కళ్లలో ఇసుక | sand business | Sakshi
Sakshi News home page

కళ్లలో ఇసుక

Jul 30 2015 2:13 AM | Updated on Sep 3 2017 6:24 AM

జిల్లా నుంచి ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దొంగ వే బిల్లులతో అక్రమ రవాణా ఊపందుకుంది.

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  జిల్లా నుంచి ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దొంగ వే బిల్లులతో అక్రమ రవాణా ఊపందుకుంది. ప్రధానంగా పంచలింగాలతో పాటు పూడూరు ఇసుక రీచ్ నుంచి ఒక కంపెనీ ఈ ఇసుకను తరలిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా అధిక లోడుతో ఇసుకను తరలిస్తున్నట్టు గుర్తించి లారీలను పట్టుకున్నారు.
 
 ఈ మేరకు మొత్తం 8 లారీల ఇసుకను బుధవారం సీజ్ చేశారు. ఇందులో ఒక లారీ(టీఎస్ 06 యుఏ1449) నుంచి దొంగ వే బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడు లారీల్లో(12, 10 టైర్ల) లోడుకు మించి అదనంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.
 
 ఈ విధంగా దొంగ బిల్లులు, అదనపు లోడు కలిపి ఏకంగా 158 టన్నుల ఇసుకను అక్రమంగా తరలించినట్టు స్పష్టమైం ది. మొత్తం ఇసుకకు ఎలాంటి రాయల్టీ చెల్లించలేదని తేల్చారు. ఇది కేవలం తనిఖీల్లో పట్టుబడిందేనని.. వాస్తవంగా రోజుకు ఈ విధంగా 50 నుంచి 60 లారీల ఇసుక వే బిల్లులు లేకుండా తరలిపోతోందని సమాచారం. ఒక్కో లారీ ఇసుక హైదరాబాద్‌లో లక్షన్నర వరకు పలుకుతోంది. ఈ లెక్కన జిల్లా నుంచి రోజుకు సుమారు కోటి రూపాయల విలువైన ఇసుక తరలిపోతుంది. మొత్తం వ్యవహారాన్ని రెవె న్యూ యంత్రాంగం కానీ.. చెక్‌పోస్టుల సిబ్బంది కానీ పట్టించుకోకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement