టీడీపీది పోరాటం కాదు దాడి... | Raghuveera reddy takes on telugudesam party | Sakshi
Sakshi News home page

టీడీపీది పోరాటం కాదు దాడి...

Published Wed, Oct 1 2014 1:20 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

పేదరికం నిర్మూలనపై తెలుగుదేశం పార్టీ చేసేది దాడేకానీ, పోరాటం కాదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

హైదరాబాద్ : పేదరికం నిర్మూలనపై తెలుగుదేశం పార్టీ చేసేది దాడేకానీ, పోరాటం కాదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పేదరికాన్ని నిర్మూలించాల్సిన ప్రభుత్వం అర్హులైన పేదల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగిస్తోందని ఆయన బుధవారమిక్కడ మండిపడ్డారు. జన్మభూమిలో పాల్గొని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని రఘువీరా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో టీడీపీకి సహకరించని వారికి కక్షపూరితంగా సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని రఘువీరా విమర్శించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, నిరుద్యోగ భృతి, రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా, ఆదర్శ రైతు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి ఉపాధి కల్పించటం వంటి అంశాలను జన్మభూమి అజెండాలో చేపట్టాలని రఘువీరా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement