తిరుమల: టీటీడీ శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు రూ. 600 కోట్లు దాటాయి. 1985, ఏప్రిల్ 6వ తేదీన టీటీడీ శ్రీవారి నిత్యాన్నదానాన్ని స్కీముగా ప్రారంభించారు. 1994 తర్వాత ట్రస్టుగా మార్చి స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించారు. రోజుకు రెండువేల మందితో ప్రారంభించిన ఈ పథకం 30 ఏళ్లపాటు మహాయజ్ఞంలా కొనసాగుతూ ప్రస్తుతం రోజుకు 1.11 లక్షల నుంచి 1.42 లక్షల వరకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారు.