రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్ | Revenue Website hacking | Sakshi
Sakshi News home page

రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్

Published Fri, Nov 21 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్

రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్

సైబర్ నేరం కింద పోలీసుల కేసు నమోదు

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. హుద్‌హుద్ తుపాను సమయంలో మండలంలో ఒక్కరు కూడా మృతి చెందలేదు. అయితే వెబ్‌సైట్ హ్యాక్ చేసిన ఆకతాయిలు రణస్థలం మండల వాసులు 69 మంది తుపానుకు చనిపోయినట్టు వెబ్‌సైట్‌లో ఉంచారు.

ఈ మేరకు తహశీల్దార్ ఎం.సురేష్‌కుమార్ వెబ్‌సైట్ హ్యాకింగ్ అయినట్లు బుధవారం రణస్థలం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వినోద్‌బాబు సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement