కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్, రైల్వేకోడూరు సర్కిళ్ల పరిధిలో 2.5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నవీన్ గులాటి వివరాలు వెల్లడించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 2.5 కోట్లు విలువ చేస్తుందని తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో నలుగురు అటవీ శాఖ సిబ్బంది కూడా పట్టుబడ్డారని తెలిపారు. వారి నుంచి ఓ ట్రక్కు, నాలుగు కార్లు, 4 ద్విచక్రవాహనాలు, 4 సెల్ఫోన్లతో పాటు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వివరాలు తెలిపారు.