Janasena Party
-
Gurumoorthy: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసింది
-
వర్మకు ఎమ్మెల్సీ దక్కకుండా పవనే అడ్డుకున్నారనే టాక్
-
అంకెల గారడీ చేస్తే ప్రజల ఆదాయం పెరిగిపోతుందా?
-
జనసైనికుల సాక్షిగా బయటపడ్డ 2 లక్షల పుస్తకాల బాగోతం
-
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన గూండాల అరాచకం
-
Lakshmi: కిరణ్ రాయల్ నగదు చెల్లించే వరకు పోరాడతా
-
పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఓటుకు నోటు
-
ఈ సైకోల నుంచి రక్షణ లేదా?
విజయవాడలో అశేష జనవాహిని నడుమ వేదికా రెడ్డి అనే చిన్నారి... మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోన్ రెడ్డిని కలవాలని ఏడ్చింది. అది చూసిన ఆయన చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయత పంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అంతే... తెలుగుదేశం – జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల్లోని సైకోలు నిద్రలేచారు. బాలిక, ఆమె కుటుంబంపై దుష్ప్రచారానికి తెరతీశారు. ‘ఆమె కుటుంబ నేపథ్యం ఇదీ’ అంటూ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. తాము స్పాన్సర్ చేస్తున్న సోషల్ మీడియా యాప్స్లో మీమ్స్, రీల్స్ (Reels) పెట్టి వ్యక్తిత్వ హనానికి పూనుకున్నారు. వీళ్లకు ఇలా చేయడం కొత్తేమీ కాదు. పాదయాత్ర సమయంలో, వివిధ కార్యక్రమాల్లో జగన్ చిన్నారులను దగ్గరకు తీసుకున్నప్పుడు ఎంతో దారుణంగా ట్రోల్స్ చేశారు.టీడీపీ మొదటి నుంచి సోషల్ మీడియా (Social Media) ద్వారా జగన్పై తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి జనసేన తోడైంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీల సోషల్ మీడియా సభ్యులు రెచ్చిపోయి పోస్టులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బెండపూడి విద్యార్థులు అమెరికన్ శ్లాంగ్లో ఇంగ్లిష్లో మాట్లాడారు. దీనిపై టీడీపీ– జనసేన నేతలు, కార్యకర్తలు చేసిన ట్రోల్స్ అంతా ఇంతా కాదు. టీడీపీకి అనుకూలమైన టీవీ, సినిమా సెలబ్రిటీస్ కూడా ఆ జాబితాలోకి ఎక్కారు. అలాగే నాడు జగన్ ప్రభుత్వం చేసిన మంచిని ఓ మహిళ సంతోషంగా చెప్పింది. ఇది ఆ పార్టీల్లోని సైకోలకు నచ్చలేదు. వెంటనే ఆమెపై ట్రోల్స్ (Trolls) మొదలుపెట్టి చివరికి ఆత్మహత్యకు కారణమయ్యారు. అయినా వారిలో మార్పు అనేది రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇటువంటి వికృత చేష్టలు మరింత పెరిగాయి. తాజాగా విజయవాడలో జగన్ను కలి సిన చిన్నారిపై చేసిన ట్రోల్స్ ఇందుకు నిదర్శనం.ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. టీడీపీ, జనసేనల సోషల్ మీడియా కార్యకర్తలు అనేక విషయాల్లో చెత్త పోస్టులు పెడుతుంటారు. రాజకీయ ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేని ఆ పార్టీల అధిష్ఠానాలు సోషల్ మీడియాలో జగన్పై తప్పుడు ప్రచారం చేయడం కోసం... చాలామంది నిర్వహించే ఖాతాలను (పేజీలను), యూట్యూబ్ చానళ్లను స్పాన్సర్ చేస్తున్నాయి. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రెమ్లా జరుగుతుందనేది నిజం.డబ్బులు తీసుకుని తమ పేజీల్లో బెండపూడి విద్యార్థులు, గీతాంజలి అనే మహిళపై దారుణమైన మీమ్స్ చేసి పెట్టారు. నేడు ఓ చిన్నారిని ట్రోల్ చేస్తూ చైల్డ్ అబ్యూజ్కు పాల్పడుతున్నారు. వాస్త వానికి సోషల్ మీడియాలోని ఈ స్పాన్సర్డ్ పేజీలు పైకి వేరే ముసుగుల్లో కనిపిస్తాయి. సినిమా రిలీజ్లు, సమీక్షలు, నటుల ఫొటోలను పెడుతుంటాయి. నవ్వించే మీమ్స్ పోస్టు చేస్తుంటాయి. దీంతో ఫాలోయర్స్ సంఖ్య అధికంగానే ఉంటుంది. దీని వెనుక ఎత్తుగడ ఏంటంటే... మధ్య మధ్యలో వైఎస్సార్సీపీ, జగన్పై దారుణమైన పోస్టులు పెడుతూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయడమే! ఇప్పటికే అబద్ధపు రాతలతో ఎల్లో పత్రికలు కొన్ని తరాల మెదళ్లను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఇప్పుడు టీడీపీ మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పేజీల ద్వారా సమాజానికి హానికరమైన వ్యవస్థను నడుపుతోంది.చదవండి: మీరు చాలా మారాలి సార్!కూటమి ప్రభుత్వంలోని లోపాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇతర అంశాలను ట్రెండింగ్ లోకి తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ట్రోల్ చేయడమనే విష సంస్కృతికి వారు బీజం వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్ను కలిసిన చిన్నారిపై జుగుప్సాకర రీతిలో పోస్టులు పెట్టినవారిపై ఏ చర్యా తీసుకోకుండా మౌనం దాల్చారు. దీన్ని జనం ముమ్మాటికీ హర్షించరు. సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు చెబుతారు.– వెంకట్ -
Lakshmi : బెదిరింపులు ఎక్కువయ్యాయి
-
అవును నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది: Kiran Royal
-
పళ్ళు చూపించి ఫోటోలు దిగడం కాదు ...అభివృద్ధి అంటే..
-
సినిమాల్లో డబ్బులు చాలకే ఈ ప్రజారాజ్యం,జనసేన పార్టీలు : KA Paul
-
కిరణ్ నిజ స్వరూపం బయటపడటంతో ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
-
కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు
-
మార్గదర్శి స్కాం దేశంలోనే చాలా పెద్దది: మిథున్ రెడ్డి
-
మహిళలపై పవన్ కు ఉన్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నలు
-
జనసేన నేత చేతిలో మోసపోయిన బాధితురాలు లక్ష్మిపై కేసు, అరెస్ట్
-
పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మీటింగ్ కి డబ్బులు కావాలి.. కిరణ్ రాయల్ బాగోతం బట్టబయలు చేసిన లక్ష్మి
-
నేను అన్ని రిలీజ్ చేస్తే కిరణ్ రాయలు పుట్టగతులు ఉండవు
-
కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు
-
ఎవరీ కిరణ్ రాయల్?
ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు. ఆధునిక సమాజంలో ఆడవారికి ఆకాశంలో సగం అంటూ అగ్రపీఠం వేశారు. అయితే కొందరు మాత్రం మహిళలను ఆటబొమ్మలుగానే చూస్తున్నారు. వంటింటి కుందేళ్లుగానే భావిస్తున్నారు. మళ్లీ ఆటవిక యుగంలోకే నెట్టేస్తున్నారు. ఇదే కోవలో జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ వారి పార్టీ అధినేత గొంతు చించుకుంటూ ఉంటే.. అనుయాయుడు మాత్రం అతివల జీవితాలతో ఆడుకుంటున్నారు. ‘చిల్లర’ వేషాలు వేస్తూ సాఫీగా సాగుతున్న సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్న వనితలను కల్లబొల్లి కబుర్లతో లోబరుచుకుని రూ.కోట్లు కాజేస్తున్నారు. ప్రశ్నించిన వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టిన సదరు కిరణ్వారు.. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలతో స్వప్రకటిత నేతగా హల్చల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడని చెప్పుకుంటూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్రాయల్ నా జీవితం నాశనం చేశాడు. రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడు. నన్ను అప్పుల పాలు చేసేశాడు. అడిగితే మమల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు’’ అంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియో.. వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జనసేనలో సదరు కిరణ్రాయల్ కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆ పారీ్టకి తలనొప్పిగా మారాయి. దీనిపై పవన్కల్యాణ్ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. కిరణ్ రాయల్పై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటి వెలుగులోకి.. కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ రాసలీలలు ఒక్కోక్కటే వెలుగులోకి వస్తున్నాయి. నమ్మించి మోసం చేసిన కిరణ్ రాసలీలల భాగోతాన్ని బాధిత మహిళ బట్టబయలు చేసింది. మరో వివాహితతో సైతం కిరణ్ శారీకర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది. ఈ క్రమంలోనే జనసేన పారీ్టలోని ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పార్టీ పదవులను పావులుగా చూపి లోబరుచుకున్నట్లు నగరంలో సైతం చర్చ జరుగుతోంది. కామాంధుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితులతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనలా కిరణ్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకురావాలని, మహిళలను మోసగించే దుర్మార్గుడికి శిక్షపడేందుకు ఆధారాలు ఇవ్వాలని లక్ష్మి కోరుతున్నారు.మాయమాటలతో మహిళలకు వల!తనకున్న మాటకారితనం, హావభావాలతో మహిళలను ఆకట్టుకునేవాడు. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇతర మహిళలను వలలో వేసుకోవడం పరిపాటిగా మార్చుకున్నాడు. అందులో భాగంగా తన పక్కింటిలో ఉన్న లక్ష్మీరెడ్డి కుటుంబంతో చనువు పెంచుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమెను బుట్టలో వేసుకున్నాడు. చివరకు ఆ కుటుంబం విడిపోవడానికి కారకుడయ్యాడు. అతడి మోజులో పడిన ఆ మహిళ కుటుంబాన్ని వదలి కిరణ్ వెంట నడిచింది. రాజకీయంగా ఎదుగుతున్న తనకు ఆర్థిక అండ అవసరమని గుర్తించి ఆమెకున్న ఎకరం భూమిని అమ్మించి సొమ్ము చేసుకున్నాడు. పలు దఫాలుగా రూ.1.32కోట్ల నగదును చేయి బదులుగా తీసుకున్నట్లు ఆ మహిళ ఆధారాలను బయటపెట్టింది. దీంతో పాటు 300గ్రాముల బంగారు నగలను కాజేశాడని వెల్లడించింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతూనే మరో మహిళను ముగ్గులోకి దింపాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఇద్దరి మహిళల మధ్య చిచ్చురేగింది. దీనిపై నిలదీయడంతో లక్ష్మీని దూరం పెడుతూ వచ్చాడు. నిన్ను నమ్ముకుని సర్వస్వం నీకే ఇచ్చేశాను.. నీ కారణంగా నా కుటుంబం రోడ్డున పడింది. నా బిడ్డలు అనాథలయ్యారని లక్ష్మి వేడుకున్నా కఠిన మసస్తత్వం కరగలేదు. దీంతో ఆమె తనకు ఇవ్వాల్సిన నగదు బంగారం తిరిగి ఇవ్వాలని కిరణ్ను అడగడంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలోనే ఆ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించి, పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ చంపేస్తానంటూ బెదిరించాడు. ఆమెపై నేరుగా దాడి చేసినట్లు వాయిస్ రికార్డులో కిరణ్ ఒప్పుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నిన్ను చంపి బెయిల్పై తిరిగొస్తా.... నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తా... నీలాంటి వాళ్లను చాల మందిని చూశా... నా వెంట్రుక కూడా ఏవరూ పీకలేరు...నీవల్ల ఏమవుతుందో అది చేసుకో...అంటూ దారుణంగా మాట్లాడిన ఆడియో, వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మొత్తం వ్యవహారంపై బాధితురాలు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.సస్పెన్షన్కు రంగం సిద్ధం! సనాతన ధర్మ పరిరక్షణకు పాటుబడతానని, మహిళలకు రక్షణ కవచంలా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి జనసేన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ రాయల్ వికృత పోకడలపై వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహిళను చంపేస్తానంటూ బెదిరించిన కిరణ్ రాయల్ను పార్టీ నుంచి నేడో, రేపో సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆధారాలు వెలుగు చూసినా పార్టీ అధిష్టానం రెండు రోజులుగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు సైతం కిరణ్రాయల్ అక్రమాలపై కచ్చితమైన ఆధారాలతో పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్కు స్పష్టం చేశారు.ఎవరీ కిరణ్? కిరణ్ రాయల్ జీవితం అంతా వివాదాస్పదంగానే ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చిన కిరణ్ తన బతుకును గ్రూప్ థియేటర్స్ నుంచి ప్రారంభించాడు. చిరంజీవి సినిమాలకు బ్లాక్లో టెకెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైల్వేస్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిళ్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు అతను కిరణ్గానే అందరికీ పరిచయం. కిళ్లీ కొట్టులో మాదకద్రవ్యాలను సైతం విక్రయించే ఈ స్థాయికి ఎదిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్గా చిన్నపాటి కార్యక్రమాలు చేపడుతూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. మెగా ఫ్యాన్కు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవిలోనూ కొనసాగాడు. ఈ క్రమంలో తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. తదనంతరం కిరణ్ ‘‘రాయల్’’గా అవతరించాడు. ఇంతలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆయనకు రాజకీయ ప్రాధాన్యం లభించింది. ఆపై పవన్కల్యాణ్కు దగ్గరవుతూ జనసేనలోనూ కొనసాగాడు. తిరుపతిలో ఆ పారీ్టలో చేరేందుకు ముఖ్యనేతలెవ్వరూ మొగ్గు చూపకపోవడంతో కిరణ్ రాయలే పెద్ద దిక్కుగా మారాడు.దర్శన టికెట్లలో అవినీతి తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందిన రోజులల్లో కిరణ్ అక్రమాల భాగోతం తిరుమలకు పాకింది. తన అభిమాని కావడం, పార్టీ వ్యవహారాలు చూస్తుండడంతో శ్రీవారి దర్శన సిఫార్సు లేఖల వ్యవహారం మొత్తం కిరణ్కు అప్పగించారు. ఈ క్రమంలోనే సిఫార్సు లేఖలను కిరణ్రాయల్ అక్రమంగా రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం చిరంజీవి చెవిన పడడంతో ఆయన పలు మార్లు కిరణ్ని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలం పాటు కిరణ్ను పక్కన పెట్టారు. నాగబాబు ద్వారా మంతనాలు నడిపి మళ్లీ మెగా కుటుంబం పంచన చేరాడు. తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారంలో ఆయనపై పలు కేసులు నమోదవడం గమనార్హం. ‘గో బ్యాక్ ఆరణి అంటూ’.. జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పేరును ఖరారు చేయడంతో కిరణ్ రాయల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు ఆరణితో సఖ్యతగా ఉన్నా తనకు లొంగలేదన్న అక్కసుతో తిరుపతి నగరం అంతా ‘గోబ్యాక్ ఆరణి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు. ఎన్నికల సమయంలో ఈ ఫ్లెక్సీల అంశం రాజకీయంగా కుదిపేసింది. జనసేనలోనే ఉంటూ ఆ పారీ్టకి నష్టం చేకూర్చేలా వ్యవహరించడం ముఖ్యనేతలకు నచ్చలేదు. మెగా ఫ్యాన్ అసోసియేషన్ నేత కావడంతో మందలించి వదిలేశారు. ఎన్నికలలో ఆరణికి వ్యతిరేకంగా పనిచేశాడని ఆధారాలతో సహా పవన్కల్యాణ్కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఎమ్మెల్యేతో ఉప్పు నిప్పుగా ఉంటూ వచ్చాడు. మళ్లీ కొద్దిరోజులుగా ఎమ్మెల్యే ఇంటి వైపునకు వెళ్లివస్తున్నాడు. ఇంతలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం ఆ పారీ్టలో సంచలనంగా మారింది. అలాగే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులను టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డాడు. అసభ్యంగా దూషిస్తూ తీవ్రమైన విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ ఈఓ, కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ను సైతం బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
అయిపాయే.. చేతులెత్తేసిన చంద్రబాబు! (ఫొటోలు)
-
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో మరోసారి కలకలం
-
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఫ్యూచర్ సీఎం లోకేశే: భరత్
-
పిఠాపురం పవన్ కల్యాణ్ సభలో వీర మహిళ లక్ష్మీకి తీవ్ర అవమానం
-
జనసేన రేవ్ పార్టీ వీడియో కలకలం
-
పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు చేదు అనుభవం
-
ప్రజల వ్యక్తిగత సమాచారం జనసేన చేతికి ఎలా వెళ్లింది?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా ఉల్లంఘన జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేసింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ డేటాను అడ్డంపెట్టుకొని సామాన్య పౌరులను జనసేన కార్యకర్తలు వేధిస్తున్నారని ఆరోపించింది. ఇది పాలనా పతనాన్ని బట్టబయలు చేస్తోందని పేర్కొంది. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో రాజకీయ గూండాయిజం రాజ్యమేలుతోందని, ఫలితంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న జనసేన పార్టీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రజల సున్నితమైన డేటా నిమిషాల్లోనే జనసేన కార్యకర్తలకు ఎలా చేరుతోందని ప్రశ్నించింది. పోలీసులు, కూటమి కార్యకర్తలు కుమ్మక్కై పని చేస్తున్నారా లేక పోలీసులే తమ వద్ద ఉండాల్సిన పరికరాలను వారి చేతికే ఇచ్చేసి వాడుకోమని చెప్పారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. డేటా ఉల్లంఘన విషయంలో పరిశోధించడానికి పోలీసులను జవాబుదారీగా ఉంచడానికి, బెదిరింపులను అరికట్టడానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. -
ప్రభుత్వం దగ్గరే ఉండాల్సిన రహస్య సమాచారం జనసేన సోషల్ మీడియాలో...
-
వేలం పాట వేసి బెల్ట్ షాపులు నడుపుతున్న ఎమ్మెల్యే అనుచరులు
-
జనసేన నేత లైంగిక వేధింపులు..
-
కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పలువురిపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలవారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఫిర్యాదుల పరంపర గురువారం కూడా కొనసాగింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్పై పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవుగా పోలీసులు కేసులు నమోదుచేసి చర్యలు చేపడుతున్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెండుచోట్ల కేసు నమోదు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నటి శ్రీరెడ్డిపై రెండు పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసిన ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సజ్జల భార్గవ్రెడ్డి, మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నటుడు పోసానిపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడులను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. టీటీడీ, టీవీ–5లపై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొన్ని ఫిర్యాదుల్లో పార్టీల నేతలు, విలేకరులు ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, అనకాపల్లి జిల్లా మునగపాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల జిల్లా డోన్, బనగానపల్లె, బాపట్ల జిల్లా చీరాల, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్లలో పోసానిపై ఫిర్యాదు చేశారు. పోసానిపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్టౌన్, కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. నటి శ్రీరెడ్డిపై.. సినీనటి శ్రీరెడ్డిపై విశాఖపట్నం టూ టౌన్, విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అర్బన్ పోలీస్స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇద్దరికి రిమాండ్ తిరుపతి సబ్జైలులో రిమాండ్లో ఉన్న ప్రకాశం జిల్లా సీఎస్ పురం తనికెళ్లపల్లె గ్రామానికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసులు బుధవారం పీటీ వారెంట్తో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని గురువారం రాజమహేంద్రవరంలోని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్కు తరలించారు. గుంటూరులో బుధవారం అరెస్టు చేసిన పి.రాజశేఖర్రెడ్డిని గురువారం ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి రిమాండ్ విధించడంలో అతడిని జైలుకు తరలించారు. ఇద్దరి అరెస్టు కాకినాడ జిల్లా తొండంగి మండల ఉపాధ్యక్షుడు నాగం గంగబాబు, సోషల్ మీడియా కన్వీనర్ అడపా సురేష్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.సజ్జల భార్గవ్, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసుజనసేన నేత ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో సోషల్మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత డిసెంబర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, లోకేశ్, జనసేన అధినేత పవన్కళ్యాణ్లపై అనుచిత పోస్టులు పెట్టారని, ఈ విషయమై అడిగితే తనను కులం పేరుతో దూషించారని సిద్ధవటానికి చెందిన జనసేన నాయకుడు వాకమల్ల వెంకటాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్రెడ్డి, సిరిగిరి అర్జున్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి పులివెందులకు బదిలీ చేసినట్లు సిద్ధవటం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
పవన్ కళ్యాణ్ ఇది చూడు నా కూతుర్లను ఎలా తిట్టారో
-
..అలా అయితే మీరు చాలా శాఖలు తీసుకోవాల్సి వస్తుంది సార్!
-
జనసేన ఎమ్మెల్యే ఎక్కడ?
సాక్షి టాస్క్ఫోర్స్: ఎమ్మెల్యే ఎక్కడ? అని మంత్రి నాదేండ్ల జనసేనులను ఆరా తీశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన ఏకై క ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న పౌరసరఫరాల మంత్రి, పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ రెండు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారు. సూపర్ సిక్స్ పథకాల్లోని దీపం–2 పథకం కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రమైన తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హాజరు కావాల్సిఉంది. అయినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాలేదు. అలాగే మంత్రి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనూ స్థానిక ఎమ్మెల్యే లేరు. మంత్రి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో నాదేండ్ల మనోహర్ జనసేన జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. జిల్లా నాయకులంతా హాజరైనా ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాకపోవడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరా తీశారు. -
కాకినాడలో రోడ్డెక్కిన టీడీపీ - జనసేన విభేదాలు
-
అమ్మాయిలపై లైంగిక వేధింపుల్లో బిజీబిజీగా కూటమి ఎమ్మెల్యేలు
-
జనసేన ఆఫీస్ దగ్గరే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరీక్షణ
-
పరిపాలనకు ‘తిరు’క్షవరం
వారెవ్వా! ఎంతటి వంచనాశిల్ప చాతుర్యము. శకుని మామ అనేవాడు బతికే ఉంటే ఈ చతురత ముందు మోకరిల్లి పొర్లు దండాలు పెట్టి ఉండేవాడే! జగన్మోహన్రెడ్డి తిరుమల దర్శనా నికి వెళ్తే పెద్ద ఎత్తున అల్లరి జరగాలి. ఆయన మీద రాళ్లు రువ్వాలి. దాడులకు తెగబడాలి. అందుకు ఏర్పాట్లు కూడా జరి గాయి. వేలాదిమందిని సమీకరించి పెట్టుకున్నారు. వైసీపీ వాళ్లను గృహనిర్బంధం చేశారు. జగన్ యాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ ఆ పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా జగన్మోహన్రెడ్డి వెళ్లి ఉంటే విధ్వంసానికి రంగం సిద్ధం. అందుకు నెపాన్ని కూడా ఆయన పైనే∙వేయడా నికి స్క్రిప్టు రెడీ.పరిస్థితిని గమనించి జగన్మోహన్రెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ వెళ్లలేదనే ప్రచారం ప్రారంభం. ఈ ప్రచారానికి సాక్షాత్తూ ముఖ్య మంత్రే నాయకత్వం వహించారు. ఆయన ప్రెస్మీట్ నుంచి సందేశాన్ని అందుకున్న కూటమి నాయకులు పొట్టోడు, పొడు గోడు అనే తేడా లేకుండా డిక్లరేషన్ దండకాన్ని అందుకున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే జరిగింది.తన వంద రోజుల పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఓ అభూతకల్పన సృష్టించారు. నిజా నిజాలు నిలకడ మీద తేటతెల్లమవుతున్నాయి. దేవస్థానం మార్కెటింగ్ విభాగం వారి నాణ్యతా పరీక్షలను దాటుకొని ప్రసాదం తయారీ చెంతకు కల్తీ నెయ్యి వెళ్లే పరిస్థితే అక్కడున్న వ్యవస్థలో ఉండదు. అందువల్లనే కొన్ని డజన్ల పర్యాయాలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు వెనక్కు మళ్లాయి. అట్లా వెనక్కు పంపిన ట్యాంకర్లలోని ఒక శాంపుల్నే గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పంపించింది. మైసూర్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ల్యాబ్కు పంపించే సంప్ర దాయానికి భిన్నంగా ఈసారి గుజరాత్కు పంపించారు.పంపించడానికి ఒకరోజు ముందు ఎన్డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్లతో టీటీడీ ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ భారత రాష్ట్ర పతి, ప్రధాని, చీఫ్ జస్టిస్లకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి గవర్నింగ్ బాడీ సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ లేఖలు రాశారు.మైసూర్ ల్యాబ్కు కూడా ఇదే కంటైనర్లోని శాంపుల్ను పంపించినట్టు విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిందా? లేదా? వస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నది ఓ అంతుచిక్కని రహస్యం. వేణుగోపాల్ లేఖ మీద విచారణ జరిగితే చాలా అంశాలు బయటకు రావచ్చు.కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దేశీయ గోసంపద వృద్ధి లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. కానీ ఎన్డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్లు ఆ కార్యక్రమాలకు తూట్లు పొడుస్తూ సంకర జాతి జెర్సీ ఆవులను ప్రోత్సహించారని కూడా వేణుగోపాల్ ఆరోపించారు.తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వారు సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి ఈ వివాదమంతా జరుగుతున్నది. వారు ఆన్లైన్ టెండర్లో పాల్గొని కేజీ నెయ్యికి 319 రూపాయలు కోట్చేసి ఎల్–వన్గా వచ్చినందువల్ల ఆనవాయితీ ప్రకారం 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆ డెయిరీకి అప్పగించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన జూన్ నెలలోనే వారు నెయ్యి సరఫరాను ప్రారంభించారు. ఈ నెయ్యి ధర మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంత తక్కువ ధరకు మంచి నెయ్యిని ఎట్లా సరఫరా చేస్తారన్నది ఆయన ప్రశ్న.డెయిరీ నిర్వాహకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆవు పాల సేకరణ ధర 35 రూపాయల లోపే వుంటే రూ.300లకు కిలో చొప్పున నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయడం అసాధ్య మేమీ కాదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆవు పాల సేకరణ ధర అంతకంటే తక్కువే ఉన్నది. కనుక ఏఆర్ డెయిరీ కోట్ చేసిన ధర అభ్యంతరకరమైనదేమీ కాదని డెయిరీ నిర్వాహకుల అభిప్రాయం. ఏఆర్ డెయిరీని ఆపేసిన తర్వాత పిలిచిన టెండ ర్లలో యూపీకి చెందిన ఆల్ఫా ఫుడ్స్ అనే డెయిరీ ఎల్–వన్గా నిలిచింది. వాళ్లు రూ. 475 కోట్ చేశారు. పద్ధతి ప్రకారం ఎల్–వన్గా ఉన్న ఆల్ఫా ఫుడ్స్ 65 శాతం సరఫరా కాంట్రా క్టును, ఎల్–టూగా ఉన్న నందినీ డెయిరీ వారు 35 శాతం సర ఫరా కాంట్రాక్టును దక్కించుకున్నారు.నందినీ డెయిరీ లోగోలోనే సంకర జాతి జెర్సీ ఆవు బొమ్మ ఉంటుందనీ, వాళ్లు సరఫరా చేసేది దేశీ ఆవు నెయ్యి కాదని స్వదేశీ గో ఉద్యమకారులు అభ్యంతరాలు చెబు తున్నారు. ఇది మరో చర్చనీయాంశం. ఇక ఎల్–వన్గా వున్న ఆల్ఫా ఫుడ్స్ డెయిరీ ప్లాంట్కు తిరుపతి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంత దూరాభారాన్ని మోస్తూ అక్కడినుంచి వాళ్లే సరఫరా చేస్తారా లేక అదే పేరుతో స్థానిక డెయిరీలు ఏవైనా ఆ పని చేస్తాయా, అనే చర్చ కూడా జరుగు తున్నది. ఆల్ఫా డెయిరీ అనేది అన్లిస్టెడ్ కంపెనీయే కనుక అదేమీ అసాధ్యమైన వ్యవహారం కాదు. ఇక్కడింకో విచిత్రమైన విషయం ఏమిటంటే నెయ్యి నాణ్యత మీద చంద్రబాబు ఆరోప ణలు చేసిన రోజున అంటే సెప్టెంబర్ 19న ఆయన కుటుంబ యాజమాన్యంలోని హెరిటేజ్ డెయిరీ షేర్ విలువ రూ. 565. సరిగ్గా వారం రోజుల్లో సెప్టెంబర్ 27 నాటికి అది రూ.635 దాటింది. మొత్తంగా చూస్తే వారం రోజుల్లో హెరిటేజ్ సంపద 600 కోట్లు పెరిగింది. ఇది యాదృచ్ఛికమేనా?ఇక డిక్లరేషన్ విషయానికొద్దాం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆధారాలు సుమారు 15 వందల ఏళ్ల క్రితం వరకూ చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. తిరు మలలో అన్యమతస్థులకు ప్రవేశం లేదనిగానీ, వారు డిక్లరేషన్ ఇస్తే తప్ప ప్రవేశించడానికి వీల్లేదని గానీ ఎన్నడూ లేదు. ఈ డిక్లరేషన్ వ్యవహారం 1987లోనే ప్రారంభమైంది. అన్యమత స్థులు శ్రీ వేంకటేశ్వరునిపై భక్తి విశ్వాసాలున్నాయని ప్రకటిస్తూ ఒక ఫామ్పై సంతకం చేసి వెళ్లవచ్చునని నిబంధనను తీసు కొచ్చారు. ఇదో అర్థం లేని నిబంధన. ఎవరైనా దేవుడిని ఎందుకు దర్శించుకుంటారు? ఆ దేవునిపై భక్తి విశ్వాసాలు ఉంటేనే కదా!తిరుమలేశుని దర్శనానికి రోజుకు సుమారు ఐదొందల నుంచి వెయ్యిమంది వరకు అన్యమతస్థులు వస్తుంటారని అంచనా. వారంతా అత్యంత భక్తి విశ్వాసాలతో తిరుమల దేవ స్థానం నిర్ణయించిన సంప్రదాయ డ్రెస్ కోడ్ను పాటిస్తూ దర్శనం చేసుకుంటారు. అంతే తప్ప రోజుకు ఒక్క డిక్లరేషన్ కూడా రాదు. డ్రెస్ కోడ్ను పాటించినంతవరకు దేవస్థానం సిబ్బంది కూడా ఎవరినీ డిక్లరేషన్ అడగదు.గత రెండు రోజులుగా బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి చేస్తున్న హడావిడి విచిత్రంగా ఉన్నది. స్వామివారి వెండి వాకిలి చెంతనున్న బీబీ నాంచారమ్మ మూర్తిని కూడా రోజుకోసారి డిక్లరేషన్ ఇవ్వాలని ఈ సరికొత్త హిందూ భక్తులు డిమాండ్ చేస్తారేమోనన్న అనుమానం కూడా వస్తు్తన్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రి. ఆ హోదాలో ఐదేళ్ల పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కూడా ఆరేడుసార్లు స్వామి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా దర్శించుకున్నారు. ఆయన చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించడానికి ముందూ, ముగించిన తర్వాత కూడా కాలినడకన వెళ్లి వేంకటనాథుని దర్శనం చేసుకున్నారు.ఇంతకంటే విశ్వాస ప్రకటన ఇంకేముంటుంది? కాగితం మీద రాసి సంతకం పెట్టి తీరాలనడం వితండవాదం కాక మరేమిటి? ఈ దేశంలో మరే ఆలయంలోనైనా, మసీదులోనైనా, చర్చిలోనైనా, గురుద్వారాలోనైనా ఇటువంటి పట్టింపులు న్నాయా? మతం పేరుతో చేసే ఈ రకమైన పిడివాదనలను నూటా ముప్పయ్యేళ్ల కిందనే స్వామి వివేకానందుడు ఈసడించుకున్నారు. మతం అనేది పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో, సంస్థలు పెట్టుకొనే నిబంధనల్లో ఉండదు. అది ఆత్మకూ పరమాత్మకూ మధ్యన ఉండే సంబంధమని లండన్ (1895)లో వివేకానందుడు ప్రకటించారు. షికాగోలో జరిగిన విశ్వవ్యాప్త సర్వమత సమ్మేళనంలో హైందవ విశిష్టతను విజయ పతాకంగా ఎగరేసి ప్రశంసలందుకున్న వివేకానందుని కంటే గొప్ప హిందువులా ఈ నడమంత్రపు నామాలవారు?సహనం హిందూమతపు సహజ భూషణమని ఆయన ప్రకటించారు. సర్వమత సహనాన్ని పాటిస్తాం. అన్ని మతాలు సత్యమైనవనే నమ్ముతాం. ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ సము ద్రంలో చేరినట్టే, అన్ని రకాల ఆరాధనా మార్గాలూ ఆ సర్వే శ్వరుడినే చేరుతాయి. ఇది హిందూమత సారమని వివేకానందుడు ప్రకటించారు. ఏది ఆ స్ఫూర్తి? అటువంటి సహనం నిన్న మొన్నటి వీరాలాపాల్లో కనిపించలేదే? కాషాయ వస్త్రాలు ధరించినవారు కూడా కళ్లెర్రజేసి పళ్లు కొరకడం సమంజసమేనా? హైందవాన్ని అర్థం చేసుకున్నవారేనా వీరు? లేక రాజకీయం కోసం, పబ్బం గడుపుకోవడం కోసం మతం రంగు పులుము కున్న పౌండ్రక వాసుదేవులా?బీజేపీ సంగతి జగమెరిగిన సత్యమే. ఆ పార్టీ మనుగడకు హిందూమత భావోద్వేగాలే ఆలంబన. ఆర్థిక వృద్ధి, పారిశ్రా మికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి కబుర్లన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దాని పలుకుబడికి ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకోసం కొత్త స్థావరాలు కావాలి. హిందూ ఎజెండా ఎత్తడానికి అవకాశం దొరికితే అది ఊరుకుంటుందా? ఆంధ్రలో వారి భాగస్వామి చంద్రబాబు ఆ ఎజెండా వారి మెడలో వేశారు. తిరుమలలో జగన్మోహన్రెడ్డిని అడ్డుకుంటామంటూ తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీ అను యాయులు తరలివెళ్లారు.కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఈమధ్య కాషాయ పార్టీ కంటే ఘాటుగా హిందూ భావజాలాన్ని ప్రకటి స్తున్నారు. ఈ సందర్భాన్ని కూడా ఆయన బాగానే ఉపయోగించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కిందకు ఆలయాల పరిపాలనను తీసుకురావాలనే డిమాండ్ కూడా చేశారు. ఇది ఎప్పట్నుంచో ఆరెస్సెస్ పరివారం చేస్తున్న డిమాండే! ఆలయాల నియంత్రణ మొత్తం కేంద్రం కనుసన్నల్లోకి రావాలనేది వారి సంకల్పం. జమిలి ఎన్నికల ఉద్దేశం కూడా అదే! రాష్ట్రాల స్థాయిని తగ్గించి కేంద్రీకృత అధికారాన్ని పాదుకొల్పడం వారి ఎజెండా. అందుకోసం ఈ దేశంలోని బహుళత్వాన్నీ, భిన్నసంప్రదాయాలనూ కొనసాగించడానికి, గౌరవించడానికి వారు ఇష్టపడరు.ఇక చంద్రబాబు ప్రస్తుతం ఏడుకొండలవాడే దిక్కనే పరి స్థితుల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క అడుగూ ముందుకుపడలేదు. వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేని ఏకైక రాష్ట్ర పాలకుడుగా ఇప్పటికే అపఖ్యాతి పాల య్యారు. వరదల నియంత్రణ కోసం పాటించవలసిన కనీస పాలనా పద్ధతులను కూడా పాటించలేక విజయవాడ మునకకు కారణమయ్యారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలను అటకెక్కించారు. గ్రామ స్వరా జ్యానికి తూట్లు పొడిచారు. నాలుగు నెలలు నిండకముందే జనంలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూపై ఒక కల్పిత కథను సృష్టించారు. దాని చుట్టూనే రాజకీయాలు తిప్పి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంచుకున్న మార్గం చాలా ప్రమాద కరమైనది. భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
'పేర్ని నాని ఇంటి వద్ద' జన సైకోలు ఓవరాక్షన్
-
‘పంతం’ నెగ్గింది.. నిందితుల వైపే కూటమి సర్కారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడలో దళిత వైద్యుడిపై దాడి ఘటనలో కూటమి పెద్దలు పంతం నెగ్గించుకున్నారు. దళిత సమాజాన్ని చిన్నబుచ్చి నోరెత్తకుండా కట్టడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజీ దళిత ప్రొఫెసర్ వివాదాన్ని కంచికి చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ రంగరాయ కళాశాల ప్రొఫెసర్, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలిచింది. ఈ ఘటనపై నాలుగు రోజుల్లో నాలుగు మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బూతు పురాణం విప్పి దాడి చేయడం, అనుచరుల దౌర్జన్యం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. దళిత వైద్యుడిపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును అన్నివర్గాలూ ముక్తకంఠంతో ఖండించాయి. ఆదినుంచీ అదే ప్రయత్నం వివిధ వర్గాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో కూటమి పెద్దలు తెరవెనుక చక్రం తిప్పి కేసును రాజీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఘటన జరిగిన రోజున కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంతపాటిల్ నేరుగా రంగంలోకి దిగారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వారు చొరవ తీసుకున్నారని అంతా భావించారు. కానీ.. ఈ వ్యవహారంలో దగ్గరుండి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ నరసింహం ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై ఇచ్చిన ఫిర్యాదును ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లతో జిల్లా పోలీస్ యంత్రాంగం తొక్కిపెట్టడం విమర్శల పాలైంది. ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వైద్యుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీస్ యంత్రాంగం మొదటినుంచీ చేస్తున్న ప్రయత్నంగానే కనిపించింది. ప్రాయశ్చిత దీక్ష చేస్తే సరిపోతుందా? అధికారం ఉంది కదా అని అన్యాయంగా ఒక దళిత వైద్యుడిని బూతు పురాణంతో దారుణంగా అవమానించి చంపేస్తానంటూ దాడికి దిగిన ఎమ్మెల్యే నానాజీ నాటకీయంగా క్షమాపణలు చెప్పి.. ప్రాయశ్చితమంటూ దీక్ష చేస్తే సరిపోతుందా అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఘటనకు బాధ్యుడైన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడైన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడాన్ని వైద్యవర్గాలు ఆక్షేపిస్తున్నాయి. చివరకు కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో పోలీస్ యంత్రాంగం కేసు తీవ్రతను తగ్గించి ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులకు కొమ్ముకాసిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. బెయిల్బుల్ సెక్షన్లతో సరి చివరకు ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై కూటమి ప్రభుత్వం బెయిల్బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి తీవ్రతను తగ్గించేసింది. సెక్షన్ 292 బీఎన్ఎస్ (భారత న్యాయసంహిత) పబ్లిక్ న్యూసెన్స్ (రూ.200 జరిమానా), 115(2) బీఎన్ఎస్ స్వల్ప గాయాలు, చేతులతో కొట్టడం (ఏడాది జైలు, రూ.1,000 జరిమానా) 351 బీఎన్ఎస్ వ్యక్తి పరువు తీయడం, శారీరకంగా, మానసికంగా బెదిరించడం (126(2) రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ ప్రకారం నెల జైలు, రూ.500 జరిమానా) వంటి సెక్షన్లతో సరిపెట్టారు. ఎమ్మెల్యే నానాజీ మరో 10 మందిపై నమోదు చేసిన ఈ సెక్షన్లన్నీ బెయిల్కు అవకాశం ఉన్నవే కావడం గమనార్హం. దళితుడైన వైద్యుడిని తీవ్రంగా అవమానించి.. చంపేస్తానని బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసినా ప్రభుత్వ ఒత్తిడితో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా బెయిల్కు అవకాశం ఉన్న సెక్షన్లతో కేసును నీరుగార్చేశారు. -
విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు తర్వాత నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ‘ఎక్స్’లో చేసిన రెండు పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తినీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’అన్న బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్ను ఆయన రాసుకొచ్చారు. అలాగే ‘మీరు విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు.ప్రతి కథకు మూడు పార్శా్వలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం’అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్ను కూడా పోస్టు చేశారు. జానీ మాస్టర్ గురించి ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించకపోయినా పరోక్షంగా మద్దతు పలికారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పారీ్టలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించడం వల్లే నాగబాబు ఇలా స్పందించారని అంటున్నారు. జానీ మాస్టర్.. తప్పు చేస్తే అంగీకరించండి: మంచు మనోజ్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్టు నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ స్పందించారు. ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. ‘జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు నా అభినందనలు.ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి..’అని మనోజ్ పేర్కొన్నారు. ‘ఇచి్చన మాట ప్రకారం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. పరిశ్రమలోని మహిళలకు గొంతుగా నిలపండి. మీరు ఒంటరిగా లేరని, మీ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం..’అంటూ మనోజ్ పోస్టు చేశారు. -
బయటకొస్తున్న జానీ అరాచకాలు.. భయపడుతున్న కొరియోగ్రాఫర్స్!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.తాజాగా కొరియోగ్రాఫర్ జానీకి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న జానీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జానీ మరింత రెచ్చిపోయారు. తన తోటి కొరియోగ్రాఫర్లను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’)సభ్యత్వం ఇవ్వకుండా వేధింపులు..జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జానీ మాస్టర్ దారుణాలకు అడ్డులేకుండా పోయింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేశారు. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్ జంకుతున్నారు.గాలిస్తున్న పోలీసులు..యువతి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను జమ్మూకశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అతని కోసం లడఖ్ బయలుదేరి వెళ్లారు. త్వరలోనే జానీమాస్టర్ అరెస్ట్ అయ్యే అవకాశముంది. -
జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు
మణికొండ: సినిమాల్లో నృత్య దర్శకునిగా పనిచేస్తూ పాపులర్ అయిన జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అతని సహాయకురాలు (21) పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్డోర్ షూటింగ్లలో పాల్గొన్నప్పుడు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలుమార్లు వేధింపులకు గురి చేశాడని వివిధ ఆధారాలతో ఆమె ఆదివారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మతం మార్చుకుని అతడిని వివాహం చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాధితురాలు ఉండేది నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో కావటంతో రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 1371/2024 ప్రకారం సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపులు), 323(2) గాయపర్చడం వంటి సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు.ఇదిలా ఉండగా జానీ మాస్టర్కు గతంలోను నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోచేరి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కేసు తమ స్టేషన్కు వచ్చిందని, విచారణ చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి తెలిపారు. మరో పక్క సఖీ బృందం బాధితురాలి వద్ద రహస్య ప్రదేశంలో వివరాలు సేకరించింది. బాధితుల గోప్యతను కాపాడాలి‘ఓ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత వ్యక్తుల తాలూకు ముసుగు లేని ఫొటోలను, వీడియోలను ఉపయోగించవద్దని, ఒకవేళ ఇప్పటికే ఉపయోగించినట్లయితే వెంటనే తీసివేయాలని కోరుతున్నాం’ అని తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఓ నోట్ని విడుదల చేసింది. బాధిత పార్టీల గోప్యతను కాపాడాలని అన్ని ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్థిస్తున్నాం.. అంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి తరఫున గౌరవ కార్యదర్శి కె.ఎల్.దామోదర్ప్రసాద్ ఆ నోట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ ‘వ్యవహారం’లో స్పందించిన జనసేనపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశంసాక్షి, అమరావతి: మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై హైదరాబాద్లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై ఆ పార్టీ స్పందించింది. ఈ మేరకు జనసేన కార్యాలయం పార్టీ ప్రతినిధి వేములపాటి అజయ్కుమార్ పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ (జానీ మాస్టర్)ని ఆదేశించడమైనది. ఆయనపై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది..’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
లైంగిక ఆరోపణలు.. జానీ మాస్టర్పై నామమాత్రపు చర్యలు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ.. జానీ మాస్టర్ వద్ద కొన్నాళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళా డ్యానర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగి పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. ప్రస్తుతం యువతి ఆరోపణలపై నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు.కాగా పవన్ కల్యాణ్ అభిమాని అయిన జానీ మాస్టర్.. గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీ జానీ మాస్టర్ను స్టార్ క్యాంపెయినర్గా కూడా నియమించింది. ఈ క్రమంలో ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో.. జనసేన పార్టీ కేవలం నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాత్రమే జనసేన ఆదేశించింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే జానీ మాస్టర్పై కేసు నమోదైనా కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండాలని చెప్పడం గమనార్హం.అయితే జానీ మాస్టర్పై నమోదైన ఎఫ్ఐఆర్లో మహిళా కొరియోగ్రాఫర్ కీలక విషయాలు వెల్లడించింది. 2017లో డీషోలో జానీ మాస్టర్ తో పరిచయం అయిందని, ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరినట్లు తెలిపింది.చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లిన సమయంలోఅక్కడ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. షూటింగ్కు సంబంధించిన వాహనంలోనూ పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు తెలిపింది.పలుమార్లు షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేశారని పేర్కొంది. గత నెల 28న అనుమానాస్పద పార్శిల్ తన ఇంటి ముందు ఉందని.. దానిపై ‘ఇదే నీ చివరి షూటింగ్’ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని.. జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. -
లంకలను ముంచిన మట్టి తవ్వకాలు
కృష్ణా నది గట్టుకు గండి పడి గ్రామాలను ముంచెత్తిన వరద ముంపులో బాపట్ల జిల్లాలోని 27 లంక గ్రామాలు వేలాది ఎకరాల వాణిజ్య పంటల మునక జనజీవనం అతలాకుతలం భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కరకట్టపైకి నీరు ఏ క్షణమైనా కరకట్టకు గండిపడే ప్రమాదం ఇదే జరిగితే జలదిగ్బంధంలో చిక్కుకోనున్న రేపల్లె సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి నేతల అక్రమార్జన బాపట్ల జిల్లాలో 27 లంక గ్రామాల ప్రజలకు తీరని కష్టాలు తెచి్చపెట్టింది. తమ జేబులు నింపుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీ నేతలు యథేచ్ఛగా కృష్ణానది సమీపంలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు చేపట్టడం కొంపముంచింది. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక అరవింద వారధి సమీపంలో కూటమి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాల వల్ల కృష్ణానది గట్టు వరదకు ముందే బలహీనపడింది. గత రెండు రోజులుగా వరద పెరిగి సోమవారం సాయంత్రానికి దాదాపు 12 లక్షల క్యూసెక్కులకు చేరడంతో అరవింద వారధి సమీపంలో కృష్ణానదికి గండి పడింది. దీంతో కొల్లూరు మండలంలోని పెసర్లంక, చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం తదితర 22 గ్రామాలతోపాటు భట్టిప్రోలు మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, పల్లెపాలెం, రేపల్లె మండలంలోని పెనుమూడి పల్లెపాలెం కలిపి మొత్తం 27 గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ గ్రామాల్లో 60 శాతం ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. మరో 30 శాతం ఇళ్లల్లోకి నీరు చేరింది. ఈ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు డాబాలపైకి ఎక్కారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 40 శాతం మందికి కూడా చేరని ఆహారం.. లంక గ్రామాలను ముంచెత్తిన వరదనీరు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బోట్ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం పంపుతున్న తాగునీరు, ఆహారం పట్టుమని 40 శాతం మందికి కూడా అందలేదు. డాబాలపైన వంట చేసుకుందామన్నా మంచినీరు అందుబాటులో లేదు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సరిపడా బోట్లు లేక అధికారులు మిన్నకుండి పోయారు. ఉన్నవారిని కూడా బయటకు తీసుకురాలేని దుస్థితి నెలకొంది. ఇక చాలా పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఒక్క చిలుమూరు లంక నుంచి మాత్రమే కొద్దిమంది గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు. వరద ప్రాంతాలకు స్థానిక పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడిలు కొల్లూరులోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.రైతులకు భారీ దెబ్బ.. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలైన కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లో భారీ ఎత్తున పసుపు, అరటి, మొక్కజొన్న, కంద, తమలపాకులు, బొప్పాయి, జామ, కొబ్బరి, కూరగాయలు తదితర వాణిజ్య, ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వరదకు ఈ రెండు మండలాల్లోని వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. వాణిజ్య పంటలు రోజుల తరబడి నీటిలో నానడంతో పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.రేపల్లె పట్టణానికి పొంచి ఉన్న ప్రమాదం.. వరద ఉధృతికి భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కృష్ణా కరకట్టపైకి నీరు చేరుతోంది. దీంతో అధికారులు, గ్రామస్తులు అప్రమత్తమై మట్టి, ఇసుక సంచులు వేసి కట్టకు గండిపడకుండా ప్రయత్నిస్తున్నారు. రావి అనంతవరం గ్రామం వద్ద కరకట్ట నుంచి నీరు లీకు అవుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. వరద మరింత పెరిగితే ఆయా ప్రాంతాల్లో కరకట్టకు గండి పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే వరద ఉధృతికి భట్టిప్రోలు, రేపల్లె పట్టణం నీట మునగొచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్కడా కనిపించకపోవడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మట్టి అక్రమ తవ్వకాలే గండికి కారణం కృష్ణా నదికి తొలిరోజు ఆదివారం 8.79 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పెసర్లంక సమీపంలోని అరవింద వారధి వద్ద కృష్ణానది గట్టుకు భారీ గండి పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు నదికి ఇరువైపులా పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. దీంతో నది గట్లు, కరకట్ట రోజురోజుకు బలహీనపడుతూ వచ్చాయి. కరకట్ట దెబ్బతినకుండా చూడాల్సిన కృష్ణా నది పరిరక్షణ విభాగం ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అక్రమ తవ్వకాలు అడ్డుకుని.. దెబ్బతిన్న కట్టను బలోపేతం చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణానది ఒడ్డు కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లో మరింత బలహీనంగా మారింది. చాలా చోట్ల పూర్తిగా దెబ్బతింది. ఇలాగే 2009 అక్టోబర్ 6న కరకట్ట తెగిపోయి రేపల్లె పట్టణం నీటిలో మునిగింది. అప్పట్లో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచి్చంది. ప్రస్తుతం కేవలం 8.79 లక్షల క్యూసెక్కుల వరదకే అరవింద వారధి వద్ద మరోమారు గండిపడింది. ఇప్పటికైనా కృష్ణా కరకట్టలో అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
బడులు తెరిచారు.. బరువు మోపారు.. 'వందనమేదీ'!
వెంటనే పిల్లలందరికీ ఇవ్వాలి..నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఆరో తరగతి, మరో అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరవగానే మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. – పదముత్తం లక్ష్మి, ఏరూరు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లాసాక్షి, అమరావతి: ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకంఅమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి.. పథకాలు అందుకోండి..’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిచోటా చాటింపు వేసిన సీఎం చంద్రబాబు ఒకపక్క పాఠశాలలు పునఃప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి నారా లోకేశ్తోపాటు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలు దాదాపు కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.15 వేల కోట్లు అవసరం. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కోటి మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరుదాటాక తెప్ప తగలేయడంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.ఖర్చులు తడిసిమోపెడు..పాఠశాలలు తెరవటమే ఆలస్యం.. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మ ఒడి’ పథకం నాలుగేళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింత కల్పించింది. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే వంద శాతం పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా రూ.6,400 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.26 వేల కోట్లకుపైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. భావి పౌరుల భవితవ్యానికి భరోసా కల్పిస్తూ వెలుగులు పంచిన ఈ పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి ‘‘తల్లికి వందనం’’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన కూటమి సర్కారు స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలున్న కుటుంబాలు తమకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డారు. ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ‘తల్లికి వందనం’పై ఇంతవరకూ కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలయాపన.. కోతలు2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విదిలించారు. ఇప్పుడు తల్లికి వందనంపైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ పథకం వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వ పెద్దల్లో కూటమి సర్కారులో గుబులు రేపుతోంది. ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం కావడం ఇందుకు కారణం. దీంతో వలంటీర్లను గౌరవ వేతనం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామన్న హామీని గాలికి వదిలేసినట్లే... ‘తల్లికి వందనం’ కూడా లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఈ ఏడాది కాలయాపన చేసి అనంతరం రకరకాల నిబంధనలతో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల రుణమాఫీపైనా ఇదే విధానం అనుసరించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అదే జరిగితే తమ పిల్లల చదువులు నాశనమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రాప్ అవుట్స్కు అడ్డుకట్ట..బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకానికి విద్యార్థి హాజరును ప్రామాణికంగా తీసుకుంది. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మాత్రం కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. జీఈఆర్...2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ఈ నిర్ణయం నూరు శాతం ఉపయోగపడింది.జూన్లోనే జమకు గత సర్కారు ఏర్పాట్లు..పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో 2019 జూన్లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్లోనే అంతకుముందు సంవత్సరం హాజరును బట్టి రూ.15 వేలు చొప్పున అందిస్తూ రూ.వెయ్యి టాయిలెట్ మెయింట్నెన్స్ ఫండ్కి, మరో రూ.వెయ్యి స్కూల్ నిర్వహణ నిధికి జమ చేసింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అందించి చదువులకు భరోసా కల్పించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే పథకాన్ని నూరు శాతం పారదర్శకతతో అమలు చేసింది. 2022–23కి సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. జూలై వచ్చినా తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.మాట ప్రకారం డబ్బులివ్వాలిగత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా సకాలంలో నగదు నా ఖాతాలో జమ చేశారు. పిల్లల చదువుల కోసం అది ఎంతో ఉపయోగపడేది. కూటమి పార్టీలు ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాయి. బడులు ఇప్పటికే తెరిచినా కొత్త ప్రభుత్వం ఇంత వరకు ఏమీ చెప్పడం లేదు. చేసేదేమీ లేక రూ.15 వేలు అప్పు చేసి పిల్లలకు అవసరమైనవి కొన్నాం. మాట ప్రకారం పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వాలి. – పద్మ, విద్యార్థి తల్లి, పుత్తూరు, తిరుపతి జిల్లాపాత వాటికి పేర్లు మార్చారే కానీపిల్లలు స్కూళ్లకు వెళుతున్నా ఏ పథకం అందలేదు. పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ పథకం ద్వారా డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. ఇలాగే ఉంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే పథకాలు అందేలా చూడాలి. – సి.జానకి, జల్లావాండ్లపల్లె, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదునా కుమార్తె లిఖిత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇంతవరకూ మాకు అమ్మ ఒడి డబ్బులు పడలేదు. గతంలో ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు. అసలు డబ్బులు పడతాయో లేదో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. పిల్లల చదువుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది. – మరడాన జ్యోతి, రామభద్రపురం, విజయనగరం జిల్లాబడులు మొదలైనా ఆ ఊసే లేదు గతంలో స్కూళ్లు తెరవగానే అమ్మ ఒడి అందేది. పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడేవి. ఈసారి బడులు ప్రారంభమైనా ఇంతవరకూ ఆ ఊసే లేదు. అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టత లేదు. గతంలో ఉన్న లబ్ధిదారులందరికీ అమ్మఒడి ఇవ్వాలి. – రమణమ్మ, అంకేపల్లి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా పిల్లలను ఆదుకోండయ్యా..! పాఠశాలలు తెరిచి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందలేదు. మా పిల్లలను ఆదుకుని పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి. – పి.రామలక్ష్మమ్మ, మల్లూరు, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా -
జనసేన కార్యకర్తల ఓవర్ యాక్షన్
-
ఉద్యాన పంటల సాగు.. ‘ఉపాధి’తో అనుసంధానం
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ బుధవారం విజయవాడలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన సోదరుడు నాగబాబుతో కలిసి అధికారిక కార్యాలయానికి వచ్చిన ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో సొంత భవనాలు లేని గిరిజన గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై పవన్ సంతకం చేసినట్టు తెలిపింది. అదే విధంగా ఉద్యాన పంటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే మరో ఫైల్ మీద కూడా పవన్ సంతకం చేసినట్టు వివరించింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి అభినందనలు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. శాఖలవారీగా సమీక్ష ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో శాఖాపరమైన విధుల్లో పాల్గొన్నారు. ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష చేశారు. సాయంత్రం అటవీ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవన్ను కలిసిన సీఎస్ నీరభ్కుమార్ బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ ప్రత్యేకంగా కలిశారు. -
ఏపీ కి ప్రత్యేక హోదా తేవాలి బాబు కు అఖిల పక్షాల డిమాండ్
-
జనసేనకు డిప్యూటీ స్పీకర్?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్ప టికే జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించిన విషయం తెలిసిందే. 21 మంది ఎమ్మెల్యే లున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు అంగీకరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు మూడో వంతు పదవులు వస్తాయని పవన్కళ్యాణ్ చెప్పేవారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి జనసేన పార్టీ నుంచి అవనిగడ్డ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. బుద్ధప్రసాద్ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరారు. బొలిశెట్టి తొలినుంచీ జనసేనలోనే ఉన్నారు. నిజంగా అవకాశం వస్తే వీరిద్దరిలో ఒకరు ఆ పదవిలో కూర్చోవడం ఖాయమని చెబుతున్నారు. మరోవైపు స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరును పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా ఈ నెల 19వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ప్రొటెం స్పీకర్తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని సమాచారం. -
పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
-
సేమ్ సీన్ రిపీట్.. నిరాశలో పవన్
-
గెలుపుపై ఆశలు లేవు..పవన్ కళ్యాణ్ సైలెంట్
-
డాబుశౌరి కబుర్లు... ఓటమి భయంతో బెంబేలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్ మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టలదొర వాగ్దానాలుమచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలÔౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలÔౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు.ఈ ప్రశ్నలకు బదులేవి? ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలÔౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు. 👉ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు? 👉 దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలÔౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు. 👉 నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు. 👉 తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు.టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలÔౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలÔౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
సాక్షి, అమరావతి: గాజుగ్లాసు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గింది. తమ పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకే రిజర్వ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను టీడీపీ ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదంటూ ఎన్నికల సంఘం నివేదించడంతో హైకోర్టు ఆ దిశగా ఉత్తర్వులివ్వడానికి సిద్ధమైంది. దీంతో టీడీపీకి పరిస్థితి అర్థమైంది. తమ పిటిషన్ను కొట్టేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించి, హైకోర్టు అనుమతి కోరింది. వెంటనే హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులిచ్చారు. పొత్తు నేపథ్యంలో గాజుగ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకుగానీ, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకుగానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రు. -
ఒకరి వెంట మరొకరు..
సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జులు డీఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్బై చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రెబల్గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెప్పారు. టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్, రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్ అభ్యర్థి -
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
-
జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం
-
జనసేన రెబల్స్ కు గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్..!
-
గ్లాసు గుర్తుపై ఈసీ సంచలన నిర్ణయం
-
అమెరికా జీవితాన్నివదిలేసి పవన్ కళ్యాణ్ కోసం వస్తే..!
-
పిఠాపురంలో పవన్ అష్టకష్టాలు
-
మనోహర్ ఆస్తి పెరిగింది!
తెనాలిరూరల్: జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాదెండ్ల మనోహర్ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్ చూపారు. తెనాలిలో మనోహర్ నామినేషన్ తెనాలిరూరల్: నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్ల మీదుగా సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్ అధికారి ప్రఖర్ జైన్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. -
పవన్ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత ఆస్తులు మాయ అని, ఆయన పెళ్లాల లెక్కలూ మాయే అని వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్లో ఆదాయం, ఆస్తులపై మాయ చేస్తున్నట్లు పెళ్లాలు, గొళ్లేల విషయంలోనూ మాయచేస్తున్నావే అని దెప్పిపొడిచారు. పవన్ ఏ భార్యతో ఎంతకాలం ఉన్నారు, ఒక భార్యతో సంసారం చేస్తూ మరొకరితో పిల్లలను కన్న విషయం, ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు, వీటన్నింటిపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు. మహేశ్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధం చెప్పాడని, అందులో వివరాలపై విచారణ చేయించాలని అన్నారు.‘ఐదేళ్ల ఆయన సంపాదన రూ.114.76 కోట్లు అని చెప్పారు. అందులో రూ.73 కోట్లు పన్నులు, పార్టీ డొనేషన్ రూ.20 కోట్లు అని చెప్పారు. ఇవన్నీ పోను ఇంకా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడు’ అని నిలదీశారు. ‘పవన్ ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే. రూ.90 కోట్ల ఆస్తులు 2018 – 2024 మధ్యలో కొన్నారు. ఇది రిజిస్టర్ విలువే. వాటి మార్కెట్ విలువ రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఉంటుంది.ఇదే సమయంలో ఆయన చేసిన సినిమాలు నాలుగే. వాటిలో యావరేజ్గా ఆడినవి రెండు. మిగతావి డిజాస్టర్ అయ్యాయి. అయినా రూ.90 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా లేక జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెడితే వచ్చాయా? కరోనా సమయంలో 2021లో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే.. అప్పుడు కూడా ఆయన రూ.33 కోట్ల ఆస్తులు కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు పసుపు కరోనా ఏమైనా కాటేసిందా’ అని ధ్వజమెత్తారు.ఈ మధ్య ముగ్గురు నలుగురు పెళ్లాలు అంటేనే పవన్ గింజుకుంటున్నారని, మరి వలంటీర్లను ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అంటే వారికి కోపం రాదా అని ప్రశ్నించారు. ‘అన్న చిరంజీవిని పదే పదే అవమానిస్తున్నది పవనే. కానిస్టేబుల్ కొడుకునంటారు గానీ, చిరంజీవి సినిమా భిక్ష పెట్టడం వల్లే పవర్ స్టార్ అయ్యానని ఎక్కడా చెప్పరు. తల్లిని అవమానించిన లోకేశ్, చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ ఈరోజు తల్లిని కూడా అవమానించారు’ అని అన్నారు.ఓటమి భయంతో ఇష్టానుసారం పేలుతున్న పవన్ఓటమి భయంతోనే పవన్ సీఎం జగన్పై ఇష్టానుసారం పేలుతున్నారన్నారు. కాపుల్ని, కార్యకర్తలను కూడా కించపరుస్తున్నారని చెప్పారు. పోటీ చేసిన రెండుచోట్లా ప్రజలు కాళ్ళు, కీళ్ళు విరగ్గొట్టినా పవన్కు బుద్ధి రాలేదన్నారు. తనని ఒక్కడినైనా గెలిపించాలని, ప్లీజ్ అంటూ అడుక్కునే పవన్ ఒక పార్టీకి అధ్యక్షుడేనా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్ని నమ్ముకున్నారని, ప్రజలు కూడా సీఎం జగన్ని నమ్మారని తెలిపారు. అందుకే సీఎం జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్నందునే సీఎం జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం జగన్ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.కూటమి కాదది.. కుమ్మక్కు రాజకీయంటీడీపీ, జనసేన, బీజేపీలది కూటమి కాదని, కుమ్మక్కు రాజకీయమని మహేశ్ ధ్వజమెత్తారు. పోటీ చేసేదంతా చంద్రబాబు మనుషులేనని, పార్టీలే మారతాయని చెప్పారు. జనసేన, బీజేపీ అభ్యర్థులు చంద్రబాబు గుంపులో నుంచి వచ్చిన వారేనన్నారు. ఈ గుంపును హైనాలు, గుంటనక్కలు, తోడేళ్లు అనక ఇంకేమనాలని ప్రశ్నించారు. వాళ్లు ప్రజల కోసం కూటమి కట్టలేదని, ప్రజల ఆస్తులను దోచుకునేందుకు, పేదల నోట్లో మట్టికొట్టేందుకు, భూములు కొట్టేసి రూ.లక్షల కోట్లు సంపాదించేందుకేనని అన్నారు.జనసేన అధ్యక్షుడు పవనే సీఎం అభ్యర్థి అని చాలా కాలం సోషల్ మీడియాలో రాగం తీశారని, తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పారని, ఆ తర్వాత 21 సీట్లతో సరిపెట్టారని, వీటిలోనూ నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లేనని చెప్పారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఇలాగే ఉంటాయని అన్నారు. -
Yalamanchili: సుందరానికి షాక్
విశాఖ సిటీ: నోటి దురదతో అందరినీ దుర్భాషలాడడం.. వ్యాపారం పేరుతో మహిళకు మోసం.. నిరసనల పేరుతో పరిశ్రమలకు బ్లాక్మెయిలింగ్.. తాజాగా మత్స్యకార నాయకుడిపై హత్యాయత్నం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. యలమంచిలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. స్థానికంగా ప్రజాబలం లేనప్పటికీ.. మత్స్యకారులపై దాడులకు పాల్పడినప్పటికీ.. ఐవీఆర్ఎస్ సర్వేలో అతడికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. ఆయనకు జనసేనకు టికెట్ ఇవ్వడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లోనే కాకుండా.. సొంత పార్టీ నేతలు సైతం విజయ్ అభ్యరి్థత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. అతడికి వ్యతిరేకంగా జనసేన పార్టీ రెబల్ అభ్యరి్థగా మత్స్యకార నాయకుడు ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. విజయ్కు వ్యతిరేకంగా పూడిమడకతో పాటు మరికొన్ని గ్రామాల్లో జనసేన నాయకులు, అభిమానులు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారు.సుందరపు సోదరులపై సీపీకి ఫిర్యాదు సుందరపు సోదరులు వ్యాపారం పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేశారు. ముందు సుందరపు సతీష్ రూ.23 లక్షలు, తరువాత సుందరపు విజయ్కుమార్ రూ.17 లక్షలు పెట్టుబడులు రూపంలో తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సదరు మహిళ 2020లో అప్పటి నగర పోలీస్ కమిషనర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు సుందరపు వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకువస్తున్నారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ రమేష్ ముద్దాడ 2012లో మరణించారు. అతని మరణం అనంతరం వచ్చిన డబ్బుతో భార్య శ్రీదేవి ముద్దాడ, ఇద్దరి పిల్లలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి పరిచయం ఉన్న సుందరపు సతీ‹Ùకుమార్(సుందరపు విజయ్కుమార్ సొదరుడు) 2013లో కలిసి ఒక వ్యాపారం కోసం చెప్పాడు.ఆమెను అక్కా అని పిలిచే సతీష్ కర్నాటకలో బల్లారి హెవీ మోటల్ వెహికల్ వ్యాపారంలో రూ.23 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.1.8 లక్షలు రిటర్న్స్ వస్తాయని నమ్మించారు. దీనికి 2013, ఫిబ్రవరిలో ఆమె తన వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రూ.23 లక్షలు ఎటువంటి ఒప్పంద పత్రాలు లేకుండానే సతీష్కు డబ్బులు ఇచ్చారు. తొలి నాలుగు నెలలు రిటర్న్స్ ఇవ్వని సతీష్ ఆ తరువాత ఒక ఏడాది పాటు కేవలం 80 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన డబ్బులు జీతాలు, వాహనాలకు ఖర్చు అవుతుందని చెప్పేవాడు. ఆ తరువాత నుంచి అది కూడా ఇవ్వడం మానేశాడు. డబ్బులు కోసం అతడికి ఆడగగా వ్యాపారంలో నష్టం వచ్చిందని, అసలు కూడా రాదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఆమె తీసుకున్న రుణం తీర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.కొద్ది రోజులకు విజయ్కుమార్.. కొద్ది రోజులకు విజయ్కుమార్.. శ్రీదేవిని కలిసి రిలయన్స్ టెలీకాంలో 4జీ కేబుల్ ప్రాజెక్టుకు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాలని కోరాడు. ముందు అతని సోదరుడు చేసిన మోసం కారణంగా ఆ ప్రతిపాదనను శ్రీదేవి తిరస్కరించారు. అయితే విజయ్కుమార్ ఆమెను రిలయన్స్ ఆఫీస్కు తీసుకువెళ్లి అక్కడి ప్రతినిధులతో మాట్లాడించాడు. మంచి ఆదాయం వస్తుందని, గత వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి మంచి అవకాశమని, సంస్థ నుంచి బిల్లులు కూడా నేరుగా ఆమె అకౌంట్లోనే పడతాయని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి నమ్మి తన భర్త ఫ్లాట్పై లోన్ తీసుకొని రూ.17 లక్షలు సుందరపు విజయ్కుమార్కు ఇచ్చారు.విజయ్కుమార్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో శ్రీదేవి ఆ పనులు చూసుకోవడం ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ పూర్తయినప్పటికీ.. ఆమె ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో ఆమె నేరుగా రిలయన్స్ ఆఫీస్కు వెళ్లి వాకబు చేయగా ఆ పనులకు సంబంధించి బిల్స్ విజయ్కుమార్ అకౌంట్కు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో డబ్బు కోసం శ్రీదేవి.. సుందరపు విజయ్కుమార్ను అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం విని షాక్కు గురయ్యారు. పనులు చేయించిన ఉద్యోగికి రూ.10 వేలు మాత్రమే ఇస్తామని, మహిళ కాబట్టి ఆమెకు నెలకు రూ.20 వేలు చొప్పున ఎన్ని నెలలు పనిచేస్తే అంత డబ్బు ఇవ్వాలని విజయ్ తన మనిíÙకి పురమాయించాడు. దీంతో పెట్టుబడి డబ్బులు ఇవ్వాలని అడిగినా విజయ్కుమార్ ఆమెను పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఆమె అతడిని డబ్బు కోసం అడగగా కొద్ది నెలల్లో ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. అయినప్పటికీ డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో శ్రీదేవి అప్పటి నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.మత్స్యకార నేతపై హత్యాయత్నంయలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పూడిమడక గ్రామ నివాసి, అదే పార్టీకి చెందిన మత్స్యకారుడు ఎర్రిçపల్లి కిరణ్పై దాడి, హత్యా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఘటనతో పూడిమాడకతో పాటు తీర ప్రాంతవాసులు, ఉమ్మడి విశాఖలో మత్స్యకారులు సుందరపు విజయ్కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడిమడకకు చెందిన కిరణ్ చురుగ్గా జనసేన పారీ్టలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీంతో జనసేన అధినాయకులు సైతం అతడిని అభినందించారు. అయితే సుందరపు విజయ్కుమార్ మాత్రం కిరణ్పై కక్ష గట్టి దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కిరణ్, అతని కుటుంబ సభ్యులు, పూడిమడక గ్రామస్తులు పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి సుందరపు విజయ్కుమార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా మత్స్యకార నేత కిరణ్ జనసేన రెబల్ అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సుందరపు విజయ్కుమార్కు జనసేన టికెట్ ఇవ్వడం పట్ల మత్స్యకారులు తీవ్రస్థాయి మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుందరపు వర్గీయులలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఎన్నికల వేళ.. పవన్ సంపద సృష్టి
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆదాయ, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న రూ.16.14 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 1,060 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కోనుగోలు చేసినట్లు చూపగా.. 2024 ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517.6 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్ అందులో పేర్కొన్నారు. అంతేకాక.. వ్యక్తిగతంగా తన పేరిట రూ. 209.13 కోట్లు స్థిర చరాస్తులుగానూ, రూ.65.76 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భార్య అన్నా లెజినోవా, అఫిడవిట్లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో రూ.28.47 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తుల్లో 10 శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందు కొనడం గమనార్హం. ఆ పిల్లలకు ఒక రకంగా.. ఈ పిల్లలకు మరో రకంగా.. ఇదిలా ఉంటే.. అఫిడవిట్లో పవన్ తన పిల్లలు దేశాయి అకీరా నందన్, దేశాయి ఆద్య (వీరిద్దరూ రేణుదేశాయి–పవన్కళ్యాణ్ పిల్లలు)తో పాటు పోలీనా అంజని, మార్క్ శంకర్ (పవన్కళ్యాణ్–అన్నా లెజినోవా పిల్లలు) పేర్లతో ఉన్న ఆస్తులూ వెల్లడించారు. ఆ అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరికి ఆస్తుల కేటాయింపులో పవన్ వ్యత్యాసం చూపించారు. విడాకులిచ్చిన రేణుదేశాయి పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం. చదివింది పదో తరగతే.. ఇక పవన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. అది కూడా ఎస్ఎస్ఎల్సీ (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) రద్దయి, దాని స్థానంలో ఎస్ఎస్సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్ఎల్సీ చదవడం గమనార్హం. ఇంటర్లో మేథమేటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు అరడజను సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్.. అవన్నీ హంబక్ అని అఫిడవిట్లో కుండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్లో వివరించారు. తనపై మొత్తం 8 కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొనగా.. తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీగా చెబుతూ.. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని 197 పోలింగ్ బూత్ 1120 నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు. పవన్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో తనకెలాంటి ఆదాయం లేకపోగా, రూ.1,10,62,939 నష్టం వచ్చిందని.. అయితే, 2019–20లో రూ.4.51 కోట్లు, 2020–21లో రూ.12.86 కోట్లు, 2021–22లో 30.09 కోట్లు, 2022–23 ఆర్థిక ఏడాదిలో 12.20 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తన భార్య, పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటరŠన్స్ వివరాలు లేవు. చరాస్తులు.. ► పవన్కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో రూ.3.15 లక్షలు ఉన్నాయని.. బ్యాంకుల్లో డిపాజిట్లుగా రూ.16.48 కోట్లు.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.15.48 లక్షలు.. ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో రూ.3.02 కోట్లు.. ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం రూ.3.65 కోట్లు.. అలాగే, రూ.14.01 కోట్లు విలువ చేసే కార్లు, వాహనాలున్నాయని.. రూ.2.34 కోట్ల బంగారు ఆభరణాలు.. రూ.14.51 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు.. ఇతర రూపాల్లో మరో రూ.1.79 కోట్లు కలిపి మొత్తం చర ఆస్తుల రూపంలో రూ.41.65 కోట్లుగా చూపించారు. ► తన వద్ద రూ.32 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్తో పాటు పది కార్లు (రెండు బెంజి, మూడు మహీంద్రా స్కార్పియాలు, రేంజ్ రోవర్, రెండు టయోటాలు, జీపు, టాటా పికప్ ట్రక్ వాహనాలున్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో రూ.19,340లు.. బ్యాంకు డిపాజిట్లు రూపంలో రూ.86.05 లక్షలు.. రూ.13.97 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు కలిపి మొత్తంగా రూ.ఒక కోటి చరాస్తులున్నాయి. ► పిల్లలు దేశాయి అకీరా నందన్ పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.89.38 లక్షలు.. దేశాయి ఆద్య పేరిట రూ 87.77 లక్షల బ్యాంకు డిపాజిట్లు.. పోలీనా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.85.92 లక్షలు.. మార్క్ శంకర్ పేరిట రూ.86.25 లక్షలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకీరా నందన్కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ► మరోవైపు.. మొత్తం రూ.65.76 కోట్ల మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్ పేర్కొంటూ, అందులో రూ.17.56 కోట్లు బ్యాంకులకు, మరో రూ.46.70 కోట్లు 15 మంది వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్లో వివరించారు. స్థిరాస్తులు.. ► హైదరాబాద్ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో 18.02 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ. 10.42 కోట్లు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.52.85 కోట్ల విలువచేసే ఏడుచోట్ల స్థలాలు (శేరిలింగంపల్లి మండల పరిధిలో రెండు, మంగళగిరి మండల పరిధిలో నాలుగు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న నాలుగు స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో కోనుగోలు చేసినట్లు వివరించారు. ► ఆ ఏడింటిలో ఒకటి మంగళగిరిలోని స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని.. మిగిలినవి తను కొనుగోలు చేసినవన్నారు. ► హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రూ. 3.14 కోట్లు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. è రూ.1.95 కోట్లు విలువచేసే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతిగా ఇచ్చానన్నారు. è రూ.22 కోట్లు విలువ చేసే హైదరాబాద్ జూబీహిల్స్లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలీనా అంజని, మార్క్ శంకర్ ఇద్దరికీ చేరి సగం వాటాగా బహుమతిగా అందజేసినట్లు పవన్ పేర్కొన్నారు. పవన్కళ్యాణ్ నామినేషన్ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలను వారు బేఖాతరు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి ఉండగా అంతకుమించి లోపలకు అనుమతించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థుల అనుచరులు ఉండాలన్న నిబంధననూ లెక్కచేయలేదు. అక్కడ నినాదాలూ చేశారు. బీజేపీ నేతలకు పరాభవం.. కూటమిలో సభ్యులైన టీడీపీ నేతలకు మాత్రమే విలువనిచ్చిన పవన్కళ్యాణ్.. అప్పటివరకూ ర్యాలీలో తనతో పాటు తిప్పుకున్న బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజుకు నామినేషన్ కేంద్రంలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. తనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కృష్ణంరాజు అసహనానికి గురయ్యారు. తరువాత పోలీసులు వర్మ కుమారుడు గిరీష్ వర్మతో పాటు ఆయన్ను లోపలకు పంపించారు. ఇక నామినేషన్ వేసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి ఒకసారి ర్యాలీగా పిఠాపురం చేరుకోవడానికే పవన్ అనుమతి తీసుకున్నారు. అయితే, రెండుసార్లు తిరగడం గమనార్హం. -
మా‘లోకం’ అనుకుంటే... మా పుట్టి ముంచేస్తోంది!
ఆక్రమణలు.. అక్రమాలు చేయడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పుడు అదే విద్యను రాజకీయ రంగంలో ప్రదర్శిస్తున్నారు. టీడీపీ కంచుకోటను డబ్బుమూటలతో కుదేలు చేస్తూ.. జనసేన బలం పెంచుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా.. భవిష్యత్తులో టికెట్ కోసం ఎవరికాళ్లూ పట్టుకోకూడదన్న ఉద్దేశంతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మా‘లోకం’ అంటూ తిరుగుతున్న పసుపుచొక్కా నాయకులు.. ఆమె చర్యలతో కలవరపడుతున్నారు. టీడీపీ పుట్టిమునిగిపోతోందంటూ మదనపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కూటమి అభ్యర్థిగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు లోకం మాధవి ఒంటెత్తు పోకడలు టీడీపీ నాయకులకు కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన టీడీపీ నాయకులు ఆమె తీరుతో బెంబేలెత్తిపోతున్నారు. మంచి ప్యాకేజీలతో చేరికలకు తెరతీయడంతో టీడీపీ కార్యకర్తలు సైతం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీడీపీ కండువాలను పక్కనపెట్టి జనసేన కండువాలు వేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి మాటెలా ఉన్నా తమ పార్టీకి నెల్లిమర్ల నియోజకవర్గంలో నూకలు చెల్లినట్లేనని టీడీపీ స్థానిక నాయకులకు బెంగపట్టుకుంది. వారంతా పలాస వచ్చిన చంద్రబాబు వద్దకు స్వయంగా వెళ్లి ‘మహాప్రభో... మాధవి మన పుట్టి ముంచేలా ఉంద’ని మొరపెట్టుకున్నా అధినేత నీళ్లు నమలడం తప్ప ఏమీ భరోసా ఇవ్వలేకపోయారట! తొలి నుంచి ఆక్రమణలే లక్ష్యం... జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలైన లోకం మాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామ పరిధిలో రెండు దశాబ్దాల కిందటే భూములు కొనుగోలు చేశారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ ముసుగులో సమీపంలోనున్న ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలిబాటలన్నీ కలిపేసి రోడ్డు వేసేశారు. కల్వర్టులను వారే కట్టేశారు. ఆ భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. అవతల ఉన్న భూముల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తమ భూముల్లోకి వెళ్లడానికి తోవలేక, మిరాకిల్ వేధింపులు పడలేక విధిలేని పరిస్థితుల్లో వారు తమ భూములను కూడా మిరాకిల్కే వచ్చినకాడికి అమ్మేయాల్సిన పరిస్థితి. ఆక్రమణల్లో దాదాపు 14 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, మరో పది ఎకరాల వరకూ డి.పట్టా భూములు ఉన్నట్టు ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటి స్వాధీనాన్ని అడ్డుకొంటూ న్యాయస్థానం నుంచి యథాతథస్థితి ఉత్తర్వులు తెచ్చుకోవడం మిరాకిల్కే చెల్లింది. టీడీపీ అస్తిత్వానికే ఎసరు... పార్టీ మనుగడ కోసం పవన్ కల్యాణ్ మద్దతు తప్పదని టీడీపీ నాయకులకు చంద్రబాబు బుజ్జగించి పంపించినా పార్టీ భవిష్యత్తుకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. కూటమి అభ్యర్థిగా లోకం మాధవి ఉన్నప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మాటే నెగ్గుతుందని చెప్పినా ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ కనిపించట్లేదు. ఆమె జనసేన పార్టీలో చేరికలకు తెరలేపారు. భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ వైఎస్సార్సీపీలో అసంతృప్త నాయకులకు వల వేశారు. ఈ వలలో టీడీపీ కార్యకర్తలు చిక్కుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లినవారు ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వస్తారనుకుంటే జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. వారి ప్రభావంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని టీడీపీ కార్యకర్తలు కూడా జనసేనలోకి పోతున్నారు. ఇది సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో ఈ చేరికల కార్యక్రమాలకు టీడీపీ నాయకులను సైతం దరిచేరనీయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీకి నూకలు చెల్లినట్లేనని ఆ పార్టీ నాయకులు దిగాలు చెందుతున్నారు. డిపాజిట్ దక్కకపోయినా సీటు కేటాయింపు.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నామనే ముసుగులో భోగాపురం మండలంలో సంపాదించిన భూములు, ఆక్రమించిన ప్రభుత్వ భూములను కాపాడుకోవడమే లక్ష్యంగా లోకం దంపతులు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచే జనసేన అభ్యర్థిగా లోకం మాధవి తొలుత పోటీచేశారు. ఆమెకు 7,550 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని రెండేళ్ల నుంచి ‘మిరాకిల్’ కేంద్రంగా రాజకీయాలకు తెరలేపారు. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా చంద్రబాబు ప్రకటించిన కర్రోతు బంగార్రాజు సహా ఆ పార్టీ నాయకులంతా ఆమెను తక్కువగా అంచనా వేశారు. ఆమె ధనబలం ముందు వారంతా దూదిపింజల్లా తేలిపోయారు. పవన్ కల్యాణ్ తొలుత ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో లోకం మాధవి కూడా ఉండటంతో టీడీపీ నాయకులకు మతిపోయింది. తిరుగుబాటు చేస్తామని ప్రకటించిన బంగార్రాజు తదితర నాయకులంతా తర్వాత సన్మానం చేయాల్సి వచ్చిందంటే ఆమె పవర్ ఊహించవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... పూసపాటిరేగ మండలం రెల్లివలసలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడి నివాసంలో నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చిన చంద్రబాబు పలాసలో బస చేయడంతో మంగళవారం వారంతా అక్కడకు వెళ్లి కలిశారు. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు బృందం చంద్రబాబుకు తమ కష్టాలను మొరపెట్టుకున్నా సానుకూల స్పందనకనిపించలేదని తెలిసింది. -
Visakhapatnam: పెద్దలకే ప్యాకేజీ
సాక్షి, విశాఖపట్నం: పొత్తులో ఒకరికొకరు సీట్లను సర్దుబాటు చేసుకున్న కూటమి అభ్యర్థులు మిత్రపక్ష పార్టీల పెద్దలకే ప్యాకేజీల్లో పెద్దపీట వేస్తున్నారు. తమపై చిన్న చూపు చూస్తున్నారన్న భావనలో చోటా మోటా నాయకులున్నారు. వాస్తవానికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఉమ్మడి విశాఖ జిల్లాలో సగానికి పైగా స్థానాల్లో సీట్లను ఆశించి భంగపడ్డారు. ఆరంభంలో వీరు తమ అధినేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్నారు. మరికొందరు తిరుగు బావుటా ఎగురవేశారు. నోటిఫికేషన్తో పాటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్లు దక్కించుకున్న కూటమి అభ్యర్థులు బుజ్జగింపుల పర్వానికి దిగారు. టికెట్లు ఆశించి భంగ పడ్డ వారితో పాటు పార్టీలో కీలక నాయకుల ఇళ్లకు వెళ్లారు. వారి స్థాయిని బట్టి విడతల వారీ ప్యాకేజీలకు ఒప్పించారు. ఇలా ప్యాకేజీ సెటిల్మెంట్లు రూ.లక్షలు, కోట్లలో జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీటికి తలొగ్గిన నేతలకు ఇప్పటికే ప్యాకేజీ సొమ్మును కొంతమేర పంపిణీ చేశారు. ఎలక్షన్ ప్యాకేజీతో అలక వీడిన నేతలు కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్తున్నారు. అయితే దిగువ స్థాయి నాయకులకు మాత్రం ఈ పరిణామం మింగుడు పడడం లేదు. వీరికి కూటమి అభ్యర్థులు ఇచ్చిన ప్యాకేజీ సొమ్ములో తమకు కూడా కొద్దోగొప్పో ఇవ్వకుండా వారే స్వాహా చేస్తున్నారంటూ రగిలిపోతున్నారు. కొన్ని చోట్ల తక్కువ ఖర్చుతో అయిపోయే విందు భోజనాలతోనే సరిపెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇలా మనస్తాపంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులు బరిలో ఉన్న చోట ప్యాకేజీ అందుకున్న పెద్ద నేతలే తప్ప కింది స్థాయి క్యాడర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇదీ పరిస్థితి.. భీమిలి టికెట్ను కూటమిలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావుకు కేటాయించారు. ఈ సీటును జనసేన నుంచి పంచకర్ల సందీప్, టీడీపీ నుంచి కోరాడ రాజబాబు ఆశించారు. ఆఖరి నిమిషంలో ఈ సీటును గంటా తన్నుకుపోవడంతో తొలుత వీరు అలకబూనారు. రాజబాబు అయితే గంటాపై తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పరిస్థితిని గ్రహించిన గంటా.. రాజబాబు ఇంటికి వెళ్లి బుజ్జగించారు. సందీప్కూ ‘సర్ది’ చెప్పారు. వీరిద్దరినీ భారీ ప్యాకేజీతో దారిలోకి తెచ్చుకోవడంతోనే గంటా వెంట ప్రచారంలో పాల్గొంటున్నారన్న ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోంది. అలాగే విశాఖ ఉత్తర టికెట్ను బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్రాజుకు కేటాయించారు. అక్కడ జనసేనలో కిందిస్థాయి శ్రేణులకు ప్యాకేజీ అందకపోవడంతో ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలిసింది. పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్బాబు టీడీపీలో పైస్థాయి నేతలనే ప్రసన్నం చేసుకోవడంతో దిగువ క్యాడర్ ప్రచారంలో పాల్గొనడం లేదని చెబుతున్నారు. యలమంచిలి టీడీపీ సీటును ప్రగడ నాగేశ్వరరావు ఆశించారు. కానీ పొత్తులో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్కు ఇచ్చారు. తొలుత తన వర్గంతో ఆందోళనకు దిగిన ఆయనకు భారీ ప్యాకేజీ అందడంతో కొద్దిరోజుల నుంచి ప్రచారంలో పాల్గొంటున్నారని, ఆయన అనుచరులు మాత్రం దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఇక పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి అనితను అక్కడ జనసేన నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ రంగంలోకి దిగి సర్దుబాటు చేసినా కింది స్థాయి క్యాడర్ టీడీపీ అభ్యర్థి ప్రచారంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అరకు సీటును తొలుత టీడీపీలో దొన్నుదొరకు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీకి మార్చారు. దీనిపై టీడీపీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. పెద్దలకు సర్దుబాటుతో ఇప్పుడు కొంతమంది ప్రచారంలో పాల్గొంటున్నారు. -
అది రాయి దాడి కాదు.. పవన్ అభిమానినే చితకబాదిన జనసైనికులు
తెనాలి రూరల్: జనసేన అధినే పవన్కళ్యాణ్ పర్యటనలో జన సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ అభిమాని అయిన ఓ కాపు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పవన్ కల్యాణ్పై రాళ్లు విసిరాడని పుకారు చెలరేగడంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన సరిగిరి దిలీప్నాయుడు తెనాలిలో ఆదివారం సాయంత్రం జరిగిన పవన్కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చాడు. ఇక్కడి సుల్తానాబాద్లోని హెలీప్యాడ్ నుండి పవన్ కల్యాణ్ కొంత దూరం కారు నుండి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చి వారాహి వాహనంలోకి మారారు. ఈ మార్గంలోనే ఉషోదయ కళ్యాణమండపం వద్ద దిలీప్ పవన్ రాక కోసం వేచి ఉన్నాడు. పవన్ కల్యాణ్ అటుగా వెళ్లగానే ఓ యువతితో దిలీప్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె తండ్రి అతనిపై దాడి చేశాడు. పక్కనే ఉన్న జన సైనికులు కలుగజేసుకుని దాడి చేస్తుండడంతో సమీపంలోని చెట్టు ఎక్కాడు. అయినా జనసైనికులు కిందకు లాగడంతో తనను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న రాయి తీసుకున్నాడు. రాళ్లతో దాడి చేస్తున్నాడని జనసైనికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరి కొందరు పవన్ కల్యాణ్పై రాళ్లు వేశాడని కేకలు మొదలు పెట్టారు. యువకులు పెద్ద ఎత్తున గుమికూడి దిలీప్పై దాడి చేస్తున్న క్రమంలో కల్యాణమండపం ఆవరణలోకి పరుగెత్తాడు. వెంబడించిన జనసైనికులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కళ్యాణ మండపం సమీపంలోనే విధుల్లో ఉన్న గుంటూరు స్పెషల్బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎస్ వెంకట్రావు, మరో మహిళా ఎస్ఐ, తెనాలి రూరల్, త్రీ టౌన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుళ్లు శివ, తిరుమలరావు, ఇతర సిబ్బంది హుటాహుటిన దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లారు. బాధితుడు దిలీప్ను పొలీసులు చుట్టముట్టి అతని ప్రాణాలను రక్షించారు. పవన్ కల్యాణ్ అభిమానినైన నేను ఆయనపై రాళ్లు ఎందుకు వేస్తానంటూ బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. వివాదానికి కారణమేంటన్నదీ విచారిస్తున్నారు. -
దత్తపుత్రుడి పార్టీకి చంద్రబాబు ఝలక్
పవన్కళ్యాణ్ ప్యాకేజీ నాయకుడని తేలిపోయింది.!. ఏళ్ల తరబడి జనసేన జెండా మోసిన వారికి టికెట్లు లేవు.. పొత్తులో భాగంగా ఇచ్చే టికెట్లనూ టీడీపీ నుంచి అప్పటికప్పుడు జనసేనలోకి వచ్చేవారికే కేటాయించారు. ఇంత జరిగినా చంద్రబాబును కిమ్మని మాట అనడంలేదంటే.. ఆయనవి స్వార్థ రాజకీయాలేనని ఆ పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. ప్రతీ ఐదేళ్లకోసారి రాజకీయాన్ని సినిమాగా భావించి.. చంద్రబాబు డైరెక్షన్లో సొమ్ముచేసుకుంటున్నాడని, ఆయనను నమ్మి పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసే వారిని నిలువునా ముంచేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి టికెట్ల కేటాయింపే నిలువెత్తు నిదర్శనమని పేర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జనసేన పార్టీకి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మూడు సీట్లు ఇస్తామని... తమ పొత్తు సూపర్ హిట్ అంటూ రెండు వేళ్లూ గాలిలో ఊపుతూ... ఒక్కటంటే ఒక్కటే టికెట్ ఇచ్చిన చంద్రబాబు వెన్నుపోటుకు అసలుసిసలైన బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి నిరూపించుకున్నారు! ఇదేదో ప్రత్యర్థుల మాట కాదు కూటమిలోనే మోసపోయి గుండె రగిలిపోతున్నవారి మాట! నెల్లిమర్ల టికెట్ ఒక్కటి మాత్రమే జనసేన జెండా పట్టుకొని తిరుగుతున్న లోకం మాధవికి దక్కింది. ఎచ్చెర్ల టికెట్ను గత ఏడాదే టీడీపీ నుంచి బీజేపీలోకి ప్రవేశించిన నడికుదుటి ఈశ్వరరావు దక్కించుకున్నారు. పాలకొండ టికెట్ అయినా అసలుసిసలైన జనసేన నాయకులకు దక్కుతుందనుకుంటే ఆఖరి నిమిషంలో పసుపు కండువా తీసేసి పార్టీలోకి వచ్చిన నిమ్మక జయకృష్ణకు ఇచ్చేసేశారు. ఇలాంటి ప్రయత్నాలే చేసిన మరో టీడీపీ నాయకురాలు పడాల భూదేవి ఆశలపై నీళ్లుజల్లారు. పవన్ కల్యాణ్ మాట ఇచ్చినా చంద్రబాబు గిమ్మిక్కులతో సీటు చేజారిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతుంది. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అందామనుకున్న ఆమెకు ఎమ్మెల్యే పదవి అందని ద్రాక్ష అయిపోయింది. పాలకొండలో పాతనీరే... టికెట్ ఇచ్చేస్తామంటూ పాలకొండ జనసేన నాయకులను ఊరించి... ఊరించి చివరకు కొత్త గ్లాసులో పాత సారా పోసినట్టుగా టీడీపీ జంప్ జిలానీ జయకృష్ణకు ఎంపికచేయడమే చిత్రం. జనసేనకు పాలకొండలో రెండు శాతం ఓట్లు లేవని, పాలకొండ టికెట్ జనసేన పార్టీకి ఇస్తే ఊరుకునేది లేదని, తేడా వస్తే నిమ్మక జయకృష్ణను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దించుతామని టీడీపీ నాయకులు బీరాలు పలికారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ కోటా టికెట్లను 24 నుంచి 21కు కోతవేసిన నేపథ్యంలో పాలకొండ టికెట్ టీడీపీకి రాదని తేలిపోయింది. ఇది గమనించిన పడాల భూదేవి అప్పటివరకూ వేసుకొని తిరిగిన టీడీపీ కండువాను పక్కనపడేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సాలువా కప్పించుకున్నారు. ఇక్కడో కొసమెరుపు ఉంది. గ్లాస్ గుర్తుతో పోటీచేయడానికి ఉబలాటపడినా ఆమె మాత్రం ముందు జనసేనలో చేరలేదు. ఇదేదో కొంపముంచే వ్యవహారంలా ఉందని జయకృష్ణ హడావుడిగా టీడీపీ కార్యకర్తలను ఫూల్స్ చేస్తూ ఈనెల 1న పిఠాపురం వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని భూదేవి కూడా ఈ నెల 7న అనకాపల్లి వచ్చిన పవన్ కళ్యాణ్ను కలిసి ఆమె కూడా జనసేనలో చేరిపోయారు. చివరకు ఈనెల 9న జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ఖరారైంది. ఎంత ఆశపడిందో కానీ ఈ వార్తతో భూదేవి కంట కన్నీరు జలపాతమైంది. ఆఖరి నిమిషంలోనైనా తనకు బీఫారం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని హూంకరిస్తున్నా... అవేవీ వాస్తవమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ తాజా జనసేన నాయకుల తీరుపై ఇన్నాళ్లూ పాలకొండ జనసేన ఇన్చార్జిగా జెండా మోసిన నిమ్మల నిబ్రమ్ అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. తనకు సీటు ఇస్తామని తిప్పించుకున్న పవన్ కళ్యాణ్ ఆఖరి నిమిషంలో తాజామాజీ టీడీపీ నాయకుడికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాలకొండలో కూటమి అభ్యర్థిని ఓడిచేందుకు అటు భూదేవి, ఇటు నిబ్రమ్ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. పాలకొండ పట్టణంలోని ఓ కళ్యాణమండపంలో గురువారం నిర్వహించిన నాలుగు మండలాల కూటమి నాయకుల సమావేశంలో జయకృష్ణ అభ్యర్థిత్వాన్ని భూదేవి వర్గం వ్యతిరేకించింది. నాలుగు సార్లు ఓడిపోయిన జయకృష్ణకే మళ్లీ టిక్కెట్ ఇచ్చారని, ఈ సారి కూడా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. -
సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో !
తమ్ముణ్ణి సినిమాకు తీసుకెళ్లావ్..నన్నుతీసుకెళ్లలేదు..వాడికి కొత్త బట్టలు కొన్నావు,సైకిల్ కొన్నావ్..నాకు కొనలేదు అని పిల్లలు అలుగుతుంటారు..అలాంటప్పుడు తల్లి, తండ్రి వాణ్ని దగ్గరకు తీసి ఒరేయ్ చిన్నోడా అది కాదురా.. వాడికి సైకిల్ కొన్నాను కదా... నీకూ కొంటాను.. నీకు ఇంకోటి కొంటాను.. వాణ్ని సినిమాకు తీసుకెళ్ళాను కదా.. నువ్వు బాధపడకు నిన్ను జాతరకు తీసుకెళ్తాను... బాధపడకు... అని ఓదార్చాలి... అదే కుటుంబం బాధ్యత. అదే విధంగా పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. అలాంటప్పుడు పిలిచి ఇదిగోవయ్యా.. నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ నీకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను.. దానికి ఏవేవో కారణాలు ఉన్నాయ్.. కాబట్టి ఏమీ అనుకోకు.. పార్టీ కోసం పని చేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. కానీ జనసేనాని వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. టికెట్లు తనకు నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారు. తిరుపతిలో కిరణ్ రాయల్ కావచ్చు.. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్..ఇలా ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది పవన్ కోసం పదేళ్లుగా పని చేస్తూ లక్షలు, కోట్లు తగలేశారు. ఇన్నేళ్ళుగా వాళ్ళను వాడుకుని అక్కడ పార్టీ ఉనికిలోకి వచ్చాక.. ప్రజల్లో కాస్త గుర్తింపు వచ్చాక అక్కడి సీటును వేరేవాళ్లకు ఇచ్చుకోవడం, ఇదేమంటే పొత్తు ధర్మం అని, త్యాగాలకు సిద్ధం కావాలని సమర్థించుకోవడం పవన్ కు అలవాటుగా మారింది. పోతిన మహేష్ టికెట్ బీజేపీకి అంటే సుజనా చౌదరికి ఇవ్వడానికి వెనుక కోట్లు చేతులుమారాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇలా పవన్ను నమ్ముకుని బికారులు అయిపోయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలోనే ఉన్నారు అయితే ఏనాడూ.. పవన్ అలా నష్టపోయిన లేదా మోసపోయినవాళ్లను పిలిచి వాళ్ళతో మాడ్లాడడం కానీ... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా..హామీ కానీ ఇచ్చినట్లు వినలేదు. మాకు పవన్ మద్దతుగా ఉంటామన్నారు అని ఇంతవరకూ ఏ ఒక్క నాయకుడూ చెప్పలేదు. ఆంటే ఆయనది అంతా తన ఇష్టానుసారం. తనకు నచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చుకోవడం.. ఆయన్ను నమ్ముకుని మునిగిపోయినవాళ్లు పోవడం.. అంతే తప్ప...కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా పార్టీలో ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు లేకపోవడం ఇక్కడ దారుణం. దీంతో బాధితుల రోదన అరణ్య రోదన అవుతోంది తప్ప వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకుండాపోయారు. దీంతో ఎక్కడికక్కడ జిల్లాలు.. నియోజకవర్గాల్లో పార్టీని మోసి మోసపోయిన జనసేన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తమ దారితాము చూసుకుంటున్నారు. తాను పిఠాపురంలో గెలిస్తే చాలు..పార్టీ మొత్తం ఏమైపోయినా ఫర్లేదు...అనే భావనలో పవన్ ఉండడంతో క్యాడర్ సైతం మెల్లగా సైడ్ అయిపోతున్నారు. --సిమ్మాదిరప్పన్న -
రాజకీయాల్లో నటించకు పవన్..
తాడేపల్లిగూడెం: ప్రజాసేవ అనే మాట పలకని పవన్కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్యాకప్ చేసి, సినిమా షూటింగ్లకు వెళ్లిపోవడం మంచిదని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం సూచించారు. సినిమాల్లో నటించు.. కానీ రాజకీయాల్లో నటించొద్దంటూ హితవు పలికారు. ఈరోజు పేదల నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే అది జగన్ దయేనని.. పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ బాగుండాలని, ఆయన పది కాలాలపాటు పేదలకు సేవచేయాలని ముద్రగడ ఆకాంక్షించారు. జగన్ ప్రకటించిన అభ్యర్థులను బలపరచాలని, వారి విజయానికి సహకరించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపు సంఘీయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాలొ్గన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని పవన్ను కోరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కాపు, తెలగ, బలిజలను మోసగించిన బాబు.. 2014లో కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని చెప్పి చంద్రబాబు మోసగించాడు. ఇచ్చిన హామీని అమలుచేయమంటే నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు. ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్ ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా అడిగారా? పవన్కు దమ్ము, «ధైర్యం ఉండి మగాడైతే నన్ను తిట్టాలి.. అంతేగానీ మెసేజ్లు పెట్టడం మగతనం అనిపించుకోదు. 21 సీట్లకు పరిమితం కావడం దారుణం.. తెలుగుదేశం గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ పొత్తువల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగింది. పవన్ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకునేవారు. 80 సీట్లు తీసుకుని, పవర్లో షేరు అడగాలని అందరూ భావించారు. కానీ, చంద్రబాబు మాత్రం లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయడానికి తనయుడితో యువగళం పాదయాత్ర చేయించారు. అడగాల్సినన్ని సీట్లు అడగకుండా.. పవర్ షేరింగ్ లేకుండా కేవలం 21 సీట్లకు పవన్ పరిమితం అయిపోవడం చాలా దారుణం. ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేది. మీకు చెప్పుకోవడానికి ఏమీలేదా బాబూ? అసలు పేదల కోసం జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మీరు అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం ఏంటి.. మీకంటూ సొంతంగా చెప్పుకోడానికి ఏమీలేవా బాబూ? ఈ మాటలు చెప్పడానికి మీరు సిగ్గుపడటంలేదేమోగాని వినడానికి మాకు సిగ్గుగా ఉంది. వైఎస్సార్సీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇస్తుందని మీరు చెప్పడం చూస్తే పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే మనుషుల్లా కనపడుతున్నారా పవన్? అయినా అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలిగానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏమిటి? నిజానికి.. పవన్కళ్యాణ్ ముందుగా తాడేపల్లిగూడెం నుంచి పోటీచేయాలనుకున్నారు. అయితే ఇక్కడి జనసేన అభ్యర్థి త్యాగాలు చేయడానికి సిద్ధంగాలేనని, వస్తే కాలూచేయీ తీసేస్తానని బెదిరించడంతో పవన్ పిఠాపురం వెళ్లిపోయారు. -
విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా
-
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కష్టమే: పవన్కళ్యాణ్
సాక్షి, అనకాపల్లి: ‘‘విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడం కష్టమే.. గతంలో నేను స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రధానమంత్రిని కలిసేందుకు నాతో ఎవరొస్తారో చేతులెత్తండి అని అడిగితే ఎవరూ స్పందించలేదు’’.. అని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అప్పట్లో విశాఖ స్టీల్ప్లాంట్ కార్మిక సంఘాల నుంచి తనకు మద్దతు రాలేదని, లేదంటే ప్రధాని దగ్గరకు వెళ్లి ప్రైవేటీకరణను నిలిపివేసే వాడినని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదిని ఊరికే నిందిస్తే సరికాదని స్టీల్ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులను పవన్ తప్పుబట్టారు. అనకాపల్లిలో ఆదివారం నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఓడిపోయానని, ఇప్పుడు పిఠాపురంలో గెలవాలని బలంగా కోరుకుంటున్నానన్నారు. అనకాపల్లిలో ఉన్న శారదానది విదేశాల్లో ఉండి ఉంటే పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేదని, మా కూటమి గెలిస్తే దాని ఒడ్డును పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. మరోవైపు.. దారి పొడువునా సీఎం జిందాబాద్ అంటుంటే ‘మనకు అంత శక్తిలేదు.. 2029లో సీఎం అవడానికి ప్రయత్నిస్తా’నని పవన్ అన్నారు. -
బాబు, పవన్ డబుల్గేమ్పై క్యాడర్ తిరుగుబాటు
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్గేమ్పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం ఇవ్వకుండా మీటింగా? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు. సుగవాసి వద్దే వద్దు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది. రమేష్నాయుడిని ఓడిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు. -
ప్యాకేజీ అందుకుని బీజేపీకి సీటు అమ్మేశాడు: కేశినేని నాని
-
యలమంచిలి టీడీపీ-జనసేన సమావేశం రసాభాస
-
చిన్నమ్మ ఇలాకాలో కమలనాథుల విలాపం
చంద్రబాబు జిత్తులమారి రాజకీయాలకు జనసేన, బీజేపీ నేతలకు భంగపాటు తప్పలేదు. పొత్తు పేరుతో ఓట్లు కొల్లగొట్టేఎత్తు వేసి.. బరిలో ఆ పార్టీల ప్రాతినిధ్యం లేకుండా చేసి మరోసారి తన వెన్నుపోటు నైజాన్ని నిరూపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు పార్టీలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (చిన్నమ్మ) సొంత ప్రాంతం కావడంతో ఒక్క సీటన్నా వస్తుందని భావించిన కమలనాథులకు నిరాశేమిగిలింది. జనసేనల పరిస్థితి కూడా అంతే. ఆ రెండు పార్టీ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల మధ్య పొత్తు పేరుతో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయానికి తెర తీశారు. మూడు పార్టీల ప్రాతినిధ్యం ఉంటుందని చివరి వరకు నమ్మించి.. చివరకు ఏకపక్షంగా అన్ని సీట్లు టీడీపీకే కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 స్థానాల్లోనూ టీడీపీ మాత్రమే పోటీ చేస్తోంది. జనసేన, బీజేపీ కార్యకర్తలు జెండాలు మోయడానికి మాత్రమే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎంత చొక్కాలు చించుకున్నా ఒరిగేదేమీ లేదు కదా అని ఆ పార్టీల కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రచారంలో జనసేన, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పెద్దగా కనిపించడంలేదు. టీడీపీ నాయకులే జనసేన, బీజేపీ జెండాలను తమ కార్యకర్తల చేత పట్టించి డూప్ షో చేస్తున్నారన్న విమర్శలున్నాయి. నమ్మకంగా తడిగుడ్డతో గొంతు కోశారు జనసేన పరిస్థితి ఘోరంగా తయారైంది. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికొచ్చే సరికి రిక్తహస్తం చూపెట్టారని ఆ పార్టీ నాయకులు బహిరంగానే కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు నమ్మకమైన మనిషిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్కు పేరుంది. ఆయనకు ఒంగోలు సీటు ఇస్తానని పవన్హామీ ఇచ్చారు. పొత్తు కుదిరినా ఒంగోలు సీటు మాత్రం జనసేనకే అని నమ్మకంగా చెప్పారు. తీరా పొత్తు కుదిరిన తరువాత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్కు కట్టబెట్టారు. ఇదేం అని అడిగితే నీకు న్యాయం చేస్తామంటూ బుజ్జగిస్తున్నారు. ఇక గిద్దలూరు సంగతి కూటమిలో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కంభం, ఒంగోలులో జరిగిన సభల్లో ఆమంచి స్వాములు తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం పాటించకుండా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. గిద్దలూరు సీటు ఇస్తామని పవన్ కళ్యాణ్తో పాటుగా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా తనకు హామీ ఇచ్చినప్పటికీ తనకు సీటు దక్కకుండా కొందరు టీడీపీ నాయకులు మోసం చేశారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ ప్రతినిధిని అని చెబుతూ ఆమంచి సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ మౌనం వహించడం పలు అనుమానాలకు తెరతీస్తోంది. పురందేశ్వరి సొంత జిల్లాలో కమలానికి దక్కని చోటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సొంత జిల్లా అయిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఒంగోలు పార్లమెంట్ సీటును బీజేపీకి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. పురంధేశ్వరి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో ఒంగోలు, మార్కాపురం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని బీజేపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె అనూహ్యంగా రాజమండ్రికి వెళ్లిపోవడమే కాకుండా సొంత జిల్లా గురించి ఆసక్తి చూపకపోవడంతో కమలం కార్యకర్తలలో నైరాశ్యం నింపింది. కనీసం ఒక్కసీటు ఇచ్చినా పార్టీలో ఉత్సాహం నింపినట్లుండేదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. తెలుగు సీరియల్ను తలపిస్తున్న దర్శి సీటు: దర్శి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి సరైన నాయకుడు లేక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఎన్నికల్లో పోటీకి రోజుకో కృష్ణుడు తెరపైకి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి జనసేన పోటీ చేయడం ఖాయమంటూ తొలి నుంచి ప్రచారం జరిగింది. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన గరికపాటి వెంకట్ను వ్యూహాత్మకంగా జనసేనలో చేర్పించింది. ఆయన తనకే సీటు అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో టీడీపీలో చేరిన అద్దంకికి చెందిన బాచిన కృష్ణ చైతన్యను దర్శికి వెళ్లమని చెప్పారు. ఆయన నో అని చెప్పేయడంతో ఒంగోలుకు చెందిన గోరంట్ల రవికుమార్ను టీడీపీ ఇన్చార్జిగా నియమించారు. రవికుమార్ పేరు ప్రచారంలో ఉండగానే నరసరావుపేటకు చెందిన కడియాల లక్ష్మి పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం చేశారు. ఆమె కూడా ఆసక్తి చూపకపోవడంతో దామచర్ల సత్య పేరు ఖరారు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో దామచర్ల సత్య పేరు రావడంతో తేలు కుట్టిన దొంగల్లా ఉలిక్కిపడ్డారు. రోజులు గడుస్తున్నప్పటికీ దర్శి సీటు పీటముడి వీడడం లేదు. ప్రచారంలో కనిపించని జనసేన, బీజేపీ నాయకులు పొత్తు ప్రక్రియ పూర్తయి అభ్యర్థులను కూడా ప్రకటించినప్పటికీ మూడు పార్టీ నాయకుల్లోలలో ఉత్సాహం కనిపించడం లేదు. పేరుకు పొత్తే కానీ పోటీ మాత్రం టీడీపీ చేస్తుండడంతో జనసేన నాయకులు కానీ, బీజేపీ కేడర్ కానీ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాన మంత్రి మోదీ సభలో సైతం పచ్చ జెండాలే కానీ బీజేపీ, జనసేన జెండాలు పెద్దగా కనిపించలేదు. జనసేనతో మొక్కుబడిగా రెండు సార్లు సమావేశాలు నిర్వహించిన టీడీపీ బీజేపీతో ఆంటీ ముట్టనట్లుగా ఉండడం పట్ల కమలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శ్రీకాకుళం అభ్యర్థిని మార్చాల్సిందే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజెపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న గొండు శంకర్ను మార్చి, గుండ లక్ష్మీదేవికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం క్యాడర్ ఆల్టిమేటం జారీ చేసింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అరసవల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసానికి చేరుకొని వారితో సమావేశమయ్యారు. అనంతరం క్యాడర్తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు గుండ దంపతులను తీసుకొని రమ్మన్నారని ఆ విషయాన్ని వారిద్దరికీ వివరించారు. దీనికి గుండ దంపతులు స్పందిస్తూ చంద్రబాబుతోనే మాట్లాడుతామని, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్తోనైతే మాట్లేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరో రెండు మూడు రోజుల్లో వారు చంద్రబాబునాయుడును కలిసేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. దీనిపై నగర తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏది ఏమైనా శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్ లక్ష్మీదేవికి కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన 50 డివిజన్లలో 45 డివిజన్లకు చెందిన ఇన్చార్జులంతా గుండ లక్ష్మీదేవి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. రెండేళ్లుగా క్రమశిక్షణ తప్పిన అసమ్మతి నేతకు టిక్కెట్ కేటాయించడంపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పరిస్థితిని చంద్రబాబునాయుడుకు వివరించి లక్ష్మీదేవికి టిక్కెట్ వచ్చేలా చూడా లని కోరారు. దీనికి సమాధానంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మీ ఆవేదన తనకు అర్థమైందని చంద్రబాబు వద్దకు గుండ దంపతులను తీసుకెళ్లడం వరకే తన బాధ్యతని వివరించారు. టికెట్ ఇస్తే గుండకే ఇవ్వాలని, యూత్ కోటా అనుకుంటే వారి కుమారుడికి ఇవ్వాలే తప్ప గొండు శంకర్కి కన్ఫర్మ్ చేస్తే తాము ఒప్పుకోబోమని కార్యకర్తలు అన్నారు. -
మైనార్టీ ఓట్ల కోసం చంద్రబాబు కొత్త నాటకం
-
ఎన్నికల తర్వాత గ్లాసు కనిపించేనా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పొత్తు పేరుతో టీడీపీ జిల్లాలో జనసేన పార్టీ జెండా పీకేసే పనిలో ఉంది. క్యాడర్ అంతంత మాత్రంగా ఉన్న జనసేన పార్టీ ఉనికి నెల్లూరు, కావలిలో మాత్రమే కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ దఫా ఎన్నికల నాటికి కావలి, నెల్లూరు సిటీ, రూరల్లో మాత్రమే నియోజకవర్గ స్థాయి లీడర్ల హడావుడి కొంత కనిపించింది. తాజాగా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ కేడర్ పూర్తిగా కనుమరుగైందనే చెప్పాలి. పాతాళంలోకి పడిపోయి గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నెల్లూరు సిటీలో కేతంరెడ్డి వినోద్రెడ్డి, నెల్లూరు రూరల్లో మనుక్రాంత్రెడ్డి, కావలి నుంచి అలహరి సుధాకర్ జనసేన పార్టీని కనిపెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉనికి చాటుకుంటూ వచ్చారు. అయితే జనసేన అధినేత పవన్కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచి పొత్తు పెట్టుకోవడంతో నెల్లూరు సిటీ నుంచి నారాయణ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని గ్రహించిన కేతంరెడ్డి వినోద్రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పి తన భవిష్యత్ కోసం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో మనుక్రాంత్రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి సిటీకి మారిపోయారు. పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ నుంచి తనకు అవకాశం వస్తుందని భావించిన మనుక్రాంత్రెడ్డి సిటీ పరిధిలో డివిజన్ల వారీగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. అయితే నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్య ర్థిగా నారాయణ పేరు ఖరారు కావడంతో కనీసం నెల్లూరు రూరల్ సీటు అయినా వస్తుందని ఆశించిన మనుక్రాంత్కు భంగపాటు తప్పలేదు. దీంతో పార్టీ క్యాడర్ సైతం చెల్లాచెదురై పరిస్థితి పాతాళానికి పడిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలు ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థులు వారిని కనీసం దరిచేరనీయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పనిచేయడం అవసరమా? అని లోలోన మదనపడుతున్నారు. ఎన్నికల తర్వాత గ్లాసు కనిపించేనా.. ప్రస్తుతం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదు. అయినప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జిలు టీడీపీ విజయం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా.. టీడీపీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా జనసేన జెండా పీకేసేందుకు కంకణం కట్టుకున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ తన బినామీ అయిన గునుకుల కిషోర్ను జనసేనలోకి పంపి ఆయన్ను ముందుంచి మనుక్రాంత్రెడ్డిని ఎన్నికల క్షేత్రంలో లేకుండా చేశారు. నారాయణ తన పార్టీ కేడర్తో జనసేన జెండాలు మోయిస్తూ ఆ పార్టీని దాదాపు లేకుండా చేశారు. కావలిలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అలహరి సుధాకర్ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కోసం పనిచేస్తున్నారు. అయితే కావ్య కృష్ణారెడ్డి తనదైన ధోరణిలో జనసేన క్యాడర్ను టీడీపీ కండువా కప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు అలహరి సుధాకర్ ఇటీవల నాగబాబు, నాదెండ్ల మనోహర్లను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని తెలిసింది. జిల్లాలో ఎక్కడైతే జనసేన ఉనికి ఉందో అక్కడ ఆ పార్టీ క్యాడర్ను సైతం టీడీపీలో కలిపేసుకుని ఆ పార్టీ జెండా పీకేసే పనిలో పచ్చనేతలు నిమగ్నమయ్యారు. ఇదంతా టీడీపీ అధినేత సూచనల మేరకే జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన జెండా కనిపించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సర్వే పేరుతో అయోమయం బయటపడ్డ కాల్ రికార్డు
-
జనసేనకు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా
-
పవన్ కళ్యాణ్..మరీ ఇంత దుర్మార్గమా ?
-
‘టీ టైమ్’ దెబ్బకు ‘సానా’ ఔట్ ఆశ పెట్టి.. జెల్ల కొట్టి..
ఎంపీ సీటు ఇస్తామంటూ తొలి నుంచీ ఆశ పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయించేశారు. బలి తీసుకునే వాడినే గొర్రె నమ్ముతుందన్నట్టు.. చంద్రన్న మాటలు నమ్మిన ఆ వ్యాపారవేత్త.. ఆయన బుట్టలో పడ్డారు. బాబుగారు చెప్పినట్టల్లా తలాడించారు. సీన్ కట్ చేస్తే.. చివరాఖరుకు చంద్రన్న ఖాతాలో మరో కరివేపాకుగా మారారు. అవసరానికి వాడుకోవడం.. ఆనక విసిరి పారేయడంలో ఆరితేరిన చంద్రబాబు చేతిలో.. టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ టికెట్టు ఆశించిన సానా సతీష్.. రాజకీయంగా ఖర్చయిపోయారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ, జనసేన పార్టీల్లో ఆశావహులను అయిన కాడికి వాడేసుకుని ఆనక కరివేపాకుల్లా తీసిపారేస్తున్నారు. ఎన్నికల్లో సీట్లు ఇస్తామంటూ ఆశలు కలి్పంచి, పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టించేస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఇంకో సీటు వచ్చేస్తుందనే గంపెడాశతో ఆశావహులు కూడా భారీగానే చేతిచమురు వదిలించేసుకుంటున్నారు. ఈ తతంగమంతా పూర్తయి.. అభ్యర్థుల ప్రకటన దగ్గరకు వచ్చేసరికి లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న వారిని అధినేతలు బకరాలను చేసేస్తున్నారు. వారికి మాటమాత్రంగానైనా చెప్పకుండా వేరేవారికి సీట్లు అప్పగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ సీటు ఆశించిన సానా సతీష్ను రాజకీయంగా బలి తీసుకున్నారని ఆ పార్టీలోని సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారు. పవన్ ప్రకటనతో.. పిఠాపురం నుంచి తాను, కాకినాడ లోక్సభ స్థానం నుంచి టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ తనను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్షా వంటి వారు ఒత్తిడి తెస్తే తాను, ఉదయ్ శ్రీనివాస్ తమ స్థానాలను మార్చుకుంటామని మళ్లీ కొద్ది రోజుల్లోనే చెప్పారు. దీనిపై అటు పిఠాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆయన అనుచరులు మాటల మంటలు రేపుతూండగా.. ఇటు తనకు టీడీపీ నుంచి సానా సతీష్కు ఎంపీ సీటు గల్లంతైనే విషయం స్పష్టమైంది. టీ టైమ్ దెబ్బకు సానా సతీష్ టికెట్టు గోవిందా అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాటవరసకైనా చెప్పకుండా.. కాకినాడకు చెందిన సానా సతీష్ ఏపీ ఈపీడీసీఎల్లో పని చేస్తూ.. ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి, మద్యం తదితర వ్యాపారాల్లో ఉన్నారు. ఆయనపై చంద్రబాబు వల వేశారు. కాకినాడ ఎంపీ సీటు ఇస్తామంటూ ఊరించారు. ఆయన మాటలు నమ్మిన సతీష్.. విపక్ష కూటమిలో ఎవరికి అవకాశం వచ్చినా కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉండేది తానేనని ప్రచారం చేపట్టారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోస్టర్లు, స్టిక్కర్లతో తన అనుచరుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. వాస్తవానికి టీడీపీ, జనసేన పొత్తులు తేలడానికి ఆరు నెలల ముందు నుంచే సతీష్ రూ.కోట్లు తగలేసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు జిల్లా పర్యటనలకు వచ్చిన సందర్భంలో ఆయా కార్యక్రమాలకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇంత చేసినా చివరకు సతీష్ ఆశలకు గండి కొట్టారని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇరు పారీ్టలూ ఒకే రకమైన పంథాలో తమను అవసరానికి వాడేసుకుని, సీట్లు ఇవ్వాల్సి వచ్చేసరికి కరివేపాకులను చేశారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు సీటు ఎందుకు ఇవ్వడం లేదో కనీసం మాటవరసకైనా పిలిచి చెబుతారని సతీష్ ఆశించారు. కానీ, అలా జరగకపోవడాన్ని ఆయన వర్గం అవమానంగా భావిస్తోంది. ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు ఎటువంటి సంబంధమూ లేని కాకినాడ ఎంపీ సీటు కేటాయించడం అవివేకమే అవుతుందని అంటున్నారు. ఆయన కోసం తామెందుకు త్యాగాలు చేయాలని వారు ప్రశి్నస్తున్నారు. ఈ సీటును హఠాత్తుగా జనసేనకు కట్టబెట్టేస్తే ఇంత కాలం ఇరు పారీ్టల కోసం పని చేసిన సతీష్ వంటి వారు ఏమైపోతారని ప్రశి్నస్తున్నారు. వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి, అనుచరగణాన్ని అంతా కాకినాడలో మకాం చేయించి, గడచిన ఆరు నెలలుగా టీడీపీ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టిన తనకు సీటు సితార చేసేసి, తగిన బహుమతే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్యాగం పేరుతో తనను దూరం పెట్టడం బాధిస్తోందంటున్న సతీష్ వర్గీయులు.. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. -
Pawan Kalyan: నటుడా? నాయకుడా?
పవన్ కళ్యాణ్.. పరిచయం అవసరం లేని పేరు. 20 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాడు. ఆ పడవలో ఓ కాలు పెట్టి.. మరో కాలును రాజకీయాల్లోకి దించాడు. పోనీ ఇక్కడ ఇప్పటివరకు పొడిచింది ఏదైనా ఉందా.? అంటే ఒక్క ఎన్నికలోనూ గెలవలేకపోయాడు. సినిమాల్లో తప్ప అసెంబ్లీ గేటు వరకైనా వెళ్లలేకపోయాడు పవన్. ఆయనకున్న ఇమేజీ అలాంటిది. వై జంక్షన్లో దారెటు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు రెండు పరీక్షలున్నాయి. ఆయనిప్పుడు వై జంక్షన్లో వెయిట్ చేస్తున్నారు. మొదటి పరీక్ష పాలిటిక్స్. చివరి ప్రయత్నంగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. గెలుస్తాడో లేదో నమ్మకం లేదు కాబట్టి.. అసెంబ్లీకి పోటీ చేయాలా.. లేక పార్లమెంటుకు పోటీ చేస్తే బీజేపీ ఇమేజ్ కాపాడుతుందా? అన్న సందిగ్ధత. వెండి తెరపై టఫ్ టైం ఇక పవన్ ముందున్న రెండో పరీక్ష సినిమాలు. ఇప్పుడు పవన్ వయస్సు 52 ఏళ్లు. ఇన్నాళ్లు యూత్ పాత్రలో నటించినా.. పాటలకు స్టెప్పులు వేసినా.. అభిమానులు అతి కష్టమ్మీద చూసుకొచ్చారు. ఇప్పుడు వయస్సు మీద పడుతోంది. ఎంత మేకప్ వేసినా.. ముఖంలో వయస్సు తాలుకు ముడతలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వయస్సుకు తగ్గ పాత్రలు దొరికితేనే.. సినిమాలు నడుస్తాయి. (చదవండి: రీల్ వర్సెస్ రియల్లో... పవన్ గందరగోళం!) ఏతా వాతా చెప్పేదేంటంటే.. పవన్ మార్కెట్ ఇప్పుడు అనుకున్నంత లేదు. అంతెందుకు పవన్ అనగానే.. ఊగిపోయే అభిమానులు కూడా ఇప్పుడు ఆచితూచి థియేటర్ల వైపు వస్తున్నారు. ఉదాహరణకు రీఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. అంతెందుకు ఇంకొంచెం ముందుకు వెళ్తే.. అజ్ఞాత వాసి, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్.. ఏ సినిమాను చూసినా బాక్సాఫీసు కంటే ముందే గ్లాసు పగిలిపోయింది. అంటే ఇప్పుడు పవన్ లేని మార్కెట్ను సృష్టించుకునేందుకు ఆరాటపడుతున్నాడు. రాజకీయాల్లో నటిస్తే ఒప్పుకుంటారా? ఎలక్షన్స్ కోసమే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏవో రెండు డైలాగ్స్తో ఒక వీడియోను విడుదల చేశాడు పవన్. పైకేమో సినిమా అంటూ అందులో పొలిటికల్ డైలాగ్స్ను చదివాడు పవన్. తానే గొప్పని చెప్పుకునేందుకు తనను తాను కీర్తించుకున్నాడు. ఆ వీడియోలో గాజు పగిలేకొద్దీ పదునెక్కుతుంది అంటూ.. చెప్పిన పవన్ ఒక లాజిక్ మిస్ అయ్యాడు. గాజు పగిలే కొద్ది పనికిరాకుండా పోతుందనే విషయాన్ని కూడా లక్ష పుస్తకాలు చదివిన పవన్ తెలుసుకోలేకపోయాడు. సముద్రం వంగదు, పర్వతం పడుకోదు, 24 అంటే గాయత్రి మంత్రం వంటి త్రివిక్రమ్ డైలాగ్స్ వినిపించాడు. కానీ రియాల్టీలో చంద్రబాబు దగ్గర వంగిపోతున్నాడు. చేతులు కట్టుకుని సాగిలబడుతున్నాడన్నది రియల్ పాలిటిక్స్లో వినిపించే విమర్శలు. అందుకే సీఎం సీఎం అని పిలిపించుకున్న పవన్.. తనను తాను బాగా తగ్గించుకుని 21 సీట్లకు పరిమితం చేసుకున్నాడు. చంద్రబాబు చెప్పిన చోట పోటీ చేసేందుకు రెడీ అయిపోయాడు. (చదవండి: బాబు ఇచ్చిందే జనసేనకు ప్రాప్తం) విశ్వసనీయత కనిపించడం లేదు? రాజకీయ నాయకుడికి కావాల్సిన ప్రాథమిక లక్షణం విశ్వసనీయత. ఆ సూత్రాన్ని పవన్ ప్యాకేజీతో మార్చేశాడు. అందుకే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశం నుంచి ఎవరు, ఎక్కడి నుంచి బరిలో దిగుతారన్న డైరెక్షన్ చంద్రబాబు ఇస్తారంటారు జనసైనికులు. అందుకే చాలా ఏళ్లుగా జనసేనను నమ్ముకుని, ఆస్తులు అమ్ముకొని డబ్బులను పార్టీ కోసం ఖర్చు పెట్టిన కొందరి నేతలకు టికెట్లు దక్కలేదు. ఒక నటుడు.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. కొన్ని నెలలపాటు అదొక అద్భుతం, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాతావరణం అలవాటైన సినిమా హీరో పవన్ కల్యాణ్కు.. వాస్తవాలు అర్థమయ్యే అవకాశం ఎప్పటికీ ఉండదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇంకా క్లారిటీ వచ్చినట్లు లేదు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడమా, లేదా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడమా అనేది అమిత్ షా డిసైడ్ చేస్తారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. మరీ క్లారిటీ ఇప్పటికైనా వచ్చిందో లేదో తెలియాల్సి ఉంది. కిం కర్తవ్యం? 2024 ఓ రకంగా పవన్ను అటో ఇటో తేల్చేసే ఏడాది. ఎన్నికల్లో పవన్ ఓడితే రాజకీయంగా ఆయన దుకాణం బంద్. ఇప్పటికే జనసేన పార్టీని చంద్రబాబుకు లీజ్కు ఇచ్చేసినట్టే. కనీసం పాతిక స్థానాల్లో కూడా పోటీ చేయలేని పార్టీని ఇంకా ముందు ముందు ఏ రకంగా నడుపుతాడు? అసెంబ్లీకి పోటీ చేయాలా? పార్లమెంటుకు పోటీ చేయాలా అన్న సందేహాలే ఇంకా వెంటాడితే నాయకుడు ఎలా అవుతాడు? ఇక మిగిలింది సినీ రంగం. కొత్త నటులెందరో దూసుకువస్తున్నారు. ఇంతకు ముందులా కాకుండా..ఓటీటీ ఎంటర్ అయింది. కంటెంట్ బాగుంటే కటౌట్ అవసరం లేదని తేల్చేస్తోంది. ఇప్పుడు పవన్ను నమ్మి భారీ బడ్జెట్తో సినిమాలంటే చేతులు పూర్తిగా కాల్చుకోవడమన్నది అందరికి అవగాహనలోకి వచ్చింది. పైగా 52 ఏళ్లలో హీరోయిన్లతో స్టెప్పులేయడం కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. నిజజీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నంత మాత్రాన.. తనను తాను ఇంకా యంగ్ అనుకోవడం కూడా అంత బాగుండదు.పెరిగిన వయస్సుకు తగ్గట్టుగా హుందాగా ఉండి ఉంటే.. సినిమాల నుంచి రాజకీయాల వైపు ఓ ట్రాన్సిషన్ వచ్చి ఉండేది. కానీ.. కేవలం సినీ ఇమేజీతో గట్టెక్కుతానంటే ఓటర్లెలా నమ్ముతారు? -
జనసేనల మధ్య పెరుగుతున్న గ్యాప్
జిల్లాలో పొత్తు రాజకీయాల్లో జనసేన చిత్తయిపోయింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి పోకడలు ఆ పార్టీ శ్రేణుల్లో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశాయి. పొత్తు ప్రకటన నుంచి సమన్వయ సమావేశాలు, సీట్ల కేటాయింపులు, ఎన్నికల ప్రచారం వరకు టీడీపీ నేతలు తమను చిన్న చూపు చూస్తున్నారని జనసేనలు మండిపడుతున్నారు. జనసేన అంతర్గత వ్యవహారాల్లో దామచర్ల తలదూర్చి పార్టీ విచ్ఛిన్నం చేసే చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. టీడీపీ ఆఫీసులో తమ పార్టీ నేతలతో సమావేశం పెట్టడం ఏమిటని రగిలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఆది నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత జిల్లాలో నిర్వహించిన పలు సమన్వయ సమావేశాలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహార శైలిపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి సమావేశానికి దామచర్ల దాదాపు మూడు గంటల ఆలస్యంగా రావడమే కాకుండా తమ వారిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇక రెండో సమావేశంలో అయితే కూర్చునేందుకు సీట్లు కూడా లేకుండా చేశారని వాపోతున్నారు. తాజాగా గురువారం టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనేక సందర్భాల్లో తమ పార్టీ నేతలను అవమానించిన నేపథ్యంలో ఈ సమావేశానికి గ్లాస్ పార్టీకి చెందిన కీలక నేతలు, వారి అనుచర వర్గం డుమ్మా కొట్టింది. దామచర్ల తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జనసేన నేతలకు మింగుడు పడడంలేదు. ఇదిలా ఉంటే జనసేన సమావేశం టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం ఏమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. రెండు పార్టీల్లోనూ ఈ అంశం హాట్టాపిక్గా మారింది. వర్గ రాజకీయాలకు ఆజ్యం దామచర్ల తమ పార్టీలో రెండు వర్గాలను పెంచిపోషించాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమేమిటని నిలదీస్తున్నాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ను ప్రోత్సహిస్తూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణను చిన్న చూపు చూశారని, ఇటీవల ఆమైపె జరిగిన దాడిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సీట్ల కేటాయింపులో మొండిచేయి ఇక సీట్ల విషయంలో కూడా అన్యాయమే జరిగిందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి రెండు లేదా మూడు సీట్లను జనసేన నేతలు ఆశించారు. అయితే చివరకు ఒక్క సీటూ ఇవ్వకపోవడంపై కూడా గ్లాసు కేడర్ గుర్రుగా ఉన్నారు. ఐదేళ్లుగా పార్టీ అభ్యున్నతికి కష్టపడిన తమను మిత్రపక్షం నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే పార్టీలో ముఖ్య నేతలను తనకు అనుకూలంగా పెట్టుకుని మీ అందరికీ న్యాయం చేస్తానని దామచర్ల హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పార్టీ శ్రేణులు మాత్రం రగిలిపోతున్నారు. అయితే ఎన్నికల వేడి మొదలైన తర్వాత కూడా వారిని అసలు పట్టించుకోకపోవడంతో కీలక నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సమావేశానికి షేక్ రియాజ్, అరుణ వర్గాలు డుమ్మా కొట్టాయని సమాచారం. మొత్తం మీద టీడీపీ అధ్యక్షుడు దామచర్ల గ్లాసులో తుఫాన్ సృష్టించి ఆ పార్టీ పతనానికి బీజాలు వేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దామచర్ల తీరుతో మనస్తాపం... ఇచ్చిన మాటను నిలుపుకోవడం అలవాటు లేని దామచర్ల జనార్దన్ సహజంగానే రియాజ్ కు ఇచ్చిన మాటను కూడా మరిచిపోయారు. ఎన్నికల ప్రచారానికి రియాజ్ను, అతడి వర్గాన్ని వాడుకుంటున్నారు. జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల తరువాత పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు జనసేనలు. దీంతో ఆ పార్టీ నేతలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజుల కిందట నగరంలోని ఒక హోటల్లో దామచర్ల..రియాజ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మీరందరూ సహకరించండి ఎన్నికల తరువాత న్యాయం చేస్తానని జనార్దన్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం ఎటూ తేలకపోవడంతో రియాజ్ జనసేన సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మా కార్యకర్తలతో సమావేశమా... అంతేకాకుండా జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడాన్ని రియాజ్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని జనసేన కార్యాలయంలో నిర్వహిస్తేనే బాగుంటుందని ఆయన చెప్పినా దామచర్ల లెక్కచేయకపోవడంతో రియాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయని, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఉంచుకొని సొంతంగా కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేని దీనస్థితిలో ఉన్నట్లు ప్రజలు చెప్పుకుంటారని చెప్పినా వినకుండా కావాలనే టీడీపీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో రియాజ్ వర్గం ఈ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
నీవు నేర్పిన విద్యయే ‘నారా’జాక్ష
పెందుర్తి: ఇంటి పెద్ద నడవడికను బట్టి..ఆ కుటుంబంలో మిలిగిన వారి వ్యవహారశైలి ఉంటుంది. కచ్చితంగా ఇంటి పెద్ద ప్రభావం కాస్తో కూస్తో పడుతుంది. మరి అక్కడున్న పార్టీ పెద్ద వెన్నుపోటు పొడవడంలో ఘనాపాటి. ఆయన వెన్నుపోటు రాజకీయాలను అడుగడుగునా అందిపుచ్చుకున్నారు పెందుర్తి తెలుగు తమ్ముళ్లు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అనే సామెత.. ఇప్పుడు పెందుర్తిలో నీవు నేర్పిన విద్యయే ‘నారా’జాక్షగా మారింది. తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తుపాట్లు ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.. పెందుర్తి తెలుగుదేశం ద్వితీయశ్రేణి నేతలు ప్లేటు ఫిరాయింపులతో జనసేన నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ‘పొత్తులో భాగంగా ఇరు పార్టీల పెద్దలు కలిసి మంచి నిర్ణయం తీసుకున్నారు. జనసేన నుంచి మీకు (పంచకర్ల రమేష్బాబు) టికెట్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందం కలిగింది. బండారు సత్యనారాయణమూర్తి మద్దతు ఉన్నా లేకపోయినా..మేమంతా మీతోనే ఉంటాం. టీడీపీ ఓట్లన్నీ మీకే పడేలా చూస్తాం’ అని బుధవారం జనసేన నేత పంచకర్ల రమేష్బాబుతో పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల హామీ ఇచ్చారు. ‘మా బండారు సత్యనారాయణమూర్తికి అన్యాయం జరిగింది. టీడీపీ అధిష్టానం పునరాలోచన చేయాలి. జనసేనకు టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితిలోనూ పడవు. అదే టీడీపీ నుంచి అభ్యర్థి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సీనియారిటీ బట్టి అయినా బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ ఇవ్వాలి. లేకపోతే మేమంతా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాం’ గురువారం సబ్బవరం కేంద్రంగా అదే టీడీపీ నాయకుల యూటర్న్ వాఖ్యల చేయడం చర్చనీయాంశమైంది.. వెన్నుపోటు 2.0 మాట మార్చడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిపోయారు పెందుర్తి తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థిగా దాదాపు ఖరారైన జనసేన నేత పంచకర్ల రమేష్బాబుకు టీడీపీ నాయకులు ఒక్కరోజు తిరగకముందే జలక్ ఇచ్చారు. బుధవారం పంచకర్ల నివాసంలో ఆయనను కలిసి మా సంపూర్ణ మద్దతు మీకే అంటూ నమ్మబలికి..24 గంటలు తిరగక ముందే గురువారం సాయంత్రం సబ్బవరం మండల కేంద్రంలో అదే టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ కేటాయించాలంటూ నిరసన తెలిపారు. ఈ పరిణామం చూసి ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఉలిక్కి పడగా..జనసేన నేతలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. టీడీపీ నాయకుల డబుల్ గేమ్తో పంచకర్ల అనుచరులు తలలు పట్టుకుంటున్నారు. ఛీఛీ ఇవేం వెన్నుపోటు రాజకీయాలు సాధారణంగా రాజకీయాల్లో రెండు పార్టీ మద్య పొత్తు కుదిరితే ఎవరికి టికెట్ వచ్చినా మిగిలిన పార్టీ వారు సహకరించడం సర్వసాధారణం. కానీ పెందుర్తి టికెట్ విషయానికి వస్తే టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి, జనసేన నుంచి పంచకర్ల రమేష్బాబు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పొత్తులో భాగం జనసేన అధినేత పవన్కల్యాణ్ తమకు కేటాయించిన 21 సీట్లలో పెందుర్తిని చేర్చి కూటమి నుంచి పంచకర్ల రమేష్బాబుకి మాటిచ్చారు. ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు రమేష్బాబుకే టికెట్ అని జనసేన నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ మేరకు రమేష్బాబు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం పెందుర్తి, సబ్బవరం, పరవాడకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులంతా పంచకర్లను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే వెన్నుపోటుకు మారుపేరైన టీడీపీ నాయకులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. బుధవారం సబ్బవరంలో పంచకర్లకు మద్దతు పలికిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులే బండారు సత్యనారాయణమూర్తికి మద్దతుగా అతనికి టికెట్ కేటాయించాలని..లేకపోతే తాము టీడీపీకి రాజీనామాలు చేస్తామని గురువారం హెచ్చరికలు జారీ చేశారు. పంచకర్లకు మద్దతుగా ఎట్టి పరిస్థితిలోనూ పనిచేయబోమని తేల్చి చెప్పారు. దీంతో జనసేన కార్యకర్తలు, నేతలు ఛీఛీ ఇవేం రాజకీయాలు..ఇదేం పొత్తు ధర్మమంటూ టీడీపీ నేతలను ఛీదరించుకుంటున్నారు. -
పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ వైఎస్సార్సీపీలోకి జనసేన 100 కుటుంబాలు
-
పవన్ కళ్యాణ్ కు జనసేన సీనియర్ నేతలు భారీ షాక్
-
టీడీపీ, జనసేనకు షాకిచ్చిన ఎన్నికల కమిషన్
-
జనసేన...వేసెయ్ టీడీపీ కండువా
నర్సీపట్నం : ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కండువాల రాజకీయానికి తెరలేపారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇరుపార్టీలు వలసలు ప్రోత్సహించుకోకూడదని ఒప్పందం చేసుకున్నారు. కానీ అయ్యన్నపాత్రుడు మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టి జనసేన నాయకులను టీడీపీలో చేర్చుకోవడానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న జనసేన క్యాడర్కు అయ్యన్నపాత్రుడు వ్యవహారశైలి మింగుడు పడడం లేదు. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు అయ్యన్నపాత్రుడు చోటామోటా నాయకులకు కండువాలు వేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు ప్రోత్సహిస్తున్న వలసలతో నియోజకవర్గంలో జనసేన కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నర్సీపట్నం మండలం, చెట్టుపల్లి గ్రామానికి చెందిన గజాల నాగరత్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్గా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ రాజాన వీర సూర్యచంద్ర, పూడి చక్రవర్తి, అద్దేపల్లి గణేష్ నాగరత్నంను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్ దంపతులు గజాల నాగరత్నం, సూరిబాబుతో పాటు నలుగురు వార్డు మెంబర్లు మంగళవారం అయ్యన్నపాత్రుడు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మిత్ర ధర్మానికి అయ్యన్నపాత్రుడు తూట్లు పొడవడంతో పలువురు విస్మయం చెందుతున్నారు. అయ్యన్నపాత్రుడు కండువా రాజకీయంతో నియోజకవర్గంలో జనసేన పార్టీ తుడుచుపెట్టుకుపోతుందని చెబుతున్నారు. -
జనసేన దుకాణం క్లోజ్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని కొద్ది రోజులుగా తెరవడంలేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టు లెట్ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలెవరూ ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవనం యజమాని పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించినట్టు సమాచారం. ఓ పక్క పొత్తుల్లో అధిక శాతం సీట్లు కోల్పోవడం, ఉన్న సీట్లను కూడా కొత్తగా వచ్చిన వారికి ఇస్తుండటంతో స్థానిక నేతలందరూ పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లూ డబ్బు ఖర్చుపెట్టుకొన్న తమను పొత్తులు, కొత్తవారికి సీట్లతో దెబ్బ తీశారని కుతకుతలాడుతున్నారు. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి సీట్లు జనసేనకు వచ్చాయి. పారీ్టలో మొన్ననే చేరిన వంశీకృష్ణకు విశాఖ దక్షిణ స్థానాన్ని, అంతకుముందు చేరిన పంచకర్లకు పెందుర్తి, నిన్న చేరిన కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచీ ఉండి పనిచేసిన తమను కాదని కొత్తగా వచి్చన వారికి పెద్దపీట వేయడాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే అనకాపల్లి నేత పరుచూరి భాస్కర్రావు, పెందుర్తి నేత కంచిపాటి కాశీవిశ్వనాథనాయుడు పార్టీకి రాజీనామ చేశారు. మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. నేతలెవ్వరూ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఆ భవనం అద్దె కూడా వృథా అని భావించి, అద్దె కట్టడం మానేసినట్లు సమాచారం. ఇది రెండోసారి జనసేన కార్యాలయం మూతపడటం ఇది రెండోసారి. గతంలో నరసింహనగర్ రైతుబజార్ సమీపంలోని అపార్టుమెంట్లో పార్టీ కార్యాలయం ఉండేది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ కార్యాలయాన్ని మూసివేశారు. కొద్ది రోజులు పార్టీ కార్యాలయం లేకుండానే కాలం వెళ్లదీశారు. రెండేళ్ల క్రితం మాధవధారలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ఇప్పుడు మూతపడటంతో ఉత్తరాంధ్రలో ముందుగానే దుకాణం సర్దేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అందుకే ప్రజాగళం సప్పగా సాగింది
ఆంధ్రప్రదేశ్లో విపక్ష మూడుపార్టీల కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ జరిగిన తీరు చూస్తే వారు చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభ ఇంత అద్వాన్నంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. బహుశా మోదీ కూడా ఇంత నాసిరకంగా సభ జరుగుతుందని అనుకుని ఉండరు. సభలో మోదీ ప్రసంగిస్తుండగా, పలుమార్లు మైక్ ఆగిపోవడం, దాంతో ఆయన అసహనం వ్యక్తం చేయడం, అంతకుముందు ప్రధానిని చంద్రబాబు సత్కరిస్తారని అనౌన్స్ చేస్తే, ఆయన చేతిలో పుష్పగుచ్చం కూడా లేకపోవడం, అయోమయంగా నిలబడడం వంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి తప్పుల సంగతి పక్కనపెడితే , సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ , ప్రధాని మోదీలలో ఎవరూ కూడా ఏపీలో తమను ఎన్నుకుంటే ఏమి చేసేది ఒక్కమాట కూడా చెప్పకపోవడం గమనించాల్సిన విషయం. మోదీ అన్నా కాస్తో,కూస్తో ఏపీకి ఫలానాది చేశాం అని చెప్పుకున్నారు. తద్వారా ఏపీలో వైఎస్ జగన్ హయాంలో అభివృద్ది జరిగిందన్న పాయింట్ ను పరోక్షంగానైనా అంగీకరించారు. కేంద్ర స్కీముల గురించి ప్రచారం చేసుకునే క్రమంలో ఆయన ఈ సంగతులు చెప్పారు. కొన్ని విద్యాసంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిపారు. ఏపీకి పది లక్షల ఇళ్లు మంజూరు చేశామని ఆయన అన్నారు. దేశచరిత్రలో ఎప్పుడు,ఏ రాష్ట్రంలో లేని విధంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహాలు నిర్మిస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. దానిని కొంతవరకు మోదీ కూడా ఒప్పుకున్నట్లయింది. అలాగే మరికొన్ని స్కీములు జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ గురించి కూడా మోదీచెప్పుకున్నారు. అసలు ఏపీలో అభివృద్ది లేదని ఆరోపించే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మోదీనే సమాధానం ఇచ్చినట్లయింది. మోదీ ఎక్కువ సేపు కేంద్ర ప్రభుత్వం తీరుతెన్నులు, ఎన్డీఏ ప్రాముఖ్యత,400 సీట్లు తదితర విషయాల గురించే మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఆయన పెద్దగా ఏమీ విమర్శలు చేయలేదనే చెప్పాలి. కేవలం మంత్రులపై జనరల్ గా చేసే ఒక ఆరోపణ మాత్రం చేశారు.కాంగ్రెస్ , వైఎస్ఆర్సీపీలు ఒకటేనని మోదీ చేసిన వ్యాఖ్య విన్నవారంతా నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి జగన్ సోదరి షర్మిల నాయకత్వం వహిస్తున్నప్పటికీ ,ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని అందరికి తెలుసు. కాకపోతే ఇంకోరకంగా ఆలోచిస్తే, కాంగ్రెస్ వారంతా అనవసరంగా ఆ పార్టీకి వేయకుండా, వైఎస్సార్సీపీకి వేయండని సూచించారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మోదీకుటుంబ రాజకీయాల గురించి ప్రస్తావించారు. కాకపోతే తన పక్కనే ఒవైపు చంద్రబాబు, మరో వైపు పురందేశ్వరిని కూర్చోబెట్టుకున్నారు. వీరిద్దరూ ఎన్టీఆర్ కుటుంబంలో భాగంగా చూస్తారో,లేదో తెలియదు. మోదీ చెప్పిన దాని ప్రకారం బీజేపీ కూడా ఒక కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. అంతేకాదు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, లోకేష్ , భరత్ ఇలా పలువురు సన్నిహిత బందువులు టీడీపీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పొత్తుపెట్టుకునే వరకు టీడీపీని కుటుంబ పార్టీ అని, చంద్రబాబు వెన్నుపోటుదారుడని బిజెపి జాతీయ నేతలు సునీల్ ధియోధర్ తో సహా పలువురు ద్వజమెత్తేవారు. ఆ విషయాన్ని విస్మరించి మోదీ మాట్లాడడం బాగోలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీకి ఉపయోగం జరుగుతుందని అన్నారు.ఏ రకమైన అభివృద్ది చేస్తారో ఆయన ఒక్క మాట వివరించలేకపోయారు. ప్రత్యేక హోదా ,పోలవరం నిధులు, రైల్వేజోన్ ,ఏపీకి రావల్సిన ఆస్తులు, ఇతర విభజన హామీలు ఒక్కటి కూడా ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయబోమని కూడా అనలేదు.2014లో ప్రత్యేక హోదాతో సహా పలు హామీలను ఈ మూడుపార్టీలు తిరుపతి సభలో ఇచ్చాయి. ఈసారి చంద్రబాబు,పవన్ లు కనీసం వాటి గురించి మాట్లాడే ధైర్యమే చేయలేకపోయారు. దాంతో మోదీకి వాటిపై జవాబు ఇవ్వవలసిన అవసరం లేకుండా పోయింది. నిజానికి మీటింగ్ లో మోడీ, చంద్రబాబు పక్కపక్కన కూర్చున్నప్పటికీ, వారిలో ఆ సంతోషం కనిపించలేదు. గతంలో ఒకరినొకరు దూషించుకున్న ఘట్టాలే గుర్తుకు వచ్చి ఉండాలి. మోదీకూడా ఏదో మొక్కుబడిగా వచ్చినట్లే ఉంది కాని, గతాన్ని పూర్తి మర్చిపోయారనిపించలేదు. అప్పట్లో మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడని, అవినీతిపరుడని.. నోట్ల రద్దుతో దేశాన్ని నాశనం చేశాడని..ఇలా ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు పక్కన కూర్చోవలసి వచ్చినందుకు మోదీబాధపడి ఉండాలి. చంద్రబాబును ఎన్డీయేలో చేర్చుకోవడం ,కలిసి సభలో పాల్గొనడం ద్వారా మోదీ కూడా అవకాశవాదే అన్న అభిప్రాయం ఏర్పడింది. 2019లో చంద్రబాబును యుటర్న్ బాబు అంటూ ఎద్దేవ చేస్తూ, అమరావతి, పోలవరం ప్రా.జెక్టులలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మోదీతీవ్రంగా విమర్శించారు. అమరావతి కుంభకోణాలపై విచారణ చేయిస్తామని బీజేపీ మానిఫెస్టోలో కూడా తెలిపారు. అయినా వాటన్నిటిని పక్కనబెట్టిన తీరు,తాను కూడా యుటర్న్ తీసుకున్న వైనం, మోదీకి కూడా పరువు తక్కువే అని ఒప్పుకోవాలి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే గతంలో మోదీని దూషించినవన్ని మర్చిపోయినట్లు నటిస్తూ కూర్చోవడమే కాకుండా, సభలో మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడారు. దేశం మోదీ నాయకత్వంలోనే ముందుకు వెళుతోందని, విశ్వగురు అని తన స్పీచ్ లో ఎక్కువ భాగం ఆయన కటాక్షం కోసమే మాట్లాడారు. మిగిలిన కాసేపు ముఖ్యమంత్రి జగన్ ను దూషించడానికి సమయం కేటాయించారు. జగన్ వల్ల రాష్ట్రానికి ఏదో చాలా నష్టం జరిగిపోయిందని ఎప్పటిమాదిరే భ్రమ కల్పించే యత్నం చేశారు. తాను జగన్ పై ఏ ఆరోపణలు చేస్తున్నది మోదీకి అర్ధం కావడం కోసం ఇంగ్లీష్ లో కూడా చంద్రబాబు రెండు,మూడు వ్యాక్యాలు చెప్పారు. 2014-19 మధ్య తాను ఫలానా గొప్పపని చేశానని చంద్రబాబు చెప్పుకోలేకపోయారు. అమరావతి గురించి మాత్రం మాట్లాడారు. కాని దానికి కేంద్రం లక్షకోట్ల నిధులుఇవ్వలేదని గతంలో చేసిన విమర్శలను ఆయనప్రస్తావించలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ యధా ప్రకారం తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఏపీలో గంజాయి అని, అమ్మాయిల మిస్సింగ్ అంటూ పిచ్చి లెక్కలు చెప్పి సభికులను విసిగించారు. విశేషం ఏమిటంటే ప్రధాని మోదీ వీరిద్దరూ జగన్ పై చేసిన తిక్క,తిక్క ఆరోపణలను వేటిని పట్టించుకోలేదు. దాంతో వీరికి ఉసూరుమన్నంత పని అయింది. మోదీ ఏదో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడతారని వీరు ఆశించారు. కాని మోదీ ఆ స్థాయికి దిగజారకుండా కాస్త పద్దతిగానే ఉన్నారని చెప్పాలి. మరో మాట ప్రస్తావించాలి. జగన్ కు చెల్లెళ్లే ఓటు వేయవద్దంటున్నారని చంద్రబాబు అన్నారు. దానికి మాజీ మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అంత దుర్మార్గుడు లేడని , అతనిని ప్రజలు తిరస్కరించాలని స్వయంగా ఆయనకు పిల్లనిచ్చిన మామతో పాటు తమ్ముడు, బావమరిది, తొడల్లుడు, వదిన ..అందరూ ఆయా సందర్భాలలో అదే మాట చెప్పారని గుర్తు చేసి ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం తన సూపర్ సిక్స్ గురించి కూడా సభలో చెప్పకపోవడం గమనార్హం. ఓవరాల్ గా చూస్తే నేతలు ముగ్గురు మోదీ, చంద్రబాబు, పవన్ లు ఒక నిర్దిష్ట ఎజెండా లేకుండా మాట్లాడడంతో సభ అంతా చప్ప, చప్పగా సాగినట్లయింది. బీజేపీ నేత సోము వీర్రాజు ఎన్డీఏ అంటూ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వగా, మరో ఇద్దరు నేతలు సత్యకుమార్, సీఎం రమేష్ లు అచ్చం టీడీపీ నేతల మాదిరే మాట్లాడారు. సీఎం రమేష్ అయితే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చాలా అభివృద్ది జరిగిందని చెప్పారు. అంత గొప్పగా చంద్రబాబు, టీడీపీ పాలన సాగితే, ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఆ ఓటమి తర్వాత ఈయన బీజేపీలోకి ఎందుకు దూకారో కూడా చెప్పాలి కదా! వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణ చేసిన సీఎం రమేష్ పై ఆదివారం హిందూ దినపత్రిక ఒక సంచలన కథనాన్ని ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు మతలబు, నలభై కోట్లను రమేష్ వెచ్చించిన వైనం గురించి వార్తను ప్రచురించింది. సభకు హాజరైన జనం మీద కూడా రకరకాల అంచనాలు ఉన్నాయి. టీడీపీ మీడియా పదిహేను లక్షల మంది వస్తారని తొలుత ఊదరగొట్టాయి. కాని అసలు వచ్చిన జనం అందులో పదోవంతు కూడా ఉంటారో, ఉండరో అన్నట్లు సభ జరిగింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి కూడా వేలాది కుర్చీలు ఖాళీగా కనిపించాయి.ఈ నేపధ్యంలోనే టీడీపీ మీడియా అప్పుడే ఒక కల్పిత గాధను ప్రచారం చేసింది. ఆర్టిసీ బస్ లను అడిగినన్నీ అధికారులు ఇవ్వలేదని కొత్త రాగం తీసింది.ఇంకా నయం.. జనాన్ని తెచ్చే బాధ్యత కూడా ఆర్టిసి మీదో, లేక వైఎస్సార్సీపీ మీదో పెట్టలేదు!. సిద్దం పేరుతో వైఎస్సార్సీపీ నలభై రోజుల్లో నాలుగు అతి భారీ సభలు నిర్వహించి రికార్డు సృష్టిస్తే మూడు పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఒక సభను కూడా విజయవంతం చేసుకోలేకపోయాయి. దీనిని బట్టే ప్రజలలో ఈ పార్టీల కూటమిపట్ల వైముఖ్యత ఏర్పడిందన్న భావన కలుగుతుంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘సిద్ధం’ సభలపై ఎల్లో మీడియా ఏడ్చిచస్తోంది
మా చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటే ఒక్కడూ రాడా? అదే జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్దమా అంటే లక్షలాది మంది ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చి జయ జయ ధ్వానాలు పలుకుతారా? ఏంటీ అన్యాయం? ఏంటీ ఘోరం? అని తెలుగుదేశం-జనసేనలతో పాటు ఎల్లో మీడియా ఏడ్చిచస్తోంది. బాబు జేబు మీడియాల్లో ఒకటేమో అసలు జనమే రాలేదంది. ఇంకోటి అబ్బే వాళ్లు జనం కారు గ్రాఫిక్సే అని లోకేష్ చెప్పారంది. ఆ సభలకు ఇంత ఖర్చు అవసరమా అంది. వచ్చిన వాళ్లకి మూడుపూటలా భోజనాలు పెట్టేస్తున్నారని మరో ఏడుపు. ఇది భీమిలి సిద్ధం సభ. ఇదిగో ఇది దెందులూరులో జరిగిన రెండో సభ. ముచ్చటగా మూడోది అనంతపురం జిల్లా రాప్తాడు లోనిది. మొదటి మూడింటినీ తలన్నేసిన మేదరమెట్లలో జరిగిన నాలుగో సిద్ధం సభ. నాలుగు సభల్లోనూ జనసునామీలను చూశారు కదా. ఇంతమంది తరలి రావడం పచ్చ మందకు ఒక ఏడుపు అయితే వచ్చిన వారు తిన్నంగా కూర్చోకుండా జగన్ మోహన్ రెడ్డికి జై జై నినాదాలు కొట్టడం.. ఆయన ప్రసంగం చేసేటపుడు అడుగడుగునా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఎగిరి గంతులేస్తూ చేతులు ఊపుతూ జెండాలు రెపరెప లాడిస్తూ మహాజాతరను తలపించేలా వ్యవహరించడం పచ్చ బ్యాచ్కి అస్సలు నచ్చలేదు. అది వాళ్లకి జీర్ణం కాకుండా ఉంది. వాళ్లు అలా ఏడవడంలో అర్ధం కూడా ఉంది. లోకేష్ నిర్వహించే శంఖారావం సభలు చూశారుగా. జనం లేకుండా ఎలా వెలవెల బోతూ ఉంటాయో తెలుసు కదాచంద్రబాబు నాయుడు గొంతు చించుకుని రా కదలి రా బాబూ అని పిలిచినా జనం కుర్చీలు మడత పెట్టేసినట్లు అరకొరగా సభలో ఈసురోమంటూ కూర్చోవడాలు చూశారు కదా. తానొక్కడూ పిలిస్తే రావడం లేదని.. పవన్ కల్యాణ్ ను కూడా పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు తన పుత్రరత్నం లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో నిర్వహించిన బీసీ జయహో సభను చూశారు కదా. లక్షకు పైగా జనం వస్తారని టిడిపి నేతలు అంచనాలు వేసుకుంటే 12 వేల పైచిలుకు మంది మాత్రమే వచ్చిన దృశ్యం గుర్తుంది కదా. మంగళగిరి బీసీ జయహో సభ మంగళగిరిలో టిడిపి నిర్వహించింది బీసీల సభ. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే లక్షమందికి పైగా బీసీలు ఉంటారని అంచనా. ఇక క్రౌడ్ పుల్లర్ పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు కదా పవన్ అభిమానులు, ఆయన సామాజిక వర్గం ప్రజలూ కూడా తరలి వచ్చేస్తారు కదా అన్నది బాబు లెక్క. కానీ ఆ లెక్క తప్పేసింది. సభ చీదేసింది. బాబు మొహం మాడిపోయింది. పవన్ అహం దెబ్బతింది. లోకేష్ మొహం చిన్నబోయింది. టిడిపి నేతల్తో ఉన్న పిసరంత నమ్మకం కాస్తా పోయింది. రాసుకోడానికి ఎల్లో బ్యాచ్ కీ ఏమీ లేకుండా పోయింది. ఒకటి మన చంద్రబాబు మన పవన్ పెట్టిన సభలకు జనం రావడం లేదాయె.రెండోది జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా జన సునామీలు పోటెత్తుతున్నాయి.ప్రజలు ఇంత దారుణంగా తమని దూరం పెట్టేస్తే బాధగా ఉండదండీ? ఒళ్లు మండిపోదాండీ? పచ్చ పార్టీ ఇంత దైన్యంగా ఉంటే ఎల్లో మీడియాకు కడుపు మంట ఉండదాండీ?ఉంటుందుంటుంది. ఆ మంటతోనే ఈ రాతలు. రామోజీరావు పత్రికలో అయితే గ్రాఫిక్స్ అన్నారు. సరే గ్రాఫిక్స్ అయితే జనం లేనట్లే కదా. ఇక ఎల్లో వారికి ఇబ్బందేమిటి? వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేశారని నీచపు రాత రాయించారు రామోజీ. సిద్ధం సభలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తోంది కానీ..ప్రభుత్వానికి సంబంధం లేదు. అటువంటప్పుడు ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుంది? ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రామోజీ పత్రిక నడిపేస్తున్నారు. ఏడుపులు అన్నీ ఇన్నీ కావు. వచ్చిన వారికి బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులు ఇచ్చేస్తున్నారని రామోజీ రాసుకొచ్చారు. తమ సభలకు వచ్చిన వారికి కావల్సిన ఏర్పాట్లు చేయడం రాజకీయ పార్టీల బాధ్యత. గతంలో టిడిపి కూడా సభలు నిర్వహించింది. అప్పుడూ కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. బాబు హయాంలో అయితే బిర్యానీ ప్యాకెట్టే కాదు మందు బాటిళ్లు కూడా ఇచ్చేవారు. మరప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతోందని ఎందుకు రాయలేదు? సిద్ధం సభలతో మామూలు ప్రయాణికులకు బస్సులు చాలాక ఇబ్బందులు పడ్డారని రాశారు. నిజమే కొన్ని బస్సులు తగ్గినపుడు ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే స్వాతంత్ర్యం వచ్చింది లగాయితు అన్ని రాజకీయ పార్టీల సభలకూ ఆర్టీసీ బస్సులను వాడుకున్న చరిత్రే ఉంది. అపుడూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు హాయంలో టిడిపి సభలకు ఆర్టీసీ బస్సులు కాకుండా బెంజ్ కార్లను వాడారా? విషయం ఏంటంటే ఇబ్బంది పడుతోంది జనం కాదు. రామోజీరావు.రాథాకృష్ణ. అండ్ అదర్ ఎల్లో మీడియాసే. కుత కుత లాడిపోతోంది టిడిపి,జనసేన అధినేతలే.వణికిపోతోంది టిడిపి-జనసేన శ్రేణులే.అయితే దానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదు. తమని జనం ఎందుకు దూరం పెట్టారో చంద్రబాబు పవన్ లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలను వాళ్లు దూరం పెట్టడంతోనే..ప్రజాసంక్షేమాన్ని వారు అడ్డుకుంటున్నారు కాబట్టే..పేదల కు దోచిపెట్టేస్తున్నారని గుక్క పెట్టి ఏడుస్తున్నారు కాబట్టే చంద్రబాబు, పవన్ లను జనం దూరం పెట్టారు. ఇంకా దూరం పెడతారు. రేపు ఎన్నికల్లో మరింత దూరం పెట్టడానికి ఏం చేయాలో అదీ చేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే ముందుగా ప్రజలను ప్రేమించడం నేర్చుకోవాలి. అది వదిలేసి మేం పెత్తందార్ల కొమ్ము కాస్తాం..పేదల పొట్ట కొడతాం.. అయినా అందరూ మా వెంటే ఉండాలంటే కుదిరేపని కాదని ఎల్లో జనం గ్రహించాలి. -
తేలు కుట్టిన దొంగ రామోజీ
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించడానికి తీసుకున్న గడువు చూస్తే, మన దేశం ఇంకా ఎంతో వెనుకబడి ఉందన్న భావన కలుగుతుంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్లో ఎన్నికల ప్రక్రియ సుమారు రెండునర్నర నెలలు తీసుకుంటే ప్రజలకు వచ్చే ఇబ్బందులు, కష్టనష్టాల గురించి ఆలోచించినట్లు అనిపించదు. మండుటెండలో ప్రజలు నీటి కోసం బాగా ఇబ్బంది పడే రోజుల్లో ఎన్నికలు పెట్టడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం అంత బాగోలేదని చెప్పాలి. అంతా కలిపి మహా అయితే నెలన్నరలో పూర్తి చేసే విధంగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించకపోవడం కమిషన్ వైఫల్యం అనిపిస్తుంది. లేదా రాజకీయ జోక్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక ఎన్నికల కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండటం, మరో కమిషనర్ రాజీనామా చేయడం, కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఇద్దరు కమిషనర్లను నియమించడం.. వీటన్నిటిని చూస్తే ఎన్నికల కమిషన్లో పరిస్థితి సవ్యంగా ఉన్నట్లు అనిపించదు. గతంలో ఒకప్పుడు ఒకరే ఎన్నికల కమిషనర్ ఉండేవారు. శేషన్ ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు అప్పటి పీవీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మార్చింది. శేషన్ అందరిలోనూ దడ పుట్టించారంటే అతిశయోక్తి కాదు. ఆ సంగతి ఎలా ఉన్నా, కొత్త కమిషనర్లు వచ్చే వరకు షెడ్యూల్ను ప్రకటించకుండా ఆపవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన తర్వాత కానీ షెడ్యూల్ ప్రకటించరన్న అభిప్రాయం ఉంది. అలాగే ఆయన సదుపాయార్దం సాధ్యమైనంత ఎక్కువ చోట్ల ప్రచార ప్రసంగాలు చేయడానికి కూడా వెసులుబాటుగా ఇలా ఏడు దశలలో నిర్ణయిస్తున్నారని విపక్షం విమర్శిస్తోంది. దీనిని ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోయినా, ప్రజలకు సందేహాలు రావడానికి అవకాశం ఉంది. ఒక రకంగా ఇది రాజకీయమే అని అనుకోవచ్చు. దానికి తగినట్లుగానే షెడ్యూల్ను వారం రోజులు లేటు చేయడం, మండుటెండల్లో ఎన్నికలు నిర్వహించడం రాజకీయ పార్టీలకు పెద్ద సమస్యే అని చెప్పాలి. ఎన్నికలకు సిద్దమైన అభ్యర్ధులకు మరో నెల అదనంగా వ్యయ ప్రయాసలకు సిద్దం కావాలి. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలో 2019లో ఏప్రిల్ పదకొండో తేదీన ఎన్నికలు జరిగిపోయాయి. తొలి దశలో ఎన్నికలు పూర్తి అయితే, ఈసారి మాత్రం నామినేషనే ఏప్రిల్ 18న మొదలు కాదు. గతానికి భిన్నంగా నాలుగో దశలో ఏపీ శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటి నుంచి రెండు నెలలపాటు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకోవలసి ఉంటుంది. దీనిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. బీజేపీతో కూటమి కట్టాక, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏమైనా మేనేజ్ చేసి ఈ ఎన్నికలను నాలుగో దశలో పెట్టించారా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం మరెవరికి లేకపోవడమే ఈ డౌటుకు కారణం. టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి చాలా రోజులైనా, బీజేపీ కొద్ది రోజుల క్రితమే క్లియర్ చేసింది. టీడీపీ, జనసేనల క్యాడర్ మధ్య ఏర్పడిన అంతరం, గొడవలు సర్దుబాటు చేసుకోవడమే సమస్యగా ఉంది. బీజేపీ కూడా కలిశాక ఈ వివాదాలు మరింత పెరిగాయి. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు కొందరు పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తూ, బీజేపీకి టీడీపీ మళ్లీ వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. ఈ గొడవలన్నీ సెటిల్ కావడానికి మరికొంత టైమ్ పట్టవచ్చు. ప్రధాని మోదీ 17వ తేదీన చంద్రబాబు, పవన్తో కలిసి చిలకలూరిపేట వద్ద సభ జరిపే రోజుకు కూడా అసలు బీజేపీ అభ్యర్ధులనే ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో చంద్రబాబు లేదా బీజేపీ పెద్దలు ఏపీలో ఎన్నికలను నాలుగోదశకు మార్చేలా చూశారా అన్న ప్రశ్నను కొందరు సంధిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీ, తెలంగాణలలో రాజకీయ పార్టీలకే కాక, ప్రజలకు కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారతాయి. ప్రభుత్వాలు ముఖ్యమైన ప్రతీ పనికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అది కూడా ఇబ్బందిగానే ఉండవచ్చు. పార్టీలపరంగా చూస్తే ముఖ్యమంత్రి, వైఎఎస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింపుల్గా ఎన్నికల తేదీ పేర్కొని సిద్దం అని రాసి హుందాగా కామెంట్ చేస్తే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం యధాప్రకారం వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించారు. ఏదో స్వాతంత్ర్య పోరాటమని, ప్రజల కోసమని, రాష్ట్ర విముక్తి అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేశారు. గతసారి ప్రజలు తెలుగుదేశంను తిరస్కరించారని అంటే చంద్రబాబును వదలించుకోవాలని అనుకున్నారని ఎవరైనా అంటే చంద్రబాబు ఒప్పుకుంటారా అన్న ప్రశ్న వస్తుంది. తాను ఏది చేసినా ఒప్పు అయినట్లు మాట్లాడడంలో, ఎదుటివారు ఏది చేసినా తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పాలి. తాజాగా ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డిలను టీడీపీలో చేర్చుకుని స్వాగతం చెప్పారు. విశేషం ఏమిటంటే డిల్లీ లిక్కర్ స్కామ్లో వీరిద్దరి పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగం మోపింది. రాఘవరెడ్డి కొన్ని నెలలపాటు జైలులో కూడా ఉన్నారు. మాగుంటకు వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇవ్వరాదని నిర్ణయించుకుంది. ఈయన వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం మద్దతు పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలలో వారిపై ఎన్ని వ్యతిరేక వార్తలు రాశారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. వీరికి వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇచ్చి ఉంటే చంద్రబాబు విరుచుకుపడేవారు. స్కామ్లు చేసినవారికి టిక్కెట్లు ఇచ్చారని ద్వజమెత్తేవారు. కానీ, ఇప్పుడు ఆయనే పార్టీలో చేర్చుకున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ కూడా ఇస్తారేమో చూడాలి. దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేస్తారని తేలుతుంది. మాగుంట ఈడీ విచారణ ఎదుర్కుంటున్న రోజుల్లో ఈనాడులో ఎన్నో వ్యతిరేక కథలు రాసిన రామోజీ ఇప్పుడు తేలు కుట్టిన దొంగ మాదిరి కిక్కురుమనడం లేదు. ఏపీలో ఒక నెల రోజులు ఆలస్యం అయినా అధికార పార్టీకి పెద్ద ఇబ్బంది ఉండదు. చంద్రబాబు వంటివారు ఏదో భయపడి ఒకవేళ ఎన్నికలను జాప్యం చేయించినా, దాని ప్రభావం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధులపై కూడా పడుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దం అని సీఎం జగన్ ప్రకటించి విపక్షాలకు సవాలు విసిరారని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Pawan Kalyan: పిఠాపురంలో పవన్కు చుక్కలే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అది ఆయన నాటకీయంగా వెల్లడించినా, అందులో ఆయన బలహీనతలను చెప్పకనే చెప్పేశారు. ఆయన ప్రకటన తర్వాత పిఠాపురంలో తెలుగుదేశం నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే కొంత రిస్కు ఉన్నట్లే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ పోటీచేసేది చివరి వరకు సస్పెన్స్ లో ఉంచాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఎప్పుడైతే వారాహి యాత్ర పిఠాపురం ప్రాంతం నుంచి ప్రారంభించారో, పిఠాపురం వెళ్లి అక్కడ వల్లభుడి గురించి ప్రస్తావించారో,అంతా అక్కడ నుంచే పోటీచేస్తారని భావించారు. కాకపోతే ఆయన అప్పట్లో ఆ విషయం చెప్పలేదు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకల నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఆ రెండింటిలో కాకుండా పిఠాపురం ఎంపిక చేసుకోవడం ద్వారా ఆయన ఆ రెండు చోట్లనుంచి పారిపోయారన్న విమర్శకు అవకాశం ఇచ్చారు. దానికి ఆయన ఇచ్చిన బిల్డప్ తమాషాగా ఉంది. భీమవరం సీటును మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు కు ఇచ్చానని , గాజువాక టీడీపీ వాళ్లు తీసేసుకున్నారని అన్నారు. ఆ మద్య భీమవరం వెళ్లి మళ్లీ పోటీచేయాలన్న ఆలోచనపై అక్కడి ప్రముఖులతో చర్చలు కూడా జరిపారట.అయినా ఆయనకు నమ్మకం కుదరలేదు. దాంతో భీమవరంలో మళ్లీ పోటీకి భయపడ్డారని అంటారు. ఇక గాజువాక నుంచి తిరిగి పోటీచేసి ప్రతిష్టను నిలబెట్టుకుంటారని ఆయన అభిమానులు అనుకున్నారు. కాని ఆ వైపే వెళ్లడానికి ఈయన సందేహించారు. పైగా టీడీపీ వారు ఈయనకు చెప్పకుండానో, తెలియకుండానో లాగేసుకున్నట్లు మాట్లాడడం ద్వారా తన బలహీన పరిస్థితిని ఒప్పుకున్నారు.ఒక దశలో తిరుపతి వైపు కూడా చూడకపోలేదు. కాని దానిని కూడా వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులుకు కేటాయించారు. సొంత పార్టీ నేతలు ఎవరికి ప్రాధాన్యం ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలకే పవన్ అవకాశం ఇవ్వడం లో కూడా చంద్రబాబు పాత్ర ఉందని, ఆయన ఏమి చెబితే దానిని జీ హుజూర్ అంటూ ఒప్పుకుంటున్నారన్న భావన జన సైనికులలో ఏర్పడింది. ఎంపీ సీటుకు పోటీచేయాలో, వద్దో అన్నది పెద్దలతో మాట్లాడి నిర్ణయిస్తానని అన్నారు.అంటే దాని అర్ధం బహుశా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీచేస్తారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పిఠాపురంలో తొంభై వేల మంది కాపులు ఉన్నారని, వారిలో మెజార్టీ తనకు మద్దతు ఇస్తారన్న ఆశతో పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారు.లేకుంటే ఆయన కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునేవారేమో!ఎందుకంటే కాకినాడ వెళ్లి అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఆ సమయంలో దమ్ముంటే పవన్ వచ్చి కాకినాడ సిటీలో పోటీచేయాలని, తనను ఓడించాలని సవాల్ చేశారు. ఆ చాలెంజ్ ను పవన్ స్వీకరిస్తారని ఆయన అభిమానులు ఆశించారు.కాని పవన్ భయపడి అటు వైపు వెళ్లలేదు. చంద్రశేఖరరెడ్డి గురువారం నాడు మరోసారి అదే సవాల్ విసిరారు. అయినా పవన్ వైపు నుంచి స్పందన కొరవడింది. పిఠాపురంలో మామూలుగా అయితే పవన్ గెలవచ్చని జనసైనికులు భావించారు. కాని అక్కడ పరిస్తితులు మారడం, తెలుగుదేశం నేత వర్మ వర్గీయులు పవన్ కళ్యాణ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆయనను, చంద్రబాబును తీవ్రంగా దూషిస్తూ ఫ్లెక్సీలను దహనం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశం కూడా అయ్యారు. చివరికి తగ్గుతారో,లేదో కాని,పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుకూల వాతావరణాన్ని అయితే చెడగొట్టినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం ఆ పరిణామాలపై స్పందించకుండా మౌనంగా ఉండడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ఇక.. వైఎస్సార్సీపీ అభ్యర్దిగా ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత గతంలో అక్కడ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. జడ్పి చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. ఎంపీగా జనంలోనే ఉంటారు. ఆమెపై ప్రజలలో అసంతృప్తి లేదు. ఆమె పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ అవుతారని అనుకుంటే ఆమెనే కొనసాగించవచ్చు. మరో నేత ఎవరైనా అంతకన్నా తీవ్రమైన పోటీ ఇచ్చి పవన్ ను ఓడిస్తారని సర్వేలలో తేలితే అభ్యర్ధిని మార్చుతారేమో తెలియదు. వైఎస్సార్సీపీ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని సీరియస్ గానే తీసుకుని పవన్ ఓటమికి కృషి చేస్తోంది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చంద్రబాబు, లోకేష్ ల నుంచి ఒక్క ప్రకటన వచ్చినా పవన్ కు పోటీ తేలిక అయి ఉండేది. పవన్ సీఎం పదవికి తగడన్న చందంగా లోకేష్ మాట్లాడినా ఈయన నోరు విప్పలేదు. అదంతా అవమానంగా మారింది. 24 సీట్లు తీసుకోవడంతో జనసేన సత్తా ఇదేనా అన్న చర్చ ఆరంభం అయింది. దానిని 21 సీట్లకు తగ్గించుకోవడంతో మరింత అప్రతిష్టపాలయ్యారు. పైగా ఇచ్చిన 21 సీట్లలో కూడా కొన్నిటిని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కేటాయించడంతో ఈయన పార్టీ నడపడంలో అసర్ధులన్న అభిప్రాయం ఏర్పడింది. సహజంగానే దీని ప్రభావం ఎన్నికపై పడుతుంది. ఇదే టైమ్ లో పవన్ పై గెలిచే వైసిపి నేతకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ కూడా రావచ్చు. అది జరిగితే పోటీ మరింత పెరుగుతుంది. ఎందుకంటే పవన్ గెలిచినా ,ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా ఆయనకు వచ్చేది మంత్రి పదవే. వైఎస్సార్సీపీ గెలిచినా అదే మంత్రి పదవి వైఎస్సార్సీపీ అభ్యర్దికి కూడా వస్తుందన్న బావన ఏర్పడితే వైఎస్సార్సీపీ గెలిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన వివిద కార్యక్రమాల వల్ల కాపులతో సహా పేదవర్గాలన్నీ లబ్ది పొందాయి. కాపు నేస్తం కింద పిఠాపురంలోని వేలాదిమంది కాపు మహిళలకు ఆర్దిక సాయం అందింది.వారిలోమెజార్టీ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తే అది పవన్ కు గట్టి దెబ్బ అవుతుంది. పవన్ కళ్యాణ్ నోటి దురుసుతో వలంటీర్లను కించపరుస్తూ పలుమార్లు మాట్లాడారు. వారి ప్రభావం ఏదో రకంగా ప్రజలలో ఉంటుంది.వారు కూడా పవన్ కు వ్యతిరేకంగా తమ సత్తా చూపితే అది పవన్ కు పెద్ద తలనొప్పి అయ్యే అవకాశం ఉంటుంది.మిత్రపక్షమైన టిడిపి ఎంతవరకు సహకరిస్తుందనేది సందేహమే. అసలు చంద్రబాబే ఈయనను ఓడించడానికి పూనుకుంటారేమోనన్న డౌట్లు కూడా లేకపోలేదు. పవన్ కనుక ఇక్కడ ఓడిపోతే, తనకు రాజకీయంగా చికాకు ఉండదని ఆయన అనుకోవచ్చు. అదెలా ఉన్నా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కనుక రాజీపడకుండా, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తే పవన్ పరిస్థితి క్లిష్టంగా మారవచ్చు.సాధారణంగా ఒక ప్రముఖుడు ఎవరైనా తమ నియోజకవర్గంలో పోటీచేస్తున్నారంటేనే, సంబందిత పార్టీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి. అలాకాకుండా ఏకంగా పవన్ కు నిరసన తెలపడం తీవ్రమైన విషయమే. అంటే అంత సానుకూలత లేదన్న విషయం అర్దం అవుతుంది.పవన్ స్థానికుడు కాడని, ప్రజలకు అందుబాటులో ఉండడని, ఇప్పటికే స్థానిక నేతలు ప్రజలకు తెలియచేసే పనిలో ఉన్నారు.గోడలపై అలాంటి ప్రచారం కూడా చేసేశారు.నిజంగానే పార్టీ అధినేతగా ఉండే, నెలకు ఒకసారో,రెండుసార్లో వచ్చి వెళ్లే పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికైతే అసలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ అబిప్రాయం ప్రబలితే కూడా నష్టం జరగవచ్చు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన కుమారుడు గిరితో సహా వైఎస్సార్సీపీలో చేరడం, ఆయనకు ఈ ప్రాంతం అంతా కొంత పట్టు ఉండడం కూడా పవన్ కు గండంగా మారవచ్చు. పవన్ కు ఉన్న ఒకేఒక్క సానుకూల అంశం కేవలం ఆయన సినీ నటుడు కావడమే. ఆ రకంగా కొంతమంది అభిమానులు ఉండడమే. కాని ఆయన ఎప్పుడైతే టీడీపీ అధినేత చంద్రబాబుకు పూర్థి స్థాయిలో లొంగిపోయారో, అప్పటి నుంచి కాపువర్గంలో కూడా ఆయనపై అయిష్టత మొదలైంది. ఈయనేదో ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తే, తనకు అర్హత లేదని చెప్పి పరువు తీసుకున్నారని, జనసేనకు అసలు నెట్ వర్క్ లేదని ఆయనే చెప్పేశారని,ఇంకేమి పార్టీ నడుపుతారన్న ప్రశ్న కాపులలో వచ్చింది. కాపు ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యతిరేక వైఖరిని కాపులు గుర్తుచేసుకుంటే ఆయనకు ఆ వర్గంలోకూడా ఆదరణ ఉండకపోవచ్చు. జనసేనకు బూత్ లెవెల్ కార్యకర్తలు లేరని, పోల్ మేనేజ్ మెంట్ తెలియదని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు.ఆయన ఎక్కడా పార్టీ వ్యవస్తను పెంపొందించుకోలేదు. పవన్ కు అవన్ని మైనస్ అయితే గెలుపుపై ప్రభావం చూపించవచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తే పవన్ కు అంత ఈజీ కాదని అర్ధం అవుతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘పొత్తు’కు పోతే ‘కత్తెర’ పడింది
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ పొత్తుకు మధ్యవర్తిత్వం చేస్తే మనమే సీట్లను తగ్గించుకోవాల్సి వచ్చిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో తన సినిమాల ప్రస్తావనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. జనసేన సీట్లు తగ్గించుకోవాల్సి రావడంపై మాట్లాడుతూ.. పొత్తుల్లో రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం చేస్తే ఏం నష్టపోతామో తనకు బాగా అర్థమైందన్నారు. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్నామని చెప్పారు. తన అన్న నాగబాబుకు మాట ఇచ్చిన లోక్సభ సీటును సైతం త్యాగం చేయాల్సి వచ్చిందని అన్నారు. సినిమాల్లో తనకు ఎదురు దెబ్బలు లేవని, రాజకీయాల్లో మాత్రం తన ఎదుగుదలే తనకు శాపం అయిందని, పదేళ్లుగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయని చెప్పారు. 2019లో 30 స్థానాలకు పోటీ చేయాలని అనుకున్నామని, అందరి బలవంతంపై అన్ని స్థానాల్లో పోటీ చేశామని చెప్పారు. అప్పుడు కొన్ని స్థానాల్లోనే పోటీ చేసి ఉంటే ఇప్పటికి జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా ఉండేదన్నారు. అధికారం జనసేనకు కనుచూపు మేరలో ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ మనమేనన్నారు. పొత్తులో జనసేన అభ్యర్థులను గెలిపించడానికి టీడీపీ, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అప్పులు తెచ్చి సంక్షేమం చేసుకుంటూ పోతే మన రాష్ట్రం కూడా శ్రీలంకలా మారే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా కారణంగా అవతలివారు చనిపోయే పరిస్థితి రాకూడదని, పార్టీ శ్రేణులు ప్రత్యర్థులను ఎందుకు తిడుతున్నామో సందేశాల్లో స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు, తిరుపతి నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు పోటీ చేస్తారని పవన్ చెప్పారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా లోక్సభకు కూడా పోటీపైపెద్దలతో చర్చించాక నిర్ణయం తాను ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అసెంబ్లీ స్థానంతో పాటు లోక్సభకు కూడా పోటీ చేసే విషయంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. ‘చాలా మంది ఎమ్మెల్యే, ఎంపీ రెండింటికీ పోటీ చేయాలని సూచిస్తున్నారు. కానీ రెండింటికీ పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్లు వంటివీ ఉంటాయని గందరగోళంలో ఉన్నా. నాకు మాత్రం ఎమ్మెల్యేగా ఉండాలనే ఉంది’ అని చెప్పారు. -
డామిట్.. అడ్డం తిరిగిందే!
సాక్షి, అమరావతి: పొత్తుల పేరుతో చంద్రబాబు పన్నిన వ్యూహాలు బెడిసికొట్టాయి. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఓకే.. 21 ఇచ్చినా ఓకే అన్న పవన్కళ్యాణ్ను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించిన మాదిరిగానే పొత్తుల పేరుతో ఏపీ బీజేపీలోని తన మనుషులకే టికెట్లు ఇచ్చి కథ నడిపించాలనుకున్న చంద్రబాబు ఎత్తుగడలకు కమలనాథులు చెక్ పెట్టారు. బీజేపీ సీట్ల సంఖ్య మొదలు కేటాయింపు దాకా అంతా తాను అనుకున్నట్టే చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు యత్నాలను వమ్ము చేసిన ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్రతి వ్యూహాలను రూపొందించి అమలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు చర్చల సందర్భంగా రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా నేరుగా కేంద్ర మంత్రిని రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎక్కడా బాబు స్పాన్సర్డ్ నేతల పాత్ర లేకుండా కమలనాథులు జాగ్రత్త పడ్డారు. జనసేన విషయంలో అంతా తాము ఊహించినట్లే జరగగా కాషాయదళం మాత్రం ముందుచూపుతో వ్యవహరించిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయనగరంపై ఢిల్లీ పెద్దల ఆరా.. గతంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించి ప్రస్తుతం యూపీ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న జీవీఎల్ నరసింహారావుకు పొత్తులో ఎక్కడా సీటు దక్కకుండా చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్న విషయం ఢిల్లీ పెద్దల దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీనిపై వారు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బీజేపీకి కేటాయించే ఆరు లోక్సభ స్థానాల్లో కొత్తగా విశాఖపట్నం లేదా విజయనగరం చేర్చేందుకు చర్చలు సాగుతున్నట్లు కమలం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయనగరం సీటును జీవీఎల్కు కేటాయించే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున నరసాపురం లోక్సభ స్థానం నుంచి గెలిచి తాను చెప్పినట్లు నడుచుకుంటున్న రఘురామకృష్ణరాజుకు టీడీపీ టికెట్ ఇవ్వకుండా బీజేపీ తరుఫున పోటీ చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండగా కమలనాథులు ఏమాత్రం సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పురందేశ్వరి సీటుపై సందిగ్ధం.. అసెంబ్లీకే! ఏలూరు నుంచి బీజేపీ తరపున లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రెండున్నరేళ్లుగా కార్యక్రమాలను నిర్వహించిన గారపాటి సీతారామంజనేయ చౌదరి పార్టీపై అసంతృప్తితో ఈ నెల 15న తన అభిమానులతో సమావేశం నిర్వహిస్తున్నారు. నరసాపురంలో బీజేపీ నాయకుడుగా కొనసాగిన శ్రీనివాసవర్మ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశాలపై బీజేపీ జాతీయ నాయకత్వం పురందేశ్వరి పట్ల తీవ్ర అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పురందేశ్వరి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆమెకు అక్కడ పార్టీ అధిష్టానం సీటు కేటాయించే అవకాశం లేదని అంటున్నారు. పురందేశ్వరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటిదాక స్పష్టత లేకపోగా ఆమెకు ఏదో ఒక ఎమ్మెల్యే సీటును కేటాయించే అవకాశం ఉందనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. పారని బాబు పాచిక.. ఐదారు రోజుల కిత్రం చంద్రబాబు – పవన్కళ్యాణ్ «ఢిల్లీలో అమిత్షాను కలసిన అనంతరం బీజేపీకి కేటాయించే సీట్లపై ఒప్పందం కుదరక ముందే తాము ఆ పార్టీకి ఆరు లోక్సభ, ఆరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇవ్వనున్నట్లు అనుకూల మీడియాలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. అది కూడా రాష్ట్ర బీజేపీలో తనకు అనుకూలంగా వ్యవహరించే వారికి కేటాయించి తాను చెప్పిన సంఖ్యకు ఒప్పించేలా పథకం వేశారు. అయితే అనూహ్యంగా సీట్ల సర్దుబాటు చర్చలకు బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో పాటు ఒడిషాకు చెందిన బి.పాండాను పంపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీట్ల సర్దుబాటు చర్చలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాత్రను నామమాత్రం చేశారు. ఢిల్లీ ఆదేశాల మేరకు వచ్చిన ఆ ఇద్దరు నాయకులు మాత్రమే చంద్రబాబుతో చర్చల్లో పాల్గొన్నారు. దీంతో చంద్రబాబు బీజేపీ అడిగినన్ని సీట్లకు తలాడించక తప్పలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో కొనసాగుతూ ఇప్పటికీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేసే సుజనా చౌదరి, సీఎం రమేష్కు సీట్లు కట్టబెట్టేందుకు ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేసేలా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారనే విమర్శలు కాషాయదళంలో వినిపిస్తున్నాయి. జనసేనలో బాబు మాటే.. పొత్తుల పేరుతో జనసేనలో మాత్రం అంతా చంద్రబాబే చక్రం తిప్పుతున్నారు. జనసేనకు ఇచ్చే సీట్లకు కోతలపై కోతలు విధించి చివరకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలకు కుదించిన చంద్రబాబు ఆ సీట్లలో సైతం తన విధేయులే పోటీ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఇప్పటికే టీడీపీని వీడి జనసేన తీర్థం తీసుకున్నారు. గతంలో పవన్కళ్యాణ్పై పోటీ చేసిన ఆయనకు జనసేన టిక్కెట్ ఇవ్వడం దాదాపుగా ఖరారైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీకే చెందిన మరో నాయకుడు గంటా నరహరి బుధవారం పవన్కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన్ను తిరుపతి లేదా అన్నమయ్య జిల్లాల్లో జనసేనకు కేటాయించే ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు జనసేన ఇప్పటివరకు ఆరుగురు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించగా వీరిలో అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ ఇటీవలే పార్టీలో చేరడం గమనార్హం. -
ఎంత మానసిక క్షోభ అనుభవించావో అమ్మా..!
తణుకు అర్బన్: తన ఇద్దరు కుమార్తెలను వదిలి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందంటే.. ఆమె ఎంత మానసిక క్షోభ అనుభవించిందో అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు అంజలి ఘటిస్తూ తణుకు నరేంద్ర సెంటర్లో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన తెలిపింది. ఈ కార్యక్రమానికి మంత్రి కారుమూరి సంఘీభావం తెలిపి మాట్లాడారు. తనకు సొంతిల్లు వచ్చిందని.. జగనన్న తన కల నెరవేర్చాడని తెనాలికి చెందిన గీతాంజలి ఒక యూట్యూబ్ చానల్కు ఎంతో భావోద్వేగంతో తెలిపిన తీరును ప్రజలంతా స్వాగతించారని, అది ఓర్వలేని టీడీపీ పచ్చ దొంగలు ఆమైపె సామాజిక మాధ్యమాల్లో విషం చిమ్మటమే కాకుండా అసభ్యకరంగా పెట్టిన పోస్టులకు చలించి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గీతాంజలి విషయంలో స్పందించి ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయంతోపాటు అండగా నిలబడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ఐటీడీపీ పేరుతో పెడుతున్న పోస్టులు ఎంతోమంది జీవితాలను చిదిమేస్తున్నాయని గీతాంజలి ఒక్క విషయమే బయటపడిందని చెప్పారు. ఒక మహిళ ప్రభుత్వం వలన తనకు జరిగిన మంచిని చెప్పుకోవడం వలన ఇలా జరిగిందంటే ప్రతిపక్షాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ముందుగా గీతాంజలి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మనన్ నత్తా కృష్ణవేణి, జేసీఎస్ పట్టణ కన్వీనర్ యిండుగపల్లి బలరామకృష్ణ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, పార్టీ అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రామిశెట్టి రాము, తణుకు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పొట్ల సురేష్, ఉండవల్లి జానకి, ఝాన్సీ లారెన్స్, ఉండ్రాజవరపు గీత, ఎం.లలిత, ఫహీమా, కొఠారు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేనవి నీచ రాజకీయాలు బుట్టాయగూడెం: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ టీడీపీ, జనసేన పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి తీవ్రంగా విమర్శించారు. బుట్టాయగూడెంలో బుధవారం జరిగిన నాలుగో విడత చేయూత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన మద్దతుదారులు వేధింపులు, ట్రోల్స్ను తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. గీతాంజలి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం వల్ల భర్త, పిల్లలు అన్యాయమైపోతారని అన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం గీతాంజలి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు. నడిపల్లిలో రాస్తారోకో పెదవేగి : గీతాంజలిది ఆత్మహత్య కాదని టీడీపీ, జనసేన సోషల్మీడియా చేసిన హత్యగా పరిగణించి కారకులైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టేటి స్టాలిన్ డిమాండ్ చేశారు. బుధవారం పెదవేగి మండలం నడిపల్లిలో గీతాంజలి మృతికి నిరసనగా రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ ఉక్కుర్తి నాగేశ్వరరావు. వైఎస్సార్ సీపీ గ్రామ నాయకుడు ఎం. గోపాలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవాపురంలో ర్యాలీ చింతలపూడి: గీతాంజలి మృతికి కారణమైన టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ గిరి భోగారావు డిమాండ్ చేశారు. బుధవారం చింతలపూడి మండలంలోని రాఘవాపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ పడమటి ఎస్సీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి గీతాంజలి మృతికి శ్రధ్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో చుండూరి కిషోర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన వల్లే గీతాంజలి చనిపోయింది తణుకు అర్బన్: టీడీపీ, జనసేన సామాజిక మాధ్యమాల్లో వేధించడం వల్లే తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని తణుకు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పొడుగు రామాచారి (రాము) అన్నారు. గీతాంజలి మృతికి బుధవారం తణుకు నరేంద్ర సెంటర్లో తణుకు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ప్రభుత్వం తనకు దస్తావేజులతో కూడిన ఇంటిపత్రాలు ఇచ్చారని సంతోషంగా చెప్పిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన గీతాంజలిని ఆత్మహత్యకు పాల్పడేంతగా వేధించడం దారుణమని అన్నారు. ఏ రాజకీయ పార్టీని విమర్శించకుండా తనకు అందిన సౌకర్యాన్ని చెప్పుకున్నందుకు ఆమె చనిపోయేంతగా వేధిస్తారా అని నిలదీశారు. వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గొల్తి హరికృష్ణప్రసాద్, కోశాధికారి కొమ్మోజు రామకృష్ణ, ఉపాధ్యక్షులు టేకు రాజు, ధవళేశ్వరపు సుబ్బారావు, కోరుమిల్లి సుబ్బారావు, నాగమల్లి సాయి, తమిరి శివకుమార్, ఉప్పరాపల్లి బాలు పాల్గొన్నారు. -
గీతాంజలి ఘటన జనసేన, టీడీపీ పై వాసిరెడ్డి పద్మ ఫైర్
-
జనసేన సీట్లకు బాబు ఎసరు!
సాక్షి, అమరావతి: జనసేనకు ఇచ్చిన ఆ కొన్ని సీట్లకు కూడా చంద్రబాబు ఎసరు పెట్టేశారు. పొత్తులో జనసేనకు చాలా తక్కువ సీట్లు కేటాయించారని రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్కళ్యాణ్ మాత్రం ఈ పొత్తు కోసం అవసరమైతే ఆ ఇచ్చిన సీట్లలోనూ కొన్నింటిని వదులుకోవడానికి సిద్దపడినట్టు టీడీపీ ప్రచారం చేస్తోంది. ఫిబ్రవరి 24న పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై పవన్కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్సభ స్థానాలు కేటాయించినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా బీజేపీతో పొత్తు కుదిరిన తరుణంలో ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్ల కోసం చంద్రబాబు చూపు జనసేన సీట్లపై పడింది. చంద్రబాబు తొలుత బీజేపీకి కేటాయించాలనుకున్న స్థానాల కంటే ఆ పార్టీ పెద్దలు ఎక్కువ స్థానాలు కోరుతుండడంతో ఇప్పుడు బీజేపీకి అదనంగా ఇవ్వాల్సి వచ్చే సీట్ల కోసం జనసేన సీట్లలో కోత పెట్టనున్నట్లు శనివారం టీడీపీ విస్త్రత స్థాయిలో ప్రచారం చేయించింది. టీడీపీ–జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరినప్పటికీ.. బీజేపీకి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అన్నది పూర్తి స్పష్టత రాలేదు. దీనిపై త్వరలో మూడు పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఈ తరుణంలో బీజేపీ కోరిక మేరకు అదనంగా సీట్లు ఇవ్వాల్సి వస్తే.. ఆ మేరకు జనసేన సీట్లను సర్దుబాటు చేసేలా మైండ్గేమ్ మొదలెట్టారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ప్రచారం ఇదివరకు జనసేనతో పొత్తు కుదుర్చుకునే ముందు కూడా బాబు ఇలానే గేమ్ ప్లే చేశారని జనసేన నేతలు ఉదహరిస్తున్నారు. అప్పట్లో జనసేన 60 అసెంబ్లీ సీట్లు, ఐదు పార్లమెంట్ సీట్లు ఆశిస్తుండగా.. 24 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలను కేటాయించబోతున్నట్టు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారని చెబుతున్నారు. ఆ ముందస్తు ప్రచారానికి తగ్గట్లుగానే సరిగ్గా అన్నే సీట్లను జనసేనకు కేటాయించారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో జనసేనపై దెబ్బ వేసేలా వ్యూహం పన్నారని జనసేన నేతల మధ్య చర్చ నడుస్తోంది. జనసేనకిచ్చే మూడు లోక్సభ స్థానాలలో ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని, అలాగే అసెంబ్లీ స్థానాల్లో కూడా ఐదారు స్థానాలు తగ్గించే అవకాశం ఉందని ఓ వర్గం మీడియా చెబుతోంది. ఇలా సీట్ల తగ్గింపునకు పవన్కళ్యాణ్ ఒప్పుకున్నారని కూడా ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ సైతం అధికారికంగా ఈ ప్రచారాన్ని ఖండించక పోవడం జనసేన శ్రేణులు, పవన్కళ్యాణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వెంట తిరిగే వాళ్లకు కనీసం భోజనాలు కూడా పెట్టించలేని స్థితిలో ఉన్న జనసేనకు ఈ మాత్రం సీట్లు ఇవ్వడమే గొప్ప అని తాడేపల్లిగూడెం సభ సాక్షిగా పవన్ కళ్యాణే సర్దిచెప్పుకున్నప్పుడు చంద్రబాబు ఇలా వెన్నుపోటు పొడవకుండా ఉంటారా.. అని పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అజ్ఞాతవాసి పొలిటికల్ సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. ఈ రెండు పేర్లు కూడా ఆయనవే. కానీ 2024 ఎన్నికలు జరగక ముందే 'పవర్ స్టార్' అవతారంలో ఫిక్సయ్యేలా కనిపిస్తున్నాడు పవన్. అదే అభిప్రాయం ఆయన అభిమానుల్లో కూడా కలుగుతోంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే వాళ్లు సినిమాలు వదులుకోలేరు. రాజకీయాలను.. ముఖ్యంగా అధికారాన్ని చెలాయించాలనుకుంటారు. రెండూ కావాలని వస్తే ప్రజలు ఊరుకోరు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు. (ఇదీ చదవండి: లగేజీ ప్యాక్ చేసుకున్న మెగా బ్రదర్స్.. పరుగులు పెడుతున్న పవన్) పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటిషియనా? లేక సినిమాలు పార్ట్ టైమా? అనే విషయంలో పవన్కు ఓ క్లారిటీ ఉన్నట్టుంది. గత రెండేళ్ల కాలం చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసిపోతుంది. వారం క్రితం జెండా సభ అంటూ స్టేజీపై రెచ్చిపోయిన పవన్ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆ సభకు ముందు కూడా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నాడు. 50 రోజుల్లో ఎన్నికలు ఉండగా ఏ పార్టీ అధినేత కూడా ఇలా చేయడు. వారాహి యాత్ర అంటూ ఊదరగొట్టినా.. ఆరు నెలల నుంచి ఆ వాహనం ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తెలంగాణ ఎన్నికల్లో అతి కష్టమ్మీద 8 మంది అభ్యర్థులను దించినా.. చివరాఖరి వరకు పవన్ ప్రచారమే చేయలేదు. షూటింగ్లు లేనప్పుడు మాత్రమే పవన్కు రాజకీయాలు గుర్తొస్తాయంటారు జనసైనికులు. అధికారం కోసం అల్లాడిపోయే.. పవన్.. రాజకీయాలకు ఎంత సమయం కేటాయిస్తున్నడన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. గత మూడేళ్లుగా ఆయన సినిమాల లిస్టు ఒకసారి పరిశీలిద్దాం. 2019 - సినిమా నెరేషన్ 2021 - వకీల్ సాబ్ 2022 - భీమ్లా నాయక్ 2023 - బ్రో 2024 - ఓజీ, హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్(?) 2024 ఎన్నికల కోసం నానా హంగామా చేస్తోన్న పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఓజి సినిమా కోసం ఇంకా కనీసం 30 రోజులు షూటింగ్ వర్క్ చేయాల్సి ఉంది. ఈ సినిమాకు బాగా మార్కెట్ కావాలని తెగ ప్రచారం చేశారు. ఇప్పటికే ఓజి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. అనుకున్న సమయానికి రీలీజ్ చేయాలంటే ఎన్నికలు అయిన వెంటనే పవన్ రాజకీయాలను ప్యాకప్ చేసి సినిమాల కోసం మేకప్ వేసుకోవాలి. పవన్ చేతిలో హరిహరవీరమల్లు (క్రిష్) , ఓజీ (సుజిత్) , ఉస్తాద్ భగత్ సింగ్ (హరీష్ శంకర్) వంటి టాప్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో హరిహరవీరమల్లు, ఓజీ చిత్రాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. రెండు నెలల క్రితం ఫుల్ బిజీగా ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కోసం పార్ట్టైమ్ జాబ్ మాదిరి టీడీపీలో స్టార్ క్యాంపెయినర్గా పవన్ ఉన్నాడు. ఎన్నికల్లో పవన్ రోల్ ముగిసిన తర్వాత వెంటనే మళ్లీ రెగ్యూలర్ షూటింగ్స్లోకి వెళ్లడం ఖాయం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మోసం చేశారు: ట్రాన్స్జెండర్) తాజాగా నిర్మాత దానయ్య కూడా పవన్ను కలిసిన విషయం తెలిసిందే.. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఓజి సినిమా పూర్తి చేస్తానని పవన్ మాట ఇచ్చారట. ఈ భారీ ప్రాజెక్ట్తో పాటు.. పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మరో రెండు వున్నాయనే విషయం తెలిసిందే. ఇలా మొత్తం మూడు సినిమాలు చేయాలి.. సాధారణంగా ఒక టాప్ హీరోకు చెందిన సినిమా తర్వాత మరో సినిమా థియేటర్లోకి రావాలంటే సుమారు రెండేళ్లు అయినా పడుతుంది. అలాంటిది పవన్ ఒప్పుకున్న సినిమాలు మూడు ఉన్నాయి. అంటే ఈ లెక్కన పవన్ వచ్చే ఎన్నికల వరకు మళ్లీ సినిమాలతోనే బిజీగా ఉంటారు. ఉన్న ప్రాజెక్ట్లతోనే ఆయన బిజీగా ఉంటే మరో సినిమాను సెట్ చేయడానికి పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే భవిష్యత్లో సినిమాలు కొనసాగించాలనే పవన్ నిర్ణయించుకున్నారని స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుతుంది. చంద్రబాబు కోసం... తాను రాజకీయం చేస్తున్నానని పదేపదే చెబుతున్న పవన్.. అందుకు తగ్గట్టు తాజాగా జరిగిన జెండా సభలో కూడా బాబును ఉద్ధండుడిగా అభివర్ణించాడు. అక్కడి వరకు జనసేన కార్యకర్తలకు ఇబ్బంది లేదు కానీ.. నన్నెలా ప్రశ్నిస్తారంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే పవన్ విరుచుకుపడడం .. జనసైనికులను షాక్కు గురి చేసింది. తాను అసలు రాజకీయాలు చేస్తాడా? ఎన్నికల తర్వాత పార్టీ నడుపుతాడా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వడు. సింగిల్గా పోటీ చేయి, వచ్చే ఎన్నికల నాటికి నాయకుడిగా ఎదుగుతావని బీజేపీ పెద్దలు చీవాట్లు పెట్టారని తానే స్వయంగా చెప్పుకున్నాడు. అంత హితబోధ చేసినా.. పవన్ మాత్రం జై బాబు మత్తులోనే ఉన్నాడు. మరి రాజకీయాలైనా సీరియస్గా చేస్తాడా.. అదీ లేదు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ఓడిపోతుందని పవన్, ఆయన దత్తతండ్రికి ముందే తెలుసంటున్నారు. అన్ని లెక్కలు పవన్ వద్ద ఉన్నాయి కాబట్టే సినిమాలు వదులుకోకుండా వచ్చే ఐదేళ్ల వరకు పలు ప్రాజెక్ట్లను లైన్లో పెట్టాడు. తాను ఇక సినిమాల్లో నటించనని ఒకప్పుడు పవన్ అన్నాడు. కానీ ఆ మాట అన్న తరువాతే ఆయన నటించడం ఎక్కువైంది అన్నది ఫిలింనగర్లో పిల్లాడిని అడిగినా చెబుతాడు. పవన్ పొలిటికల్ సినిమాకు అప్పటివరకు భశుం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ వీక్నెస్ ఏంటో గానీ.. మరీ ఇంత దిగజారుడా..!?) -
పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడో..!
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా తేలలేదు. మరో 40–45 రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా, ఈ విషయంలో జనసేన పార్టీ గానీ పవన్కళ్యాణ్ గానీ ఇంకా పూర్తి స్పష్టతకు రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోటా పవన్కళ్యాణ్ పోటీకి సంబంధించి చర్చ జరుగుతున్న దాఖలాలు లేవంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే... తాను పోటీ చేసే స్థానంపై కూడా చంద్రబాబుపై ఆధారపడినట్టు ఉన్నారని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతర్గతంగా సర్వేలు చేయించుకుని, కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాతో గాజువాక, భీమవరం స్థానాలను పవన్కళ్యాణ్ ఆఖరి నిముషంలో ఎంపిక చేసుకున్నారు. వామపక్షాలు, బీఎస్పీ మద్దతు ఇచ్చాయి. అయితే రెండు చోట్లా పవన్కళ్యాణ్ ఓడిపోయారు. గాజువాకలో మొత్తం 1,99,314 ఓట్లు పోలవగా, పవన్కళ్యాణ్ కేవలం 58,539 ఓట్లు (29.37 శాతం) మాత్రమే తెచ్చుకోగలిగారు. భీమవరంలో 1,92,558 ఓటు పోలవగా, 62,285 ఓట్లు (28 శాతం) మాత్రమే పడ్డాయి. గాజువాకలో 17 వేలు, భీమవరంలో 8 వేల ఓట్లకు పైగా తేడాతో ఆయన ఓడిపోయారు. ఈ నేపధ్యంలో తాను ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోయినా కచ్చితంగా గెలిచే సీటు అయి ఉండాలని భావిస్తున్నారు. గాజువాక, భీమవరం, పిఠాపురం స్థానాలు పరిశీస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు లెక్కలు వేరు అయితే పవన్ సీటు విషయంలో చంద్రబాబు లెక్కలు వేరుగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీచేసే నియోజకవర్గం పరిధిలోని లోక్సభ స్థానంలో టీడీపీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందన్న ఆలోచనలతో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కు కేటాయించే స్థానం, ఆ చుట్టుపక్కల టీడీపీ బలహీనంగా ఉండే స్థానాలను చంద్రబాబు బేరీజు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పవన్కళ్యాణ్ను పోటీ చేయించాలని చూస్తున్నారని, అలా జరిగే పక్షంలో గాజువాక నుంచే మరోసారి పోటీ పడే అవకాశం ఉందంటున్నారు. 15 రోజుల క్రితం భీమవరం పర్యటనలో పవన్ టీడీపీ, బీజేపీ నాయకుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. దీంతో ఈసారీ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జనసేనలో అంతర్గత చర్చ సాగింది. అయితే, సీట్ల సర్దుబాటులో భాగంగా భీమవరం నుంచి పోటీ చేయని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు చంద్రబాబును హైదరాబాద్ వెళ్లి మరీ కోరడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పోటీపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కొంత ప్రచారం కొనసాగినా స్పష్టత లేదు. మరోవైపు జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిలో మాత్రమే అభ్యర్ధులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ అధినేతే ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని సందిగ్థంలో ఉన్నప్పుడు తమ గురించి ఆలోచించే వారెవ్వరని జనసేన ఆశావహులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. -
గాలివాటంతో పోయిన విశ్వసనీయత
ఒకవైపు వైసీపీ అధినేత జగన్ రాష్ట్రం నలుమూలలా ‘సిద్ధం’ సభలు పెట్టి ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తుంటే... ఎట్టకేలకు ప్రతిపక్ష పార్టీలు జనసేన – తెలుగు దేశం కూటమిగా ఏర్పడి తాడేపల్లిగూడెంలో మొదటి సభ పెట్టాయి. అక్కడ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం చర్చనీయాంశం. పవన్ సొంత పార్టీ పెట్టి ఇప్పటికి పదేళ్లు అయ్యింది. ఈ దశాబ్ద కాలంలో 2014లో హిందుత్వ బీజేపీనీ, అవకాశవాద చంద్రబాబు టీడీపీనీ బలపరిచా రాయన. 2019కి వచ్చేటప్పటికి బీజీపీకి పూర్తి వ్యతిరేక వైఖరి అవలంబించే కమ్యూనిస్టు పార్టీలతో, బీఎస్పీతో జత కట్టారు. ఆ ఎన్నికలు అయిన వెనువెంటనే తిరిగి బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు టీడీపీతో కలిసి బరిలోకి దిగారు. ఈ పదేళ్ల వ్యవహార శైలి అతడి రాజకీయ ఊసరవెల్లితనాన్ని చాటి చెబు తోంది. ఈ విషయంలో తాను చంద్రబాబుకి ఏ మాత్రం తీసి పోనని కించిత్ గర్వపడొచ్చు కూడా! దేశం కాని దేశ ప్రజల కోసం ఆత్మ త్యాగం చేసిన చేగువేరా వంటి అద్వితీయమైన నాయకుడిని స్మరించిన నోటితోనే వెన్నుపోటు పొడిచే కళలో ఆరితేరిన చంద్రబాబు నామజపం చేయడం సిగ్గు చేటు. ‘జెండా’ సభలో ఆయన మాటల్లో అక్కసు కనిపించింది తప్ప ఎన్నికల్లో వారి అజెండా ప్రస్తావనే లేదు. 2019లో జనం తనని రెండు చోట్ల ఓడించారు అనే కోపం ప్రదర్శించారు కానీ ఎందుకు ఆ పరిస్థితి దాపురించిందో సింహావలోకనం చేసు కునే సంయమనం చూపలేదాయన. సినిమా పాటల్లో గెటప్లు మార్చినంత తొందరగా రాజకీయాలలో రంగులు మారిస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతాము అనే తర్కాన్నీ మరచారు. తనకు తానే దేశం కోసం, రాష్ట్రం కోసం పరితపిస్తున్నాను అని చెబితే నమ్మేసి మళ్లీ మళ్లీ మోసపోవడానికి ఇవి ఆడియో రిలీజ్ సభలు కాదు అనే విషయం పాపం ‘పవర్’ స్టార్ విస్మరించారు. అంతగా ఆలోచించి ఈయన దేశం కోసం చేసిన మంచి ఏమిటో మచ్చుకు ఒక్కటైనా చెప్పలేకపోయారు. 2014లో తాను గెలిపించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా? పోనీ ఈసారి గెలిస్తే ఇదీ మా ప్రణాళిక అని చెప్పే సాహసం కూడా చేయలేకపోయారు. ‘నేను ఒక నియోజకవర్గం కూడా పెంపొందించుకోలేదు’ అని అనడం ఎన్నికలు మొదలు కాక మునుపే ఓటమికి సాకులు వెతుక్కుంటున్నట్టు ఉంది. ఒక దశలో తనను తాను వామనుడిగా, జగన్ను బలి చక్రవర్తిగా పోల్చారు. దక్షిణాది ప్రజల చరిత్ర ఈయనకి ఏ మాత్రం అవగతమైనట్లు లేదు. ఎన్నో పుస్తకాలు నెమరు వేశాను అని డాంబికాలు పలికే పవన్ కల్యాణ్ బలి చక్రవర్తి ఔన్నత్యాన్నీ, వామనుడి కుటిలత్వాన్నీ గమనించినట్లు లేరు. కేరళలో కానీ, ఇతర దక్షి ణాది రాష్ట్రాలలో కానీ బలి చక్రవర్తిని ఒక ఉదార రాజుగా కొలు స్తారు. బహుజనుల నాయకుడైన బలిని అవ హేళన చేస్తూ ఒక రాజ కీయ సభలో ప్రసంగించడం ఆయన అపరిపక్వతకు మచ్చుతునక. పలుమార్లు కోట్ల సంపాదన వదిలి ప్రజల కోసం తిట్లు తింటున్నాను అని ఈయన చెప్తారు. ఇది చాలా చవకబారు వాదన. తనకు తానే ఒక కారణ జన్ముడిగా, త్యాగశీలిగా చెప్పుకోవడం నిజానికి ప్రజల వివేకాన్ని అవమానించడమే. ఒక రాజకీయ నాయకుడు ప్రజలను మమేకం చేసుకుంటూ తన అజెండాని వారికి తెలియచెప్పాలి. కానీ ‘అంతా నాకు వదిలేయండి. నాకు అన్నీ తెలుస’ని ఏమార్చకూడదు. ఆది గమనించే 2019లో ప్రజలు ఈయన్ని తేలికగా తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేసే స్థోమత లేదు అని చెప్పడం మరో హాస్యాస్పదమైన అంశం. చరిత్రలో ఎన్నో కొత్త పార్టీలు అటువంటి ధైర్యాన్నే చేసి ప్రజల మద్దతు కూడకట్టుకో గలిగాయి. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కానీ, జగన్ సారథ్యంలో వచ్చిన వైసీపీ కానీ, ఈయన అన్నయ్య చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం’ కానీ సొంతంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసి తాడో పేడో తేల్చుకున్న కొత్త పార్టీలే. ఇతర రాష్ట్రాలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి శక్తులు కొత్తగా బరిలోకి దిగి విజయం సాధించిన సందర్భాలు కోకొల్లలు. అంతటి మేధ లేక చీటికి మాటికి తనను గుడ్డిగా నమ్ముకున్న నాయ కులనూ, కార్యకర్తలనూ ‘పోల్ మేనేజ్మెంట్’ రాదు అంటూ కించపరుస్తూ మాట్లాడడం ఒక పద్ధతిగా పెట్టుకున్నారు పవన్. ఒకసారి పార్టీ ఎదుగుదలకి 10 ఏళ్ళు కావాలి అన్నారు. పదేళ్లు గడిచాక ఇప్పుడు... కాదు కాదు 20–30 ఏళ్ళు అంటున్నారు. ఎంత కాలం ఇలా వెళ్ళబుచ్చుతారో చూడాలి! 24 సీట్లకి జనసేనను కుదించి చంద్ర బాబు నాయుడు పవన్ కల్యాణ్ను భూస్థా పితం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు అనిపిస్తుంది. కూటమి గెలిస్తే ఎందుకూ కొరగాని జూనియర్ పార్టీ అవుతుంది జనసేన. ఓడితే కూటమి వల్లే ఈ పరిస్థితి అని చెప్పడానికి సరిపోతుంది. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన సందర్బంలో కమ్యూనిస్టు పార్టీల మద్దతు ఇలాగే తీసుకున్న చంద్రబాబు వాళ్ళ విశ్వసనీయతపై ఇలాంటి దెబ్బే కొట్టారు. 1994లో సీపీఐ, సీపీఎంలు కలిపి 34 సీట్లు గెలిచి బలమైన స్థానంలో ఉండేవారు. ఎన్టీఆర్ను కాదని చంద్రబాబుతో చేతులు కలిపిన కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్ర ప్రదేశ్లో పట్టు పోయి మళ్ళీ కోలుకోలేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపినా ఒకటో ఆరో సీటుకి పరిమితమయ్యి కాలగర్భంలో కలిసిపోయాయి. ఈసారి బాబు దెబ్బతో పవన్ కల్యాణ్ కూడా కరి మింగిన వెలగపండు అవుతారేమో! డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు -
పవన్ అసమర్థుడు.. జగన్ గట్స్ ఉన్న లీడర్
సాక్షి, గుంటూరు: జనసేనకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరును ఎండగట్టారు. పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా? అని పవన్ను ప్రశ్నించారు సూర్యప్రకాశ్. ‘‘జనసేనలో నేను పని చేసిన ఈ ఆరేళ్లలో అరగంట మాత్రమే నాతో పవన్ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు. సామాజిక న్యాయం గురించి పవన్కు ఏమాత్రం తెలియదు. జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు’’ అని సూర్యప్రకాష్ అన్నారు. .. పవన్ కల్యాణ్ని నమ్మి గతంలో జనసేనలో చేరాను. పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా. ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు. పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరే. నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు. చంద్రబాబునో, లోకేష్నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు. అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు. ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు. సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలబడాలి. పీఏసీ సభ్యుడిగా ఉన్నా.. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏనాడూ నాకు ఇవ్వలేదు. ఆయన నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు. సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా. ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది. అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు?. ఏం లబ్ది చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు?.. .. సలహాలు ఇచ్చేవారిని వైఎస్సార్సీపీ కోవర్టులంటూ పవన్ బహిరంగంగా అన్నారని.. ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్కే క్లారిటీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక.. ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని.. పదవికి రాజీనామా ఈ ఉదయమే పంపించానని చెప్పారాయన. బేషరతుగా వైఎస్సార్సీపీలో చేరానని చెప్పారాయన. ‘‘ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను. జగన్ గట్స్ ఉన్న లీడర్. అలాంటి నాయకుని వెనుక నడవాలని అనుకుంటున్నా. ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను. క్రమశిక్షణ గల నేతగా వైఎస్సార్సీపీ కోసం పని చేస్తానని.. ఇక నుంచి నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే అని సూర్యప్రకాశ్ చెప్పారు. మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడే ఈ సూర్య ప్రకాష్. జనసేనలో గత కొన్నేళ్లుగా కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారాయన. ఇక.. పొత్తులో భాగంగా జనసేన తరఫున 24 సీట్లు దక్కించుకున్న పవన్పై హరిరామ జోగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. -
‘అజ్ఞాని పవన్.. నీ అభిమానులే ఛీ కొడుతున్నారు’
గుంటూరు, సాక్షి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న అశేష ప్రజాదరణ చూసి చంద్రబాబు, పవన్లో అసహనం తారాస్థాయికి చేరుకుందని.. తాడేపల్లిగూడెం సభలో వాళ్ల ప్రసంగాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించిందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ బాబు అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జెండా సభ అంటూ తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఏదో వీరంగం వేసి మమ అనిపించారు. ఆ మీటింగ్లో మాట్లాడిన ప్రతీ మాటలో జగన్నామస్మరణ చేశారు. వాస్తవానికి వారిద్దరూ ‘జగన్’ అనే బ్రాండ్ పేరు వింటేనే భయపడుతోన్నారు. చంద్రబాబు సొంత కొడుకు ఎక్కడికెళ్లాడో గానీ.. పెంచుకున్న కుమారుడు పవన్ కల్యాణ్ మాత్రం నిన్న పరిగెత్తుకుంటూ పోయి మైకు పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడాడు. మా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నోరుపారేసుకున్నాడు. పావలా బిళ్లను నేలమీద పడేస్తే పెద్ద గోల చేస్తుంది కదా..? మరి, అదే రూ. వందనోటో.. రూ. ఐదొందల నోటునో కిందపడేస్తే శబ్ధం చేస్తాయా..? అంటే, చేయవని అందరూ చెబుతారు. దీన్నిబట్టి అందరికీ నిన్నటి పవన్ కల్యాణ్ ప్రవర్తన తీరును చూస్తే.. అల్లరి చిల్లర పావలాబిళ్ల పవన్ కల్యాణ్ అని తెలిసిపోయింది. పవన్ ఫ్రస్టేషన్కు కారణం అది జగన్గారి మీద పవన్ కల్యాణ్కు అంత ఫ్రస్టేషన్ ఎందుకు..? ఆయనకు మా నాయకుడు జగన్ గారు చేసిన ద్రోహమేంటి..? అని పవన్ అభిమానుల్లో చర్చ మొదలైంది. రేపోమాపో 60 ఏళ్ల వయస్సు నిండి.. ముసలోడయ్యి.. చంద్రబాబు సహవాసిగా మిగిలిపోయే సందర్భంలో.. తాను పార్టీ పెట్టి 12 ఏళ్లయినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాయనే ఆవేదన పవన్ కల్యాణ్లో ఉంది. తనను నాయకుడిగా ఎవరూ గుర్తించలేకపోవడం.. మరోవైపు తమకన్నా చిన్నవయసున్న జగన్మోహన్రెడ్డి గారికి ప్రజాదరణ వెల్లువెత్తడంతో వారికి ఫ్రస్టేషన్ పీక్కు వెళ్తుందని ప్రజలు కూడా గమనించారు. నీ మాటలు, చేష్టలకు భీతిల్లిన నీ అభిమానులు, జనసేన కార్యకర్తలే రేపటి ఎన్నికల్లో మరోమారు నిన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. అతనో సన్నాసి అభిమానుల్ని పట్టించుకోకుండా.. చంద్రబాబు కాళ్లు ఎందుకు వత్తుకుంటూ కూర్చొన్నావని అతన్నెవరూ ప్రశ్నించకూడదంట. ఎవరి సలహాలు అతనికి అవసరం లేదంట. తాను మాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా తనను నమ్ముకున్నోళ్లు ఏమైనా పర్వాలేదనే తత్వంతో .. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంటాడంట. నిజానికి, ఎవరి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ఎవరి సలహాలు స్వీకరించకుండా ఉన్నందునే పవన్ కల్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీని పెట్టి 12 ఏళ్లయినా.. ఏమాత్రం ఎదుగూబొదుగు లేకుండా ఒంటరిగా సన్నాసిగా మిగిలిపోయాడు. నీ అభిమానులే నిన్ను నమ్మడం లేదు ఈ నిమిషాన కూడా నిన్ను నాయకుడిగా గుర్తించే స్థితిలో నీ అభిమానులే లేరు. అలాంటి సందర్భంలో నువ్వు మా నాయకుడి మీద కోతలు కోస్తావా..? రాష్ట్రంలో 175 స్థానాలకూ 175 స్థానాలూ మేము గెలుచుకుంటున్నామని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు దమ్ముగా చెబుతున్నారు. తాను నిల్చోబెట్టిన ఇద్దరు అభ్యర్థులపై ఓడిన వ్యక్తివి నువ్వు. గతంలో నువ్వు ఎవరిమీదనైతే ఓడావో.. వారిద్దరూ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో ఉన్నారంటే.. ఎవరి బలం ఎంత ఉందో బేరీజు వేసుకుని మాట్లాడితే మంచిది. చంద్రబాబు ప్యాకేజీతో పొత్తుకు సిద్ధమైనప్పుడే నువ్వు జనసేన పార్టీ జెండాను మడతపెట్టేశావని నీ అభిమానులకూ తెలిసిపోయింది. ముసలోళ్లతో సహవాసి కనుకే బీపీ పెరుగుతోంది చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ సొమ్మే నీకు ముఖ్యం కాబట్టి.. నిన్నెవరూ ప్రశ్నించకూడదు.. సలహాలివ్వకూడదంటు న్నావ్..? 75 ఏళ్ల ముసలినక్కతో సహవాసం చేసే నీకూ అవే ముసలి లక్షణాలు అబ్బుతాయనే చెప్పాలి. చేతులూ, కాళ్లు ఊపుకుంటూ రంకెలేస్తే బీపీ పెరిగి జరగరానిదేదో జరిగిందంటే నిన్ను కాపాడేవారెవ్వరూ ఉండరని తెలుసుకో.. హరిరామ జోగయ్య, ముద్రగడ నీకు శత్రువులా? వంగవీటి రంగా గారిని చంపిన, ముద్రగడను అవమానించిన చంద్రబాబుతో అంటకాగొద్దని సలహానిచ్చే హరిరామ జోగయ్య, ముద్రగడలు నీకు శత్రువులా..? వారి పేర్లను ఉదహరించక పోయినా.. వారు పంపే లేఖల్ని.. వాటిల్లో నిన్ను నిలదీసే అంశాల్ని ప్రస్తావిస్తూ తెగ ఊగిపోయావెందుకు..? నిన్న ఆ సభలో నీ ప్రవర్తన అత్యంత జుగుప్సాకరంగా ఉందని నీ అభిమానులే నిన్ను ఛీ కొడుతున్నారని తెలుసుకుంటే మంచిది. బాబు పార్టీకి నువ్వొక జెండా కూలీవి! జెండా కూలీలుగా ఇన్నాళ్లూ నిన్ను అభిమానించే నాయకుల్ని ఏమార్చావు. కార్యకర్తల్ని కూడా ఏమార్చావు. నిన్న చంద్రబాబు పార్టీ జెండా పట్టుకుని నువ్వు కూడా పెద్ద జెండా కూలీగా మారావు. దీన్నిబట్టి నువ్వు, చంద్రబాబు ఎంత అవమానకర పరిస్థితిలో ఉన్నారో తెలుసా..? మీ పార్టీల జెండాల్ని పక్కనబెట్టి పక్క పార్టీల జెండాల్ని పట్టి ఊపడం వంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాజకీయాల్లో మీ ఇద్దరికీ మాత్రమే సాధ్యం. వేరే ఇతర ఏ రాజకీయ పార్టీకీ అలాంటి దుస్థితి రానుగాక రానేరాదు. అవమానించినోళ్లే నీకు మంచోళ్లుగా కనిపిస్తారా..? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని, మీ అన్న చిరంజీవి గారిని, వారి కుమార్తెను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా వాళ్లు చేసిన రోత ప్రచారం నీకు గుర్తుందా పవన్..? అదే సందర్భంలో ఆనాడు చంద్రబాబు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా..?. నీ వాళ్లను తిట్టి అవమానించిన వాళ్లనూ మంచోళ్లుగా చిత్రీకరించుకుంటావ్.. నీకు ఏమాత్రం సంబంధంలేనోళ్లనూ నీకు శత్రువులుగా చిత్రీకరించుకుంటావ్.. ఎదుటి వ్యక్తి ఎవరైనా నీకు తప్పుడోళ్లుగానే కనిపించడమనేది నీచంగా ఉందని గ్రహించుకో.. మగాళ్లతో నీకు సంసారమేంటి..? ఇన్నాళ్లూ నీ పెళ్లిళ్లు.. విడాకుల మీద చాలా వార్తలు వచ్చాయి. నీ మోసంతో కొందరు మహిళలు మోసపోయారని విన్నాం. ఇప్పుడేమో, ఆడవాళ్లను కాకుండా మగవాళ్లతోనూ సంసారం అంటున్నావు. అసలు, నీ మానసిక స్థితేంటో.. ఎవరికీ అర్ధం కావట్లేదు. అంటే, నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోతున్నావో ఆలోచించుకుంటే మంచిది. బాబు, పవన్లను తరిమికొట్టే రోజులొచ్చాయి పావలా వాటాకూ సరిపోని నువ్వు .. పూటకో మాటతో రాజకీయాల్లో గందరగోళం సృష్టించే నువ్వు.. ఏ రకమైన రాజకీయంతో జనసేనను నడుపుతున్నావో ఆలోచించుకోవాలి పవన్. చంద్రబాబు చంకలో వ్యక్తిగా ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలుగా మారవు.. అబద్ధాలు నిజాలవ్వవు. మహిళలు సిగ్గు పడే విధంగా మాట్లాడటానికి నీకు సిగ్గుండాలి. నాడు కుల రాజధాని.. నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? నాడు కులరాజధానిగా కనిపించిన అమరావతి నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? ఇప్పటికైనా నీ నోరు కంట్రోల్ పెట్టుకుని మాట్లాడకపోతే జీవితంలో మరిచిపోలేని పరాభవాన్ని రుచి చూస్తావని హెచ్చరిస్తున్నాను. రేపటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ పార్టీలకు శాశ్వత సమాధికట్టి.. నీకు, చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. -
ఆయన పేరు పవన్ కల్యాణే కాదు: మంత్రి అంబటి
-
‘గట్టిగా అరిచినంత మాత్రాన ఓట్లు పడవ్’
సాక్షి, గుంటూరు: పార్టీ పెట్టి పదేళ్లైనా.. 24 సీట్లకే పోటీ చేసే దుస్థితిలో ఉన్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి ఆర్కో రోజా సెటైర్లు వేశారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలకు గురువారం ఆమె కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేష్టన్ పీక్స్కు చేరింది. పార్టీ పెట్టి పదేళ్లైనా 24 సీట్లకే పోటీ చేస్తున్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలని స్టేజ్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారు. సీఎం జగన్ను విమర్శించే అర్హత పవన్ కల్యాణ్కు లేదు. చంద్రబాబు మాయలో పవన్ పూర్తిగా పడిపోయారు. బాబుకు ఊడిగం చేస్తూ పవన్ పాతాళంలోకి కూరుకుపోయారు .. పార్టీ అధ్యక్షుడైనా పవన్ ఇంతదాకా మండల, బూత్ కమిటీలు వేయలేదు. 24 సీట్లు తీసుకొని... జనసేన నేతలకు పవన్ అన్యాయం చేశారు. తన తప్పును కార్యకర్తలపై రుద్దాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. గట్టిగా అరిచినంత మాత్రాన ఓట్లు పడవని పవన్ గుర్తించాలి. రిషికొండలో అద్భుతమైన భవనం నిర్మిస్తున్నాం. ముఖ్యమంత్రి రిషికొండలో ఉండాలని కమిటీ నిర్ణయించింది. క్యాంప్ ఆఫీసు కాకపోతే.. టూరిస్టు ప్లేస్ గా ఉంటుంది అని అన్నారు మంత్రి రోజా. -
చంద్రబాబు, పవన్ కు చుక్కలు చూపించిన కేశినేని
-
వంగలపూడి అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు
-
సీటివ్వకపోతే చచ్చిపోతా..!
తాడేపల్లిగూడెం/తణుకు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ ఏలూరు(టూటౌన్)/గోకవరం: పదేళ్లపాటు టికెట్ ఇస్తానని నమ్మబలికి ఇప్పుడు తణుకు టికెట్ను పొత్తులో టీడీపీకి కేటాయించడం న్యాయం కాదని, తనకు టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు హెచ్చరించారు. టికెట్ కేటాయింపుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో ఆయన సోమవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్తోపాటు ఇతర నాయకులు చేపట్టిన బుజ్జగింపులు ఫలించలేదు. తనకు సీటు కేటాయించకపోవడంపై సోమవారం రాత్రి మనోహర్ను ప్రశ్నించేందుకు ఆయన బస చేసిన గెస్ట్హౌస్కు నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లిన విడివాడను మనోహర్ కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విడివాడ తణుకు వెళ్లిపోయారు. తొలుత జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్కు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. తణుకు టికెట్ను పవన్ గతంలో హామీ ఇచ్చిన విధంగా విడివాడ రామచంద్రరావుకు కాకుండా టీడీపికి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో రగిలిపోతున్న జనసేన కార్యకర్తలు, నాయకులు జనసేన పీఏసీ చైర్మన్ మనోహర్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పెంటపాడు మండలం అలంపురం సమీపంలోని జయా గార్డెన్లో ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన జనసేన, టీడీపీ ఉమ్మడి సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. ఈ క్రమంలో తణుకు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ కన్వినర్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన బస చేసిన గెస్ట్హౌస్ని ముట్టడించారు. మనోహర్ బయటికి రావాలని, విడివాడకు న్యాయం చేయాలంటూ నినాదాలిచ్చారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో లోపల ఉన్న మనోహర్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో మరింత రగిలిపోయిన శ్రేణులు తోపులాటకు దిగాయి. ఆ పార్టీ జిల్లా స్థాయి నాయకులు సముదాయించే ప్రయత్నం చేసినా శ్రేణుల ఆగ్రహం చల్లారలేదు. ఈ క్రమంలో సహనం నశించిన కార్యకర్తలు గెస్ట్హౌస్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లడానికి యత్నించారు. ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను శాంతింపజేసేందుకు పార్టీ నేతలు బొలిశెట్టి శ్రీను, కొటికలపూడి గోవిందరావు తదితరులు ప్రయత్నించినా ఎవ్వరూ లెక్కచేయలేదు. ఈ సందర్భంగా విడివాడ మాట్లాడుతూ తనకు టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఈ పంచాయితీని తణుకులోనే తేల్చుకుంటామని తన అనుచరులతో కలసి వెనుదిరిగారు. అనంతరం మనోహర్ సూచనలతో జిల్లా నాయకులు తణుకు చేరుకొని రాత్రి తొమ్మిది గంటల సమయంలో విడివాడ గెస్ట్ హౌస్కు తీసుకొచ్చారు. పదేళ్లపాటు జనసేన టికెట్ ఇస్తామని నమ్మబలికి చివరికి టికెట్ల పంపకాల్లో మొండిచేయి చూపడంతో ఆగ్రహించిన జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ ప్లెక్సీలను చించేస్తూ జనసేన అధినేత పవన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు నన్ను కాదని మరో వ్యక్తికి తణుకు టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన విడివాడ మండపాక గ్రామ జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో తనను కాదని మరో వ్యక్తికి టిక్కెట్ ఇచ్చినా సహించానని, పదేళ్లుగా రూ. కోట్లు ఖర్చు పెట్టానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తానని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన నాయకుడిని పక్కన పెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ ఇక్కడ పోటీ చేస్తే సహకరిస్తామని, అంతే తప్ప తెలుగుదేశం జెండా మోసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జనసేన పార్టీకి సంబంధం లేని వారిని టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తనతో పాటు తిప్పుకోవడం సరైన పద్దతి కాదని మండిపడ్డారు. మరోవైపు నెల్లూరులో జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. నెల్లూరు సిటీ లేదా నెల్లూరు రూరల్ సీటు ఇస్తారని ఆశ పెట్టుకున్న మనుక్రాంత్రెడ్డికి పవన్ కళ్యాణ్ పెద్ద షాకిచ్చారు. పవన్కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని టికెట్ వస్తుందని ఆశిస్తే అన్యాయం చేశారని మండిపడుతున్నారు. సోమవారం నెల్లూరులోని మినీబైపాస్లోని జనసేన కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు మాయలోపడి పవన్ మోసపోయాడని వారు మండిపడ్డారు. టీడీపీకి ఓటేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఈ నిరసన సమయంలో మనుక్రాంత్రెడ్డి పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. రెడ్డి అప్పలనాయుడు కన్నీటిపర్యంతం పొత్తులో భాగంగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. దీనిపై జనసేన, టీడీపీ నేతలు వపన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి సీటును జనసేనకు కేటాయించాలని జనసేన పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్య కేడర్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మాకు న్యాయం చేయాలి’, ‘రెడ్డి అప్పలనాయుడుకు సీటు ఇవ్వాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవసరమైతే జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు రెబల్గా పోటీలో నిలవాలంటూ నినదించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఏలూరు టికెట్ను టీడీపీకి కేటాయించడం పట్ల ఏలూరు నియోజకవర్గ జనసైనికులు అసంతృప్తికి లోనయ్యారన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే జనసేన పార్టీకి అత్యధికంగా బలం ఉన్న నియోజకవర్గం ఏలూరు అని సర్వేలో మొదటి స్థానం వచ్చిన ఏలూరు సీటుపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని కోరారు. రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినాయకత్వం స్పందించని పక్షంలో ఏం చేయాలనే దానిపై కార్యాచరణ ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా ఏడుగురు సభ్యులతో కమిటీని వేశారు. గత ఐదున్నర సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమించిన రెడ్డి అప్పలనాయుడుకు పొత్తుల పేరుతో మొండిచేయి చూపడాన్ని పార్టీ కార్యకర్తలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా కార్యకర్తల సమావేశం నుంచి లోపలికి వెళుతూ కన్నీరు పెట్టుకున్నారు. దీన్ని చూసిన జనసైనికులు పెద్దగా నినాదాలు చేశారు. కార్యాలయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఉన్న ఫ్లెక్సీల్లోని చంద్రబాబు ఫొటోలను చించేశారు. కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించి, తనకు అన్యాయం చేయడంపై జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర గోకవరం మండలంలోని అచ్యుతాపురం కనకదుర్గమ్మ ఆలయం వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షా శిబిరాన్ని సోమవారం వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులను పరామర్శించారు. -
నాదెండ్లకు చుక్కలు చూపించి.. దాడికి యత్నం!
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేనలో సీట్ల పంచాయితీ ‘ముష్టి’ యుద్ధానికి దారి తీస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు జనసేన శ్రేణులు చుక్కలు చూపించాయి. ఆయన బస చేసిన చోట నిరసనకు దిగాయి. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ నాదెండ్లపై దాడికి సైతం యత్నించాయి. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు సోమవారం నాదెండ్ల మనోహర్ వెళ్లారు. పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్లో రాత్రి బస చేశారాయన. సమాచారం అందుకున్న వెంటనే జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు, తన అనుచరులు, కొంతమంది కార్యకర్తలతో గెస్ట్హౌజ్ దగ్గర నిరసనకు దిగారు. రామచంద్రరావుకు అనుకూలంగా ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ భారీగా పోలీసులతో అక్కడ మోహరించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్లు ఎంత సముదాయించిన రామచంద్రరావు మాట వినలేదు. ‘టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటా’ అంటూ బెదిరించారు. ఈ క్రమంలో బొలిశెట్టి వర్సెస్ విడివాడ వర్గాలుగా విడిపోయి జనసేన శ్రేణులు బాహాబాహీకి యత్నించాయి. బోలిశెట్టి సత్యనారాయణపై కొందరు కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. మనోహర్ బస చేసిన చోటే రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో కొందరు కార్యకర్తలు మనోహర్ను బూతులు తిడుతూ కనిపించారు. వారాహి యాత్రలో స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తణుకు సీటు జనసేనదేనని.. రామచంద్రరావు పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా చాలా కాలం దాకా ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది. సీన్ కట్ చేస్తే.. ఉమ్మడి జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. టికెట్ టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణకు వెళ్లింది. దీంతో రామచంద్రరావు వర్గీయులు రగిలిపోతున్నారు. -
‘రబ్బరు చెప్పుల రాజకీయం కాస్త.. !’
విజయవాడ, సాక్షి: రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్లతో రాజకీయాలు చేయిస్తానని పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట మార్చాడని.. ఇప్పుడు డబ్బున్న వాళ్ళను మాత్రమే జనసేన నాయకుల్ని చేస్తోందని వైఎస్సార్సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్ విమర్శించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్పై సంచలన ఆరోపణలే చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరి నుంచి పవన్ కల్యాణ్ కోట్ల కొద్ది డబ్బు తీసుకున్నాడు. పవన్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశాడు. 2019 తరువాత చార్టర్ ఫ్లైట్ కొన్నాడు. కోట్లు పెట్టి కార్లు కొన్నాడు. అసలు పవన్కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?.. .. పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తే నేను బూటు చూపిస్తున్నా. పార్టీ పెట్టి కాపులను పవన్ కల్యాణ్ మోసం చేశారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డున పడేశారు. టీడీపీకి హోల్ సేల్ గా పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేశాడు. నమ్మి మోసపోయిన నాకు మీరు(పవన్ను ఉద్దేశించి..) సమాధానం చెప్పాలి అని రామ్సుధీర్ వ్యాఖ్యానించారు. .. జనసేన పార్టీ పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాల పేరుతో పెద్ద స్కామ్కు తెరలేపారు. జనసేనలో నాదెండ్ల లింగమనేని ఇద్దరూ కలిసి టికెట్ల డిసైడ్ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని అడుగుతున్నారు.. అని రామ్ సుధీర్ ఆరోపించారు. -
పవన్ కల్యాణ్కు ఓపెన్ ఆఫర్!
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిని చేస్తామని.. అందుకు ఎంత డబ్బు ఖర్చు అయినా తానే భరిస్తానని ఆఫర్ ఇచ్చారు . సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థుల్ని ప్రకటించే టైంలో వేదిక మీద చంద్రబాబు పక్కనే ఉన్న పవన్లో బాధ కనిపించిందన్నారు. మరి చంద్రబాబు ఎన్ని కోట్లు ఇచ్చారో పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారోనని పాల్ ప్రశ్నించారు. ‘నీకు(పవన్ను ఉద్దేశించి..) ఓటు బ్యాంకు లేదు. డబ్బు తెచ్చే సత్తా లేదు. ప్రజలు ఛీ అంటుఉన్నారు. కానీ, ప్రజా శాంతి తరపున నీకు నేను 24 కాదు.. గతంలో చెప్పినట్లు 48 కాదు.. ఇప్పుడు మూడు రెట్లు అంటే 72 సీట్లు ఇస్తా. నిన్ను గెలిపిస్తా. నేను గెలిచి పార్లమెంట్కు వెళ్తా.. నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తా’’ అని పాల్ పవన్కు హామీ ఇచ్చారు. అలాగే.. టీడీపీ జనసేనలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి సంసిద్ధం అంటున్నాయని.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ఏపీ ప్రజలకు కే ఏ పాల్ విజ్క్షప్తి చేశారు. వంగవీటి రంగాను చంపిన రక్తపు చేతుల్లోంచి(బాబును ఉద్దేశిస్తూ..) బయటకు రా అంటూ పవన్ను పాల్ కోరారు. -
జానీ.. జానీ.. 'ఎస్.. పాపా'!
గాలికి ఎగిరిపోయే పేలాలు కృష్ణార్పణం..! బలహీన స్థానాలు జనసేన పరం..! పొత్తుల పేరుతో జనసేన స్థావరాల్లోకి చొరబాట్లు! ఇదీ చంద్రబాబు రాజకీయ నీతి! గత ఎన్నికల్లో జనసేన కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకున్న స్థానాలను పొత్తుల పేరుతో కబళిస్తూ ఆ పార్టీ చేతులెత్తేసిన సీట్లను మాత్రం చంద్రబాబు బలవంతంగా అంట గట్టేసి చేతులు దులుపుకొంటున్నారు. పొత్తుల పేరుతో నామమాత్రంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించిన చంద్రబాబు అందులోనూ తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శించారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పుడు జనసేన తమకన్నా అధికంగా ఓట్లు తెచ్చుకున్న సీట్లను కూడా ఈ సారి ఆ పార్టీకి కేటాయించలేదు. అంటే... చంద్రబాబు కోరుకుంటున్నదేంటి? మిత్రపక్షంగా జనసేన గెలుపునా? లేక కేవలం జనసేనతో పొత్తువల్ల తమకు వచ్చే ఓట్లనా? సందేహం లేదు.. ఆ రెండోదే!. మరి ఇన్ని జరుగుతున్నా... ఇలాగైతే జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కావటం సాధ్యం కాదంటూ పార్టీ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నా పవన్ మాత్రం నోరు మెదపటం లేదెందుకు? బాబు ఏం చేసినా ఊ.. కొడుతున్నారెందుకు? మరోసారి ఆయన్ను నమ్మి జనసేన శ్రేణులు దెబ్బతినాల్సిందేనా? సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రెండు స్థానాలతోపాటు జనసేన గెలిచిన ఏకైక సీటుతో కలిపి ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 15 స్థానాల్లో 30 వేలకు పైగా ఓట్లు సాధించింది. అయితే ఇందులో ఏడు చోట్ల ఇప్పటికే టీడీపీ అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించేశారు. మిగిలినవి ప్రస్తుతానికింకా ప్రకటించలేదు. ఈ 15 సీట్లలో ఒక్కటంటే ఒక్కటి... కేవలం కాకినాడ రూరల్ స్థానాన్ని మాత్రమే జనసేనకు కేటాయించారు. ► గత ఎన్నికలో జనసేనకు కేవలం 7,633 ఓట్లు మాత్రమే వచ్చిన నెలిమర్ల లాంటి బలహీన స్థానాలను పొత్తుల పేరుతో చంద్రబాబు ఆ పార్టీకి మరోసారి కేటాయించేశారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో జనసేనకు 11,988 ఓట్లు వచ్చాయి. విచిత్రమేంటంటే పవన్ కళ్యాణ్ సైతం సీట్ల సంఖ్యపై గానీ, ఏఏ సీట్లు అనే విషయంలో గానీ పెద్దగా పట్టుబట్టడం లేదన్నది ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఎంత సంఖ్య చెప్పినా ‘ఊ’ కొట్టేస్తున్నారని... నాదెండ్ల మనోహర్ ఏ జాబితా ఇస్తే ఆ జాబితాను ప్రకటించేస్తున్నారని పార్టీ వర్గాలు రగిలిపోతున్నాయి. ► గత ఎన్నికల్లో జనసేన ఏకంగా 36,259 ఓట్లు దక్కించుకున్న పి.గన్నవరం సీటుకు చంద్రబాబు ఈ దఫా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించి జనసైనికులకు షాక్ ఇచ్చారు. ఇంకా విస్మయకరమైన వాస్తవమేంటంటే జనసేనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన మహాసేన రాజేష్ను పి.గన్నవరం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం. దీనిపై జనసేన నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ► మరోవైపు విజయవాడ తూర్పులో జనసేన అభ్యర్థికి 30,137 ఓట్లు, విజయవాడ సెంట్రల్లో జనసేనతో మిత్రపక్షంగా నాడు పోటీ చేసిన సీపీఎం అభ్యర్ధికి 29,333 ఓట్లు రాగా ఈసారి ఆ రెండు స్థానాల్లోనూ చంద్రబాబు ఇప్పటికే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించేశారు. ఇక నగరంలో మిగిలింది విజయవాడ పశ్చిమ స్థానమే. జనసేన పట్టుబట్టి దాన్ని సాధించుకున్నా... అక్కడ మిగతా రెండు స్థానాలతో పోలిస్తే జనసేనకు గతంలో తక్కువగా 22,367 ఓట్లు మాత్రమే వచ్చాయి. ► రాజమండ్రి రూరల్లో గత ఎన్నికల్లో 42,685 ఓట్లు సాధించిన జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్ ఈ దఫా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తానూ పోటీలో ఉన్నానంటున్నారు. దుర్గేష్ను నిడదవోలు పంపించేందుకు పవన్కళ్యాణ్ ద్వారా చంద్రబాబు స్కెచ్ వేసినట్లు సమాచారం. నిడదవోలులో గత ఎన్నికల్లో జనసేనకు 23 వేల ఓట్లు మాత్రమే దక్కాయి. పవన్కళ్యాణ్ తర్వాత జనసేనలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించిన అభ్యరి్థకి సైతం సీటు గ్యారెంటీ లేకపోవడంపై జనసైనికులు కంగు తింటున్నారు. ► తణుకు శాసనసభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 31,961 ఓట్లు వచ్చాయి. పొత్తుల పేరుతో అక్కడ ఈసారి టీడీపీ పాగా వేసింది. జనసేనకు 35,833 ఓట్లు వచ్చిన కొత్తపేట, 35,173 ఓట్లు వచ్చిన మండపేట, 33,334 ఓట్లు వచ్చిన ముమ్మడివరం, 32,984 ఓట్లు లభించిన పాలకొల్లు నియోజకవరాల్లో సైతం చంద్రబాబు ఇప్పటికే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించారు. తణుకు పర్యటన సందర్భంగా స్థానిక జనసేన ఇన్చార్జ్ని గెలిపించుకుందామంటూ ప్రకటనలు చేసిన పవన్కళ్యాణ్... పొత్తుల పేరుతో ఆ స్థానాన్ని టీడీపీకి అప్పగించడంపై జనసైనికులకు మాట పెగలటం లేదు. -
నీ మీద నమ్మకం పోయిందన్నా.. నీ వెంట నడిచే ఓపిక లేదు..
తొలి జాబితాతోనే యుద్ధం మొదలైంది.. ఈ యుద్ధం ఎన్నికల క్షేత్రంలో కాదు.. సామాజిక మాధ్యమాల్లో. వైరి శ్రేణుల మధ్య కాదు.. పొత్తు కౌగిల్లో ఉన్న పారీ్టల మధ్య. పొత్తుల మాటున చంద్రబాబుకు అలవాటైన వెన్నుపోటుతో జనసేన నాయకులు, కార్యకర్తలు విలవిల్లాడుతున్నారు. మా నాయకుడ్ని సీఎం కుర్చీపై చూస్తామని అనుకుంటే.. ముష్టి విదిలించినట్లు 24 సీట్లు ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేక.. ఈ కూలి బతుకులు మాకొద్దంటూ.. పవన్కు గ్లాసుకూ ఒక దండం పెట్టేస్తున్నారు. మీ తొత్తు పారీ్టకి 24 సీట్లే ఎక్కువ మూసుకొని బానిసల్లా ఉండడమేనంటూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు మాటలతో రెచ్చగొడుతున్నారు. పావలా వంతు కూడా సీట్లు దక్కించుకోలేని జనసేన, పొత్తు పేరుతో బానిస పారీ్టలాగానే జనసేనని చూస్తున్న టీడీపీ కార్యకర్తల మధ్య ‘సోషల్’ యుద్ధం జరుగుతోంది. సాక్షి, విశాఖపట్నం : ‘అన్నా.. ఇన్నాళ్లూ.. నీ మీద నమ్మకంతో జెండా పట్టి కూలీలా పనిచేశాం. రెండు జెండాలు పట్టుకొని తిరుగుదామని పిలుపునిస్తే.. తిరిగాం.. ఇంక మా వల్ల కాదు.. నీ కోసం క్షేత్ర స్థాయిలో మేం రొమ్ము విరుచుకొని పనిచేస్తుంటే.. నువ్వు చంద్రబాబు ఎదుట సాగిలాపడుతూ బాంచన్ దొర అన్నట్లుగా తలూపుతుంటే ఇంకా చూస్తూ తట్టుకోవడం మా వల్ల కావడం లేదు.. ఇక సెలవు అన్నా.. పవన్ అంటే ప్రాణం.. కానీ.. ఓటు మాత్రం వైఎస్ జగన్కే వేస్తాం..’ అని ఒకరు. ‘నీ మీద నమ్మకం పోయిందన్నా.. నీ వెంట నడిచే ఓపిక లేదు.. నడిచే ప్రసక్తే లేదు..’ అంటూ మరొక జనసేన కార్యకర్త పవన్ని సోషల్ మీడియా వేదికగా తూర్పారబడుతున్నారు. టీడీపీ, జనసేన సంయుక్తంగా విడుదల చేసిన తొలి జాబితా.. ఆయా పార్టీ శ్రేణుల్లో చిచ్చు రేపుతోంది. టీడీపీ, జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు సొషల్ మీడియాలో కత్తులు దూసుకుంటున్నారు. మాటల తూటాలతో యుద్ధం చేసుకుంటున్నారు. 2024లో కచ్చితంగా పవన్ని ముఖ్యమంత్రిగా చూస్తామని ఇన్నాళ్లూ కలలు కన్న జనశ్రేణులు.. అవన్నీ పగటి కలలని తేలడంతో.. ఏం చేయాలో పాలుపోని దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఒక్కొక్కరుగా.. పారీ్టకి ఇన్నాళ్లూ సేవలు చేసినా.. చివరికి బానిసల్లా పవన్ కల్యాణ్ మార్చేశారంటూ ఆవేదనతో జనసేనకు గుడ్బై చెబుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి పొత్తులతో ఓట్ షేరింగ్ జరిగే ప్రసక్తే లేదనీ.. రాబోయే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని బల్లగుద్దీ మరీ పోస్టుల్లో చెబుతున్నారు. వీటిని సహించలేని కొందరు జనసేన పార్టీ నాయకులు.. ఎప్పటిలాగానే.. వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని కోవర్టులంటూ బూతు పురాణాలు లంఖిస్తున్నారు. దీంతో.. సామాజిక మా«ధ్యమాల్లో జనసేన కార్యకర్తలు, నాయకులు రెండుగా చీలిపోయారు. కొందరు పవన్ ఏం చేసినా తప్పదు. ఆయన వెంటే నడుస్తామని నైరాశ్యంతో చెబుతుంటే.. సింహభాగం నాయకులు, కార్యకర్తలు మాత్రం.. చంద్రబాబు, లోకేష్ తోపాటు పవన్నీ తిడుతూ.. ఈసారి వైఎస్ జగన్కే మా ఓటు.. ఆయనే సీఎం అని బాహాటంగానే తమ నిర్ణయాన్ని వ్యక్తం చేసే వర్గంగా విడిపోయారు. జనసేనను ఆటాడుకుంటున్న టీడీపీ మరోవైపు సీట్ల కేటాయింపుతో నిరాశ నిస్పృహలకు లోనైన జనసేన కార్యకర్తలు, నాయకులతో టీడీపీ శ్రేణులు ఆటాడుకుంటున్నాయి. పావలా బతుకులకు 24 సీట్లే ఎక్కువనీ.. ఇచ్చిన సీట్లన్నీ గెలిపించుకోగలరా అంటూ సవాల్ విసురుతున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకెళ్లి.. చంద్రబాబు లేదా లోకేష్ సీఎం అవుతారు తప్ప.. పవన్కు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంకొందరైతే.. ముందు ఎమ్మెల్యేని చెయ్యండి.. తర్వాత సీఎంని చేసే ఆలోచన దగ్గరకు రండి అంటూ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతుండటంతో.. జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు రగిలిపోతున్నారు. అనవసరంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మద్దతునిచ్చి పవన్ తప్పు చేశారనీ.. లేదంటే.. అచ్చెన్నాయుడు చెప్పినట్లు ఈ సమయానికి పార్టీ లేదు.. బొ–– లేదు అనే మాటే నిజమై ఉండేదని సమాధానమిస్తున్నారు. ఇలా.. రెండు రోజులుగా ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో టీడీపీ, జనసేన మధ్య సోషల్ వార్నడుస్తోంది. -
భలే మాంచి 'చౌక బేరమూ'!
సాక్షి, అమరావతి: అందరూ అనుకుంటున్నట్లుగానే జరిగింది. జనసేనను కేవలం 24 స్థానాలకే పరిమితం చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్కు ఏం చెప్పారో.. ఏం ఆశ చూపారో కానీ.. పాతిక శాతానికి పైగా సీట్లు ఆశిస్తున్న జనసేన నేతల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మాత్రం సీట్ల కోసం ఇన్నాళ్ల నుంచి ఇంత హంగామా ఎందుకని, ఇలాగైతే రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుందని ఆ పార్టీ నేతలు పవన్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ–జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం పవన్ కళ్యాణ్తో కలిసి ఉండవల్లిలోని తన నివాసంలో విడుదల చేశారు. సీట్ల విషయంలో తాము చాలాసార్లు చర్చలు జరిపామని తెలిపారు. తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, ఇందులో టీడీపీ నుంచి 94 మంది ఉన్నారని తెలిపారు. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తుందన్నారు. ఇలా వారిద్దరూ కలిసి ఉమ్మడి బాబితా విడుదల చేయగానే జనసేన నేతలు ఎక్కడికక్కడ భగ్గుమన్నారు. సీట్ల సంఖ్యలో బాబు చెప్పినట్టే తలూపుతూ తమ అధినేత పవన్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తు పేరుతో జనసేన పార్టీని చంద్రబాబుకు హోల్ సేల్గా తాకట్టు పెట్టేశారని దుమ్మెత్తిపోశారు. రెండేళ్లుగా పనులన్నీ మానుకుని పార్టీ కోసం పని చేస్తుంటే, మరీ దారుణంగా 24 సీట్లతో ఎలా పొత్తు పెట్టుకుంటారని దుయ్యబట్టారు. బాబు బలహీనత బహిర్గతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారులోనే చంద్రబాబు బలహీనత బహిర్గతమైంది. ఎటువంటి ప్రయోగాలు లేకుండా చాలా సాదాసీదాగా టీడీపీ–జనసేన ఉమ్మడి జాబితాను ప్రకటించారు. ఇందులో దాదాపు అన్నీ పాత ముఖాలే ఉన్నాయి. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో రకరకాల భయాలు, అనుమానాలతో ఉన్న చంద్రబాబు వాటన్నింటినీ జాబితాలో తేటతెల్లం చేశారు. కొత్తదనం అనే మాటే లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ కూడా ఆ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రకటించిన 94 సీట్లలో బీసీలకు కేవలం 18 సీట్లు మాత్రమే ఇచ్చారు. గతంలో కంటే తక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం. తన సొంత సామాజికవర్గానికి (కమ్మ) మాత్రం ఏకంగా 21 సీట్లు కేటాయించి తన ప్రాధాన్యత ఏమిటో చంద్రబాబు మరోసారి చాటిచెప్పారు. 94 సీట్లలో 52 మంది ఓసీ అభ్యర్థులే ఉన్నారంటే టీడీపీ ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతోంది. మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించామని ప్రకటించినా, 94లో పది మంది మాత్రమే ఉన్నారు. దీన్నిబట్టి వారికి ఏ స్థాయిలో అవకాశం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి కేవలం ఏడు సీట్లు మాత్రమే ఇచ్చారు. ఈ జాబితాలో మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు కేటాయించి వారికి టీడీపీలో ఉన్న గౌరవం ఏపాటిదో స్పష్టం చేశారు. ఒత్తిడి తట్టుకోలేక ఎట్టకేలకు తొలి జాబితా టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొనడంతో ఎట్టకేలకు తొలి జాబితాలో చంద్రబాబు కొందరు అభ్యర్థులను ఖరారు చేశారు. సీట్లు ఖరారు చేయకుండా పవన్ కళ్యాణ్తో చర్చలకే పరిమితమవడం, బీజేపీతో పొత్తు కోసం తాపత్రయ పడుతుండడంతో టీడీపీలో ఆందోళన నెలకొంది. ఒకవైపు వైఎస్సార్సీపీ ఒక ప్రణాళిక ప్రకారం అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకెళుతున్న తరుణంలో చంద్రబాబు స్తబ్దుగా ఉండడంపై క్యాడర్లో తీవ్ర నిరుత్సాహం ఏర్పడింది. తాము ఎన్ని సీట్లలో పోటీ చేసే విషయాన్ని తేల్చక పోవడంపై జనసేన నేతల్లోనూ అసహనం పెరిగిపోయింది. బీజేపీతో పొత్తు విషయం తేలాకే సీట్లు ప్రకటించాలనే ఆలోచనతో ఇన్నాళ్లూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎదురు చూశారు. కానీ ఆ పార్టీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ప్రస్తుతానికి కొన్ని సీట్లలోనైనా అభ్యర్థులను ఖరారు చేసి క్యాడర్లో అసహనాన్ని తగ్గించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే శనివారం 99 మందితో జనసేన–టీడీపీ తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. పొత్తులో మొత్తంగా జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు దక్కాయి. తన పార్టీకి కేటాయించిన 24 సీట్లకుగాను పవన్ ప్రస్తుతం కేవలం ఐదు సీట్లలోనే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. పారాచూట్ నేతలకు ప్రాధాన్యత తొలి జాబితాలో పారాచూట్ నేతలకు ప్రాధాన్యత లభించింది. ఉన్నట్టుండి ఊడిపడిన వెనిగండ్ల రాము, సరిపల్లె రాజేష్, ఎస్ రోషన్, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వీఎం థామస్ వంటి వారికి సీట్లు ప్రకటించేశారు. అక్కడ పార్టీ కోసం సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టేశారు. తొలి జాబితాలోనే తనతోపాటు తన కుమారుడు, తన బావమరిదికి చంద్రబాబు టికెట్లు ప్రకటించారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేష్కు మంగళగిరి, బావమరిది బాలకృష్ణకు హిందూపురం సీట్లు ఖరారు చేశారు. జనసేనకు కేటాయించిన సీట్లు పోగా, మిగిలిన సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని బాబు తెలిపారు. బీజేపీ కూడా కలిసి వస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ప్రజాబలం ఉందని, విలువలతో కూడిన రాజకీయాలు చేశామని చెప్పుకొచ్చారు. మాఘపౌర్ణమి లాంటి శుభ దినాన టీడీపీ–జనసేన అభ్యర్థులను ప్రకటించామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేస్తున్నామన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశానన్నారు. దాదాపు 1.30 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, విద్యావంతులకు, యువత, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. 40 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు లెక్కట! ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేసేకంటే, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ, వ్యక్తి ప్రయోజనాలు దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. కొందరు 45 కావాలి.. 75 కావాలన్నారని, 2019లో పది స్థానాలన్నా గెలిచి ఉంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు అడగడానికి అవకాశం ఉండేదని చెప్పారు. జనసేనకు కేటాయించిన 24 స్థానాలే కనబడుతున్నాయి కానీ.. 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు జనసేనలో భాగమవుతాయని తనకు తాను సర్దిచెప్పుకున్నారు. ఈ లెక్కన పార్లమెంటు స్థానాల పరిధిని కలుపుకుంటే 40 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు లెక్క అని సరికొత్త లెక్క చెప్పారు. పొత్తు బలంగా ఉండాలని బీజేపీని దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. -
యెల్లో సేనలు డీలా!
పెత్తందారు ప్రమాదకరమైనవాడు. వాడు దశకంఠుడిలా కనిపి స్తాడు. మహాబలాఢ్యునిగా గోచరిస్తాడు. నల్లధనం కొండ మీద పడగవిప్పి కూర్చున్న నల్లతాచు వాడు. కనుక భయంకరంగానే కనిపిస్తాడు. వేయి పడగల కర్కోటకుడు పెత్తందారు. ఒక్కో వ్యవస్థలోకి ఒక్కో పడగను దూర్చి ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విషసర్పం వాడు. ఆ సర్పరాజు పేరు ఏదైనా కావచ్చు. తక్షకుడు, కర్కోటకుడు, కాలకేయుడు, పింజారకుడు, చంద్రబాబు నాయుడు, రామోజీరావు... ఇలా! పేరేదైనా సరే పెత్తందార్ల దోపిడీకి కాపుకాయడమే ఆ రాజు పని. భయంకరంగా కనిపి స్తున్నాడని వాడికి భయపడితే పేదల బతుకులు ఎప్పటికీ మారవు. మన ఏడున్నర దశాబ్దాల ప్రజాస్వామ్యం ఇదే విషయాన్ని నిరూపించింది. ఈ విషసర్పపు కోరలు పీకేస్తేనే పేదలకు శాప విమోచనం దొరుకుతుంది. ఆ పని చేయడానికి నేను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తున్నారు. తనతో కలిసి నడవడానికి సిద్ధమా అని ప్రశ్నిస్తూ జనసామాన్యాన్ని ఆయన సమాయత్తం చేస్తున్నారు. పేద పిల్లలకు బంట్రోతు చదువులు... సంపన్నులకు దొరబాబు చదువులా? ఎన్నాళ్లీ దుర్నీతి? ఇది ప్రజాస్వా మ్యమా... పెత్తందారీస్వామ్యమా?... ఇన్నాళ్లూ పెత్తందారీ స్వామ్యమే విద్యారంగాన్ని పరిపాలించింది. ఈ దుష్పాలన ఇంకానా... ఇకపై చెల్లదని ఐదేళ్ల కింద జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చాటింపు వేశారు. ఒక్క చదువే కాదు, సమస్త జీవన రంగాల్లోని అమానవీయత, అసమానతలపై ఆయన యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పేదవర్గాలకు సమకూర్చేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. నవయుగానికి అవసరమైన ‘మాగ్నాకార్టా’ను తనదైన పద్ధతిలో అమలు చేయడం ప్రారంభించారు. అది సత్ఫలితాలనిస్తున్నది. రెండేళ్లు కోవిడ్ కోతకు గురైన ఈ అయిదేళ్ల పదవీ కాలంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతాలు చేసి చూపెట్టింది. ఒకపక్క ఆర్థికాభివృద్ధి సూచికలు ఊర్ధ్వ చలనాన్ని సూచిస్తుంటే, అదే సమయంలో మానవాభివృద్ధి సూచికలు కూడా అంతకంటే వేగంగా పరుగులు తీశాయి. ఇది గతంలో ఎన్నడూ చూడని అనుభవం. మానవాభివృద్ధిరంగంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇంకో పది పదిహేనేళ్లలో సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చబోతున్నదని పలువురు ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని గతంలో కొందరు ఆర్థికవేత్తలు తప్పుపట్టేవారు. ‘గుడ్ ఫిలాసఫీ బట్ బ్యాడ్ ఎకనామిక్స్’ అంటూ వెటకారం చేసేవారు. కానీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన మానవాభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్కదానిపైనా ఆర్థికవేత్తలు ఇటువంటి వ్యాఖ్యానం చేయకపోవడం విశేషం. పైపెచ్చు ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ‘గుడ్ ఫిలాసఫీ అండ్ గుడ్ ఎకనామిక్స్’గా పరిగణన పొందాయి. అందువల్లనే అవి సత్ఫలితాలనిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికల్లో, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో, ఉపాధి కల్పనలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పేద వర్గాల్లో ఒక గొప్ప రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్నది. సాధికారతలోని ఆత్మగౌరవ భావన వారి అనుభవంలోకి నెమ్మదిగా ప్రవేశి స్తున్నది. సాధికారత పథంలో మహిళలు ముందడుగు వేశారు. ఈ కారణాల వలన రాష్ట్రంలో వైఎస్ జగన్ రాజకీయ శిబిరం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. అతి భయంకరుడూ, గండర గండడనుకున్న పెత్తందారులను తరిమికొట్టొచ్చన్న భావన బల పడుతున్నది. ఈ పెత్తందారీ శిబిరానికి తెలుగు నాట కాపలా దార్లయిన సర్పరాజులు చంద్రబాబు, రామోజీ వగైరాలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు పార్టీ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెబుతున్నది కదా! మరి వాళ్లెట్లా పెత్తందారీ వర్గాల ప్రతినిధులవుతారు? ఈ సంశయం కొంతమందికి కలగవచ్చు. చంద్రబాబు పార్టీది పూటకూళ్ల సంక్షేమ సిద్ధాంతం. అన్న క్యాంటీన్లు, అక్క క్యాంటీన్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి సంక్షేమ పథకం వెనుక ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ పథకాన్ని అమలు చేయడం వల్ల లబ్ధిదారుకు కలిగేది తాత్కాలిక ఉపశ మనమైతే దాన్ని కంటితుడుపు సంక్షేమమంటారు. తాత్కాలిక ఉపశమనంతోపాటు లబ్ధిదారుని అభ్యున్నతికీ, సాధికారతకూ ఉపయోగపడే విధంగా పథకాన్ని డిజైన్ చేస్తే అది మానవాభి వృద్ధి పథకం కింద లెక్క. ఉదాహరణకు పేద జంటలకు పెళ్లి కానుక అందజేసే పథకాన్ని చంద్రబాబు కూడా అమలు చేశారు. పద్దెనిమిది వేల అర్హులైన జంటలకు ఎగవేసినందువల్ల తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వారికి చెల్లించిందనేది వేరే విషయం. దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇదే పథకాన్ని ‘కల్యాణమస్తు’ పేరుతో జగన్ ప్రభుత్వం కూడా అమలు చేసింది. కానీ అది కాదు అసలు విషయం. పథకానికి అర్హత ప్రమాణాలను కొత్తగా నిర్దేశించింది. వధువుకు 18 యేళ్లు, వరుడికి 21 యేళ్లు వయఃపరిమితి చట్టపరమైన నిబంధన. దాన్ని కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయించింది. దాంతో పాటు పదవ తరగతి ఉత్తీర్ణతను కూడా అర్హతగా చేర్చింది. అందువల్ల తప్పనిసరి టెన్త్ పాసవుతారు. ఆడపిల్లలకు పెళ్లి కోసం ఇంకో మూడేళ్ల గడువుంటుంది. ఇంటర్ వరకూ ‘అమ్మ ఒడి’ కూడా లభిస్తున్నందువల్ల ఆ పిల్లలు కచ్చితంగా ఇంటర్ కూడా పూర్తి చేస్తారు. డిగ్రీలో చేరుతారు. ఈ విధంగా ఒక్కో సంక్షేమ పథకాన్ని వారి కాళ్ల మీద నిలబడటానికి తోడ్పతే విధంగా డిజైన్ చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే! జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమం వెనుక ఇటువంటి ఎంపవర్మెంట్ ఫిలాసఫీ ఉంటుంది. ఈ ఫిలాసఫీ సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ ప్రాధమ్యాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం ఉపాధి వంటి రంగాలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాల ప్రజలు కూడా పెద్ద వారితో సమానంగా నిలబడేందుకు అవకాశాలు కల్పించింది. ఇండియాలోని అత్యున్నతస్థాయి కార్పొరేట్ విద్యను రాష్ట్రంలోని పేద విద్యార్థి కూడా అభ్యసించగలిగే ఏర్పాట్లు చేసింది. నాణ్య మైన వైద్యం పేదల ఇళ్ల వాకిళ్లకు చేరువైంది. చిన్న సన్నకారు రైతులు కూడా లాభసాటి సేద్యం చేయడానికి అనేక కార్య క్రమాలను అమలుచేస్తూ ఆర్బీకే సెంటర్ల పేరుతో గ్రామ గ్రామానా ఊతకర్రలను నిలబెట్టింది. పేదవర్గాల తలరాతలు మార్చే ఇటువంటి ప్రాధమ్యాలు చంద్రబాబు సర్కారులో కని పించలేదు. విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు దేనికి ప్రాధాన్యతనిచ్చారో అందరికీ తెలిసిందే. అమరావతి సింగిల్ పాయింట్ ఎజెండా. అదో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్. కాంట్రాక్టర్లకూ, పెట్టుబడులు పెట్టిన పెత్తందార్లకూ మాత్రమే ఉపయోగపడే ఎజెండా. ఒక తాత్కాలిక సెక్రటేరియట్ను కట్టి అందులో 30 శాతం కమిషన్ను తీసుకున్నట్టు ఇప్పుడు ఆధారాలు లభించాయి. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎమ్గా మార్చు కున్నారని ఈ దేశ ప్రధాని స్వయంగా చెప్పిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. కమిషన్ల కక్కుర్తికి ప్రతిష్ఠా త్మకమైన పోలవరాన్ని ఆయన బలిపెట్టారు. నాసిరకం పనుల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పనుల్లో అవాంఛ నీయమైన ఆలస్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ రకంగా చంద్రబాబు తీరని ద్రోహం చేసిన వారయ్యారు. ఇదొక్కటే కాదు ఆయన ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల భారీగా లబ్ధిపొందిన వారు ఆయన, ఆయన ఆంతరంగికులు, కాంట్రా క్టర్లు, సంపన్నులు. చిల్లర లబ్ధి పొందిన వాళ్లు జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రాధమ్యాల వల్ల లబ్ధి పొందినవారు రాష్ట్రంలోని 85 శాతం కుటుంబాల ప్రజలు. ఈ ప్రాధమ్యాల కారణంగానే జగన్ ప్రభుత్వానికి ‘పేదల ప్రభుత్వం’ అనే పేరు వచ్చింది. ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే తెలుగుదేశం, యెల్లో మీడియా కూటమికి పెత్తందార్లు అనే పేరు వచ్చింది. ఇంగ్లీషు మీడియం, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు మన పేదవర్గాల భవిష్యత్తును సుంద రంగా మార్చివేస్తాయి. జగన్ ప్రభుత్వ వైద్య విధానాలు బీదా బిక్కీ తేడా లేకుండా ఆరోగ్య సమాజాన్ని నిర్మిస్తాయి. వ్యవసాయ విధానాలు సాగుబాటను సంపన్నం చేస్తాయి. ఈ విధా నాలను వ్యతిరేకిస్తున్నారు కనుకనే వారిని పెత్తందారుల తొత్తులుగా పరిగణించవలసి వస్తున్నది. ఈ ఫిలాసఫీని పక్కన పెట్టి జగన్మోహన్రెడ్డి పేదవాడా? ఆయనది పేదల ప్రభుత్వం ఎట్లా అవుతుందని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వితండవాదాన్ని లేవదీస్తున్నారు. ఒక నాయకుడు ధనికుడా, పేద వాడా అన్నది కాదు సమస్య. ఆ నాయకుని విధా నాలు ఎవరి పురోభివృద్ధికి తోడ్పడుతున్నాయనేదే ముఖ్యం. ఆ లెక్కన జగన్ ప్రభుత్వం నిస్సందేహంగా పేదల ప్రభుత్వమే! చంద్రబాబు పార్టీ పెత్తందార్ల వేదికే! రాష్ట్రంలోని పేదవర్గాల్లో ఈ రకమైన అవగాహన బలపడు తున్నది. ఫలితంగా పెత్తందారీ రాజకీయ శిబిరం తీవ్ర సంక్షో భంలోకి కూరుకొని పోయింది. జనసేన పార్టీని తన ప్రయో జనాలకోసం చంద్రబాబే పెట్టించాడనే అభిప్రాయానికి తాజా అభ్యర్థుల ప్రకటన మరింత బలం చేకూర్చింది. కనీసం మూడో వంతు సీట్లయినా వస్తాయని ఆశిస్తున్న జనసేన కార్యకర్తలు 24 సీట్ల లెక్కతో తీవ్ర నిరాశలో కూరుకొని పోయారు. ఈ రెండు పార్టీల బలంతోనే జగన్ పార్టీని ఎదుర్కో లేమనీ, బీజేపీని కూడా తమ తరఫున రంగంలోకి దించాలనేది చంద్రబాబు తలపోత. బీజేపీ వాళ్లు తనవంటి ఊసరవెల్లిని నమ్ముతారో లేదోనని నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ ద్వారా లాబీయింగ్ నడిపిస్తున్నారు. అదేకాకుండా తన సొంత మనుషులను కూడా ఆ పార్టీలోకి జొప్పించారు. ఇప్పటివరకు బీజేపీ ఈ కూటమిలో చేరుతుందో లేదో స్పష్టత లేదు. పరిస్థితులను గమనిస్తుంటే చంద్రబాబు వంటి మోసకారి నేతను నమ్మలేమని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అదే నిజమైతే చంద్రబాబు – పవన్ పార్టీలే కూటమిగా పోటీ చేయాలి. 24 సీట్లతో జూనియర్ భాగస్వామి పాత్ర పవన్ది. ఈ మాత్రం సీట్లకే ఎన్ని గంభీరోపన్యాసాలు చేశారు పవన్? వాళ్లు ‘సిద్ధం’ అంటే మేము ‘యుద్ధ’మని మొన్ననే ఆయన గర్జించి నట్టు కూడా గుర్తు. ఒకసారెప్పుడో జనసేన కార్యకర్తల సభలో అభిమానులు ‘సీఎం... సీఎం’ అనే నినాదాలు చేశారు. అందుకు పవన్ చెప్పిన సమాధానం ఏమిటి? ‘మొన్నటి ఎన్నికల్లో కనీసం 40 సీట్లలో గెలిపించి ఉన్నట్లయితే సీఎం పదవి అడిగేవాడిని. ఇప్పుడెలా అడుగుతామ’ని అశక్తతను ప్రకటించాడు. ఇప్పుడు కూడా అంతే! 40 సీట్లలో పోటీ కూడా చేయడం లేదు. పోటీ చేస్తున్న 24 సీట్లలో పావలా పర్సెంట్ గెలిచినా 6 సీట్లే. కనుక ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సీఎం పదవి అడగలేరు. ఎందుకంటే అయిదేళ్ల తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని ఆయనే చెప్పారు కనుక! రెండు పార్టీలూ కలిసి 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో 18 మందే బీసీ వర్గాలకు చెందినవారు. ఇంకా ప్రకటించాల్సింది 76 సీట్లు. అందులో 14 రిజర్వుడు సీట్లు న్నాయి. పోతే 62 సీట్లు. వాటిలో బీసీలకు, మైనారిటీలకు ఏమాత్రం కేటాయిస్తారో చూడాలి. ఆ వర్గాల గురించి మాట్లాడే అర్హత టీడీపీ కోల్పోయినట్టే! బీసీ ఓట్లు పూర్తిగా దూరమైనట్టే! అభ్యర్థుల ఎంపికలో ప్రయోగాలు చేయడానికి కూడా చంద్రబాబు భయపడినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. పవన్ కల్యాణ యితే తన అభ్యర్థిత్వాన్ని కూడా తొలి జాబితాలో ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారు. కేటాయించిన 24 సీట్లలో ఐదుగురి పేర్లే ఆయన ప్రకటించగలిగారు. పాపం, ఆయన ముఖకవళి కల్లో ఎక్కడా ఉత్సాహం కనిపించలేదు. పార్టీ శ్రేణులు జావగారి పోకుండా ఉండేందుకే కుప్పం నుంచి తన పేరును బాబు ప్రకటించారు గానీ, చివరి నిమిషంలో అక్కడ మార్పు ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. కానీ తొలి జాబితాతోనే శ్రేణులు డీలా పడ్డాయి. అధికార వైసీపీ ఇప్పటికే సగం యుద్ధాన్ని గెలిచింది. మన పెత్తందారు ఇంకెంతమాత్రమూ బలాఢ్యుడు కాదు. అతడొక గాలి తీసిన బెలూన్ మాత్రమే. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఉంగరాల సింగరాజు రింగులో ఫింగరు!
పదిహేనేళ్ల నుంచీ రాజకీయాలు చేస్తున్నా తనకు రాజకీయ నాయకుడి ముద్ర, ఆ గుర్తింపు లేకపోవడం, ఎంతసేపూ తనను సినిమా హీరోగానే ప్రజలు చూస్తుండడం.. అటు టీడీపీ, వైఎస్సార్సీపీ కేడర్, ఆ పార్టీ నాయకులు సైతం తనను ప్యాకేజీ స్టార్ అని అవమానిస్తుండడంతో.. ఇక లాభం లేదు, ఎలాగైనా తన జాతకం మార్చాలని.. మార్చుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడైన పవన్ కళ్యాణ్ ఓ రోజు బురఖా వేసుకుని టాంక్ బండ్ మీద చిలక జోతిష్యం చెప్పే వారి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చెట్టుకు చేరబడి బీడీ కాలుస్తున్న జ్యోతిష్యం గంగరాజు ఒక్కసారి ఈ బురఖా చూసి ఎలర్ట్ అయ్యాడు. బేరం తగిలిందని సంబరపడుతూ రామ్మా..చిలకమ్మా మంచి బేగం బేరం వచ్చిందమ్మా అంటూ పవన్ను చాపమీద కూర్చోబెట్టాడు. చేతిని చూసి అమ్మా మిమ్మల్ని చూస్తుంటే అమ్మాయి కానట్లుంది.. మీకు మగ లక్షణాలే ఉన్నాయి దానికితోడు మీకు మూడునాలుగు పెళ్ళిళ్ళు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు రాజకీయంగా కూడా ఎదుగుదల లేదు. ఎంతసేపూ వేరేవారి ఎదుగుదలకు మీరు పనికొస్తారు తప్ప మీ క్రేజీ మీకు పనికిరాదు. మీరు పోటీ చేసినా ఓడిపోయే ప్రమాదాలు ఉన్నాయి.. మీకు కళారంగమే పనికొస్తుంది..అందులు ట్రై చేయండి అంటూ చెబుతున్నాడు. దీంతో లోపలున్న పవన్ చిరాకుపడుతూనే బయటికి మాత్రం ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. గొంతు మార్చి ‘‘మరి నాకు విరుగుడు చెప్పండి స్వామీ.. ఏమి చేయాలో చిలుకను అడగండి’’ అన్నాడు. మళ్లీ గంగరాజు చిలుకను రావమ్మా సోనాలి బింద్రే.. ఈ బురఖా బుజ్జమ్మకు మంచి కార్డ్ తీసి ఫ్యూచర్ చూపించమ్మా అన్నాడు. అంతసేపూ లోపల జామకాయ తింటూ ఏదో మూడ్లో ఉన్న చిలక.. షిరాగ్గా మొహం పెట్టి ‘ఎన్నిసార్లు పిలుస్తావురా?..’ అన్నట్లు చూసింది. దాని శిరాకు చూసి గంగరాజుకు భయమేసింది. అయినా సరే ‘ఒసే సోనాలి.. మనిద్దరం పొట్లాడుకుంటే వచ్చే బేరం పోతుంది . ఈసారికి వచ్చి ఏదో కార్డ్ తీసి మొహాన కొట్టిపోవే’ అన్నాడు వేరే భాషలో. దీంతో సరే అడుక్కుంటున్నవు కాబట్టి వస్తున్నా అన్నట్లు చూసి మెల్లగా బయటికి వచ్చి ఓ పాము బొమ్మ ఉన్న కార్డ్.. తాబేలు బొమ్మ కార్డు తీసి బయట గిరాటేసి. ‘ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేస్తే పారిపోతాను’ అన్నట్లు వార్నింగ్ లుక్కేసి పెట్టెలో దూరింది. దీంతో బురఖా లోపలున్న పవన్ ఆ కార్డులు చూసి ఇదేంటి స్వామి పాములు తాబేళ్లు అంటోంది(అంటాడు). ‘‘నేనేమైనా వాటి యపారం చెయ్యాలా?’’ అన్నాడు కంగారుగా!. దీంతో గంగరాజు చిరునవ్వు నవ్వి ‘లేదు అమ్మా.. మీరు ఈ రెండు బొమ్మలున్న ఉంగరాలు పెట్టుకోండి. ఇక మీకు తిరుగే ఉండదు.. మా సోనాలి మీద ఒట్టు’ అన్నాడు.. హమ్మయ్య బ్రతికించాడు అనుకుని పవన్ వెంటనే రెండువేలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ మరునాడే చేతికి ఉంగరాలు వచ్చాయి.. తాబేలు.. పాము ఉన్న ఉంగరాలతో జనంలోకి వచ్చి చేతులు తిప్పుతున్నారు. అదన్నమాట పవన్ గారి ఉంగరాల కథ! ✍️ సిమ్మాదిరప్పన్న -
గంట మోగింది.. వినబడుతోందా బాబూ?
విశాఖపట్నం, సాక్షి: నాకు మాత్రం ఈసారి విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని ఉంది.. ఎన్నికలొచ్చినప్పుడల్లా నియోజకవర్గం మారే గంటా శ్రీనివాస రావు ఆవేదన ఇది. అయితే మరోస్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించడంపై గంటా గరం గరంగా ఉన్నారు. ‘‘నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది. నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు. విశాఖ నార్త్ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నా. నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది. కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు. అది నాకు 150కిలోమీటర్ల దూరం. పైగా జిల్లా కూడా వేరు కావడంతో ఆలోచనలో పడ్డా. .. ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు. కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది. వారం రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను. నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా?. పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను.రెండు రోజుల్లో నిర్ణయం ఏంటన్నది చెప్తాను. ప్రతీ ఎన్నికల్లో నేను నియోజకవర్గం మారుతున్నా. కానీ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది అని గంటా అంటున్నారు. -
ఫ్లెక్సీలేనా?.. అభ్యర్థులు లేరా?
సాక్షి, కృష్ణా: మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్పై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. వైఎస్సార్సీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు సిద్ధం అంటే బాగుంటుందంటూ చురకలంటించారాయన. మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నారు. ఎన్నికల కోసం జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటున్నారు. మరి మీరు దేనికి సిద్ధం?. మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా?. క్యాండిడేట్లను పెట్టరా? ఫ్లెక్సీలే పెడతారా?. మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది అని పవన్కు సూచించారాయన. -
రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే: పవన్
సాక్షి, భీమవరం: వయసు మళ్లిన నాయకులు పదవుల కోసం పాకులాడటం పద్ధతి కాదని, రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం ఆయన పలువురు టీడీపీ, బీజేపీ నాయకులను మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక వయసు వచ్చాక రాజకీయాల్లో ఉండకూడదని చెప్పారు. 80–90 ఏళ్ల వయసు వచ్చే వరకు రాజకీయం చేస్తామంటే కొత్త వాళ్లకు అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అలాంటి వారు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తాను కూడా 30 ఏళ్ల వయసులోనే సినిమా రంగం నుంచి రిటైర్మెంట్ తీసుకుని కొత్త తరానికి అవకాశం ఇచ్చేందుకు ప్రణాళిక రచించుకున్నానని చెప్పారు. నేటి సమాజంలో డబ్బులేని రాజకీయాలు సాధ్యం కావని, డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయాలు చేయాలని తాను ఏనాడూ చెప్పలేదని తెలిపారు. ఎవరికీ భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేస్తానంటే కుదరదన్నారు. డబ్బులు ఖర్చులు పెట్టాలన్న విషయాన్ని ఇప్పటికే నాయకులకు చెప్పానని తెలిపారు. ఓట్లు కొంటారో.. ఏం చేస్తారో తాను చెప్పనని, అది మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులపరంగా జరిగే గొడవలను పార్టీలకు అంటగట్టడం మంచిది కాదని, కులంలో ఒకరు తప్పుచేస్తే ఆ తప్పును మొత్తం కులంపై మోపుతున్నారన్నారు. ఈ సందర్భంగా భీమవరంలో కాపులు–రాజుల మధ్య, తూర్పుగోదావరి జిల్లాలో కాపు–శెట్టిబలిజ కులాల మధ్య ఉన్న గొడవలను పవన్కళ్యాణ్ ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ.. అన్ని కులాలను సమ దృష్టితో చూస్తుందని చెప్పిన పవన్.. వేదికపై కాపు, క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు నేతలకు మాత్రమే స్థానం కల్పించడం.. బీసీ, ఎస్సీ నాయకులెవరికీ అవకాశం ఇవ్వకపోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. కాగా, రాజకీయాల్లో రిటైర్మెంట్ విషయం చంద్రబాబును ఉద్దేశించేనని, ఏదో వ్యూహం మేరకే కుప్పంలో భువనేశ్వరి, ఇక్కడ పవన్ ప్రస్తావించారని పలువురు నేతలు చర్చించుకున్నారు. -
రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ-జనసేన మధ్య వివాదం
-
Feb 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 09:33 PM, Feb 21st, 2024 రేపు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొననున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ పై చర్చ సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పై చర్చ టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని 08:16 PM, Feb 21st, 2024 ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసు విచారణ స్కిల్ స్కాం నిందితుడు, మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు స్కిల్ స్కాంలో అప్రూవర్గా మారడానికి అనుమతించాలని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా పిటిషన్ చంద్రకాంత్ షా పిటిషన్లో జత చేసిన డాక్యుమెంట్లు తనకి అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్ స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటీషన్లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని వాదించిన లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు విచారణ రేపటికి వాయిదా రేపు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 07:06 PM, Feb 21st, 2024 భువనేశ్వరి మాటలతో క్లారిటీ వచ్చేసింది: మంత్రి అంబటి రాంబాబు భువనేశ్వరి, లోకేష్ ఇద్దరు కలిసి కుర్చీలు మడత పెడుతున్నారు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేశారు భువనేశ్వరి చంద్రబాబు నాయుడుని రెస్ట్ తీసుకోమని చెప్తోంది కుప్పంలో చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వండి అని కార్యకర్తలకు చెప్తుంది కుప్పంలో చంద్రబాబు నాయుడు కుర్చీ కూడా మడత పెట్టేశారని అర్ధమౌతుంది. భువనేశ్వరి చంద్రబాబు పెద్దవాడైపోయాడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తానని చెప్తోంది చంద్రబాబు, లోకేష్కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా... కుప్పంలో ఓడిపోవడం ఖాయం చంద్రబాబు కుప్పంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కుప్పంలో నీళ్లు ఇవ్వలేకపోయాడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో త్వరలో కుప్పంలో నీళ్లు ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి చంద్రబాబు తెలుగుదేశాన్ని మూసేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ప్రజలకు అర్థమైంది ఇవాళ భువనేశ్వరి మాట్లాడిన మాటలతో క్లారిటీ వచ్చింది చంద్రబాబుకు ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకుని చూస్తే ఎందుకు పనికిరాడు అందుకే కనీసం కుప్పంలో నన్ను అన్న గెలిపించండి అని టీడీపీ కార్యకర్తలను భువనేశ్వరి బతిమిలాడుకుంటుంది 06:55 PM, Feb 21st, 2024 ఓటుకు నోటు: పవన్ కళ్యాణ్ పరమార్థమిదే భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ డబ్బులు పంచితే గానీ నెగ్గలేమట.! డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాలట.! ఎన్నికలప్పుడు మాత్రమే ఏపీకి వస్తే తప్పు కాదా? ప్యాకేజీ పాలిటిక్స్ చేస్తే ప్రజలెలా పట్టించుకుంటారు?భీమవరంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు 05:53 PM, Feb 21st, 2024 భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారు: మంత్రి జోగి రమేష్ రాష్ట్రప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారు చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారు భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు..రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు టీడీపీని తీసుకెళ్లి తాకట్టుపెట్టేస్తాడు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు పవన్కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన చంద్రబాబు, లోకేష్ పనికిరాడు...ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం 05:13 PM, Feb 21st, 2024 అందుకే కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు: నారమల్లి పద్మజ చంద్రబాబు రాజకీయాలకు పనికి రారని భువనేశ్వరి తేల్చి చెప్పారు ఏఏజీ ఆస్పత్రి వారు కూడా చంద్రబాబు రెస్టు తీసుకోవాలని అప్పుడే చెప్పారు కానీ చంద్రబాబు తిరుగుతూనే ఉన్నారు జనం నుండి స్పందన లేకపోవడంతో కుర్చీ మడత పెట్టేశారు ఎమ్మెల్యేగానే కాదు, రాజకీయాలకు కూడా చంద్రబాబు పనికిరారు భువనేశ్వరి అబద్దాలను చూస్తుంటే చంద్రబాబుకు మించిపోతున్నారు విజయవాడలో కాల్ మనీ రాకెట్ బయట పడినప్పుడు భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు? రుషితేశ్వరి ర్యాగింగ్తో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమయ్యారు? తహశీల్దార్ వనజాక్షిపై దారుణంగా మీ ఎమ్మెల్యే దాడి చేస్తే భువనేశ్వరి ఏం చేశారు? అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? బాలకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడినప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పలేదు? తెలుగుదేశం పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు మూడు సిద్ధం సభలు చూశాక చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టింది అందుకే కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరిగే ఘటనలను కూడా ఏపీలో జరిగినట్టు పచ్చి అబద్దాలు చెప్తున్న మహిళ భువనేశ్వరి అబద్దాల టీడీపీకి కరెక్టయిన అధ్యక్షులు భువనేశ్వరి ఆమెకే అధ్యక్షపదవి ఇస్తే బెటర్ 05:06 PM, Feb 21st, 2024 మళ్లీ వాయిదా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు 28కి వాయిదా కౌంటర్ దాఖలు చేయడానికి మరోసారి సమయమడిగిన లోకేష్ లాయర్లు వారం రోజుల సమయమిస్తూ 28కి కేసు విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు గత నాలుగు వాయిదాల సమయంలోనూ ఏసీబీ కోర్టులో సమయం కోరిన లోకేష్ న్యాయవాదులు కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్ చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు అధికారులకి రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటీషన్ సీఐడీ పిటీషన్పై ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా లోకేష్ నాన్చుడు రెడ్ బుక్ అంశంపై సీఐడీ నోటీసులు పట్టించుకోని లోకేష్ స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కి నోటీసులు జారీ ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్ ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వచ్చిన టీడీపీ లాయర్లు 04:10 PM, Feb 21st, 2024 చంద్రబాబు కుప్పంలో కుర్చీ మడత పెట్టేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారు ఇప్పటికే రాజ్యసభలో జీరో అయ్యింది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోనూ టీడీపీ జీరో అవుతుంది. చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేడని మేము ముందే చెప్పాం కుప్పం ప్రజలకు జగన్ మాత్రమే అన్ని సౌకర్యాలు కల్పించారు 03:52 PM, Feb 21st, 2024 కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు: జూపూడి ప్రభాకరరావు ‘సిద్దం’ సభలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు స్కూల్స్ బాగుపడాలన్నా, అందరికీ వైద్యం అందాలన్నా జగనే కావాలని జనం అంటున్నారు చంద్రబాబు సామాజిక న్యాయాన్ని ఎప్పుడో మర్చిపోయారు ఇప్పటికీ సీట్ల కేటాయింపు కూడా చేసుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం కూడా చూపించలేరు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత చంద్రబాబుకు లేదు కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు భువనేశ్వరి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారా? టీడీపీలో ఏం జరుగుతుంది? లోకేష్, భువనేశ్వరి కలిసి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు 02:56 PM, Feb 21st, 2024 ఎన్నికల టార్గెట్ క్లియర్గా ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ డీఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారు అందుకు తగినట్టే పార్టీ విధానాలు ఉంటాయి సునామిలాగా వస్తున్న ఆదరణని పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్లను నొక్కించాలి రాబోయే 50 రోజుల్లో ఇదే మన పని.. టార్గెట్ క్లియర్గా ఉంది.. పరీక్షలు వచ్చినపుడు ఎలా పనిచేస్తామో.. అలానే ఇప్పుడు పని చేయాలి చిన్నపాటి విచక్షణ కూడా లేకుండా ప్రభుత్వం పని చేస్తోంది 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశాం అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాము ఇక పై మైనార్టీలను ఇతర వర్గాలకు నాయకులను చేస్తాం మైనార్టీ లకు 50శాతం పదవులు ఇచ్చాము అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉంది ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రం గా ఏపీ ని జగన్ తీర్చిదిద్దుతున్నారు సంక్షేమ పథకాలు ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగింది. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసి వచ్చింది రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్లలో తిరుగుతున్నాడు 01:37 PM, Feb 21st, 2024 బెజవాడ సైకిల్కు ఎదురుగాలి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు పొత్తులో భాగంగా తూర్పులో రాధకి టికెట్ ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు గుర్రుమన్న గద్దె రామ్మోహన్ పార్టీ మారే యోచనలో గద్దె నిన్న రాత్రి ఇతర పార్టీ నేతలను కలిసిన గద్దె రామ్మోహన్ 01:29 PM, Feb 21st, 2024 భీమవరంలో గెలిపించండి ప్లీజ్: జనసేనాని తెలుగుదేశం పార్టీ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం ఈ సారి ఎలాగైనా అసెంబ్లీకి పంపాలని కోరిన పవన్ రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలున్నా పట్టించుకోవద్దని విజ్ఞప్తి నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని వేడ్కోలు ఏమైనా సమస్యలుంటే మీ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచన కేవలం కొందరు నాయకులనే కలిస్తే సరిపోతుందా? : పవన్తీరుపై తెలుగుతమ్ముళ్ల ఆగ్రహం ఇక్కడికి రమ్మన్నారు, గంటల కొద్దీ కూర్చోబెట్టారు, కనీసం పలకరించాలని పవన్కు తెలియదా? మమ్మల్ని పట్టించుకోకుండా లీడర్లతో మాట్లాడి వెళ్లిపోతాడా? రేపు ఓట్లు వేసేది, వేయించేది ఎవరు? : పవన్ తీరుపై టీడీపీ కార్యకర్తల మండిపాటు 01:22 PM, Feb 21st, 2024 పవనూ.. 40 చెప్పి 20లోనే పోటీనా?: వెల్లంపల్లి సెటైర్లు పేద ప్రజలకు అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నాడు. పేదవారి ఇల్లు పట్ల చంద్రబాబు కోర్టులో స్టే ఎందుకు వేశాడు. పేదవారు సంతోషంగా ఉండటం చూడలేని వ్యక్తి చంద్రబాబు 2019 లో చంద్రముఖి చంద్రబాబు ను సీఎం జగన్ పెట్లో పెట్టి తాళం వేశాడు. లక లక.. అంటూ రాక్షసుడు చంద్రబాబు ప్రభుత్వం రాలేదు చంద్రముఖి లాంటి చంద్రబాబును అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది. చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రం నాశనం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు, అప్పుల పాలవుతుంది. రాష్ట్ర ప్రజలు కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించి సీఎం జగన్ కు 175 సీట్లు కానుక ఇస్తారు. పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ మరి ఎందుకు 20 సీట్లకు అమ్ముడుపోయాడు. ప్యాకేజీల కోసం బతికేది పవన్ కళ్యాణ్. జనసేనా సింగల్ గా పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయి అన్న పవన్ 20 సీట్లు అడుక్కోవడం దేనికి? మాజీ మంత్రి,ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ 01:01 PM, Feb 21st, 2024 భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్ తో సమావేశం కోసం ఉదయం నుండి వేచి ఉన్న నాయకులు కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో సమావేశం అని ఏర్పాటు చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తన నివాసంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లతో మాత్రమే జరిగిన భేటీ పవన్ అర్థతరంగా వెళ్లిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ క్యాన్సిల్ అవడం పై సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మమ్మల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేసిన భీమవరం టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్ వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా....అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు ఇంకెప్పుడూ పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు ఆగ్రహం మండలాల వారీ మీటింగ్ పెట్టండి అని సీరియస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ మీరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి అంటూ మండిపడ్డ పితాని 12:39 PM, Feb 21st, 2024 కళ్యాణదుర్గంలో మా పార్టీ గందరగోళంగా ఉంది: టీడీపీ నేతలు కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు కు టిక్కెట్ ఖరారు మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి మీడియా సమావేశం కళ్యాణదుర్గం టీడీపీ లో రాజకీయ గందరగోళం నెలకొంది చంద్రబాబు నాయుడు కు అల్టిమేటం జారీ చేసిన ఇరువురు నేతలు కళ్యాణదుర్గం టీడీపీ టిక్కెట్ తనకే ఖరారు అయిందని కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు ప్రచారం చేసుకుంటున్నారు అధికారికంగా చంద్రబాబు ఎక్కడా ప్రకటించలేదు మాతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు మా ఇద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ కేటాయించాలి కళ్యాణదుర్గం లో పార్టీ కోసం పనిచేసిన ఏ నేతకు ఇచ్చినా పని చేస్తాం స్థానికేతరులకు టిక్కెట్ ఇస్తే అంగీకరించేదిలేదన్న ఇద్దరు నేతలు 12:25 PM, Feb 21st, 2024 జనసైనికుల దూషణ.. ఎక్స్లో బుచ్చయ్య రియాక్షన్ రాజమండ్రిలో జనసేన వర్సెస్ టీడీపీ మధ్య ముదురుతున్న రగడ రాజమండ్రి రూరల్ స్ధానం నుంచే పోటీచేస్తానని స్పష్టం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరిని సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన జనసేన కార్యకర్తలు కుర్చీ మడత పెడతామంటూ బుచ్చయ్యపై దూషణలు సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను పట్టించుకోవద్దన్న బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలు కి అభిమానులకి శ్రేయోభిలాషులకు మనవి.. టీవి న్యూస్ ల లో వాట్స్ యాప్ మెసేజ్ ల్లో వస్తున్న వార్తలు అనేవి ఊహాజనితం.. అవి నమ్మి భావోద్వేగాల కి గురి అవ్వోద్దు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కచ్చితంగా "గోరంట్ల" పోటీ లో ఉంటారు...దీంట్లో… — Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 20, 2024 12:15 PM, Feb 21st, 2024 టీడీపీ లో చింతలపూడి సీటు చిచ్చు సీటు దక్కకపోవడం తో మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర అసహనం చింతలపూడి ఇంచార్జ్ గా రోషన్ కుమార్ ని ప్రకటించిన టీడీపీ సీనియర్ ని అవమానించారంటూ పీతల సుజాత అసంతృప్తి పవన్ కల్యాణ్, టీడీపీ నేతల సమావేశానికి పీతల సుజాత డుమ్మా భవిష్యత్ కార్యాచరణ పై పీతల సుజాత అనుచరుల తో మంతనాలు పీతల సుజాత తో సంప్రదింపులు చేస్తున్న టీడీపీ నేతలు చింతమనేని ,మాగంటి బాబు లను నమ్ముకుని సీటు పై ఆశలు పెట్టుకున్న మరో నేత బొమ్మాజి అనిల్ కు చుక్కెదురు 12:11 PM, Feb 21st, 2024 గ్లాస్ గుర్తు.. విచారణ వాయిదా జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ జనసేన గాజుగ్లాసు గుర్తు రద్దు చేయాలని RPC పార్టీ పిటిషన్ ఏపీ హైకోర్టులో నేడు జరిగిన విచారణ వాదనలు వినిపించేందుకు సమయం కోరిన జనసేన విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 12:08 PM, Feb 21st, 2024 టీడీపీ అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు: ఎంపీ మిథున్ టీడీపీ ఎన్ని ప్రచారాలు చేసుకున్న సీఎంగా మళ్ళీ జగనే టీడీపీ అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి బూతు స్థాయిలో పని విభజన చేసుకొని ముందుకు సాగాలి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం పీలేరు కార్యకర్తల సమావేశంలో దిశా నిర్దేశం చేసిన ఎంపీ మిధున్ రెడ్డి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 12:03 PM, Feb 21st, 2024 భీమవరం నుంచే పోటీ చేస్తా: పవన్ కల్యాణ్ నేడు భీమవరంలో పర్యటిస్తున్న పవన్ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంట్లో టీడీపీ నేతలతో భేటీ అయిన పవన్ భీమవరం నుంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ టీడీపీ నేతలతో స్పష్టం చేసిన జనసేనాని మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నివాసానికి వెళ్లి మరీ అదే విషయం స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ 11:50 AM, Feb 21st, 2024 టీడీపీపై అంబటి సెటైర్ రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ అతిత్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా అంటూ అంబటి ట్వీట్ రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా !@naralokesh @ncbn — Ambati Rambabu (@AmbatiRambabu) February 21, 2024 11:32 AM, Feb 21st, 2024 కొనకళ్లకు పచ్చసెగ తగులుతోందా? టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లకు వ్యతిరేకంగా ప్రచారం తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేక ప్రచారం టీడీపీ కొనకళ్ల విడిచిపెట్టి వెళతాడంటూ సోషల్ మీడియాలో టిడిపి నేతల పోస్టింగ్లు పొమ్మనలేక పొగ పెడుతున్నారంటూ సన్నిహితుల దగ్గర కొనకళ్ల ఆవేదన 11:25 AM, Feb 21st, 2024 ఎందరు ఎదురొచ్చినా గెలిచిచూపిస్తా: అనిల్ కుమార్ యాదవ్ జగన్ కోసం తల తెంచుకుంటా ఎవరికీ తలవంచను! ఒక్కడిని ఓడించడానికి ఐదుగురు కలిసి వస్తున్నారు ఎంపీగా గెలిచాక.. పల్నాడులోనే ఇల్లు కట్టుకొని ఉంటా జగన్ కోసం రామబంటులా పనిచేస్తా 11:03 AM, Feb 21st, 2024 లోకేష్ పిల్లి అని ఏపీ మొత్తానికి తెలుసు! నర్సీపట్నంలో లోకేష్ శంఖారావం అట్టర్ ప్లాప్ రాష్ట్రస్థాయి నేత లోకేష్ వస్తే 2000 మంది కూడా రాలేదు నర్సీపట్నంలో వైయస్సార్సీ బస్సు యాత్ర సభకు 40000 మంది హాజరయ్యారు రాష్ట్రంలో పిల్లి అంటే లోకేష్ అని ప్రతి ఒక్కరికి తెలుసు పులి అంటే వైయస్ జగన్ అని దేశం మొత్తం తెలుసు లోకేష్ లాంటి పిల్లులు ఎంత మంది వచ్చినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు చంద్రబాబు నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు మళ్లీ ఇప్పుడు 3000 నిరుద్యోగ భృతి అంటూ 420 మాటలు చెబుతున్నారు నేను రూపాయి అవినీతి చేసినట్లు దమ్ముంటే నిరూపించాలి నీ పక్కనే అయ్యన్న వంటి దోపిడీ దొంగలను పట్టుకుని మాపై విమర్శలా? వందల కోట్లు దోపిడీ చేసింది అయ్యన్న కాదా? నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వ్యాఖ్యలు 10:23 AM, Feb 21st, 2024 తణుకులో కోల్డ్ వార్ తణుకు సీటు కోసం టీడీపీ-జనసేన ఫైట్ టీడీపీ, జనసేన లోకల్ లీడర్ల వార్ విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని గతంలో పవన్ ప్రకటన పోటీకి పట్టుబడుతున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ టికెట్ నాకంటే నాకంటూ ఇద్దరి పోటాపోటీ ప్రచారం పవన్ పర్యటనతో ఆసక్తిగా మారిన పొత్తు రాజకీయం 09:49 AM, Feb 21st, 2024 జనం సీఎం జగన్తోనే ఉన్నారు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు గా ధ్రువీకరణ పత్రం తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉంది సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయాలని భావించింది కానీ మా ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసం తో ఉన్నారు అందుకే మేము ఏకగ్రీవంగా గెలవగలిగాము టీడీపీ ని పెద్దల సభ లో ఖాళీ చేశాం మొత్తం స్థానాలు వై ఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది ఒక్కొక్క సభ లో టీడీపీ ని ఖాళీ చేస్తున్నాం తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ అవుతుంది మా పార్టీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు మళ్ళీ తిరిగివస్తున్నారు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదు సీఎం జగన్ తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుంది సీఎం జగన్ తో జనం ఉన్నారు 08:55 AM, Feb 21st, 2024 లోకేష్ రెడ్బుక్ కేసుపై నేడు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ ఈ కేసు పై ఏసిబి కోర్టులో ఈ రోజు విచారణ. 08:23 AM, Feb 21st, 2024 తెనాలిలో టికెట్ చిచ్చు? తెనాలిలో టీడీపీపై జనసేన పైచేయి! పంతం నెగ్గించుకున్న నాదెండ్ల తెనాలి టికెట్ నాదెండ్ల మనోహర్కే మాజీ మంత్రి ఆలపాటికి లేదని తేల్చేసిన నారా లోకేష్ సర్వేలు తనకే ఉన్నాయని ప్రకటించుకుంటూ వస్తున్న ఆలపాటి గల్లా జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు దూరం గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆలపాటికి సూచన లేదంటే మీ దారి మీరు చూస్కోవాలని ఆలపాటికి స్పష్టీకరణ తన వర్గంతో చర్చలు, సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకోనున్న ఆలపాటి 07:58 AM, Feb 21st, 2024 అనంతలో టీడీపీ నేతల దౌర్జన్యం టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కి చేదు అనుభవం టీడీపీ నేత ప్రభాకర్ చౌదరిని నిలదీసిన మహిళ నువ్వు ఎప్పుడూ రాలేదని ప్రభాకర్ చౌదరిని నిలదీసిన మహిళ అనంతపురం నగరంలోని 21, 13, 2 డివిజన్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేయని అభివృద్ధి చేసినట్లుగా చెప్పేందుకు ప్రభాకర్ చౌదరి యత్నం నువ్వు ఎప్పుడూ రాలేదు కదా అని మొహం మీద చెప్పేసిన మహిళ ప్రతి రోజూ మీ ఏరియాకు రాలేనంటూ అసహనం వ్యక్తం చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి చిత్రీకరిస్తున్న వారిపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు 07:41 AM, Feb 21st, 2024 భీమవరంలో పవన్ పర్యటన నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఇక్కడి నుంచే పవన్ పోటీ చేస్తాడంటూ పొలిటికల్ సర్కిల్లో టాక్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిన పవన్ టీడీపీతో ఈ ఎన్నికలకు పొత్తుతో వెళ్లాలని జనసేన నిర్ణయం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే ప్రకటించిన పవన్ కల్యాణ్ నేటి సమావేశానికి టీడీపీ నేతల డుమ్మా? టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదని.. బలవంతంగా తానే ఒప్పించానని విశాఖ కార్యకర్తలతో పవన్ వ్యాఖ్య పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతల అసంతృప్తి రాజమండ్రి ఎయిర్పోర్టులో పవన్ ఆహ్వానానికి వెళ్లాల్సి ఉన్నా.. దూరంగా ఉన్న వైనం టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై ఇంకా రాని క్లారిటీ 07:27 AM, Feb 21st, 2024 మూడు రోజులైనా ఆగట్లేదు! ఇంట్లో ఫ్యాన్.. ఇంటి బయట సైకిల్.. సింక్ లో టీ గ్లాస్.. ఆదివారం రాప్తాడు వైఎస్సార్సీపీ సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్ డైలాగులు ఇది విశ్వసనీయతకు, మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్న సీఎం జగన్ కౌరవసేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళుతున్నది అభిమన్యుడు కాదు.. గాండీవి అర్జునుడన్న సీఎం జగన్ తన వెనుక శ్రీకృష్ణుడిలా ప్రజలు ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో రాప్తాడు పంచ్ డైలాగులు విపరీతంగా వైరల్ 07:23 AM, Feb 21st, 2024 వైఎస్సార్సీపీకి లేదు పోటీ! రాజ్యసభ మూడు స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం ఏకగ్రీవంగా మూడు స్థానాలు వైసీపీ గెలుచుకున్నట్టు ప్రకటించిన ఎన్నికల కమిషన్ రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి ఏకగ్రీవం అధికారికంగా ప్రకటించిన ఎన్నికల కమిషన్ 06:58 AM, Feb 21st, 2024 యూజ్ అండ్ త్రోలో బాబుని మించినవాళ్లు లేరేమో! చంద్రబాబు పాలసీ అయిన యూజ్ అండ్ త్రో దెబ్బకు మరో నాయకుడు బలి టీడీపీకి నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వర రావు గుడ్బై కష్టకాలంలో ఉన్నప్పుడు తనను వాడుకుని ఇప్పుడు తనను పక్కన పెట్టేస్తున్నారంటూ ముద్రబోయిన అవేదన చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని ముద్రబోయిన మండిపాడు నూజివీడు ఇంచార్జిగా తప్పించడానికి నిరసిస్తూ టీడీపీకి రాజీనామా 06:42 AM, Feb 21st, 2024 అరరె.. బాబు మర్చిపోయారే! ఓటమి భయం బాబు మొహంలోనే కాదు.. మాటల్లో కూడా ప్రజలకి రోజూ డబ్బా కొడుతున్న హామీనే మర్చిపోయావా? ఇక దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగలవా చంద్రబాబూ? 2014లో ఇలానే 650 హామీలు ఇచ్చి మర్చిపోయావ్! జనాలకీ గుర్తుండకూడదని మేనిఫెస్టోని మాయం చేశావ్. కానీ ప్రజలు తెలివైనోళ్లు బాబూ..!! ఓటమి భయం బాబు మొహంలోనే కాదు.. మాటల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ప్రజలకి రోజూ డబ్బా కొడుతున్న హామీనే మర్చిపోయావంటే.. ఇక దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగలవా @ncbn? 2014లో ఇలానే 650 హామీలు ఇచ్చి మర్చిపోయావ్.. జనాలకీ గుర్తుండకూడదని మేనిఫెస్టోని మాయం చేశావ్. కానీ ప్రజలు… pic.twitter.com/fmCAsx2X8J — YSR Congress Party (@YSRCParty) February 20, 2024 06:30 AM, Feb 21st, 2024 అసెంబ్లీకి దారేదీ? పవన్ రూటేదీ? ఏం తేల్చకుండానే ముగిసిన పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన రేపు మంగళగిరి నుంచి భీమవరం పర్యటనకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ టికెట్ నాకేనంటూ ప్రకటించిన జనసేన నేత కందుల దుర్గేష్ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారని తెలిపిన కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్ జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు టీడీపీ అధిష్ఠానంతో కలిసి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్న పవన్ కల్యాణ్ రాజానగరం నుంచి జనసేన పోటీ చేయడం ఖాయం...అభ్యర్థి పై క్లారిటీ ఇస్తామంటున్న పవన్ -
పవన్ డెసిషన్.. ఇక నిప్పురవ్వలు లేవడమే తరువాయా?
సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఉంటాయి.. ఆ సినిమాల్లో వాళ్ళ పాత్ర నిడివి తక్కువే .. కానీ వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సినిమా మొత్తాన్ని సైతం ప్రభావితం చేసేంత పవర్ ఫుల్ గా ఆ పాత్రలను కథకులు రూపొందిస్తారు. అదేమాదిరి పాలిటిక్స్ లోనూ అతిథి పాత్రలు ఉంటాయి. వాళ్ళు కనిపించేది తక్కువే అయినా వాళ్ళ హడావుడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ లెక్కలు.. లాభనష్టాల బేరీజులు కూడా వేరేలేవేల్.. అంతా స్పాట్లో తేలిపోవాల్సింది.. ఆ కోవకు చెందినవారే జనసేనాని పవన్ కళ్యాణ్. మూన్నెళ్లకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే అయన ఆమధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజోలు, రాజనగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు. దీంతోబాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్ కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేసారు.. అక్కడ ప్రస్తుతం ఆరుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు... ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... నన్ను కాదని మీరు టిక్కెట్లు ఎలా ఇస్తారు అంటూ అయన ఇప్పటికే నిప్పు రాజేశారు..దీంతోబాటు రాజానగరం, రాజోలులోనూ టీడీపీ నాయకులూ ఇప్పటికే సుర్రుమంటున్నారు.. మళ్ళీ మూణ్ణెల్ల గ్యాప్ తీసుకుని ప్రజల్లోకి వచ్చిన పవన్ విశాఖ జిల్లా పాలిటిక్స్ మీద దృష్టిపెట్టారు. విశాఖలో అన్నయ్య నాగబాబుతోబాటు పలు సమీక్షలు సమావేశాలు నిర్వహించిన పవన్ ఏకంగా నాలుగూటిక్కెట్లు ప్రకటించేసారు.. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టిక్కెట్స్ ఎలా ఇచ్చారో తెలీడం లేదు కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ను ఇంచార్జ్ గా నియమించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ ను, యలమంచిలిని సుందరపు విజయ్ కుమార్ కు ప్రకటించేసారు. ఇక పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు ఏకంగా నలుగురికి దాదాపు టిక్కెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా ? ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పని చేస్తున్న టీడీపీ క్యాడర్ ఎందుకు ఊరుకుంటుంది.. తమ ఎత్తులు.. తమ నిరసనలు వ్యక్తం చేస్తారు కదా అని అంటున్నారు. ఏకపక్షంగా టిక్కెట్లు ఇచ్చేస్తుంటే తెలుగుదేశం అధిష్టానం, చంద్రబాబు ఎందుకు ఊరుకుంటున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. పవన్ ఇప్పటికే ఈ విషయమై మాట్లాడుకుని బాబు దగ్గర హామీ తీసుకునే చెప్పారా అనే దావుట్లు వ్యక్తం అవుతున్నాయి.. ✍️సిమ్మాదిరప్పన్న -
మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన
-
పవన్ ఢిల్లీ డ్రామా.. జనసేనలో నైరాశ్యం!
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. ఎన్నికలకు పట్టుమని 60 రోజులు కూడా లేదు. అయినా ఇంకా టిక్కెట్లు ఖరారు కాలేదు. ఈ తరుణంలో కేడర్ చేజారిపోకుండా ఉండేందుకు ఎన్ని డ్రామాలు ఆడాలో.. అన్నీ ఆడేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకే మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన తీసుకొచ్చారు. ‘రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తా..’ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటన గురించి జనసేన అధికారిక సమాచారం ఇచ్చింది కాదు. విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో చర్చల సందర్భంగా కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలివి. ఆ వ్యాఖ్యలే మీడియాకు లీకయ్యాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన వ్యవహారంగానే అర్థమవుతోంది. టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సీట్ల పంపకంపై ఎటూ తేల్చలేకపోయారు. ఓవైపు టీడీపీ ఏమో ఏకపక్షంగా పలు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతోంది. మరోవైపు టీడీపీ నేతలు పవన్ను కలిసి తమ స్థానాల వైపు రావొద్దంటూ కోరుతున్నారు. ఇంకోవైపు.. జనసేన ఆశిస్తున్న స్థానాల్లోనూ టీడీపీ(అదనంగా అందులో వర్గపోరు కూడా) ముందుకొస్తోంది. ఈ తరుణంలో.. బాబు-పవన్లు వెనువెనుకే ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. కానీ.. ఫలితం లేనట్లు కనిపిస్తోంది. అందుకే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాతే ఇరు పార్టీల ఉమ్మడి సమావేశాలు రద్దు అయ్యాయి. పవన్ తన టూర్లు రద్దు చేసుకుని.. మంగళగిరి ఆఫీస్కే పరిమితం అయ్యారు. ఇప్పుడు ‘‘వ్యక్తిగత గెలుపు కోసం కాదు.. సమష్టి గెలుపు కోసమే తన వ్యూహాలు, అడుగులు ఉంటాయి. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత నాది’’ అంటూ త్యాగాలకి సిద్దం కావాలనే అర్థం వచ్చేలా పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేన నేతల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అందుకే ఢిల్లీ పర్యటన అని చెప్పినా.. పెదవి విరిచేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలతో.. టీడీపీలో కలకలం టీడీపీతో కలవడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నేనే ఒప్పించా.. అని కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తు రాజకీయంపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో టీడీపీ కేడర్ నొచ్చుకుంది. ఈ క్రమంలోనే.. సోమవారం రాత్రి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కనీసం పవన్కు ఆహ్వానం పలికేందుకు కూడా టీడీపీ నేతలు రాలేదని స్పష్టమవుతోంది. గత నెలలోనూ ఇదే విధంగా లీకులు పవన్ ఢిల్లీ ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఇప్పటివరకు ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ దొరక్కపోవడం!. ఇవాళో, రేపో అపాయింట్మెంట్ ఖరారు అవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే.. గత నెలలోనూ ఇదే విధంగా పవన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి లీకులు ఇచ్చాడు. అప్పుడూ ఇదే తరహాలో అపాయింట్మెంట్ దొరకలేదు. -
YSRCP: సందేహం లేదు సునామీయే
సాక్షి, అమరావతి: ‘సందేహమే లేదు.. రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించడం తథ్యం.. అందుకు తార్కాణమే చరిత్రాత్మక రాప్తాడు సభ’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభకు సుమారు పది నుంచి 11 లక్షల మంది అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారని అంచనా. అదీ రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 52 శాసనసభ స్థానాల పరిధి నుంచే ఇంత భారీ స్థాయిలో ప్రజలు కదలిరావడం గమనార్హం. రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో ‘సిద్ధం’ సభను వైఎస్సార్సీపీ నిర్వహించింది. ఇందులో 200 ఎకరాల విస్తీర్ణంలో సభను వీక్షించడానికి ఏర్పాట్లు చేసింది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇసుకేస్తే రాలనంత స్థాయిలో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 1982లో పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో విజయవాడలో కృష్ణా నది ఇసుక తిన్నెలపై సీపీఎం నిర్వహించిన సభకు 5 లక్షల మంది హాజరయ్యారని అప్పట్లో అంచనా. 1990లో వరంగల్లో వంద ఎకరాల మైదానంలో పీపుల్స్ వార్ నిర్వహించిన రైతు కూలీ సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ.. వాస్తవంగా ఆ సభకు ఆరు నుంచి ఏడు లక్షల మంది వచ్చారని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎన్టీఆర్ ఆధ్యర్యంలో టీడీపీ నిర్వహించిన సభకు పది లక్షల మంది ప్రజలు హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. పరేడ్ గ్రౌండ్స్తోపాటు పక్కనున్న జింఖానా గ్రౌండ్స్, బౌసన్పోలో గ్రౌండ్ కలిసినా దాని విస్తీర్ణం 90 ఎకరాలే. ఈ లెక్కన ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఐదు లక్షల మందేనని అంచనా. ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్ర పరిధిలోని 23 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించడం గమనార్హం. ఇక 2010లో వరంగల్లో వంద ఎకరాల విస్తీర్ణంలో టీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ గర్జన సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఏడు లక్షల మందికి కాస్తా అటూ ఇటూ అని అంచనా. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభే అతి పెద్ద ప్రజా సభ అని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పెత్తందారులపై పోరుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపునిస్తే.. 10 నుంచి 11 లక్షల మంది ఒక్కసారిగా పిడికిలి పైకెత్తి, దిక్కులు పిక్కటిల్లేలా ‘మేం సిద్ధమే’ అంటూ ప్రతిస్పందించారు. ఇది రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జైత్ర యాత్రతో సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రణనినాదమై మారుమోగుతున్న ‘సిద్ధం’ ‘మేమంతా సిద్ధం’ అని వైఎస్సార్సీపీ శ్రేణుల ప్రతిస్పందన రణ నినాదమై రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి జనవరి 27న భీమిలి.. ఈనెల 3న దెందులూరు.. ఆదివారం రాప్తాడులలో ‘సిద్ధం’ పేరుతో వైఎస్సార్సీపీ నిర్వహించిన సభలు ఒకదాన్ని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. భీమిలి సభకు సముద్రంతో పోటీపడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం కదలివచ్చారు. దెందులూరు సభకు భీమిలి సభ కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తర కోస్తా ప్రాంత అభిమానులు పోటెత్తారు. ఇక రాప్తాడు సభ తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా సభగా నిలిచింది. మూడు సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణుల్లో సరి కొత్త జోష్ నింపింది. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన మూడు సభల్లోనూ.. పెత్తందారులపై యుద్ధానికి సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా? పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మరోసారి మన పార్టీ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నిస్తే.. మేం సిద్ధమే అంటూ ఒక్కసారిగా లక్షలాదిమంది ప్రతిస్పందించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేసిన దిశా నిర్దేశం మేరకు 175కు 175 శాసనసభ.. 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జైత్రయాత్రకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సీఎం జగన్ నాయకత్వంపై విశ్వాసానికి ప్రతీక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధికారం చేపట్టిన తొలి ఏడాదే 95 శాతం సీఎం జగన్ అమలు చేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.55 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.76 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో డీబీటీ, నాన్డీబీటీ రూపంలో రూ.4.31 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు లేవు. ఓ వైపు సంక్షేమాభివృద్ధి పథకాలు.. మరో వైపు విద్య, వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు.. ఇంకో వైపు సుపరిపాలనతో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. దాంతో సీఎం జగన్పై ప్రజల్లో మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. ‘మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలం, అభిమానులం’ అంటూ కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునే రీతిలో సీఎం జగన్ పరిపాలిస్తుండటం ఆయన నాయకత్వంపై శ్రేణుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచింది. ఇది ‘సిద్ధం’ సభల్లో మరోసారి ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలం టీడీపీ–జనసేనల మధ్య పొత్తుల లెక్కలు ఇప్పటికీ తేలలేదు. రెండు పార్టీల మధ్య సిగపట్లు కొనసాగుతున్నాయి. రా కదలి రా.. పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తున్నారు. ఇటు ‘సిద్ధం’ సభల్లో లక్షలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్త్తలు, అభిమానులు ‘పోరుకు మేం సిద్ధమే’ అంటూ చేసిన రణనినాదం మోరుమోగుతుండగా.. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు జన స్పందన కన్పించకపోవడంతో టీడీపీ–జనసేన అగ్రనేతల వెన్నులో వణుకు పుట్టించింది. సిద్ధం సభలు నింపిన జోష్తో ప్రజా క్షేత్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తున్నాయి. మరో వైపు పొత్తులు తేలక, చంద్రబాబు–పవన్ల సభలకు జన స్పందన లేక టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలమయ్యాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే వైఎస్సార్సీపీ శ్రేణులు చారిత్రక విజయమే లక్ష్యంగా కదం తొక్కుతుంటే.. టీడీపీ–జనసేన శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లాచెదురయ్యాయి. ఇది 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
‘ఉమ్మడి కృష్ణా’లో తారాస్థాయికి వివాదం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లా తెలుగుదేశంలో జనసేనతో పొత్తు తీవ్ర కలవరం రేపుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మైలవరం, పెడన, అవనిగడ్డ.. ఈ ఐదు నియోజకవర్గాల్లో తమకు నాలుగు నియోజకవర్గాలు కేటాయించాలని జనసేన నాయకులు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లో మూడు సీట్లకు తగ్గేది లేదని భీష్మించుకు కూర్చున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఆ మూడు సీట్లతో పాటు, ఎంపీ సీటుపైన టీడీపీ పూర్తి ఆశలు వదులుకుకోవాల్సిందేననే భావనలో టీడీపీ ఉంది. టికెట్ ఇచ్చినా ఓడిస్తాం.. మరోవైపు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీటు కూడా ఇవ్వడానికి వీలులేదని, టీడీపీ అధినేతపై ఒత్తిడి తేవాలని తెలుగు తమ్ముళ్లు చూస్తున్నారు. విజయవాడలో జనసేనాని సామాజిక వర్గానికి రాజకీయంగా పట్టు ఏర్పడితే, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలకు విఘాతం అని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. అనివార్యం అయితే ఒకటి, రెండు సీట్లు జనసేనకు ఇచ్చినా, ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని టీడీపీ ధ్యేయంగా పెట్టుకొంది. జనసేనకు గాని, ఆ పారీ్టకి దన్నుగా ఉన్న సామాజిక వర్గానికి ఎనీ్టఆర్ జిల్లాలో స్థానం లేకుండా చేయాలన్నదే టీడీపీ ఎత్తుగడ. ఈ విషయం బయటికి పొక్కడంతో జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీట్ల వ్యవహారంపై తాడో పేడో తేల్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెబుతున్నారు. టీడీపీ సైలెంట్.. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో కాడి పడేయటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య టికెట్పై గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న, జలీల్ఖాన్, ఎంకే బేగ్లు తమకే టికెట్ వస్తుందని బహిరంగ ప్రకటనలు గుప్పిస్తున్నారు. జనసేన సైతం పొత్తులో భాగంగా ఈ సీటు తమకే కేటాయిస్తారని ఆ పార్టీ నేత పోతిన మహేష్ హడావుడి చేస్తున్నారు. ఇక్కడ టికెట్పై స్పష్టత లేకపోవడంతో.. అక్కడ అసలే అంతమాత్రంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఇక్కడ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆసిఫ్ ప్రచారం ముమ్మరం చేశారు. మండలికి మళ్లీ సారీ! ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీలో సైతం అవనిగడ్డ టికెట్ జనసేనకు ఇవ్వాలని కోరారు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్కు ఈసారీ టికెట్ దక్కే అవకాశం లేదనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. బుద్ధ ప్రసాద్ కూడా సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ జనసేనకు టికెట్ ఇస్తే, ఓటమి తప్పదని, టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. పెడన నియోజకవర్గం టికెట్ జనసేనకు కేటాయిస్తారనే గట్టి నమ్మకంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. టీడీపీ నేతలు కాగిత కృష్ణప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్ వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. టికెట్పై ఎటూ తేలకపోవడంతో, టీడీపీ నేతలు అంటీ ముట్టనట్లు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పొత్తు ఖరారు కాకముందే కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించటాన్ని అక్కడ జనసేన పార్టీ శ్రేణులు జీరి్ణంచుకొలేకపోతున్నారు. గద్దె సీటుకు ఎసరు! తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటించడం లేదు. టికెట్ వస్తుందో రాదో అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. జనసేన నాయకులు సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని రెండు, మూడు సార్లు చుట్టేశారు. తాజాగా కుటుంబ సభ్యులందరితో కలిసి, తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ, తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని వైఎస్సార్ సీపీ తరఫున పార్లమెంట్ ఇన్చార్జిగా ప్రకటించడం పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు కలిసొస్తోంది. తాజాగా మైలవరం జనసేనకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. అక్కడ దేవినేని ఉమాకు టికెట్ లేదని టీడీపీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేయడంతోపాటు, అక్కడ అభ్యర్థి ఎవరో తేలక పోవడంతో దేశం శ్రేణుల్లో స్తబ్దత నెలకొంది. -
Feb 19th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 08:50 PM, Feb 19th, 2024 టీడీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దు: ఎంపీ కేశినేని నాని బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు: గ్యారంటీ అని టీడీపీ వాళ్లు వచ్చే ఉంటారు టీడీపీలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారు.. మీ ఓటు వృథా చేసుకోవద్దు చంద్రబాబు అంటేనే పచ్చి మోసం పనికిమాలిన కొడుకును సీఎం చేయడమే చంద్రబాబు ఎత్తుగడ పాపం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కూడా మోస పోతున్నాడు టీడీపీ ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు, కొడుకులు వెళ్లిపోతారు టిడిపి ఎలాగూ గెలవదు.. ఎలక్షన్ అనంతరం ప్రక్కనే ఉన్న తెలంగాణకు బాబు,కొడుకులు వెళ్ళిపోతారు 08:30 PM, Feb 19th, 2024 ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం: తిరువూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ స్వామిదాస్ నేను పక్కా లోకల్ .. ముప్పై ఏళ్లుగా ప్రజల తోనే ఉన్నా ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం రోజుకొక వేషం వేసుకుని నియోజకవర్గంలోకి కొందరు వస్తున్నారు ఇప్పటికే నన్ను,తర్వాత ఇంకొకరు,ఆ తర్వాత మరొకరు ఇలా టీడీపీలో ఎందర్ని ఎందుకోసం మారుస్తున్నారో ప్రజలకు తెలుసు టక్కుటమార విద్యలలో మన ముందుకు ఐదేళ్లకోసారి జాతర కోసమన్నట్లు వస్తూనే ఉన్నారు 07:15 PM, Feb 19th, 2024 చంద్రబాబు, ఎల్లోమీడియా పై మాజీమంత్రి కొడాలి నాని ఫైర్ వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే...చెప్పేవాడు చంద్రబాబు ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్ లను ఏడు విడతల్లో జగన్మోహన్రెడ్డి ప్రకటించారు అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు వైఎస్సార్సీపీలో సీట్ల మార్పులు జగన్మోహన్రెడ్డి చేస్తారు.. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు, మహాటీవీ వంశీ కాదు నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్ రాధాకృష్ణ టికెట్ ఇవ్వగలడు నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్మోహన్రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్, మహాన్యూస్పకోడీగాళ్లు కాదు ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా గన్నవరంలో వంశీని,గుడివాడలో నన్ను మారుస్తామని జగన్మోహన్రెడ్డి చెప్పారా మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్సీపీలో ఉండదు వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు వైఎస్సార్సీపీలో ఒకడు ట్రైచేస్తేనో...బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి సీట్లు మారుస్తాడా లేదా..అనేది మాకు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం మధ్యలో తెలుగుదేశం బ్రోకర్లకు పనేంటి ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి జగన్ మోహన్ రెడ్డిని ఎదుక్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి ఎందరు కలిసొచ్చినా జగన్మోహన్రెడ్డిని ఎదిరించలేరు జగన్ సింగిల్ గా వస్తానని చెబుతున్నాడు ...మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు చంద్రబాబు పర్మినెంట్ గా మాజీగానే ఉంటాడు ఈ రాష్ట్రానికి పర్మినెంట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి ఏబీఎన్ ను , వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం..ఎవరు రమ్మన్నారు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు 06:53 PM, Feb 19th, 2024 నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్ జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి యువతలో సీఎం జగన్కు మంచి క్రేజ్ ఉందని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా 05:17 PM, Feb 19th, 2024 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు?: సజ్జల గత ఐదేళ్లలో ఏ అభివృద్ధీ చేయని చంద్రబాబు ఇప్పుడు మాకు సవాల్ చేయటం కరెక్టు కాదు చంద్రబాబుకు సత్తా ఉంటే గతంలో ఏం చేశారో చెప్పాలి చంద్రబాబు పాలన చెత్తపాలన అని పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు మద్యం విషయంలో దశలవారీగా చేస్తున్నాం సీఎం జగన్కు సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు చంద్రబాబు సవాల్కి మేము సిద్ధమే మా తరపున ఎవరో ఒకరు చర్చకు వస్తారు అంతకంటే ముందు గత పాలనలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలి జగన్ పాలనలో చెప్పి, చేయనవి ఏంటో చంద్రబాబు చెప్పాలి కౌంట్ డౌన్ మొదలైంది ఇంకో యాభై రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు మా వాలంటీర్ల వ్యవస్థ మంచిది కాదు, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తానని డైరెక్ట్గా చెప్పాలి సిద్ధం సభలను ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏ సభలోనూ జగన్ పరుషంగా ఎప్పుడూ మాట్లాడలేదు కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు ఎలా ఉన్నాయో కూడా జనం చూస్తున్నారు ఊరూరా జరిగిన అభివృద్ధిని ఎవరూ కాదనలేదు ఎల్లోమీడియా రోజూ తప్పుడు వార్తలు రాస్తున్నారు చేసిన అభివృద్ధి, సంక్షేమం వారికి కనపడదా? 87% మంది ప్రజలు నేరుగా ప్రభుత్వ లబ్ది పొందారు ఆ కృతజ్ఞతలు చూపిస్తున్నారు జగన్ మీద వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు? రెండు ఎకరాల నుండి లక్షల కోట్ల ఆస్థులు చంద్రబాబు ఎలా సంపాదించారు? జగన్ ఆస్తులు ప్రజలకు పంచాలన్న లోకేష్ ప్రకటన హాస్యాస్పదం చేతిలో పచ్చమీడియా ఉన్నందున ఏది మాట్లాడినా వార్తలు వేస్తారని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారు చంద్రబాబు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శాపం ఉందని గతంలో వైఎస్సార్ అనేవారు ఆ సంగతి తెలీక లోకేష్ ఆ సామెతని జగన్కి చుడుతున్నాడు జైల్లో ఉన్నప్పుడు సర్వరోగాలు ఉన్నాయని చెప్పుకుని బెయిల్ పై బయటకు వచ్చారు ఆ రోగాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయో చంద్రబాబు చెప్పాలి కేసులపై కోర్టులు తీర్పులు ఇస్తాయి త్వరలోనే మ్యానిఫెస్టోని ప్రకటిస్తాం.. చేయగలిగినదే చెప్తాం 05:15 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్పై కొట్టు సత్యనారాయణ ధ్వజం చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించింది చంద్రబాబు అభివృద్ధి మీద చర్చిద్దాం అనడం హాస్యాస్పదం ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు సీఎం జగన్తో సవాల్ చేసే స్థాయి చంద్రబాబుకి లేదు మర్రిచెట్టుకి వచ్చినట్లు ఏళ్ళు వస్తే సరిపోదు బుద్ధి జ్ఞానం ఉండాలి నా పరిపాలన చూసి ఓటెయ్యమని అడిగే దమ్ము దైర్యం చంద్రబాబుకి ఉంటే చెప్పాలి 04:40 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్కు జగన్కు రావాల్సిన అవసరం లేదు.. మేమే సరిపోతాం: పోతుల సునీత చంద్రబాబు సవాల్కు సీఎం జగన్ రావాల్సిన అవసరం లేదు.. మేమే చంద్రబాబుకు సమాధానం ఇస్తాం రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం గా ఉన్నారు. రెండు బటన్లు నొక్కేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారు.. చంద్రబాబు అంటే భయపడాల్సిన అవసరం జగన్కు లేదు చంద్రబాబు తన హయాంలోనే సారాను ఏరులై పారించారు ఇసుక అక్రమ రవాణా చేసి కోట్ల గడించారు సిద్ధం సభలు భారీ సక్సెస్ అవుతున్నాయి విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు చేశారు అంబేద్కర్ స్ఫూర్తితో జగన్ పరిపాలన సాగిస్తున్నారు అందుకే సిద్ధం సభలకు భారీగా జనం తరలివస్తున్నారు 04:20 PM, Feb 19th, 2024 చంద్రబాబుతో చర్చకు జగన్ అవసరం లేదు : కేశినేని నాని వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిపై మేం చర్చకు సిద్ధం తాత్కాలిక సచివాలయం కటడం అభివృద్ధా? ఏపీలో 10 వేలకు పైగా గ్రామ సచివాలయాలు అభివృద్ధి కాదా? సంపదను చంద్రబాబు దోచుకున్నారా? 04:15 PM, Feb 19th, 2024 మమ్మల్ని విమర్శించే స్థాయి లోకేష్కు లేదు : ధర్మాన కృష్ణదాస్ లోకేష్ అవివేకి, ఆయన మాటలకు విలువలేదు రెడ్ బుక్ చూపిస్తే ఎవరూ భయపడరు దమ్ముంటే లోకేష్ నాపై పోటీ చేయాలి 04:10 PM, Feb 19th, 2024 బుద్ధా వెంకన్న కిడ్నీలు దానం చేసినా ప్రయోజనం లేదు: వెల్లంపల్లి బుద్ధా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు బుద్ధా వెంకన్న విచిత్ర వేషాలు కామెడీగా ఉన్నాయి బోండా ఉమా, బుద్ధా వెంకన్నను పిచ్చాస్పత్రికి పంపాలి 02:45 PM, Feb 19th, 2024 కాకినాడ రాజకీయ స్వార్థం తో నాపై విమర్శలు చేస్తున్నారు: ఎమ్మెల్యే ద్వారంపూడి మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను జాతి అంటే కొండ బాబు కుటుంబం అని ఆ రోజే చెప్పాను మత్స్యకారులుకి ఎమ్మెల్సీ ఇప్పించడం లో నేను కృషి చేశాను కొండ బాబు మత్స్యకారులుకి ఏమి చేశాడు? మత్స్యకార జాతి లో నేను పుట్టకపోవచ్చు..వారి కోసం నేను తప్పిస్తాను 02:40 PM, Feb 19th, 2024 చంద్రబాబు సవాల్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పేర్నినాని చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడు బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు బందరు పోర్టును పూర్తిచేశావా చంద్రబాబు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్...మూడు గజాలైనా ఇచ్చావా? ఆక్వా హబ్ ను చేస్తానన్నావ్ చేశావా? హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానన్నాడు చేశాడా గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ ఉంటుంది చంద్రబాబుకు నిలువెల్లా మచ్చలే ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా? జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదు 02:20 PM, Feb 19th, 2024 టీడీపీ కుట్ర బట్టబయలు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల ద్వారా వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి సోషల్ మీడియా ముసుగులో వైఎస్సార్సీపీపై విషం జిమ్మిన టీడీపీ టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ్ భూషణ్ పేస్బుక్లో షర్మిల, నర్రెడ్డి సునీతపై జుగుప్సాకరంగా పోస్టింగ్లు ఫేక్ పోస్టులతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేందుకు చంద్రబాబు ఎత్తుగడ ప్రజలు ఎప్పుడో మరిచిపోయిన కాంగ్రెస్ను జాకీలెత్తి లేపే ప్రయత్నం 01:42 PM, Feb 19th, 2024 అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం: దేవినేని అవినాష్ రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జగన్ హయాంలోనే జరిగింది తూర్పు నియోజకర్గంలోనే 650 కోట్ల అభివృద్ది జరిగింది కొండ ప్రాంతాలు..కరకట్ట ప్రాంతం ఏంతో అభివృద్ది చేశాం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ప్రజలకు అండగా నిలిచాం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ అభివృద్ధీ చేయలేదు గద్దె దిగజారుడు వ్యాఖ్యలు చేసి తన అక్కసు వెళ్లగక్కుతున్నారు ప్రభుత్వంపై, దేవినేని నెహ్రూపై గద్దె రామ్మెహన్ దిగజారి విమర్శలు చేస్తున్నారు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి సంక్షేమం పై గద్దె రామ్మోహన్ చర్చకు రావాలి గద్దె తూర్పులో ఏం అభివృద్ది చేశాడో చెప్పాలి సెటిల్మెంట్ వారసుడు అని నా పై నోరుపారేసుకోవడం మానుకోవాలి మేము చేసిన అభివృద్ది పై చంద్రబాబుతోనైనా చర్చిస్తాం 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల నన్ను చూసి వణికిపోతున్నారు జీరో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ చరిత్రలో నిలిచిపోతారు హెరిటేజ్ వ్యానులో గంజాయి తీసుకెళ్లింది టీడీపీ నేతలే కాల్ మనీ సెక్స్ రాకెట్, కాల్ నాగ్ అంటే గుర్తొచ్చేది గద్దె రామ్మోహన్ గద్దె భండారం త్వరలోనే బయటపెడతాం సిద్ధం సభలు చూసి టీడీపి శ్రేణులు, దాని మిత్ర పక్షాలుకి మైండ్ బ్లాక్ అయింది నారా లోకేష్ అతనికి ఉన్న ఆస్తుల పై వివరణ ఇవ్వాలి చంద్రబాబు అక్రమ ఆస్తులు పేదలకు పంచాలి తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 01:09 PM, Feb 19th, 2024 అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా: అలీ వైఎస్సార్సీపీ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తా అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటా గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఏ స్థానం నుంచైనా పోటీకి సిద్ధం రాప్తాడు సభ చూశాక వైఎస్సార్సీపీ విజయం ఖాయమని అర్థమైపోయింది సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ 12:40 PM, Feb 19th, 2024 బ్రాహ్మణి.. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: గంజి చిరంజీవి లోకేష్ భార్య బ్రాహ్మణి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు 2014 నుంచి 2019 వరకు మీ మామ చంద్రబాబు నాయుడు చేనేతలకు ఏం చేశాడో చెప్పండి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేనేత పరిశ్రమంలో నాశనం చేశాడు ఇప్పుడొచ్చి మాయ మాటలు చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు వైఎస్సార్సీపీ మంగళగిరి ఇన్ఛార్జి గంజి చిరంజీవి కామెంట్స్ 12:34 PM, Feb 19th, 2024 చంద్రబాబు ఛాలెంజ్.. కేశినేని నాని సూటి ప్రశ్నలు చంద్రబాబు ఛాలెంజ్కు.. కేశినేని నాని ప్రతి ఛాలెంజ్ చంద్రబాబు స్టేట్మెంట్ చూశా ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అన్నాడు అభివృద్ధి పై జగన్ వరకు ఎందుకు చంద్రబాబుతో చర్చించేందుకు నేను సిద్దం తాత్కాలిక సచివాయలం ఒకటి కట్టడం అభివృద్ధా? రాష్ట్రంలో సీఎం జగన్ కట్టిన 10వేలకు పైగా సచివాలయాలు అభివృద్ధా? చంద్రబాబు కుటుంబం, వారి అనుయాయులు ప్రభుత్వం సంపదను దోచుకోవడం అభివృద్ధా...? మానవ అభివృద్ధి కోసం చదువులు, ఆరోగ్యం,సంక్షేమం ఇలా చేయడం అభివృద్ధా..? చంద్రబాబు 45 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటాడు...అందులో స్వామిదాస్ 35 ఏళ్ల ఇండస్ట్రీ, నాది పదేళ్లు మేము చెబుతాం ప్రజలకు చంద్రబాబు నీది కాదు అభివృద్ధి.. సీఎం జగన్ దే అభివృద్ధి అని టీడీపీ పార్టీ ఈనాడు పేపర్ చేతుల్లో ఉంది రామోజీరావు 2 వేల ఎకరాల కోటలో నుంచి ఆంధ్రాను చూస్తాడు పేదలను బెదిరించి, ముఖ్యమంత్రు లను లొంగ తీసుకున్న రామోజీరావుకు ఆయన టాయిలెట్ అంత ఉండదు మన అభివృద్ధి 2వేల ఎకరాల కోట అందులోనే ఎయిర్ డ్రోమ్ ,ఫిల్మ్ సిటీ ఇవన్నీ రామోజీరావు అభివృద్ధి చంద్రబాబు చేసేవి మాత్రమే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5,సోషల్ మీడియా, అమెరికాలో ఉండే కుహనా మేధావులకు అభివృద్ధిలా కనిపిస్తాయి తిరువూరు నియోజకవర్గానికి 2,200 కోట్లు సంక్షేమం, అభివృద్ధి పథకాల పేరుతో ప్రజలకు అందాయి ఇది కాదా చంద్రబాబు అభివృద్ధి 12:02 PM, Feb 19th, 2024 విశాఖలో పవన్ రెండో రోజు పర్యటన సీట్ల సర్దుబాటు పై కసరత్తు చేస్తున్న జనసేనాని అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పవన్ నిన్న కొణతాలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం నేతలతో భేటీ పోటీకి సిద్ధపడుతున్న పలువురు జనసేన నేతలు విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్ అనకాపల్లి ఎంపీగా పోటీకి నాగబాబు ఆసక్తి.. పోటీకి దిగుతానంటున్న కొణతాల రామకృష్ణ 11:31 AM, Feb 19th, 2024 మరోసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విచారణ మధ్యాహ్నం గంటలకు హాజరుకావాలంటూ స్పీకర్ నోటీసులు నోటీసుల్లో తుది విచారణగా పేర్కొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం రాకపోతే.. ఇప్పటివరకు జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన కోటంరెడ్డి, ఆనం, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి ఫిరాయింపు ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణలకు సైతం నోటీసులు విచారణకు హాజరవుతారా ? లేదా ? అనే దానిపై సందిగ్థత 11:02 AM, Feb 19th, 2024 బాబును నమ్ముదామా? వద్దా?.. బీజేపీ నిర్ణయంపై ఆసక్తి ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం తేల్చే అవకాశం ఒకట్రెండు రోజుల్లో రానున్న స్పష్టత రాష్ట్ర నాయకత్వానికి క్లారిటీ ఇవ్వనున్న హైకమాండ్ చంద్రబాబును నమ్మాలా? వద్దా? అనే అనుమానంలో బీజేపీ పవన్ కల్యాణ్ కూడా విశ్వసనీయమైన మిత్రుడు కాదన్నయోచనలో కమలనాథులు అయినా సరే, పొత్తు పెట్టుకుందామంటోన్న బాబు, పవన్ విశాఖ టూర్ తర్వాత ఢిల్లీకి వెళ్లే యోచనలో పవన్ పిలిస్తే క్షణంలో ఢిల్లీకి వస్తానంటున్న బాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న బీజేపీ నేతలు ఏపీలో పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి వివరించిన బీజేపీ నేతలు హైకమాండ్ నిర్ణయం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ బీజేపీ నేతలు 10:42 AM, Feb 19th, 2024 అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి మహిళకు సాధికారత అందిస్తేనే సమాజం వృద్ధి చెందుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మారు రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు రామచంద్రగుహ కమిటీ ఓ నివేదిక ఇచ్చినా మహిళల ఇబ్బందులు మారలేదు 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు ఇందిరాగాంధీ చేయలేని పనిని జగన్ మోహన్ రెడ్డి చేసి చూపించారు మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని ఎన్టీఆర్ స్థాపించారు మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది నాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేసిన సీఎం భారతదేశంలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజలు మంచి మనసుతో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్ వయసులో చిన్నవాడే అయినా జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవి జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యవస్థ అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి పేదలు.. మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా జగన్ పాటు పడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి గత ఐదేళ్లలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు చంద్రబాబు బాధితుల్లో నేను,నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం ఆడవారంటే చంద్రబాబుకి అసహ్యం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే చంద్రబాబు మీటింగ్ లు పెడుతున్నాడు మంచి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించాలి చంద్రబాబు ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి తన కొడుకుని సీఎం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది :::తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు 09:58 AM, Feb 19th, 2024 మైలవరం టీడీపీలో ముసలం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మళ్లీ వేడెక్కిన రాజకీయం వసంత వర్సెస్ దేవినేని ఉమాగా మారిన పరిణామాలు టికెట్ విషయంలో ఎవరికీ క్లారిటీ ఇవ్వని టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా వర్గం మైలవరంలో ఎన్నికల ప్రచారానిని ఉమా నిర్ణయం 21 నుంచి అన్నరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ప్లాన్ 09:28 AM, Feb 19th, 2024 ‘నాగబాబుకి ఇవ్వడమేంటండి!’ ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన లో రేగుతున్న చిచ్చు నాగబాబు పవన్ పర్యటనకు కొణతాల రామకృష్ణ డుమ్మా నాగబాబు విశాఖ అనకాపల్లి పర్యటనలకు కొణతాల దూరం నిన్న విశాఖ వచ్చిన పవన్ ను కలవని కొణతాల అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకి ఇవ్వడం పై కొణతాల అసంతృప్తి జిల్లాలో తనకు తెలియకుండా పర్యటించడంపైన ఆగ్రహం కొణతాల ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ 08:55 AM, Feb 19th, 2024 వన్స్ మోర్ జగన్ రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ రాయలసీమ వ్యాప్తంగా తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు వన్స్ మోర్ జగన్ అంటూ నినదించిన వైఎస్సార్ సీపీ క్యాడర్ భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలు విజయవంతం కావటంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త కూ అండగా ఉంటానన్న సీఎం జగన్ ప్రత్యర్థులపై పంచులు గుప్పించిన సీఎం జగన్.. సర్వత్రా చర్చ 08:25 AM, Feb 19th, 2024 పవన్.. మళ్లీ భీమవరమేనా? ఉమ్మడి తూర్పు గోదావరిలో నేడు పవన్ కల్యాణ్ పర్యటన పార్టీ కీలక నేతలతో సమావేశం రేపు భీమవరానికి పవన్ రెండు రోజులపాటు భీమవరంలోనే పవన్ మకాం భీమవరం నుంచే పవన్ పోటీ చేస్తాడనే ప్రచారం 08:12 AM, Feb 19th, 2024 జగన్ పంచులు.. వర్మ మాస్ ట్రోలింగ్ ఏపీ పొత్తు రాజకీయాలపై తనదైన శైలిలో ఆర్జీవీ సెటైర్లు టీ గ్లాస్ సింక్లో పడేసిన వీడియో పోస్ట్ చేసిన వర్మ రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ పంచులు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి.. గ్లాస్ సింక్ లో ఉండాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జనసేనపై సీఎం జగన్ పంచ్ను ఇలా చూపించిన వర్మ pic.twitter.com/o3EMhMJ57S — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 07:43 AM, Feb 19th, 2024 ఫుల్ జోష్తో వైఎస్సార్సీపీ సిద్ధం భారీ సభలతో దూసుకువెళ్తున్న వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించిన నిన్నటి రాప్తాడు సిధ్దం సభ ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో సిద్ధం సభలు పూర్తి త్వరలోనే పల్నాడు జిల్లాలో మరో సిద్ధం సభ ఉండే అవకాశం ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా సాగుతున్న సభలు పార్టీ నేతలు, క్యాడర్ లో ఫుల్ జోష్ 07:02 AM, Feb 19th, 2024 మారణాయుధాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి పల్నాడు జిల్లా మంచికల్లు గ్రామంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు మేకపోతుల ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమం ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలను రెచ్చగొడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఫైర్ 06:58 AM, Feb 19th, 2024 రాప్తాడు సిద్ధం సభపై ఆర్జీవీ ట్వీట్ సముద్రాన్ని తలపించిన రాప్తాడు సిద్ధం సభ వైఎస్సార్సీపీ బహిరంగ సభపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన సీఎం జగన్ సిద్ధం సభను చూసి ఆశ్చర్యపోయానంటూ ట్వీట్ పది లక్షల మందికిపైగా హాజరై ఉంటారని వర్మ అంచనా దేశంలోనే అతిపెద్ద సభ కాబోలు అంటూ ఆశ్చర్యం In the DRY region of Rayalaseema suddenly a OCEAN emerged and this is a ocean of nearly 10 LAKH people who came to attend a meeting of @ysjagan and this is the BIGGEST gathering ever in the political HISTORY of india https://t.co/woJ5M9t3wQ — Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2024 06:41 AM, Feb 19th, 2024 సోషల్ మీడియాలోనూ సిద్ధమా?: సీఎం జగన్ ఎన్నికల వేళ.. కపట వాగ్ధానాలు చేస్తున్న చంద్రబాబు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు అంతటిని ఎండగట్టడానికి సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్ఫోన్ ద్వారా తిప్పికొట్టాలని పార్టీ కేడర్ను పిలుపు చంద్రబాబు కపట వాగ్ధానాలు, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎండగట్టడానికి మన సోషల్ మీడియా సైన్యమంతా సిద్ధమా? సోషల్ మీడియాలో మన ప్రభుత్వంపై పచ్చమంద చేస్తున్న దుష్ప్రచారాన్ని మీ సెల్ఫోన్ ద్వారా తిప్పికొట్టండి! #Siddham pic.twitter.com/p9d0j2lCv8 — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024 06:36 AM, Feb 19th, 2024 పవన్ బుజ్జగింపు పర్వం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇంటికి పవన్ కల్యాణ్ అభ్యర్ధుల ఎంపికపై కొణతాలతో సమావేశమైన పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా కొణతాల నివాసానికి పవన్ అనకాపల్లిలో నాగబాబు టూర్ కు దూరంగా ఉన్న కొణతాల నిన్న కొణతాల ఇంటికి వెళ్లిన నాగబాబు ఆసక్తిగా మారిన కొణతాల, పవన్ సమావేశం అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు పేరు ప్రచారం కావడంతో పవన్-కొణతాల భేటీకి ప్రాధాన్యత 06:30 AM, Feb 19th, 2024 ఎవరు పోటీలో ఉన్నా.. మనకే ప్రజల బ్రహ్మరథం: సీఎం జగన్ పార్టీ క్యాడర్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి మన పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు మన @YSRCParty కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటా… అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో రెండు మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తా… ఈ ఐదేళ్లు ప్రజలకు మంచి పాలన అందించాం. కాబట్టి, మనలో ఎవరు పోటీలో ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పడతారు!#Siddham pic.twitter.com/wny9gwiYnj — YS Jagan Mohan Reddy (@ysjagan) February 18, 2024 -
గ్లాసు.. పగిలేలా ఉంది బాసూ!
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ రాజకీయం రంజుగా సాగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే టికెట్టు కచ్చితంగా తనకే అని భావిస్తున్న జనసేన నేత బత్తుల బలరామకృష్ణకు శృంగభంగం తప్పేలా లేదు. టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి ఇటీవల చేసిన ప్రకటన బలం ఇందుకు చేకూరుస్తోంది. ఈ పరిణామం జనసేన, టీడీపీ నేతల్లో గందరగోళానికి దారి తీస్తోంది. ఈ సీటు విషయమై ఇరు పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వకపోవడం జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. అధినేత ప్రకటనతో.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని ఆ పార్టీ నేత బత్తుల బలరామకృష్ణ బల్లగుద్ది మరీ ప్రకటించారు. అధినేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, సీటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ సైతం రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో మరింత ఉత్సాహంగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. టీడీపీ కేడర్తో సంబంధం లేకుండా తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో టీడీపీ నిర్వహించిన చంద్రబాబు సభలో సైతం తనదైన శైలిలో రెచ్చిపోయారు. చంద్రబాబునే ఎదిరించే స్థాయికి చేరారు. బాబు కాన్వాయ్ను అడ్డుకునే చర్యలకు దిగి ఆయన విసిగిపోయేలా వ్యవహరించారు. ఇదంతా తనకు టికెట్ ఖరారైందన్న భావనలో చేసినట్లు సమాచారం. బొడ్డు ఎంట్రీతో షాక్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బొడ్డు వెంకట రమణ చౌదరిని కాదని జనసేనకు రాజానగరం సీటు కేటాయిస్తారన్న విషయమై ఆయన వర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబుతో, రాష్ట్ర పార్టీ నేతలతో తాడోపేడో తేల్చుకునేందుకు సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వారు వెళ్లారు. జనసేన తొందరపాటు నిర్ణయం ఫలితంగా టీడీపీకి తీరని నష్టం వాటిల్లుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల రాజమహేంద్రవరం రూరల్లో చంద్రబాబు నిర్వహించిన రా.. కదలి రా.. సభలో సైతం అసమ్మతి గళమెత్తారు. బొడ్డు ఆందోళనతో అవాక్కయిన చంద్రబాబు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ స్థానంలో పోటీ చేయాలన్న ప్రతిపాదన తీసుకువచ్చారు. దీనికి బొడ్డు అంగీకరించకపోవడంతో పునరాలోచనలో పడిన చంద్రబాబు.. న్యాయం చేస్తానని ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. బాబు భరోసాతో నియోజకవర్గానికి వచ్చిన బొడ్డు వెంకటరమణ చౌదరి తనదైన శైలిలో ప్రకటన చేశారు. రాజానగరంలో జనసేన పోటీపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని, భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న జనసేన నేతల్లో ఉత్పన్నమవుతోంది. రాజానగరంలో టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. అందులో భాగంగా బొడ్డు ప్రకటన చేశారా అనే అనుమానం కలుగుతోంది. ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటన చేశారంటే రాజానగరం సీటు బొడ్డుకే కేటాయిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే నిజమైతే జనసేన నేత బత్తుల బలరామకృష్ణ పరిస్థితేమిటని, తమ ‘గ్లాసు’ పగిలేలా ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అగ్నికి ఆజ్యం పోస్తున్న అధినేతల తీరు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ల వ్యవహార శైలి ఆయా పార్టీల శ్రేణుల్లో వైషమ్యాలకు దారి తీస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే స్థాయికి చేరింది. ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో ఇరు పార్టీల నేతలూ విడిపోయి ప్రచారాలు చేసుకుంటున్నారు. -
Pawan Kalyan: అనువుగాని చోట..!
తూచ్.. అధికారులు మా లీడర్ రావాల్సిన హెలికాఫ్టర్ ల్యాండింగ్కు అధికారులు అనుమతించడం లేదు. ఇందుకు నిరసనగా మా పార్టీ అధినేత తన పర్యటన వాయిదా వేసుకుంటున్నాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదాపై జనసేన పార్టీ ఇచ్చిన వివరణ ఇది. అదనంగా.. అధికారుల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యకు దిగింది అంటూ విష ప్రచారానికి దిగారు. ఇది వాస్తవమేనా?.. ఎన్నికలకు పట్టుమని రెండు నెలలు కూడా లేదు. ఓవైపు అధికార పక్షం మార్పులు చేర్పులు చేసుకుంటూ.. అభివృద్ధి మంత్రతో దూసుకుపోతోంది. మరోవైపు ప్రతిక్ష టీడీపీ కూడా జనాల్లోకి వెళ్లేందుకు శాయశక్తుల కృషి చేస్తోంది. ఇక.. బీజేపీ సైతం వరుస భేటీలో హడావిడి చేస్తోంది. అంతెందుకు.. గత ఎన్నికల్లో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ సైతం కొత్త పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ఏదో ఒక యాక్టివిటీతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మరి పదేళ్లు పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్ జనసేన సంగతి? పార్టీ పెట్టినప్పుడు టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇచ్చాడు. రెండో దఫా ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుగా పోటీ చేసి బొక్కా బొర్లా పడ్డాడు(137 స్థానాల్లో పోటీ చేస్తే.. నెగ్గింది ఒక్కటే సీటు). పోనీ.. ఈ ఐదేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలపర్చుకుంది ఏమైనా ఉందా? అంటే.. అదీ లేదు. అసలు వారాహి యాత్రను పవన్ కల్యాణ్ ఎందుకు మొదలుపెట్టాడు. ఎందుకు ఆపాడు? టీడీపీతో పొత్తు ప్రకటన ఎందుకు చేశాడు? అసలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని పదే పదే ఎందుకు కలుస్తున్నాడు?.. సీట్ల పంపకాన్ని ఇంకెప్పుడు తేలుస్తాడు?.. ప్రజలకే కాదు.. జనసేన కేడర్కు సైతం అంతుచిక్కని ప్రశ్నలివి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనాలకు దగ్గర అవుదామని ఆలోచన కూడా పవన్ చేయకపోవడాన్ని ఆ పార్టీ నేతలే తీవ్రంగా తప్పుబడుతున్నారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్కు అనుమతించలేదన్న సాకుతో.. భీమవరం పర్యటనను వాయిదా వేసుకోవడంపైనా ఇప్పుడు అదే తరహా చర్చ నడుస్తోంది. అధికారులు చెప్పినా కూడా.. పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన కోసం హెలికాఫ్టర్ను ఉపయోగించుకోవాలనున్నారట. అది ఫర్వాలేదు. కానీ, అనువుగా లేని హెలిపాడ్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడంపైనే అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే జనసేన దానిని మరోలా ప్రచారం చేస్తోంది. ఆర్ అండ్ బి అధికారులు మోకాళ్ల అడ్డారంటూ అసత్య ప్రచారానికి దిగింది. దీనిపై అధికారులు స్పందిస్తూ.. విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలిపాడ్ ప్రాంతాన్ని 2018 నుండి అనుమతించడం లేదని గుర్తు చేస్తున్నారు. ‘‘హెలిపాడ్ ప్రాంతానికి 50 మీటర్ల దూరంలోనే అపార్ట్మెంట్లు ,చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో హెలిప్యాడ్ అనువు కాదు. ఏవియేషన్స్ నామ్స్ పాటించాలని జనసేన నేతలకు సూచించాం. అనువైన ప్రదేశాన్ని హెలిపాడ్గా ఎంపిక చేసుకోవాలని కూడా చెప్పాం కూడా అని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు అంత చెప్పినా.. జనసేన నేతలు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు.. సోషల్ మీడియాలో విష ప్రచారానికి దిగారు. కారణం ఏంటసలు? భీమవరం పర్యటన కోసం పవన్ హెలికాఫ్టర్లోనే వెళ్లాలా? రోడ్డు మార్గంలో తన కాన్వాయ్ గుండా వెళ్లొచ్చు కదా. గతంలో పవన్ ఏనాడూ ఇలా కారులో వెళ్లింది లేదా?. కేవలం హెలిపాడ్ అనుమతి నిరాకరణ కారణంతోనే పవన్ తన పర్యటన వాయిదా వేసుకున్నాడా?. ఇది సిల్లీగా పవన్కే అనిపించడం లేదా?.. కీలకమైన ఎన్నికల సమయంలో పవన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడం వెనుక వేరే కారణం ఏదైనా ఉందా?... ఢిల్లీ పర్యటనలో బీజేపీతో పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబు వెంటే వెళ్లిన పవన్.. అక్కడ మీడియాకు ముభావంగా కనిపించాడు. మీడియాతో పెద్దగా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ఇన్నిరోజులు గడిచినా ఢిల్లీ పరిణామాలపై ఇటు చంద్రబాబు, అటు పవన్ మాట్లాడింది లేదు. అదే సమయంలో పొత్తు పార్టీల ఉమ్మడి సమావేశం వాయిదా పడింది. అంటే.. అభ్యర్థుల ప్రకటనను సాగదీస్తూ పోతున్నారాన్నమాట. ఇంతలోనే పవన్ భీమవరం పర్యటన ఖరారైంది. దీంతో పవన్ మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆ వెంటనే ఆ పర్యటనను కూడా వాయిదా వేసుకోవడం.. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో కూడా జనసేన స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఏదో జరుగుతోందన్న విశ్లేషణ నడుస్తోంది ఇప్పుడు. -
పవన్ కళ్యాణ్ తీరును జీర్ణించుకోలేకపోతున్న జనసైనికులు
-
సై అంటే సై.. టీడీపీ, జనసేనల పొత్తు కుంపట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. పైగా.. కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటివరకు ఒక్కడుగు కూడా వారిరువురూ ఆ దిశగా ముందుకు వేయలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. అలాగే, సీట్ల సర్దుబాటుపై కొన్నినెలలుగా చర్చలు జరగడమే తప్ప ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. తమకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసేన కోరుతుండగా, 15 సీట్లు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధంగాలేరు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకూ ఆ ఊసేలేదు. అంతేకాక.. ఇద్దరు అధినేతలు కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తారని ప్రకటించినా అదీ జరగలేదు. బాబు ‘రా కదలిరా’ సభలకు పవన్ వెళ్తారని ప్రచారం చేసినా ఆయన వెళ్లలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంవల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాలో నువ్వా నేనా? ఇదిలా ఉంటే.. నియోజకవర్గాల్లో మాత్రం రెండు పార్టీల నేతలు సీటు తమదంటే తమదంటూ పోటీపడుతూ గొడవలకు దిగడంతో జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల నేతలు బలప్రదర్శనకు దిగుతూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఉదా.. అనకాపల్లి ఎంపీ సీటు కోసం టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ ప్రయత్నిస్తుండగా దాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో వాతావరణం వేడెక్కింది. తన కొడుక్కి ఎంపీ సీటు నిరాకరిస్తుండడంతో అయ్యన్న కస్సుమంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజమండ్రి రూరల్లో రాజుకున్న విభేదాలు.. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రాజేసింది. అక్కడి నుంచి మళ్లీ తానే పోటీచేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతుండగా సీటు తనదేనని జనసేన నేత కందుల దుర్గేష్ తొడకొడుతున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఇప్పటికే బహిరంగంగా గొడవలు పడే పరిస్థితి నెలకొంది. తాజాగా.. బుచ్చయ్య చౌదరి స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన సీటును ఆపడానికి దుర్గేష్ ఎవరని ప్రశ్నించారు. దీనిపై దుర్గేష్ వర్గం మండిపడుతూ ప్రతి విమర్శలు చేసింది. ఇలా.. నిత్యం రెండు పార్టీల నేతలు సీటు కోసం రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు. పిఠాపురంలో పోటాపోటీ.. ► కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఇటీవల జరిగిన రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సీటు తనదేనని చెబుతూ ఒకసారి ఓడిపోయిన వారికి సీటు ఎలా ఇస్తారని వర్మను ఉద్దేశించి మాట్లాడారు. దీనికి ప్రతిగా పార్టీ అధినేతలే ఓడిపోయిన పరిస్థితి ఉందంటూ పవన్ విషయాన్ని వర్మ గుర్తుచేశారు. దీంతో గొడవ జరిగి ఇరు వర్గాలు కుర్చీలు విసురుకునే పరిస్థితి ఏర్పడింది. ► అలాగే, కాకినాడ రూరల్ సీటును జనసేన నేత పంతం నానాజీకి ఇస్తారనే ప్రచారంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కారాలు నూరుతున్నారు. సీటు తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ► అమలాపురం నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలు సీటు తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. ► రాజోలు సీటును పవన్ తమదేనని ప్రకటించినా అక్కడి టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుని హడావుడి చేస్తున్నారు. ► ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోలవరం సీటు జనసేనకు ఇస్తున్నారనే ప్రచారంతో అక్కడి టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ► నర్సాపురం సీటు జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ► అలాగే, కృష్ణా జిల్లాలోనూ రెండు, మూడు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీచేస్తున్నట్లు జనసేన నేత పోతిన మహేష్ హడావుడి చేస్తుండగా టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్ధా వెంకన్నలు అతనికి అంత సీన్లేదని ఎద్దేవా చేస్తున్నారు. తెనాలిపై మనోహర్, రాజా పట్టు.. ఇక తెనాలి సీటు కోసం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పోటీపడుతుండడం రసవత్తరంగా మారింది. సీటు తనదేనని మనోహర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేయగా, రాజా మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతూ తానే పోటీచేస్తానని చెబుతున్నారు. రాజాకు సీటు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే రీతిలో రాజా అనుచరులు తొడలు కొడుతున్నారు. ► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీటు తమదేనని జనసేన నేతలు ప్రకటించుకోవడంతో అక్కడి టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడుతున్నారు. ► అనంతపురం అర్బన్ సీటు కోసం రెండు పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ► ధర్మవరం సీటుపైనా రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం సీటుపైనా సిగపట్లు.. ఇలా మొత్తంగా రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. చంద్రబాబు సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్కళ్యాణ్ బలపరుస్తున్నా ఆ పార్టీ నేతలు, కేడర్ మాత్రం అంగీకరించడంలేదు. పైగా పవనే సీఎం అభ్యర్థని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతూ జనసేనకు అంత సీన్లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
పవన్ కల్యాణ్ సైకిల్ దిగితేనే మేం పోటీలో ఉండేది!
సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నాయకులు, కార్యకర్తలు ఊరూవాడా తిరుగుతూ జనంతో మమేకం అవుతుండగా..ఒక్క పార్టీ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. ప్రశ్నిస్తామంటూ పుట్టుకొచ్చిన ఆ పార్టీ... ఎన్నికల్లో పోటీ చేస్తారా...? అంటే సమాధానం చెప్పలేక సతమతమవుతోంది. సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో గ్లాసు గుర్తు పార్టీ జనసేన ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో హడావుడి చేస్తున్నా...క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలో రెండు స్థానాలు తమకు ఇవ్వాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలతో ఆ పార్టీ హిందూపురం పార్లమెంటు పరిధిలో ఒక్క చోటైనా పోటీ చేస్తుందా.. అన్నది సందేహంగా మారింది. మరోవైపు జిల్లాలో జనసేనకు ఒక్క సీటు కూడా ఉండదని టీడీపీ కార్యకర్తలు బహిరంగ ప్రచారం చేస్తున్నారు. పైగా చంద్రబాబుతో పవన్కల్యాణ్ కూడా డీల్ కుదుర్చుకున్నారని చెబుతున్నారు. దీంతో అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో జనసేన కార్యకర్తలు నైరాశ్యంలో పడ్డారు. గతంలో మాదిరిగా మళ్లీ టీడీపీ జెండా మోయాల్సిందేనా అని మదనపడుతున్నారు. జనసేన అధినేతకు చెప్పలేక.. టీడీపీ వెంట నడవలేక.. కొందరు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలిసింది. జనసేనకు ‘సున్న’మే.. ఈ ఎన్నికల్లో జిల్లాలో కనీసం రెండు సీట్లు డిమాండ్ చేయాలని జనసేన నాయకులు అనుకున్నారు. ధర్మవరం, పుట్టపర్తి లేదా కదిరి సీటు జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. దీంతో జిల్లాలో జనసేన పోటీ ఉండదని తేలిపోయింది. అక్కడక్కడా జనసేన పేరుతో తిరిగే కార్యకర్తలు.. టీడీపీ జెండా మోయాల్సిన పరిస్థితి నెలకొంది. అధినేతపై మండిపాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు. కనీసం కార్యకర్తల బాధలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలోని ఓ జనసేన కార్యకర్తతో మాట్లాడగా.. ‘గట్టిగా ప్రయత్నిస్తే 65 సీట్లలో పోటీ చేసే వాళ్లం. కానీ మా పవనన్న పట్టించుకోకపోవడంతో ఆ సంఖ్య 20 లోపే ఉంటుందేమో. ఏమీ చేయలేం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘పవన్ కల్యాణ్ సైకిల్ దిగితేనే మేం పోటీలో ఉండేది’ అని మరో కార్యకర్త తన మనసులో మాట తెలియజేశారు. ఎన్నాళ్లిలా? .. ప్రతి ఎన్నికల వేళ జనసేన నేతలు ఏదో ఒక పార్టీ జెండా మోయకతప్పని పరిస్థితి. 2014లో పోటీ చేయకుండా.. టీడీపీకి మద్దతు తెలిపిన జనసేన... 2019 ఎన్నికల్లో హడావుడి చేసింది. అయితే జిల్లాలో ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేసిందో? లేదో? కూడా ఆ పార్టీ వాళ్లకే తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి జనసేనకు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ సారి కూడా టీడీపీ జెండా మోయాల్సిందేనా అని కార్యకర్తలు బాధపడుతున్నారు. నాయకుల పేర్లు కూడా తెలియదే! జిల్లాలో జనసేన నాయకులు ఎవరని సామాన్యులను ప్రశ్నిస్తే... కనీసం రెండు పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. కార్యకర్తలే లేకపోవడంతో గ్రామ స్థాయి నాయకులే నియోజకవర్గ నాయకులుగా చలామణి అవుతున్నారు. ఉన్న ఒకరిద్దరు కూడా పబ్లిసిటీ పిచ్చితో జనసేనలో తిరుగుతున్నట్లు చెబుతున్నారు. -
పాయకరావుపేటలో మరోసారి జనసేన, టీడీపీ మధ్య సీటు వివాదం
-
జనసేన ఆఫీసు ముందే తనుకున్న జనసైనిక్స్..
-
జగ్గంపేట నియోజకవర్గంలో మళ్లీ వైఎస్ఆర్సీపీదే గెలుపు: నరసింహం
-
జోగయ్య కాదు జోరీగయ్య
చేగొండి హరిరామ జోగయ్య తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్కు చిర్రెత్తుకొస్తోంది... ఒకవైపు చూస్తే కులంలో పెద్ద... మరోవైపు సీనియర్ నాయకుడు... అలాంటి మనిషి తరచూ తనను ఇరిటేట్ చేస్తుంటే పవన్ ఏమీ అనలేక.. ఇటు చంద్రబాబు దగ్గర డిమాండ్ చేసే పరిస్థితి లేక.. బిత్తరపోయి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ముక్కీ మూలిగి పొత్తులో ఓ పాతిక సీట్లు తెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ కు గగనమైపోతోంది..ఇది కూడా ఎక్కడ ఇస్తారన్నది ఖరారు కాలేదు.. కేవలం టిక్కెట్లే ఇస్తారా.. అభ్యర్థులను శాతం చంద్రబాబే సప్లై చేస్తారా అన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు.. ఈలోపే జోగయ్య మళ్ళీ జోరీగయ్య మాదిరి మారిపోయి లేఖలు రిలీజ్ చేస్తున్నారు కనీసం అరవై సీట్లు ఇవ్వకుండా దేనికోసం పొత్తు.. ఇలాగైతే మా కాపులు .. కాపు యువత.. నాయకులూ ఏమవ్వాలి.. చంద్రబాబును సీఎంను చేసేందుకు మేమెందుకు పాలికాపులమవ్వాలి. పాతిక ఇరవై సీట్లకోసం పవన్ ఇంత యాగీ చేసి సినిమా కెరీర్ వదులుకుని జగన్ మీద ఇంతగా రెచ్చిపోయి కాలు దువ్వి శత్రుత్వం తెచ్చుకోవాలా ? ఇదెక్కడి దరిద్రం అంటూ జోగయ్య రాస్తున్న లేఖలు. వాటిలో లేవనెత్తుతున్న సందేహాలు ఇటు కాపు యువతలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. కాపులకు అధికప్రాధాన్యం ఇస్తూ కాపు నేస్తం వంటి పథకాలతో మహిళలను సైతం ఆడుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాళ్ళదన్నుకుని తెలుగుదేశం పల్లకీ ఎందుకు మోయాలి అనేది ఇప్పుడు గోదావరి జిల్లాల్లోచర్చ. కులం చెడినా సుఖం దక్కాలన్నది సామెత. కానీ కేవలం పాతిక సీట్ల కోసం మొత్తం కాపులను గంపగుత్తగా చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేస్తే ఎలా అనేది జోగయ్య ప్రశ్న... అరవై సీట్లయినా ఇవ్వకుంటే కాపు నాయకులకు పోటీ చేసేందుకు ఎక్కడ అవకాశం వస్తుందని.. వాళ్లంతా చాన్నాళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం చూస్తున్నారని. ఇప్పుడు పాతిక సీట్లకే ఒప్పేసుకుంటే ఇక వాళ్లంతా ఎందుకు ఊరుకుంటారని..? ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తారని జోగయ్య లేవనెత్తిన ప్రశ్నలు సమంజసమే అని కాపు యువత అంటోంది. గౌరవప్రదంగా సీట్లు కేటాయించకుంటే పొత్తు పొసగదని జోగయ్య తేల్చేసారు. దీంతో పవన్ ఏమీ చేయలేక సైలెంట్ అయ్యారు. ఇటు చూస్తుంటే చంద్రబాబు పాతిక సీట్లకు మించి ఇవ్వడు.. కావాలంటే బ్లాకులో డబ్బు ఇస్తాడు కానీ సీట్లు ఇవ్వడు.. అన్ని లేకపోతె ప్రజలు ఒప్పుకోరు.. దీంతో ఏమి చేయాలో తోచక పవన్ మళ్ళీ కార్యకర్తలకు మొహం చూపలేక సిగ్గుతో దాక్కున్నారు. అలాగని టీడీపీని కాదని అటు బీజేపీతో వెళ్లేందుకు మనసు ఒప్పడం లేదు.. ఏమిటో పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా ఒక దారీ తెన్నూ లేకుండా జాతరలో దారితప్పిన పిల్లాడిలా పవన్ ఆందోళనలో ఉండిపోయారు -సిమ్మాదిరప్పన్న -
వైఎస్సార్సీపీని తప్పించడమంటే.. టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్కళ్యాణ్కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే అధికారం చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని జనసైనికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన పవన్నుద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖ రాశారు. దానిని ఆయన మీడియాకు విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ► జనసైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా? ► పవన్కళ్యాణ్, చంద్రబాబునాయుడు అసెంబ్లీ సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనిసూ్తనే ఉన్నాం. కానీ వారిద్దరి మధ్యలో ఏయే చర్చలు జరిగాయో, ఎవరికెన్ని సీట్లు ఇస్తారో, ఏయే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఓ ఎల్లో టీవీ ఛానల్లో జనసేనకు 30 సీట్లని, మరో ఎల్లో వార్తా పత్రికలో 27 సీట్లని ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ► ఎన్నికల నోటిఫికేషన్లోగా ఇద్దరు నాయకులు పైవిధంగా ప్రకటించబోతున్నట్లుగా ఎల్లో మీడియాలో రావడం ఎవరిని ఉద్ధరించడానికి? ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకెళ్లడం తప్పని పరిస్థితిగా ఏర్పడింది. ► అయితే, వైఎస్సార్సీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్తే మెజారిటీ సీట్లు దక్కించుకోవడం జరిగే పనికాదు. ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనం. ►దీన్ని దృష్టిలో పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ప్రధాన అంశంకాదు.. జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ముఖ్యమైన అంశం. ►కానీ, 25 శాతం జనాభా ఉన్న కాపులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు దక్కించుకుంటోంది? 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలు ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులు ఎన్ని సీట్లు దక్కించుకోగలుగుతున్నారనేది కాపులకు జనసేన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. -
అఖిలను పక్కకు పెట్టేసినట్టే..
సాక్షి, నంద్యాల: టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి అఖిలప్రియ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఆమె వ్యవహారశైలి బూమరాంగ్ అవుతుందా? సొంత కుటుంబ సభ్యులకే నచ్చడం లేదా? ఆమె ఏకాకిగా మిగిలారా? కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెకు టికెట్ నిరాకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారా? అంటే అవుననే జవాబులే వినిపిస్తున్నాయి. బాబు మోసాల ఖాతాలో మరో వికెట్ పడిందని నంద్యాల జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దివంగత భూమా నాగిరెడ్డి కూతురిగా అఖిలప్రియ వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పార్టీ మారినా భూమా కుటుంబ సభ్యుల్లో అధికశాతం వైఎస్సార్ సీపీకే మద్దతుగా నిలిచారు. దీనికితోడు అఖిలప్రియ భర్త భార్గవరాం నాయుడు వ్యవహార శైలిని అనుచరులతోపాటు కుటుంబ సభ్యులూ తప్పుపట్టారు. అఖిలప్రియకు, ఆమె భర్త భార్గవరాం నాయుడికి భూమా కుటుంబంతో సంబంధం లేదని భూమా కిశోర్ రెడ్డి (అఖిలప్రియ పెదనాన్న కొడుకు) స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులంతా సమావేశమై ఈ ఎన్నికల్లో అఖిలకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కిశోర్ పేర్కొన్నారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి అఖిల వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటెత్తు పోకడలకు పోవడంతో బంధువుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం హైదరాబాద్కు మకాం మార్చిన తర్వాత దోపిడీ, బెదిరింపులు, కిడ్నాప్ కేసులతో అఖిల తీరు వివాదాస్పదమైంది. బంధువులతోనూ వివాదాలు, ఆస్తి తగాదాలు రావడం, అఖిల భర్త వ్యవహారశైలి వల్ల కుటుంబ సభ్యులు ఆమెతో బంధుత్వం తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అఖిలను పక్కకు పెట్టేసినట్టే.. భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని అఖిలప్రియ దూరం పెట్టారు. గతేడాది నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆళ్లగడ్డలో జరిగినప్పుడు సుబ్బారెడ్డిపై దాడి చేయడం పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటన యాత్రపై ప్రభావం చూపడంతో అప్పట్లో బాబు అఖిలను మందలించారని సమాచారం. అయినా ఆమె వ్యవహారశైలిలో మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఆమె వల్ల పార్టీ దెబ్బతింటోందని జిల్లా నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివరించారు. దీంతో ఆళ్లగడ్డ బరి నుంచి ఆమెను తప్పించాలనే నిర్ణయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆళ్లగడ్డలో నిర్వహించిన రా.. కదలిరా సభలోనూ టికెట్ విషయం తేల్చకపోవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ బాధ్యతల నుంచి అఖిలప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించడం.. ఇప్పుడు ఆళ్లగడ్డ టికెట్ అఖిలప్రియకు ఇవ్వరనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబును నమ్మి భూమా కుటుంబం పెద్ద తప్పే చేసిందనే వాదన జిల్లాలో వినిపిస్తోంది. అఖిల కూడా ఈ విషయంపై ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. -
‘పొత్తు’ కడుపులో కత్తులు!.. 68 సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదన
సాక్షి, అమరావతి: పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే స్థానాలపై పవన్కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముందుంచిన ప్రతిపాదిత అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా ఇటీవల బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. తమ సీటు ఎలా అడుగుతారంటూ టీడీపీ నేతలు స్థానిక జనసేన నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. ఈ విషయమై జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. ఒత్తిళ్లకు తలొగ్గే పవన్ ప్రతిపాదనలు పార్టీ నాయకులు, కొన్ని కుల సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తమ పార్టీ కోరే సీట్ల జాబితాను అందజేశారు. జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీట్ల కేటాయింపు తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న స్థానాలనూ జనసేనకు కేటాయించారన్న అభిప్రాయం కలిగించేలా ఉండాలని బాబుకు పవన్ స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతోపాటు మరో రెండు కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. 68 అసెంబ్లీ స్థానాల జాబితాను ఇచ్చి వాటిలో 45 సీట్లకు తగ్గకుండా కేటాయించాలని, 2019లో టీడీపీ గెలిచిన 23 అసెంబ్లీ స్థానాల్లో కనీసం రెండైనా తప్పనిసరిగా ఇవ్వాలని పవన్ ప్రతిపాదించారని సమాచారం. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన లేదా అత్యధిక ఓట్లు సాధించిన స్థానాలతోపాటు 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీకి కలిపి ఎక్కువ ఓట్లు వచ్చిన స్థానాలను గుర్తించి జాబితాను టీడీపీ ముందుంచినట్టు తెలుస్తోంది. దీనికి తోడు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేవే జనసేనకు కేటాయించాలని పవన్ కోరినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి. బీజేపీ పేరు చెప్పి వేచి చూద్దామన్న బాబు పొత్తులో భాగంగా బీజేపీని కూడా కలుపుకోవాలని తొలి నుంచి యోచిస్తున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు వేచి చూద్దామని చంద్రబాబు పవన్కు సూచించినట్టు తెలుస్తోంది. మరో పది పదిహేను రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తుపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని, అప్పటిదాకా రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలోనూ, నియోజకవర్గాల స్థాయిలోనూ సీట్ల అంశంలో ఎలాంటి ప్రకటనలు, విభేదాలు లేకుండా చూద్దామని చెప్పినట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో సీట్ల పంపకాలపై ప్రస్తుతానికి ప్రతిష్టంభన కొనసాగుతోంది. పలుచోట్ల రచ్చకెక్కిన విభేదాలు ► రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అసలు ఈ నియోజకవర్గాన్ని జనసేన ఎలా అడుగుతుందని అక్కడి జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనసేన నేతలు తమ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ► పెందుర్తి నియోజకవర్గంలో అక్కడి టీడీపీ నాయకుడు బండారు సత్యానందరావు, స్థానిక జనసేన నేత పంచకర్ల రమేష్ల మధ్య యుద్ధం జరుగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ► కాకినాడ రూరల్, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో టికెట్ రేసులో ఉన్న టీడీపీ నాయకులు తమ స్థానాలను జనసేనకు కేటాయిస్తే తమ దారి తాము చూసుకుంటామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ► పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ – జనసేన నాయకుల మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సమయంలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ తరహా అసంతృప్తులను కట్టడి చేసేందుకు బీజేపీని బూచిగా చూపి జనసేనను శాంతపరుస్తున్నారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. జనసేనకు కేటాయించాలని కోరుతూ పవన్కళ్యాణ్ ప్రతిపాదించిన నియోజకవర్గాల జాబితా ఇదీ.. ► ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస ► ఉమ్మడి విజయనగరం జిల్లా: విజయనగరం, నెల్లిమర్ల. ► ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా: పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, భీమిలి, అనకాపల్లి, గాజువాక ► ఉమ్మడి తూర్పు గోదావరి: పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొత్తపేట, అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, పి.గన్నవరం ► ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, ఆచంట ► ఉమ్మడి కష్ణా, గుంటూరు జిల్లాలో..: విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, పెడన, నూజివీడు, మచిలీపట్నం, కైకలూరు, పెనమలూరు, తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, తాడికొండ, పొన్నూరు, వేమూరు, గుంటూరు తూర్పు ► ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో: దర్శి, గిద్దలూరు, నెల్లూరు సిటీ, కోవూరు, కావలి, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నగరి, ఆళ్లగడ్డ, నంద్యాల, గుంతకల్లు, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట, పుట్టపర్తి, ధర్మవరం -
జనసేనలో భయం.. భయం
గుంటూరు, సాక్షి: చంద్రబాబు విషకౌగిలిలో చిక్కుకుంటే ఇక తప్పించుకోవడం కష్టం.. పవన్ కళ్యాణ్కు ఇప్పుడిప్పుడే ఆ తత్త్వం మెల్లగా బోధపడుతోంది. జనసేనకు సీట్ల కేటాయింపును ఆఖరి నిమిషం దాకా నాన్చి... చివర్లో అతి కొద్ది సీట్లతో పవన్ను కట్టడి చేసేలా చంద్రబాబు పెద్ద ప్రణాళికతో ఉన్నారని ఇప్పటికే జనసేన నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా.. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికీ ఆ పార్టీ నేతల్లో స్పష్టత లేదు. దీంతో జనసేన కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. పార్టీ అధినేత పవన్ రెండు మూడు వారాలుగా మౌనంగా ఉండడంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో.. ఈ పొత్తు ఎటు పోయి ఎటు వస్తుందోనని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. యుద్ధానికి సన్నద్ధమవ్వాల్సిన సమయంలో పార్టీ అధినేత మొదలు.. పార్టీలో ఏ ఒక్క నాయకుడు తాము ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఇలాగైతే అసలుకే మోసం తమకు ఇన్ని స్థానాలు కావాలని.. ఈ స్థానాలు కేటాయించాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఇప్పటి దాకా టీడీపీని స్పష్టంగా కోరలేదు. జనసేనలోను కొందరు కీలక నేతలకు కూడా ఎలాంటి స్పష్టత లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది గత ఎన్నికల్లోనూ చివరి వరకూ తేల్చలేదు. దీంతో అసలుకే మోసం వచ్చింది. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి పోటీ అనేది ఆఖరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచడం ఈ ఎన్నికల్లో ఒక ఎత్తుగడగా భావిస్తున్నారు. వాడుకుని వదిలేస్తారేమో? రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ రాష్ట్ర పర్యటనకు వచ్చి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయా? అన్నంత హడావుడి చేసేవారు. సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం ఆయన మౌనంగా ఉండిపోవడం వెనుక చంద్రబాబు జిమ్మిక్కులు ఉన్నాయని జనసైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మూడున్నర నెలలుగా వారాహి యాత్రను సైతం పక్కనపెట్టేశారు. ప్రతి పొత్తు సమయంలోనూ చంద్రబాబు తమతో పొత్తు పెట్టుకున్న పార్టీని రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత ఆ పార్టీని అణగదొక్కే నైజం అందరికీ తెలిసిందే. ఆ వ్యూహాన్ని ఇప్పుడు జనసేనపైనా మొదలుపెట్టి ఉండొచ్చని పార్టీలో చర్చ సాగుతోంది. పవన్కు అవమానం : జనసైనికుల ఆవేదన మొదటి నుంచి చంద్రబాబు వెంట పవన్ కళ్యాణ్ వెంపర్లాడడంతో దాన్ని అలుసుగా తీసుకుని తమ అధినేతను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేసే ఎత్తుగడలో బాబు ఉన్నాడని ఇప్పటికే జనసేన నేతలు మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. తెలుగుదేశం–జనసేనలు కచ్చితంగా కలిసి పోటీ చేస్తాయని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరాఖండీగా ఆ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. నచ్చేవారు ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి అని కేడర్ను అయోమయంలో పడేశారు. తమ అధినేత ఇంత చేస్తే పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయించేదీ చంద్రబాబు తేల్చకపోవడంపై ఆ పార్టీలో పెద్ద ఎత్తున మేధోమథనం సాగుతోంది. తమను చంద్రబాబు చివరిలో ముంచేస్తే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. నెలాఖరు నుంచి పర్యటనలు: నాదెండ్ల నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతోపాటు బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. పొత్తులు కాదు కత్తులే పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కోరుకుంటున్న గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం మొదలు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నియోజకవర్గాలన్నింటిలోనూ స్థానిక టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా గత వారం పది రోజులుగా అక్కడి జనసేన నాయకులకు వ్యతిరేకంగా పోటీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. జనసేనలో కీలక నేతగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ ఆశిస్తున్న గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో జనసేనకు పోటీగా పాదయాత్ర చేస్తుండగా... రాజా అనుచరులు నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు పెట్టి నాదెండ్ల మనోహర్పై బహిరంగంగానే విమర్శలకు దిగారు. పొత్తులో సీట్ల కేటాయింపు కొలిక్కి రాకమునుపే చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల గురించి బహిరంగ సభలో ప్రకటిస్తున్నారని జనసేన నాయకులు భగ్గుమంటున్నారు. మండపేట నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ఆ స్థానంలో టీడీపీ పోటీ చేసే అంశాన్ని పేర్కొనడం స్థానికంగా రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలోని జనసేన కీలక నాయకుడు మనస్తాపం చెంది.. సీట్ల కేటాయింపు తేలేవరకు మండపేట నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన నాయకులకు సందేశాలు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇదే తరహా వాతావరణం ఉండగా, ఉమ్మడి ఉభయగోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఫొటోలోనే పవన్.. పక్కన అక్కర్లేదా: జనసైనికులు జనసేనలో టికెట్లపై గందరగోళం నెలకొనగా... చంద్రబాబు మాత్రం పవన్ ఫొటోలు పెట్టుకుని వరుసగా తమ పార్టీ రాజకీయ కార్యక్రమాలకు వాడేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతిచోట తమ అభ్యర్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేసుకుంటున్నారు. మరోవైపు జనసేనలో మాత్రం సీట్ల కేటాయింపు తేలక ఎన్నికల హడావుడి లేకుండా పార్టీ పూర్తి స్తబ్ధుగా తయారైంది. చంద్రబాబు తన ఫొటో పక్కనే పవన్ కళ్యాణ్ ఫొటోలు పెట్టుకొని జనసేనకు ఏమాత్రం సంబంధం లేకుండానే రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించడం జనసైనికులకు మింగుడుపడడం లేదు. -
గుంటూరు జిల్లా తెనాలిలో తారస్థాయికి టికెట్ వార్
-
‘ఉమ్మడి’గా మాయ!
సాక్షి, అమరావతి: మాయే చంద్రబాబు మంత్రం. మోసమే ఆయనకు తెలిసిన తంత్రం. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడు. 2014 ఎన్నికల్లో ఉమ్మడిగా కలిసి పోటీ చేసిన చంద్రబాబు, పవన్.. అప్పట్లో ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేశారు. ఆ తర్వాత అసలు ఆ మేనిఫెస్టోనే కనపడకుండా పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు. వీరిద్దరూ కలిసి మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడిగా అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి కార్యక్రమాలు అంటూ హడావుడి చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసే పోటీ చేశారు. 600కు పైగా హామీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబుతోపాటు పవన్ ఫొటో కూడా ముద్రించారు. అప్పుడు ఇద్దరూ కలిసే జనానికి హామీలు ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పీఠమెక్కాకు ముసుగు తొలగంచి, అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. ఆ హామీలను అమలు చేయకపోగా, అసలు మేనిఫెస్టోనే చెత్త బుట్టలో వేశారు. ప్రజలను నిలువునా మోసగించారు. రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దారుణంగా వంచించారు. అధికారంలోకి వచ్చాక మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని, మీరు పైసా కట్టకండి అని చెప్పి.. తీరా చంద్రబాబు సీఎం అయ్యాక రైతులు, మహిళలను ముప్పుతిప్పలు పెట్టారు. వారు వడ్డీతో సహా రుణాలు చెల్లించుకోవాల్సి వచ్చింది. జాబు రావాలంటే బాబు రావాలంటూ యువతనూ నిలువునా ముంచారు. పింఛన్ల పేరుతో వృద్ధులు, దివ్వాంగులను ఎన్ని అవస్థలు పెట్టాలో అన్నీ పెట్టారు. ఇళ్లు, స్థలాల పేరుతో అందరినీ మోసం చేశారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. అమరావతి రాజధాని పేరుతో ఓ మాయా ప్రపంచాన్నే కళ్ల ముందు నిలబెట్టి చక్కబెట్టుకున్న వ్యవహారాలు, సొంత వారికి చేసిన మేలు కళ్లకు కడుతూనే ఉంది. చివరకు తాము ఇచ్చిన హామీలు ప్రజలకు కనపడకుండా పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోనే తొలగించేశారు. మాటిమాటికీ ప్రశ్నిస్తానంటూ మాట్లాడే పవన్.. ఆనాడు చంద్రబాబు చేసిన మోసాలను, అవినీతిని, అరాచకాలపై ఒక్క ప్రశ్న వేయకపోగా, చంద్రబాబుతో బంధాన్ని మరింత పెంచుకున్నారు. గతంలో మోసం చేసినట్లే మళ్లీ ఇప్పుడు కూడా ఉమ్మడిగా ప్రజలను మోసం చేయడానికి ఇద్దరూ సిద్ధమైపోయారు. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి జైలుకు వెళ్లిన చంద్రబాబును వెనకేసుకొచ్చారు. బాబు జైలుకు వెళ్లిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి ఆయనతో ములాఖత్ అయ్యారు. అవినీతిని బట్టబయలు చేసి, చంద్రబాబును జైలుకు పంపిన ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. ఆ తర్వాత కూడా ప్రతి విషయంలో అంటకాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి కార్యక్రమాలతో మరోసారి ఈ ద్వయం ప్రజలను వంచించడానికి వస్తోంది. చేసేదంతా బాబే చంద్రబాబు, పవన్ కలిసి పని చేస్తున్నప్పటికీ, వాస్తవంగా నిర్ణయాలన్నీ చంద్రబాబువే. వాటికి వత్తాసు పలకడం పవన్ వంతు. వాస్తవానికి చంద్రబాబు మహానాడులో 6 అంశాలతో ఓ మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పుడు దానికే మరో 6 హామీలను జనసేన ఇస్తున్నట్లు చూపించి మొత్తం 12 అంశాలతో ఉమ్మడిగా మేనిఫెస్టో అంటూ ఒకటి తయారు చేశారు. నిజానికి జనసేన ఆరు హామీలు కూడా చంద్రబాబు చెప్పినవే. వాటికి జనసేన కలర్ మాత్రమే ఇచ్చారు. త్వరలో ఈ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. జనసేన అభ్యర్థుల ఎంపికలోనూ చంద్రబాబుదే నిర్ణయమనేలా పవన్ చర్యలు ఉన్నాయి. అసలు రెండు పారీ్టల మధ్య పొత్తు కుదిరినప్పటికీ, ఇంతవరకు సీట్ల సర్దుబాటు జరగలేదు. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే విషయం తేలలేదు. పవన్ 50 అసెంబ్లీ, రెండు లేదా మూడు లోక్సభ సీట్లు అడుగుతుండగా చంద్రబాబు దానిపై ఏమీ తేల్చకుండా నాన్చుతూనే ఉన్నారు. 10 నుంచి 15 సీట్లు మాత్రమే జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీట్లు ఎన్ని ఇస్తారో తెలియకపోయినా, ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు పవన్ సమ్మతించడంపై జనసేన పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తారని, ఉమ్మడి జాబితా నిర్ణయం వెనుక మతలబు ఇదేనని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు. తొలి జాబితాలో 20 నుంచి 27 సీట్లను ప్రకటించాలని భావిస్తున్నారు. అందులోనే ఐదు లేక ఆరు సీట్లను జనసేనకు కేటాయించనున్నారు. ఆ తర్వాత జాబితాలో మరికొన్ని జనసేనకు వదలనున్నారు. చంద్రబాబు తెలివిగా సీట్లు తేల్చకుండానే సర్దుబాటును ప్రకటించి పవన్ కళ్యాణ్ను ఇరికించేస్తున్నారు. చివరికి తాను అనుకున్న మేరకే జనసేనకు సీట్లు ఇచ్చే పరిస్థితి కల్పించడం దీని వెనుక వ్యూహమని తెలుస్తోంది. -
పుట్టింటోళ్ళు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు!
మూడిళ్ళ చుట్టం మూతి ఎండి చచ్చినట్లు అయిందట. మాఇంటికి రాలేదు కదా... వాళ్ళింటికి కదా వచ్చారు.. అక్కడే తింటారులే అని ఈ ఇంటివాళ్ళు... అదేం లేదులే.. అక్కడికి వెళ్ళాడు కదా... తినేసి వస్తాడేమో అని ఆ ఇంటివాళ్ళు మొత్తానికి ఆ చూట్టానికి చుక్కలు చూపించి చివరకు పస్తులు పెట్టారట.. అలా అయ్యేలా ఉంది రఘురామకృష్ణం రాజు పరిస్థితి. బిజెపి... టిడిపి.. ఇలా అన్ని పార్టీల్లో తిరిగేసి. ఎక్కడ నిలువనీడ లేకుండా ఉండిపోయే పరిస్థితుల్లో అయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత ముసుగు తీసి చంద్రబాబు ఏజెంట్ గా మారిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో బాటు ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించడం మొదలెట్టారు. ఇదంతా సహజంగా అటు తెలుగుదేశానికి, దాని మద్దతుదారులయిన మీడియా సంస్థలకు అయన ఒక సోర్స్ గా మారిపోయారు. అయన రోజూ జగన్ మోహన్ రెడ్డిని. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీవీల్లో మాట్లాడడం.. దాని ఆయా సంస్థలు ఘనంగా ప్రచురించడం జరుగుతూ వస్తోంది. మొదట్లో అయన వ్యాఖ్యలు.. కామెంట్లకు మంచి రేటింగ్స్... వ్యూవర్ షిప్ ఉండేది కానీ నిత్యం జగన్ను తిట్టడమేపనిగా పెట్టుకున్న ఆయన్ను ఇక ప్రజలు చూడడం మానేశారు. అయినా సరే ఆయనకు వేరే గత్యంతరం లేక ఆయా మీడియా సంస్థలను అనధికార రెగ్యులర్ యాంకర్ కమ్. మోడరేటర్ కమ్ సలహాదారు... విశ్లేషకుడుగా మారిపోయారు. ఈ ఎపిసోడ్లన్నీ ముగిసి ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. జనసేన... తెలుగుదేశం.. వైయస్సార్ కాంగ్రెస్.. ... చివరకు ఒక్కసీటు కూడా గెలవని బిజెపి సైతం తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ రఘురామకృష్ణం రాజుకు ఎవరు టికెట్ ఇస్తారన్నది అర్థం కావడం లేదు. ఆయన్ను ఎవరూ భరించలేరు.. పైగా ఆయనకు సొంత క్యాడర్ లేదు.. ప్రజల్లోనూ ఆదరణ లేదు.. అలాంటపుడు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే అయన దెబ్బకు ఆ ఎంపీ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు సైతం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన్ను అందరూ ఒక ఐటం క్యారెక్టర్ మాదిరి వాడుకుని పక్కనపడేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. కుక్కను శత్రువుమీద మొరగడానికి పెంచుకుంటాం... మనమీద మొరుగుతుంది అనుకుంటే చెప్పుతో కొడతాం అనే సినిమా డైలాగ్ మాదిరి... ఆయన్ను టీడీపీ... దాని అనుబంధ మీడియా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినంతవరకే మీడియాలో కవరేజి ఇచ్చి ఊరుకుంటారు తప్ప ఆయనకు ఎక్కడా టిక్కెట్ మాత్రం ఇవ్వరు అంటున్నారు. ఆయనకు నర్సాపురం... లేదా ఇంకోచోట టికెట్ ఇస్తే అయన అసమర్థత.. అహంకారం .. ఇవన్నీ కలగలిసి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతారన్న ఆందోళన ఆయనపార్టీల్లో కనిపిస్తోంది. అందుకే కేవలం ఆయన్ను తమ ఛానెళ్లలో చూపడానికి మాత్రమే వాడుకుని ఎన్నికలు.. టిక్కెట్స్ ఇచ్చేవేళ పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా టీడీపీ.. జనసేన కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత అయన భోగినాడు సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చారు. ఆయనకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో భారీగా భౌన్సర్లను ఆయనే ఏర్పాటు చేసుకుని ఊళ్లోకి వచ్చారు తప్ప ఆయనకోసం ఎక్కడా అభిమానులు. క్యాడర్ ఎదురు చూడలేదు. దీంతో రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనని, కేవలం టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు తప్ప కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు దక్కదని నరసాపురం ప్రజలు అంటున్నారు. ✍️ సిమ్మాదిరప్పన్న -
జనసేన నుంచి టీడీపీ అభ్యర్థులు
-
పవన్ దగ్గరకు టీడీపీ నేతల్ని పంపిస్తున్న చంద్రబాబు