
సాక్షి, విజయవాడ : నాగార్జున సాగర్ నుంచి భారీ ఎత్తున నీరు చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. వరద ఉదృతి పెరిగేకొద్దీ నీటి విడుదల శాతాన్ని కూడా అధికారులు పెంచుతున్నారు. మంగళవారం రాత్రి వరకు ఐదు లక్షలకు పైగా ఇన్ ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజీకి జలకళ రావడం, మొత్తం 72 గేట్లు ఎత్తేయడంతో సందర్శకుల తాకిడీ పెరుగుతోంది. మరోపక్క చందర్లంపాడులో వరద నీటిలో గొర్రెల కాపర్లు చిక్కుకోవడంతో వారిని రెస్క్యూ టీం కాపాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment