చిట్టీల పేరుతో రూ. 5కోట్లకు టోకరా | RS 5crore cheating by name of Chitties | Sakshi

చిట్టీల పేరుతో రూ. 5కోట్లకు టోకరా

Published Sun, Mar 1 2015 9:44 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

RS 5crore cheating by name of Chitties

విశాఖ: చిట్టీల పేరుతో ఓ దంపతులిద్దరూ ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని నర్సింహనగర్లో ఆదివారం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా ఈ దంపతులిద్దరూ చిట్టీలు నడుపుతున్నారు. అదినమ్మిన బాధితులు వారివద్ద చిట్టీలు వేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన రూ. 5కోట్లకు టోకరా వేసి నిర్మల, నాయుడు అనే దంపతులు పరారైయ్యారు. 

మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  కాగా, ఏవీఎన్ కాలేజీలో లెక్చరర్గా నిందితుడు నాయుడు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement