39 ప్రైవేట్ బస్సులు సీజ్ చేసిన ఆర్టీఏ | RTA Officers Seized 39 Private Buses Across the State | Sakshi
Sakshi News home page

39 ప్రైవేట్ బస్సులు సీజ్ చేసిన ఆర్టీఏ

Published Wed, Nov 20 2013 9:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

RTA Officers Seized 39 Private Buses Across the State

మహబూబ్నగర్ జిల్లాలోని పాలెం సమీపంలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమైయ్యారు.దాంతో రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్ ట్రావెల్స్పై తనిఖీలు ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ రోజు తెల్లవారుజామున శంషాబాద్ సమీపంలోని షాపూర్ చెక్పోస్ట్ వద్ద ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 13 బస్సులను సీజ్ చేశారు.

 

అలాగే  హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై 7, హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారిలో 3 బస్సులను సీజ్ చేశారు. విజయవాడలో 16 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ఆహుతి అయింది.

 

ఆ ఘటనలో 45 మంది మరణించారు. ఆ ఘటనతో నిద్రలో జోగుతున్న రాష్ట్ర రవాణ శాఖ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.దాంతో ప్రైవేట్ ట్రావెల్స్పై తనిఖీల కొరడా ఝుళిపించింది. ఈ నేపథ్యంలో ఆ ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు రవాణా శాఖ నిబంధనలను తుంగలోకి తొక్కి నడుపుతున్న దాదాపు వెయ్యి బస్సులను ఆ శాఖ అధికారులు సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement