తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 32వ మలుపు వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. తిరుమలలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారంతా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలసీఉలు వెల్లడించారు.