరాకిల్ వేధింపులు పడలేక విధిలేని పరిస్థితుల్లో వారు తమ భూములను కూడా మిరాకిల్కే వచ్చినకాడికి అమ్మేయాల్సిన పరిస్థితి. ఆక్రమణల్లో దాదాపు 14 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, మరో పది ఎకరాల వరకూ డి.పట్టా భూములు ఉన్నట్టు ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటి స్వాధీనాన్ని అడ్డుకొంటూ న్యాయస్థానం నుంచి యథాతథస్థితి ఉత్తర్వులు తెచ్చుకోవడం మిరాకిల్కే చెల్లింది. టీడీపీ అస్తిత్వానికే ఎసరు... పార్టీ మనుగడ కోసం పవన్ కల్యాణ్ మద్దతు తప్పదని టీడీపీ నాయకులకు చంద్రబాబు బుజ్జగించి పంపించినా పార్టీ భవిష్యత్తుకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. కూటమి అభ్యర్థిగా లోకం మాధవి ఉన్నప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మాటే నెగ్గుతుందని చెప్పినా ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ కనిపించట్లేదు. ఆమె జనసేన పార్టీలో చేరికలకు తెరలేపారు. భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ వైఎస్సార్సీపీలో అసంతృప్త నాయకులకు వల వేశారు. ఈ వలలో టీడీపీ కార్యకర్తలు చిక్కుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లినవారు ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వస్తారనుకుంటే జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. వారి ప్రభావంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని టీడీపీ కార్యకర్తలు కూడా జనసేనలోకి పోతున్నారు. ఇది సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో ఈ చేరికల కార్యక్రమాలకు టీడీపీ నాయకులను సైతం దరిచేరనీయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీకి నూకలు చెల్లినట్లేనని ఆ పార్టీ నాయకులు దిగాలు చెందుతున్నారు. డిపాజిట్ దక్కకపోయినా సీటు కేటాయింపు.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నామనే ముసుగులో భోగాపురం మండలంలో సంపాదించిన భూములు, ఆక్రమించిన ప్రభుత్వ భూములను కాపాడుకోవడమే లక్ష్యంగా లోకం దంపతులు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచే జనసేన అభ్యర్థిగా లోకం మాధవి తొలుత పోటీచేశారు. ఆమెకు 7,550 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని రెండేళ్ల నుంచి ‘మిరాకిల్’ కేంద్రంగా రాజకీయాలకు తెరలేపారు. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా చంద్రబాబు ప్రకటించిన కర్రోతు బంగార్రాజు సహా ఆ పార్టీ నాయకులంతా ఆమెను తక్కువగా అంచనా వేశారు. ఆమె ధనబలం ముందు వారంతా దూదిపింజల్లా తేలిపోయారు. పవన్ కల్యాణ్ తొలుత ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో లోకం మాధవి కూడా ఉండటంతో టీడీపీ నాయకులకు మతిపోయింది. తిరుగుబాటు చేస్తామని ప్రకటించిన బంగార్రాజు తదితర నాయకులంతా తర్వాత సన్మానం చేయాల్సి వచ్చిందంటే ఆమె పవర్ ఊహించవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... పూసపాటిరేగ మండలం రెల్లివలసలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడి నివాసంలో నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చిన చంద్రబాబు పలాసలో బస చేయడంతో మంగళవారం వారంతా అక్కడకు వెళ్లి కలిశారు. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు బృందం చంద్రబాబుకు తమ కష్టాలను మొరపెట్టుకున్నా సానుకూల స్పందనకనిపించలేదని తెలిసింది. -
Visakhapatnam: పెద్దలకే ప్యాకేజీ
సాక్షి, విశాఖపట్నం: పొత్తులో ఒకరికొకరు సీట్లను సర్దుబాటు చేసుకున్న కూటమి అభ్యర్థులు మిత్రపక్ష పార్టీల పెద్దలకే ప్యాకేజీల్లో పెద్దపీట వేస్తున్నారు. తమపై చిన్న చూపు చూస్తున్నారన్న భావనలో చోటా మోటా నాయకులున్నారు. వాస్తవానికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఉమ్మడి విశాఖ జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో సీట్లను ఆశించి భంగపడ్డారు. ఆరంభంలో వీరు తమ అధినేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్నారు. మరికొందరు తిరుగు బావుటా ఎగురవేశారు. నోటిఫికేషన్తో పాటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్లు దక్కించుకున్న కూటమి అభ్యర్థులు బుజ్జగింపుల పర్వానికి దిగారు. టికెట్లు ఆశించి భంగ పడ్డ వారితో పాటు పార్టీలో కీలక నాయకుల ఇళ్లకు వెళ్లారు. వారి స్థాయిని బట్టి విడతల వారీ ప్యాకేజీలకు ఒప్పించారు. ఇలా ప్యాకేజీ సెటిల్మెంట్లు రూ.లక్షలు, కోట్లలో జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీటికి తలొగ్గిన నేతలకు ఇప్పటికే ప్యాకేజీ సొమ్మును కొంతమేర పంపిణీ చేశారు. ఎలక్షన్ ప్యాకేజీతో అలక వీడిన నేతలు కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్తున్నారు. అయితే దిగువ స్థాయి నాయకులకు మాత్రం ఈ పరిణామం మింగుడు పడడం లేదు. వీరికి కూటమి అభ్యర్థులు ఇచ్చిన ప్యాకేజీ సొమ్ములో తమకు కూడా కొద్దోగొప్పో ఇవ్వకుండా వారే స్వాహా చేస్తున్నారంటూ రగిలిపోతున్నారు. కొన్ని చోట్ల తక్కువ ఖర్చుతో అయిపోయే విందు భోజనాలతోనే సరిపెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇలా మనస్తాపంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులు బరిలో ఉన్న చోట ప్యాకేజీ అందుకున్న పెద్ద నేతలే తప్ప కింది స్థాయి క్యాడర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇదీ పరిస్థితి.. భీమిలి టికెట్ను కూటమిలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావుకు కేటాయించారు. ఈ సీటును జనసేన నుంచి పంచకర్ల సందీప్, టీడీపీ నుంచి కోరాడ రాజబాబు ఆశించారు. ఆఖరి నిమిషంలో ఈ సీటును గంటా తన్నుకుపోవడంతో తొలుత వీరు అలకబూనారు. రాజబాబు అయితే గంటాపై తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పరిస్థితిని గ్రహించిన గంటా.. రాజబాబు ఇంటికి వెళ్లి బుజ్జగించారు. సందీప్కూ ‘సర్ది’ చెప్పారు. వీరిద్దరినీ భారీ ప్యాకేజీతో దారిలోకి తెచ్చుకోవడంతోనే గంటా వెంట ప్రచారంలో పాల్గొంటున్నారన్న ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది. అలాగే విశాఖ ఉత్తర టికెట్ను బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్రాజుకు కేటాయించారు. అక్కడ జనసేనలో కిందిస్థాయి శ్రేణులకు ప్యాకేజీ అందకపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలిసింది. పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్బాబు టీడీపీలో పైస్థాయి నేతలనే ప్రసన్నం చేసుకోవడంతో దిగువ క్యాడర్ ప్రచారంలో పాల్గొనడం లేదని చెబుతున్నారు. యలమంచిలి టీడీపీ సీటును ప్రగడ నాగేశ్వరరావు ఆశించారు. కానీ పొత్తులో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్కు ఇచ్చారు. తొలుత తన వర్గంతో ఆందోళనకు దిగిన ఆయనకు భారీ ప్యాకేజీ అందడంతో కొద్దిరోజుల నుంచి ప్రచారంలో పాల్గొంటున్నారని, ఆయన అనుచరులు మాత్రం దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఇక పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి అనితను అక్కడ జనసేన నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ రంగంలోకి దిగి సర్దుబాటు చేసినా కింది స్థాయి క్యాడర్ టీడీపీ అభ్యర్థి ప్రచారంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అరకు సీటును తొలుత టీడీపీలో దొన్నుదొరకు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీకి మార్చారు. దీనిపై టీడీపీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. పెద్దలకు సర్దుబాటుతో ఇప్పుడు కొంతమంది ప్రచారంలో పాల్గొంటున్నారు. -
అది రాయి దాడి కాదు.. పవన్ అభిమానినే చితకబాదిన జనసైనికులు
తెనాలి రూరల్: జనసేన అధినే పవన్కళ్యాణ్ పర్యటనలో జన సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ అభిమాని అయిన ఓ కాపు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పవన్ కల్యాణ్పై రాళ్లు విసిరాడని పుకారు చెలరేగడంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన సరిగిరి దిలీప్నాయుడు తెనాలిలో ఆదివారం సాయంత్రం జరిగిన పవన్కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చాడు. ఇక్కడి సుల్తానాబాద్లోని హెలీప్యాడ్ నుండి పవన్ కల్యాణ్ కొంత దూరం కారు నుండి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చి వారాహి వాహనంలోకి మారారు. ఈ మార్గంలోనే ఉషోదయ కళ్యాణమండపం వద్ద దిలీప్ పవన్ రాక కోసం వేచి ఉన్నాడు. పవన్ కల్యాణ్ అటుగా వెళ్లగానే ఓ యువతితో దిలీప్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె తండ్రి అతనిపై దాడి చేశాడు. పక్కనే ఉన్న జన సైనికులు కలుగజేసుకుని దాడి చేస్తుండడంతో సమీపంలోని చెట్టు ఎక్కాడు. అయినా జనసైనికులు కిందకు లాగడంతో తనను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న రాయి తీసుకున్నాడు. రాళ్లతో దాడి చేస్తున్నాడని జనసైనికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరి కొందరు పవన్ కల్యాణ్పై రాళ్లు వేశాడని కేకలు మొదలు పెట్టారు. యువకులు పెద్ద ఎత్తున గుమికూడి దిలీప్పై దాడి చేస్తున్న క్రమంలో కల్యాణమండపం ఆవరణలోకి పరుగెత్తాడు. వెంబడించిన జనసైనికులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కళ్యాణ మండపం సమీపంలోనే విధుల్లో ఉన్న గుంటూరు స్పెషల్బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎస్ వెంకట్రావు, మరో మహిళా ఎస్ఐ, తెనాలి రూరల్, త్రీ టౌన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుళ్లు శివ, తిరుమలరావు, ఇతర సిబ్బంది హుటాహుటిన దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లారు. బాధితుడు దిలీప్ను పొలీసులు చుట్టముట్టి అతని ప్రాణాలను రక్షించారు. పవన్ కల్యాణ్ అభిమానినైన నేను ఆయనపై రాళ్లు ఎందుకు వేస్తానంటూ బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. వివాదానికి కారణమేంటన్నదీ విచారిస్తున్నారు. -
దత్తపుత్రుడి పార్టీకి చంద్రబాబు ఝలక్
పవన్కళ్యాణ్ ప్యాకేజీ నాయకుడని తేలిపోయింది.!. ఏళ్ల తరబడి జనసేన జెండా మోసిన వారికి టికెట్లు లేవు.. పొత్తులో భాగంగా ఇచ్చే టికెట్లనూ టీడీపీ నుంచి అప్పటికప్పుడు జనసేనలోకి వచ్చేవారికే కేటాయించారు. ఇంత జరిగినా చంద్రబాబును కిమ్మని మాట అనడంలేదంటే.. ఆయనవి స్వార్థ రాజకీయాలేనని ఆ పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. ప్రతీ ఐదేళ్లకోసారి రాజకీయాన్ని సినిమాగా భావించి.. చంద్రబాబు డైరెక్షన్లో సొమ్ముచేసుకుంటున్నాడని, ఆయనను నమ్మి పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసే వారిని నిలువునా ముంచేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి టికెట్ల కేటాయింపే నిలువెత్తు నిదర్శనమని పేర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనసేన పార్టీకి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మూడు సీట్లు ఇస్తామని... తమ పొత్తు సూపర్ హిట్ అంటూ రెండు వేళ్లూ గాలిలో ఊపుతూ... ఒక్కటంటే ఒక్కటే టికెట్ ఇచ్చిన చంద్రబాబు వెన్నుపోటుకు అసలుసిసలైన బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి నిరూపించుకున్నారు! ఇదేదో ప్రత్యర్థుల మాట కాదు కూటమిలోనే మోసపోయి గుండె రగిలిపోతున్నవారి మాట! నెల్లిమర్ల టికెట్ ఒక్కటి మాత్రమే జనసేన జెండా పట్టుకొని తిరుగుతున్న లోకం మాధవికి దక్కింది. ఎచ్చెర్ల టికెట్ను గత ఏడాదే టీడీపీ నుంచి బీజేపీలోకి ప్రవేశించిన నడికుదుటి ఈశ్వరరావు దక్కించుకున్నారు. పాలకొండ టికెట్ అయినా అసలుసిసలైన జనసేన నాయకులకు దక్కుతుందనుకుంటే ఆఖరి నిమిషంలో పసుపు కండువా తీసేసి పార్టీలోకి వచ్చిన నిమ్మక జయకృష్ణకు ఇచ్చేసేశారు. ఇలాంటి ప్రయత్నాలే చేసిన మరో టీడీపీ నాయకురాలు పడాల భూదేవి ఆశలపై నీళ్లుజల్లారు. పవన్ కల్యాణ్ మాట ఇచ్చినా చంద్రబాబు గిమ్మిక్కులతో సీటు చేజారిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతుంది. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అందామనుకున్న ఆమెకు ఎమ్మెల్యే పదవి అందని ద్రాక్ష అయిపోయింది. పాలకొండలో పాతనీరే... టికెట్ ఇచ్చేస్తామంటూ పాలకొండ జనసేన నాయకులను ఊరించి... ఊరించి చివరకు కొత్త గ్లాసులో పాత సారా పోసినట్టుగా టీడీపీ జంప్ జిలానీ జయకృష్ణకు ఎంపికచేయడమే చిత్రం. జనసేనకు పాలకొండలో రెండు శాతం ఓట్లు లేవని, పాలకొండ టికెట్ జనసేన పార్టీకి ఇస్తే ఊరుకునేది లేదని, తేడా వస్తే నిమ్మక జయకృష్ణను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దించుతామని టీడీపీ నాయకులు బీరాలు పలికారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ కోటా టికెట్లను 24 నుంచి 21కు కోతవేసిన నేపథ్యంలో పాలకొండ టికెట్ టీడీపీకి రాదని తేలిపోయింది. ఇది గమనించిన పడాల భూదేవి అప్పటివరకూ వేసుకొని తిరిగిన టీడీపీ కండువాను పక్కనపడేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సాలువా కప్పించుకున్నారు. ఇక్కడో కొసమెరుపు ఉంది. గ్లాస్ గుర్తుతో పోటీచేయడానికి ఉబలాటపడినా ఆమె మాత్రం ముందు జనసేనలో చేరలేదు. ఇదేదో కొంపముంచే వ్యవహారంలా ఉందని జయకృష్ణ హడావుడిగా టీడీపీ కార్యకర్తలను ఫూల్స్ చేస్తూ ఈనెల 1న పిఠాపురం వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భూదేవి కూడా ఈ నెల 7న అనకాపల్లి వచ్చిన పవన్ కళ్యాణ్ను కలిసి ఆమె కూడా జనసేనలో చేరిపోయారు. చివరకు ఈనెల 9న జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ఖరారైంది. ఎంత ఆశపడిందో కానీ ఈ వార్తతో భూదేవి కంట కన్నీరు జలపాతమైంది. ఆఖరి నిమిషంలోనైనా తనకు బీఫారం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని హూంకరిస్తున్నా... అవేవీ వాస్తవమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ తాజా జనసేన నాయకుల తీరుపై ఇన్నాళ్లూ పాలకొండ జనసేన ఇన్చార్జిగా జెండా మోసిన నిమ్మల నిబ్రమ్ అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. తనకు సీటు ఇస్తామని తిప్పించుకున్న పవన్ కళ్యాణ్ ఆఖరి నిమిషంలో తాజామాజీ టీడీపీ నాయకుడికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాలకొండలో కూటమి అభ్యర్థిని ఓడిచేందుకు అటు భూదేవి, ఇటు నిబ్రమ్ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. పాలకొండ పట్టణంలోని ఓ కళ్యాణమండపంలో గురువారం నిర్వహించిన నాలుగు మండలాల కూటమి నాయకుల సమావేశంలో జయకృష్ణ అభ్యర్థిత్వాన్ని భూదేవి వర్గం వ్యతిరేకించింది. నాలుగు సార్లు ఓడిపోయిన జయకృష్ణకే మళ్లీ టిక్కెట్ ఇచ్చారని, ఈ సారి కూడా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. -
సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో !
తమ్ముణ్ణి సినిమాకు తీసుకెళ్లావ్..నన్నుతీసుకెళ్లలేదు..వాడికి కొత్త బట్టలు కొన్నావు,సైకిల్ కొన్నావ్..నాకు కొనలేదు అని పిల్లలు అలుగుతుంటారు..అలాంటప్పుడు తల్లి, తండ్రి వాణ్ని దగ్గరకు తీసి ఒరేయ్ చిన్నోడా అది కాదురా.. వాడికి సైకిల్ కొన్నాను కదా... నీకూ కొంటాను.. నీకు ఇంకోటి కొంటాను.. వాణ్ని సినిమాకు తీసుకెళ్ళాను కదా.. నువ్వు బాధపడకు నిన్ను జాతరకు తీసుకెళ్తాను... బాధపడకు... అని ఓదార్చాలి... అదే కుటుంబం బాధ్యత. అదే విధంగా పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. అలాంటప్పుడు పిలిచి ఇదిగోవయ్యా.. నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ నీకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను.. దానికి ఏవేవో కారణాలు ఉన్నాయ్.. కాబట్టి ఏమీ అనుకోకు.. పార్టీ కోసం పని చేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. కానీ జనసేనాని వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. టికెట్లు తనకు నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారు. తిరుపతిలో కిరణ్ రాయల్ కావచ్చు.. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్..ఇలా ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది పవన్ కోసం పదేళ్లుగా పని చేస్తూ లక్షలు, కోట్లు తగలేశారు. ఇన్నేళ్ళుగా వాళ్ళను వాడుకుని అక్కడ పార్టీ ఉనికిలోకి వచ్చాక.. ప్రజల్లో కాస్త గుర్తింపు వచ్చాక అక్కడి సీటును వేరేవాళ్లకు ఇచ్చుకోవడం, ఇదేమంటే పొత్తు ధర్మం అని, త్యాగాలకు సిద్ధం కావాలని సమర్థించుకోవడం పవన్ కు అలవాటుగా మారింది. పోతిన మహేష్ టికెట్ బీజేపీకి అంటే సుజనా చౌదరికి ఇవ్వడానికి వెనుక కోట్లు చేతులుమారాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇలా పవన్ను నమ్ముకుని బికారులు అయిపోయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలోనే ఉన్నారు అయితే ఏనాడూ.. పవన్ అలా నష్టపోయిన లేదా మోసపోయినవాళ్లను పిలిచి వాళ్ళతో మాడ్లాడడం కానీ... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా..హామీ కానీ ఇచ్చినట్లు వినలేదు. మాకు పవన్ మద్దతుగా ఉంటామన్నారు అని ఇంతవరకూ ఏ ఒక్క నాయకుడూ చెప్పలేదు. ఆంటే ఆయనది అంతా తన ఇష్టానుసారం. తనకు నచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చుకోవడం.. ఆయన్ను నమ్ముకుని మునిగిపోయినవాళ్లు పోవడం.. అంతే తప్ప...కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా పార్టీలో ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు లేకపోవడం ఇక్కడ దారుణం. దీంతో బాధితుల రోదన అరణ్య రోదన అవుతోంది తప్ప వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకుండాపోయారు. దీంతో ఎక్కడికక్కడ జిల్లాలు.. నియోజకవర్గాల్లో పార్టీని మోసి మోసపోయిన జనసేన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తమ దారితాము చూసుకుంటున్నారు. తాను పిఠాపురంలో గెలిస్తే చాలు..పార్టీ మొత్తం ఏమైపోయినా ఫర్లేదు...అనే భావనలో పవన్ ఉండడంతో క్యాడర్ సైతం మెల్లగా సైడ్ అయిపోతున్నారు. --సిమ్మాదిరప్పన్న -
రాజకీయాల్లో నటించకు పవన్..
తాడేపల్లిగూడెం: ప్రజాసేవ అనే మాట పలకని పవన్కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి, సినిమా షూటింగ్లకు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాల్లో నటించు.. కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు. ఈరోజు పేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే అది జగన్ దయేనని.. పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ బాగుండాలని, ఆయన పది కాలాలపాటు పేదలకు సేవచేయాలని ముద్రగడ ఆకాంక్షించారు. జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాలొ్గన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ను కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కాపు, తెలగ, బలిజలను మోసగించిన బాబు.. 2014లో కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడు. ఇచ్చిన హామీని అమలుచేయమంటే నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు. ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా అడిగారా? పవన్కు దమ్ము, «ధైర్యం ఉండి మగాడైతే నన్ను తిట్టాలి.. అంతేగానీ మెసేజ్లు పెట్టడం మగతనం అనిపించుకోదు. 21 సీట్లకు పరిమితం కావడం దారుణం.. తెలుగుదేశం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ పొత్తువల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగింది. పవన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునేవారు. 80 సీట్లు తీసుకుని, పవర్లో షేరు అడగాలని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు మాత్రం లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయడానికి తనయుడితో యువగళం పాదయాత్ర చేయించారు. అడగాల్సినన్ని సీట్లు అడగకుండా.. పవర్ షేరింగ్ లేకుండా కేవలం 21 సీట్లకు పవన్ పరిమితం అయిపోవడం చాలా దారుణం. ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేది. మీకు చెప్పుకోవడానికి ఏమీలేదా బాబూ? అసలు పేదల కోసం జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మీరు అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం ఏంటి.. మీకంటూ సొంతంగా చెప్పుకోడానికి ఏమీలేవా బాబూ? ఈ మాటలు చెప్పడానికి మీరు సిగ్గుపడటంలేదేమోగాని వినడానికి మాకు సిగ్గుగా ఉంది. వైఎస్సార్సీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇస్తుందని మీరు చెప్పడం చూస్తే పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే మనుషుల్లా కనపడుతున్నారా పవన్? అయినా అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలిగానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏమిటి? నిజానికి.. పవన్కళ్యాణ్ ముందుగా తాడేపల్లిగూడెం నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే ఇక్కడి జనసేన అభ్యర్థి త్యాగాలు చేయడానికి సిద్ధంగాలేనని, వస్తే కాలూచేయీ తీసేస్తానని బెదిరించడంతో పవన్ పిఠాపురం వెళ్లిపోయారు. -
విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా
-
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కష్టమే: పవన్కళ్యాణ్
సాక్షి, అనకాపల్లి: ‘‘విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడం కష్టమే.. గతంలో నేను స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రధానమంత్రిని కలిసేందుకు నాతో ఎవరొస్తారో చేతులెత్తండి అని అడిగితే ఎవరూ స్పందించలేదు’’.. అని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో విశాఖ స్టీల్ప్లాంట్ కార్మిక సంఘాల నుంచి తనకు మద్దతు రాలేదని, లేదంటే ప్రధాని దగ్గరకు వెళ్లి ప్రైవేటీకరణను నిలిపివేసే వాడినని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదిని ఊరికే నిందిస్తే సరికాదని స్టీల్ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులను పవన్ తప్పుబట్టారు. అనకాపల్లిలో ఆదివారం నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఓడిపోయానని, ఇప్పుడు పిఠాపురంలో గెలవాలని బలంగా కోరుకుంటున్నానన్నారు. అనకాపల్లిలో ఉన్న శారదానది విదేశాల్లో ఉండి ఉంటే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేదని, మా కూటమి గెలిస్తే దాని ఒడ్డును పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మరోవైపు.. దారి పొడువునా సీఎం జిందాబాద్ అంటుంటే ‘మనకు అంత శక్తిలేదు.. 2029లో సీఎం అవడానికి ప్రయత్నిస్తా’నని పవన్ అన్నారు. -
బాబు, పవన్ డబుల్గేమ్పై క్యాడర్ తిరుగుబాటు
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్గేమ్పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం ఇవ్వకుండా మీటింగా? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు. సుగవాసి వద్దే వద్దు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది. రమేష్నాయుడిని ఓడిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు. -
ప్యాకేజీ అందుకుని బీజేపీకి సీటు అమ్మేశాడు: కేశినేని నాని
-
యలమంచిలి టీడీపీ-జనసేన సమావేశం రసాభాస
-
చిన్నమ్మ ఇలాకాలో కమలనాథుల విలాపం
చంద్రబాబు జిత్తులమారి రాజకీయాలకు జనసేన, బీజేపీ నేతలకు భంగపాటు తప్పలేదు. పొత్తు పేరుతో ఓట్లు కొల్లగొట్టేఎత్తు వేసి.. బరిలో ఆ పార్టీల ప్రాతినిధ్యం లేకుండా చేసి మరోసారి తన వెన్నుపోటు నైజాన్ని నిరూపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు పార్టీలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (చిన్నమ్మ) సొంత ప్రాంతం కావడంతో ఒక్క సీటన్నా వస్తుందని భావించిన కమలనాథులకు నిరాశేమిగిలింది. జనసేనల పరిస్థితి కూడా అంతే. ఆ రెండు పార్టీ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల మధ్య పొత్తు పేరుతో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయానికి తెర తీశారు. మూడు పార్టీల ప్రాతినిధ్యం ఉంటుందని చివరి వరకు నమ్మించి.. చివరకు ఏకపక్షంగా అన్ని సీట్లు టీడీపీకే కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 స్థానాల్లోనూ టీడీపీ మాత్రమే పోటీ చేస్తోంది. జనసేన, బీజేపీ కార్యకర్తలు జెండాలు మోయడానికి మాత్రమే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎంత చొక్కాలు చించుకున్నా ఒరిగేదేమీ లేదు కదా అని ఆ పార్టీల కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రచారంలో జనసేన, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పెద్దగా కనిపించడంలేదు. టీడీపీ నాయకులే జనసేన, బీజేపీ జెండాలను తమ కార్యకర్తల చేత పట్టించి డూప్ షో చేస్తున్నారన్న విమర్శలున్నాయి. నమ్మకంగా తడిగుడ్డతో గొంతు కోశారు జనసేన పరిస్థితి ఘోరంగా తయారైంది. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికొచ్చే సరికి రిక్తహస్తం చూపెట్టారని ఆ పార్టీ నాయకులు బహిరంగానే కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు నమ్మకమైన మనిషిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్కు పేరుంది. ఆయనకు ఒంగోలు సీటు ఇస్తానని పవన్హామీ ఇచ్చారు. పొత్తు కుదిరినా ఒంగోలు సీటు మాత్రం జనసేనకే అని నమ్మకంగా చెప్పారు. తీరా పొత్తు కుదిరిన తరువాత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్కు కట్టబెట్టారు. ఇదేం అని అడిగితే నీకు న్యాయం చేస్తామంటూ బుజ్జగిస్తున్నారు. ఇక గిద్దలూరు సంగతి కూటమిలో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కంభం, ఒంగోలులో జరిగిన సభల్లో ఆమంచి స్వాములు తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం పాటించకుండా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. గిద్దలూరు సీటు ఇస్తామని పవన్ కళ్యాణ్తో పాటుగా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా తనకు హామీ ఇచ్చినప్పటికీ తనకు సీటు దక్కకుండా కొందరు టీడీపీ నాయకులు మోసం చేశారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ ప్రతినిధిని అని చెబుతూ ఆమంచి సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ మౌనం వహించడం పలు అనుమానాలకు తెరతీస్తోంది. పురందేశ్వరి సొంత జిల్లాలో కమలానికి దక్కని చోటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సొంత జిల్లా అయిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఒంగోలు పార్లమెంట్ సీటును బీజేపీకి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. పురంధేశ్వరి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో ఒంగోలు, మార్కాపురం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని బీజేపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె అనూహ్యంగా రాజమండ్రికి వెళ్లిపోవడమే కాకుండా సొంత జిల్లా గురించి ఆసక్తి చూపకపోవడంతో కమలం కార్యకర్తలలో నైరాశ్యం నింపింది. కనీసం ఒక్కసీటు ఇచ్చినా పార్టీలో ఉత్సాహం నింపినట్లుండేదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. తెలుగు సీరియల్ను తలపిస్తున్న దర్శి సీటు: దర్శి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి సరైన నాయకుడు లేక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఎన్నికల్లో పోటీకి రోజుకో కృష్ణుడు తెరపైకి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి జనసేన పోటీ చేయడం ఖాయమంటూ తొలి నుంచి ప్రచారం జరిగింది. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన గరికపాటి వెంకట్ను వ్యూహాత్మకంగా జనసేనలో చేర్పించింది. ఆయన తనకే సీటు అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో టీడీపీలో చేరిన అద్దంకికి చెందిన బాచిన కృష్ణ చైతన్యను దర్శికి వెళ్లమని చెప్పారు. ఆయన నో అని చెప్పేయడంతో ఒంగోలుకు చెందిన గోరంట్ల రవికుమార్ను టీడీపీ ఇన్చార్జిగా నియమించారు. రవికుమార్ పేరు ప్రచారంలో ఉండగానే నరసరావుపేటకు చెందిన కడియాల లక్ష్మి పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం చేశారు. ఆమె కూడా ఆసక్తి చూపకపోవడంతో దామచర్ల సత్య పేరు ఖరారు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో దామచర్ల సత్య పేరు రావడంతో తేలు కుట్టిన దొంగల్లా ఉలిక్కిపడ్డారు. రోజులు గడుస్తున్నప్పటికీ దర్శి సీటు పీటముడి వీడడం లేదు. ప్రచారంలో కనిపించని జనసేన, బీజేపీ నాయకులు పొత్తు ప్రక్రియ పూర్తయి అభ్యర్థులను కూడా ప్రకటించినప్పటికీ మూడు పార్టీ నాయకుల్లోలలో ఉత్సాహం కనిపించడం లేదు. పేరుకు పొత్తే కానీ పోటీ మాత్రం టీడీపీ చేస్తుండడంతో జనసేన నాయకులు కానీ, బీజేపీ కేడర్ కానీ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాన మంత్రి మోదీ సభలో సైతం పచ్చ జెండాలే కానీ బీజేపీ, జనసేన జెండాలు పెద్దగా కనిపించలేదు. జనసేనతో మొక్కుబడిగా రెండు సార్లు సమావేశాలు నిర్వహించిన టీడీపీ బీజేపీతో ఆంటీ ముట్టనట్లుగా ఉండడం పట్ల కమలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శ్రీకాకుళం అభ్యర్థిని మార్చాల్సిందే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజెపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న గొండు శంకర్ను మార్చి, గుండ లక్ష్మీదేవికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం క్యాడర్ ఆల్టిమేటం జారీ చేసింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అరసవల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసానికి చేరుకొని వారితో సమావేశమయ్యారు. అనంతరం క్యాడర్తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు గుండ దంపతులను తీసుకొని రమ్మన్నారని ఆ విషయాన్ని వారిద్దరికీ వివరించారు. దీనికి గుండ దంపతులు స్పందిస్తూ చంద్రబాబుతోనే మాట్లాడుతామని, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్తోనైతే మాట్లేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరో రెండు మూడు రోజుల్లో వారు చంద్రబాబునాయుడును కలిసేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. దీనిపై నగర తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏది ఏమైనా శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్ లక్ష్మీదేవికి కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన 50 డివిజన్లలో 45 డివిజన్లకు చెందిన ఇన్చార్జులంతా గుండ లక్ష్మీదేవి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. రెండేళ్లుగా క్రమశిక్షణ తప్పిన అసమ్మతి నేతకు టిక్కెట్ కేటాయించడంపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పరిస్థితిని చంద్రబాబునాయుడుకు వివరించి లక్ష్మీదేవికి టిక్కెట్ వచ్చేలా చూడా లని కోరారు. దీనికి సమాధానంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మీ ఆవేదన తనకు అర్థమైందని చంద్రబాబు వద్దకు గుండ దంపతులను తీసుకెళ్లడం వరకే తన బాధ్యతని వివరించారు. టికెట్ ఇస్తే గుండకే ఇవ్వాలని, యూత్ కోటా అనుకుంటే వారి కుమారుడికి ఇవ్వాలే తప్ప గొండు శంకర్కి కన్ఫర్మ్ చేస్తే తాము ఒప్పుకోబోమని కార్యకర్తలు అన్నారు. -
మైనార్టీ ఓట్ల కోసం చంద్రబాబు కొత్త నాటకం
-
ఎన్నికల తర్వాత గ్లాసు కనిపించేనా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పొత్తు పేరుతో టీడీపీ జిల్లాలో జనసేన పార్టీ జెండా పీకేసే పనిలో ఉంది. క్యాడర్ అంతంత మాత్రంగా ఉన్న జనసేన పార్టీ ఉనికి నెల్లూరు, కావలిలో మాత్రమే కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ దఫా ఎన్నికల నాటికి కావలి, నెల్లూరు సిటీ, రూరల్లో మాత్రమే నియోజకవర్గ స్థాయి లీడర్ల హడావుడి కొంత కనిపించింది. తాజాగా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ కేడర్ పూర్తిగా కనుమరుగైందనే చెప్పాలి. పాతాళంలోకి పడిపోయి గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నెల్లూరు సిటీలో కేతంరెడ్డి వినోద్రెడ్డి, నెల్లూరు రూరల్లో మనుక్రాంత్రెడ్డి, కావలి నుంచి అలహరి సుధాకర్ జనసేన పార్టీని కనిపెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉనికి చాటుకుంటూ వచ్చారు. అయితే జనసేన అధినేత పవన్కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచి పొత్తు పెట్టుకోవడంతో నెల్లూరు సిటీ నుంచి నారాయణ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని గ్రహించిన కేతంరెడ్డి వినోద్రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పి తన భవిష్యత్ కోసం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో మనుక్రాంత్రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి సిటీకి మారిపోయారు. పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ నుంచి తనకు అవకాశం వస్తుందని భావించిన మనుక్రాంత్రెడ్డి సిటీ పరిధిలో డివిజన్ల వారీగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. అయితే నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్య ర్థిగా నారాయణ పేరు ఖరారు కావడంతో కనీసం నెల్లూరు రూరల్ సీటు అయినా వస్తుందని ఆశించిన మనుక్రాంత్కు భంగపాటు తప్పలేదు. దీంతో పార్టీ క్యాడర్ సైతం చెల్లాచెదురై పరిస్థితి పాతాళానికి పడిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలు ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థులు వారిని కనీసం దరిచేరనీయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పనిచేయడం అవసరమా? అని లోలోన మదనపడుతున్నారు. ఎన్నికల తర్వాత గ్లాసు కనిపించేనా.. ప్రస్తుతం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదు. అయినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జిలు టీడీపీ విజయం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా.. టీడీపీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా జనసేన జెండా పీకేసేందుకు కంకణం కట్టుకున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ తన బినామీ అయిన గునుకుల కిషోర్ను జనసేనలోకి పంపి ఆయన్ను ముందుంచి మనుక్రాంత్రెడ్డిని ఎన్నికల క్షేత్రంలో లేకుండా చేశారు. నారాయణ తన పార్టీ కేడర్తో జనసేన జెండాలు మోయిస్తూ ఆ పార్టీని దాదాపు లేకుండా చేశారు. కావలిలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అలహరి సుధాకర్ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కోసం పనిచేస్తున్నారు. అయితే కావ్య కృష్ణారెడ్డి తనదైన ధోరణిలో జనసేన క్యాడర్ను టీడీపీ కండువా కప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు అలహరి సుధాకర్ ఇటీవల నాగబాబు, నాదెండ్ల మనోహర్లను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని తెలిసింది. జిల్లాలో ఎక్కడైతే జనసేన ఉనికి ఉందో అక్కడ ఆ పార్టీ క్యాడర్ను సైతం టీడీపీలో కలిపేసుకుని ఆ పార్టీ జెండా పీకేసే పనిలో పచ్చనేతలు నిమగ్నమయ్యారు. ఇదంతా టీడీపీ అధినేత సూచనల మేరకే జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన జెండా కనిపించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సర్వే పేరుతో అయోమయం బయటపడ్డ కాల్ రికార్డు
-
జనసేనకు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా
-
పవన్ కళ్యాణ్..మరీ ఇంత దుర్మార్గమా ?
-
‘టీ టైమ్’ దెబ్బకు ‘సానా’ ఔట్ ఆశ పెట్టి.. జెల్ల కొట్టి..
ఎంపీ సీటు ఇస్తామంటూ తొలి నుంచీ ఆశ పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయించేశారు. బలి తీసుకునే వాడినే గొర్రె నమ్ముతుందన్నట్టు.. చంద్రన్న మాటలు నమ్మిన ఆ వ్యాపారవేత్త.. ఆయన బుట్టలో పడ్డారు. బాబుగారు చెప్పినట్టల్లా తలాడించారు. సీన్ కట్ చేస్తే.. చివరాఖరుకు చంద్రన్న ఖాతాలో మరో కరివేపాకుగా మారారు. అవసరానికి వాడుకోవడం.. ఆనక విసిరి పారేయడంలో ఆరితేరిన చంద్రబాబు చేతిలో.. టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ టికెట్టు ఆశించిన సానా సతీష్.. రాజకీయంగా ఖర్చయిపోయారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ, జనసేన పార్టీల్లో ఆశావహులను అయిన కాడికి వాడేసుకుని ఆనక కరివేపాకుల్లా తీసిపారేస్తున్నారు. ఎన్నికల్లో సీట్లు ఇస్తామంటూ ఆశలు కలి్పంచి, పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టించేస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఇంకో సీటు వచ్చేస్తుందనే గంపెడాశతో ఆశావహులు కూడా భారీగానే చేతిచమురు వదిలించేసుకుంటున్నారు. ఈ తతంగమంతా పూర్తయి.. అభ్యర్థుల ప్రకటన దగ్గరకు వచ్చేసరికి లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న వారిని అధినేతలు బకరాలను చేసేస్తున్నారు. వారికి మాటమాత్రంగానైనా చెప్పకుండా వేరేవారికి సీట్లు అప్పగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ సీటు ఆశించిన సానా సతీష్ను రాజకీయంగా బలి తీసుకున్నారని ఆ పార్టీలోని సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారు. పవన్ ప్రకటనతో.. పిఠాపురం నుంచి తాను, కాకినాడ లోక్సభ స్థానం నుంచి టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ తనను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్షా వంటి వారు ఒత్తిడి తెస్తే తాను, ఉదయ్ శ్రీనివాస్ తమ స్థానాలను మార్చుకుంటామని మళ్లీ కొద్ది రోజుల్లోనే చెప్పారు. దీనిపై అటు పిఠాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆయన అనుచరులు మాటల మంటలు రేపుతూండగా.. ఇటు తనకు టీడీపీ నుంచి సానా సతీష్కు ఎంపీ సీటు గల్లంతైనే విషయం స్పష్టమైంది. టీ టైమ్ దెబ్బకు సానా సతీష్ టికెట్టు గోవిందా అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాటవరసకైనా చెప్పకుండా.. కాకినాడకు చెందిన సానా సతీష్ ఏపీ ఈపీడీసీఎల్లో పని చేస్తూ.. ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి, మద్యం తదితర వ్యాపారాల్లో ఉన్నారు. ఆయనపై చంద్రబాబు వల వేశారు. కాకినాడ ఎంపీ సీటు ఇస్తామంటూ ఊరించారు. ఆయన మాటలు నమ్మిన సతీష్.. విపక్ష కూటమిలో ఎవరికి అవకాశం వచ్చినా కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉండేది తానేనని ప్రచారం చేపట్టారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోస్టర్లు, స్టిక్కర్లతో తన అనుచరుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. వాస్తవానికి టీడీపీ, జనసేన పొత్తులు తేలడానికి ఆరు నెలల ముందు నుంచే సతీష్ రూ.కోట్లు తగలేసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు జిల్లా పర్యటనలకు వచ్చిన సందర్భంలో ఆయా కార్యక్రమాలకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇంత చేసినా చివరకు సతీష్ ఆశలకు గండి కొట్టారని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇరు పారీ్టలూ ఒకే రకమైన పంథాలో తమను అవసరానికి వాడేసుకుని, సీట్లు ఇవ్వాల్సి వచ్చేసరికి కరివేపాకులను చేశారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు సీటు ఎందుకు ఇవ్వడం లేదో కనీసం మాటవరసకైనా పిలిచి చెబుతారని సతీష్ ఆశించారు. కానీ, అలా జరగకపోవడాన్ని ఆయన వర్గం అవమానంగా భావిస్తోంది. ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు ఎటువంటి సంబంధమూ లేని కాకినాడ ఎంపీ సీటు కేటాయించడం అవివేకమే అవుతుందని అంటున్నారు. ఆయన కోసం తామెందుకు త్యాగాలు చేయాలని వారు ప్రశి్నస్తున్నారు. ఈ సీటును హఠాత్తుగా జనసేనకు కట్టబెట్టేస్తే ఇంత కాలం ఇరు పారీ్టల కోసం పని చేసిన సతీష్ వంటి వారు ఏమైపోతారని ప్రశి్నస్తున్నారు. వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి, అనుచరగణాన్ని అంతా కాకినాడలో మకాం చేయించి, గడచిన ఆరు నెలలుగా టీడీపీ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టిన తనకు సీటు సితార చేసేసి, తగిన బహుమతే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్యాగం పేరుతో తనను దూరం పెట్టడం బాధిస్తోందంటున్న సతీష్ వర్గీయులు.. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. -
Pawan Kalyan: నటుడా? నాయకుడా?
పవన్ కళ్యాణ్.. పరిచయం అవసరం లేని పేరు. 20 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాడు. ఆ పడవలో ఓ కాలు పెట్టి.. మరో కాలును రాజకీయాల్లోకి దించాడు. పోనీ ఇక్కడ ఇప్పటివరకు పొడిచింది ఏదైనా ఉందా.? అంటే ఒక్క ఎన్నికలోనూ గెలవలేకపోయాడు. సినిమాల్లో తప్ప అసెంబ్లీ గేటు వరకైనా వెళ్లలేకపోయాడు పవన్. ఆయనకున్న ఇమేజీ అలాంటిది. వై జంక్షన్లో దారెటు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు రెండు పరీక్షలున్నాయి. ఆయనిప్పుడు వై జంక్షన్లో వెయిట్ చేస్తున్నారు. మొదటి పరీక్ష పాలిటిక్స్. చివరి ప్రయత్నంగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. గెలుస్తాడో లేదో నమ్మకం లేదు కాబట్టి.. అసెంబ్లీకి పోటీ చేయాలా.. లేక పార్లమెంటుకు పోటీ చేస్తే బీజేపీ ఇమేజ్ కాపాడుతుందా? అన్న సందిగ్ధత. వెండి తెరపై టఫ్ టైం ఇక పవన్ ముందున్న రెండో పరీక్ష సినిమాలు. ఇప్పుడు పవన్ వయస్సు 52 ఏళ్లు. ఇన్నాళ్లు యూత్ పాత్రలో నటించినా.. పాటలకు స్టెప్పులు వేసినా.. అభిమానులు అతి కష్టమ్మీద చూసుకొచ్చారు. ఇప్పుడు వయస్సు మీద పడుతోంది. ఎంత మేకప్ వేసినా.. ముఖంలో వయస్సు తాలుకు ముడతలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వయస్సుకు తగ్గ పాత్రలు దొరికితేనే.. సినిమాలు నడుస్తాయి. (చదవండి: రీల్ వర్సెస్ రియల్లో... పవన్ గందరగోళం!) ఏతా వాతా చెప్పేదేంటంటే.. పవన్ మార్కెట్ ఇప్పుడు అనుకున్నంత లేదు. అంతెందుకు పవన్ అనగానే.. ఊగిపోయే అభిమానులు కూడా ఇప్పుడు ఆచితూచి థియేటర్ల వైపు వస్తున్నారు. ఉదాహరణకు రీఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. అంతెందుకు ఇంకొంచెం ముందుకు వెళ్తే.. అజ్ఞాత వాసి, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్.. ఏ సినిమాను చూసినా బాక్సాఫీసు కంటే ముందే గ్లాసు పగిలిపోయింది. అంటే ఇప్పుడు పవన్ లేని మార్కెట్ను సృష్టించుకునేందుకు ఆరాటపడుతున్నాడు. రాజకీయాల్లో నటిస్తే ఒప్పుకుంటారా? ఎలక్షన్స్ కోసమే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏవో రెండు డైలాగ్స్తో ఒక వీడియోను విడుదల చేశాడు పవన్. పైకేమో సినిమా అంటూ అందులో పొలిటికల్ డైలాగ్స్ను చదివాడు పవన్. తానే గొప్పని చెప్పుకునేందుకు తనను తాను కీర్తించుకున్నాడు. ఆ వీడియోలో గాజు పగిలేకొద్దీ పదునెక్కుతుంది అంటూ.. చెప్పిన పవన్ ఒక లాజిక్ మిస్ అయ్యాడు. గాజు పగిలే కొద్ది పనికిరాకుండా పోతుందనే విషయాన్ని కూడా లక్ష పుస్తకాలు చదివిన పవన్ తెలుసుకోలేకపోయాడు. సముద్రం వంగదు, పర్వతం పడుకోదు, 24 అంటే గాయత్రి మంత్రం వంటి త్రివిక్రమ్ డైలాగ్స్ వినిపించాడు. కానీ రియాల్టీలో చంద్రబాబు దగ్గర వంగిపోతున్నాడు. చేతులు కట్టుకుని సాగిలబడుతున్నాడన్నది రియల్ పాలిటిక్స్లో వినిపించే విమర్శలు. అందుకే సీఎం సీఎం అని పిలిపించుకున్న పవన్.. తనను తాను బాగా తగ్గించుకుని 21 సీట్లకు పరిమితం చేసుకున్నాడు. చంద్రబాబు చెప్పిన చోట పోటీ చేసేందుకు రెడీ అయిపోయాడు. (చదవండి: బాబు ఇచ్చిందే జనసేనకు ప్రాప్తం) విశ్వసనీయత కనిపించడం లేదు? రాజకీయ నాయకుడికి కావాల్సిన ప్రాథమిక లక్షణం విశ్వసనీయత. ఆ సూత్రాన్ని పవన్ ప్యాకేజీతో మార్చేశాడు. అందుకే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశం నుంచి ఎవరు, ఎక్కడి నుంచి బరిలో దిగుతారన్న డైరెక్షన్ చంద్రబాబు ఇస్తారంటారు జనసైనికులు. అందుకే చాలా ఏళ్లుగా జనసేనను నమ్ముకుని, ఆస్తులు అమ్ముకొని డబ్బులను పార్టీ కోసం ఖర్చు పెట్టిన కొందరి నేతలకు టికెట్లు దక్కలేదు. ఒక నటుడు.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. కొన్ని నెలలపాటు అదొక అద్భుతం, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాతావరణం అలవాటైన సినిమా హీరో పవన్ కల్యాణ్కు.. వాస్తవాలు అర్థమయ్యే అవకాశం ఎప్పటికీ ఉండదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇంకా క్లారిటీ వచ్చినట్లు లేదు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడమా, లేదా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడమా అనేది అమిత్ షా డిసైడ్ చేస్తారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. మరీ క్లారిటీ ఇప్పటికైనా వచ్చిందో లేదో తెలియాల్సి ఉంది. కిం కర్తవ్యం? 2024 ఓ రకంగా పవన్ను అటో ఇటో తేల్చేసే ఏడాది. ఎన్నికల్లో పవన్ ఓడితే రాజకీయంగా ఆయన దుకాణం బంద్. ఇప్పటికే జనసేన పార్టీని చంద్రబాబుకు లీజ్కు ఇచ్చేసినట్టే. కనీసం పాతిక స్థానాల్లో కూడా పోటీ చేయలేని పార్టీని ఇంకా ముందు ముందు ఏ రకంగా నడుపుతాడు? అసెంబ్లీకి పోటీ చేయాలా? పార్లమెంటుకు పోటీ చేయాలా అన్న సందేహాలే ఇంకా వెంటాడితే నాయకుడు ఎలా అవుతాడు? ఇక మిగిలింది సినీ రంగం. కొత్త నటులెందరో దూసుకువస్తున్నారు. ఇంతకు ముందులా కాకుండా..ఓటీటీ ఎంటర్ అయింది. కంటెంట్ బాగుంటే కటౌట్ అవసరం లేదని తేల్చేస్తోంది. ఇప్పుడు పవన్ను నమ్మి భారీ బడ్జెట్తో సినిమాలంటే చేతులు పూర్తిగా కాల్చుకోవడమన్నది అందరికి అవగాహనలోకి వచ్చింది. పైగా 52 ఏళ్లలో హీరోయిన్లతో స్టెప్పులేయడం కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. నిజజీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నంత మాత్రాన.. తనను తాను ఇంకా యంగ్ అనుకోవడం కూడా అంత బాగుండదు.పెరిగిన వయస్సుకు తగ్గట్టుగా హుందాగా ఉండి ఉంటే.. సినిమాల నుంచి రాజకీయాల వైపు ఓ ట్రాన్సిషన్ వచ్చి ఉండేది. కానీ.. కేవలం సినీ ఇమేజీతో గట్టెక్కుతానంటే ఓటర్లెలా నమ్ముతారు? -
జనసేనల మధ్య పెరుగుతున్న గ్యాప్
జిల్లాలో పొత్తు రాజకీయాల్లో జనసేన చిత్తయిపోయింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి పోకడలు ఆ పార్టీ శ్రేణుల్లో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశాయి. పొత్తు ప్రకటన నుంచి సమన్వయ సమావేశాలు, సీట్ల కేటాయింపులు, ఎన్నికల ప్రచారం వరకు టీడీపీ నేతలు తమను చిన్న చూపు చూస్తున్నారని జనసేనలు మండిపడుతున్నారు. జనసేన అంతర్గత వ్యవహారాల్లో దామచర్ల తలదూర్చి పార్టీ విచ్ఛిన్నం చేసే చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. టీడీపీ ఆఫీసులో తమ పార్టీ నేతలతో సమావేశం పెట్టడం ఏమిటని రగిలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఆది నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత జిల్లాలో నిర్వహించిన పలు సమన్వయ సమావేశాలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహార శైలిపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి సమావేశానికి దామచర్ల దాదాపు మూడు గంటల ఆలస్యంగా రావడమే కాకుండా తమ వారిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇక రెండో సమావేశంలో అయితే కూర్చునేందుకు సీట్లు కూడా లేకుండా చేశారని వాపోతున్నారు. తాజాగా గురువారం టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనేక సందర్భాల్లో తమ పార్టీ నేతలను అవమానించిన నేపథ్యంలో ఈ సమావేశానికి గ్లాస్ పార్టీకి చెందిన కీలక నేతలు, వారి అనుచర వర్గం డుమ్మా కొట్టింది. దామచర్ల తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జనసేన నేతలకు మింగుడు పడడంలేదు. ఇదిలా ఉంటే జనసేన సమావేశం టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం ఏమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. రెండు పార్టీల్లోనూ ఈ అంశం హాట్టాపిక్గా మారింది. వర్గ రాజకీయాలకు ఆజ్యం దామచర్ల తమ పార్టీలో రెండు వర్గాలను పెంచిపోషించాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమేమిటని నిలదీస్తున్నాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ను ప్రోత్సహిస్తూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణను చిన్న చూపు చూశారని, ఇటీవల ఆమైపె జరిగిన దాడిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సీట్ల కేటాయింపులో మొండిచేయి ఇక సీట్ల విషయంలో కూడా అన్యాయమే జరిగిందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి రెండు లేదా మూడు సీట్లను జనసేన నేతలు ఆశించారు. అయితే చివరకు ఒక్క సీటూ ఇవ్వకపోవడంపై కూడా గ్లాసు కేడర్ గుర్రుగా ఉన్నారు. ఐదేళ్లుగా పార్టీ అభ్యున్నతికి కష్టపడిన తమను మిత్రపక్షం నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే పార్టీలో ముఖ్య నేతలను తనకు అనుకూలంగా పెట్టుకుని మీ అందరికీ న్యాయం చేస్తానని దామచర్ల హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పార్టీ శ్రేణులు మాత్రం రగిలిపోతున్నారు. అయితే ఎన్నికల వేడి మొదలైన తర్వాత కూడా వారిని అసలు పట్టించుకోకపోవడంతో కీలక నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సమావేశానికి షేక్ రియాజ్, అరుణ వర్గాలు డుమ్మా కొట్టాయని సమాచారం. మొత్తం మీద టీడీపీ అధ్యక్షుడు దామచర్ల గ్లాసులో తుఫాన్ సృష్టించి ఆ పార్టీ పతనానికి బీజాలు వేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దామచర్ల తీరుతో మనస్తాపం... ఇచ్చిన మాటను నిలుపుకోవడం అలవాటు లేని దామచర్ల జనార్దన్ సహజంగానే రియాజ్ కు ఇచ్చిన మాటను కూడా మరిచిపోయారు. ఎన్నికల ప్రచారానికి రియాజ్ను, అతడి వర్గాన్ని వాడుకుంటున్నారు. జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల తరువాత పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు జనసేనలు. దీంతో ఆ పార్టీ నేతలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజుల కిందట నగరంలోని ఒక హోటల్లో దామచర్ల..రియాజ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మీరందరూ సహకరించండి ఎన్నికల తరువాత న్యాయం చేస్తానని జనార్దన్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం ఎటూ తేలకపోవడంతో రియాజ్ జనసేన సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మా కార్యకర్తలతో సమావేశమా... అంతేకాకుండా జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడాన్ని రియాజ్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని జనసేన కార్యాలయంలో నిర్వహిస్తేనే బాగుంటుందని ఆయన చెప్పినా దామచర్ల లెక్కచేయకపోవడంతో రియాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయని, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఉంచుకొని సొంతంగా కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేని దీనస్థితిలో ఉన్నట్లు ప్రజలు చెప్పుకుంటారని చెప్పినా వినకుండా కావాలనే టీడీపీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో రియాజ్ వర్గం ఈ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.