కడప: వైఎస్ఆర్ జిల్లా రాజంపేట సమీపంలోని గుండ్లూరు వద్ద పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు. స్మగ్లర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.