Sand
-
నిద్రిస్తున్న కూలీలపై ఇసుక అన్లోడ్.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర: జల్నాలో విషాదం జరిగింది. నిద్రిస్తున్న తీసుకుంటున్న కూలీలపై టిప్పర్ ట్రక్కు డ్రైవర్ ఇసుక లోడ్ వేయడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్.. ఇసుకను అన్లోడ్ చేశాడు.ఇసుక అన్లోడ్ చేసే సమయంలో షెడ్డు కూలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, శిథిలాల నుంచి మహిళ, బాలికను రక్షించారు. శనివారం తెల్లవారుజామున జాఫ్రాబాద్ తహసీల్లోని పసోడి-చందోల్లోని వంతెన నిర్మాణ స్థలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పరారీలో ఉండగా, అతని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వీఆర్ వో నాగేంద్రతో టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ
-
3 జలాశయాల్లో పూడిక తీతకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: కడెం, మిడ్మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో పైలట్ ప్రాజెక్టు కింద పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించడానికి రా ష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిoది. ఇందులోని నిబంధనల మేరకు పూడిక తొలగింపుతో లభ్యమయ్యే ఇసుకను కాంట్రాక్టర్లు అమ్ముకోవచ్చు. ఈ నేపథ్యంలో మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.406.64ను కనీస బిడ్డింగ్ ధరగా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ ధరను ఎప్పటికప్పుడు సవరిస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు తాము కోట్ చేసిన ధర ఆధారంగా ఎంత ఇసుకను తవ్వితే ఆ మేరకు ప్రభుత్వానికి చెల్లింపు లు చేయాల్సి ఉంటుంది. పూడిక తొలగింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ వాటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీడబ్ల్యూఆర్డీసీ) ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కాంట్రాక్టర్లు ఇసుక నిల్వలను స్టాక్యార్డులో నిర్వహించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖ, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)లు దీనిని పర్యవేక్షించనున్నాయి. ఈ మేరకు పూడిక తొలగింపునకు టెండర్లను ఆహ్వానించాలని కరీంనగర్ ఈఎన్సీని ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకుపోయిన పూడిక రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 జలాశయాలున్నాయి. కాగా, ఇందులో సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో పూడిక పెరిగి క్రమంగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమై న సాగునీటికి లోటు ఏర్పడుతోంది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భా గంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పో యినట్టు తేలింది. దేశంలో పీఎం కిసాన్ సించాయ్ యోజన (పీఎంకేఎస్వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. కాగా, పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మూడు జలాశయాల్లో భారీగా పూడిక పేరుకుపోయింది. సర్కారుకు ఖర్చు లేకుండా.. జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పూడికతీత కోసం రాజస్తాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ ఆర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) నిర్వ హించనున్నారు. దీనికోసం ప్రభు త్వం ఎలాంటి ఖ ర్చు చేయదు. అత్యధిక ధర కోట్ చేసిన బిడ్డర్లు పన్నులు, సెస్, జీఎస్టీ, రాయల్టీని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపున కు ఇదే విధానాన్ని అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది. పూడిక తొలగింపు గడువు 20 ఏళ్లు! జలాశయాల్లో భారీగా ఉన్న పూడికను ఇప్పటికిప్పుడు తొలగించడం సాధ్యం కాదు. పూడిక తొలగింపునకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లు కాంట్రాక్టర్లతో 20 ఏళ్ల గడువుతో ఒప్పందా లు చేసుకోగా, మరో ఐదేళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాయి. రాష్ట్రంలో సైతం ఇదే రీతిలో 20 ఏళ్ల గడువు విధించి, ఆ తర్వాత గరిష్టంగా 5 ఏళ్ల గడువు పొడిగింపునకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. -
పది వేలిస్తేనే.. ఇసుక లోడింగ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతల ఇసుక దందా యథేచ్ఛంగా సాగుతోంది. రూ.10 వేలు ఇస్తేనే ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఇక్కడంతా టీడీపీ ఎంపీ ఒకరి అనుచరుల దందానే. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సైతం ఈ దందాకు వత్తాసు పలుకుతున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్ చేసుకొన్నా తట్టెడు ఇసుక దొరకదు. చలానాకు ఇసుక దొరకదని కరాఖండిగా చెబుతున్నారు. గట్టిగా అడిగిన వారిపై పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టజెబితే దండిగా ఇసుక లోడ్ చేస్తారు.టీడీపీ ఎంపీ పీఏలుగా వ్యవహరిస్తున్న జగదీష్, కిశోర్లే ఈ రీచ్లను పర్యవేక్షిస్తున్నారు. ఓ లారీ యజమానికి, ఇసుక రీచ్లో ఉన్న మనుషులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ బయటకు రావడంతో ఈ విషయం బట్టబయలైంది. కంచికచర్ల మండలం వేములపల్లి, పెండ్యాల, కాసరబాద రీచ్లను వీరు గుప్పిట్లో పెట్టుకొని లారీకి రూ.10 వేలు రేటు కట్టి వసూలు చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికి భారీ పొక్లెయిన్లతో ఇసుక ఎత్తిపోస్తున్నారు. అంతే కాకుండా, రోజుకు 200కు పైగా లారీల ఇసుక అక్రమంగా ఖమ్మం, వైరా, హైదరాబాద్, విజయవాడకు తరలించి పెద్ద ఎత్తున దండుకొంటున్నారు.ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి కొడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుతీరగానే 8 స్టాకు యార్డుల్లో ఉన్న ఇసుకను టీడీపీ నాయకులు లూటీ చేశారు. ఇక్కడ 2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను మింగేశారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి భారీ ధరలకు తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీని వెనుక జిల్లాకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధుల హస్తం ఉందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇసుక రీచ్లను గుప్పిట్లో పెట్టుకొని రేటు కట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. -
ఇది 'గంగా' దందా
సాక్షి, టాస్క్ ఫోర్స్ : ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. అధికార పార్టీ నేత మాత్రమే. ఇది చాలు దండుకోవడానికన్నట్లు ప్రభుత్వేతర శక్తిగా రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని ఇతర నేతలకు సైతం కొరకరాని కొయ్యలా మారి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయడం లేదు. తన నియోజకవర్గం మీదుగా వెళ్లే ప్రతి ఇసుక లారీ తను చెప్పిన రేటుకు అన్లోడ్ చేసి వెళ్లాల్సిందేనని రూల్ పెట్డారు. ఏకంగా నేషనల్ హైవేపై అనధికారికంగా టోల్గేట్ పెట్టి, తన ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త గంగా ప్రసాద్. ఈయన వ్యవహారం ప్రధానంగా వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని అధికార కూటమి పార్టీల నేతలకు మింగుడు పడటం లేదు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, అది క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలవ్వడం లేదు. లోకల్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో రీచ్ల నిర్వహణ సాగుతోంది. ఈ ప్రాంతంలో పెన్నా నదిలో భారీ యంత్రాలు పెట్టి టన్నుల లెక్కన లోడింగ్ చార్జీల పేరుతో నగదు వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. పెన్నా ఇసుకకు ఇతర జిల్లాలతో పాటు చెన్నై, బెంగళూరులో ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతో అధికార పార్టీ నేతలు పెన్నా నది నుంచి ఇసుకను చెన్నై, బెంగళూరులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాకు చెందిన గంగాప్రసాద్ కన్ను ఈ దందాపై పడింది. 20 రోజులుగా జాతీయ రహదారిపై ప్రైవేటు సైన్యం ద్వారా టోల్గేట్ పెట్టి, ఇసుక లారీలను ఆపుతున్నారు. టన్ను ఇసుకను రూ.750 చొప్పున వదిలేసి వెళ్లాలని నిబంధన పెట్టారు. లేదంటే వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. పార్టీ పెద్దలతో ఉన్న సంబంధాల దృష్ట్యా స్థానిక నేతలెవరూ ఈయన వ్యవహారాన్ని నేరుగా ప్రశ్నించలేక పోతున్నారు. ఇప్పటికే సిలికా, సైదాపురం గనుల్లో సైతం అనధికారికంగా మైనింగ్ దందా నడుపుతున్న గంగాప్రసాద్.. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్న స్వర్ణముఖి నది గర్భాన్ని సైతం తోడేస్తూ చెన్నైకి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ పెద్ద టిప్పర్ ఇసుక రూ.80 వేల నుంచి రూ.లక్ష ధర పలుకుతోంది.నెల్లూరు ఇసుక మాఫియా ఆయన కనుసన్నల్లోనే..నెల్లూరు జిల్లా ఇసుక మాఫియాను కూడా గంగా ప్రసాద్ తన గుప్పిట్లోకి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తిరుపతి, నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో నేషనల్ హైవేపై ఏకంగా టోల్గేట్ పెట్టి, ప్రైవేటు సైన్యం చేత వాహనాలను తనిఖీలు చేయిస్తున్నారు. ఇందుకు పోలీసులు సైతం ఈయనకు సహకరిస్తుండటం విడ్డూరం. తన మాట వినకుండా ఏ లారీ అయినా ముందుకు వెళితే.. గూడూరు రూరల్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తున్నారు. టన్ను ఇసుక రూ.750 చొప్పున కారు చౌకగా కొట్టేస్తున్న గంగాప్రసాద్... శ్రీసిటీలో నిర్మాణాలకు టన్ను రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. శ్రీసిటీలో 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని తెలుసుకుని ఈ దందాకు దిగారు. ఈయన వ్యవహారం అటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఆయా జిల్లాల నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే ఇసుక లారీలకు ఆరు నెలలుగా లోకల్ ఎమ్మెల్యేలు వెన్నుదన్నుగా ఉన్నారు. గంగా ప్రసాద్ రంగంలోకి దిగడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారంతా నిర్ణయించినట్లు తెలిసింది. -
ఇసుక ఫ్రీ ఫ్రీ ఫ్రీ..
-
పుష్పగిరిలో భక్తుల్ని ఆకర్షిస్తున్న సైకత లింగం
వైఎస్సార్, సాక్షి: పుష్పగిరిలో నది తీరాన భక్తుల చేత ప్రశంసలందుకుంటున్న సైకత లింగం. వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన రెండవ దక్షిణ కాశి పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయ సమీపాన పంచమ నది ఒడిలో సైకత శివలింగాన్ని ఇoటాక్ సభ్యులు కడిమెల్ల రాఘవేంద్ర వర్మ తన స్వహస్తాలతో తయారుచేశారు. వర్మ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాన్ని గురువారం సందర్శించారు. లింగాన్ని తిలకించిన పలువురు భక్తుల చేత ప్రశంసలు అందుకొoటోoది. -
‘ఇసుక’ లేని ఇన్కం కోసం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించింది. సంస్థకు ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా, అదంతా రాష్ట్ర ఖజానాకు చేరుతోంది. దీంతో టీజీఎండీసీ ఖాతా ఎప్పటికప్పుడు ఖాళీ అవుతోంది. ఫలితంగా ఇసుక వెలికితీస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు నెలల తరబడి పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక విక్రయాల్లో లోపాలను అరికట్టడంతోపాటు ఇతర ఖనిజాల అన్వేషణ, విక్రయం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. నాపరాయి, మార్బుల్, సున్నపురాయి, క్వారŠట్జ్, ఫెల్డ్స్పార్ గనులను లీజుకు తీసుకొని వెలికితీత, విక్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు జాతీయస్థాయిలోనూ సున్నపురాయి గనులను లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఏటా రూ.వందల కోట్ల ఆదాయం వస్తున్నా..రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సగటున ఏటా రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర ఇసుక విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ఏటా సుమారు కోటిన్నర క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుకను వెలికితీసి ఆన్లైన్ విధానంలో విక్రయిస్తోంది. సంస్థ నిర్వహణ వ్యయం, ప్రభుత్వ ఖజానాకు చేరుతున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే టీజీఎండీసీ లాభాలు ఏటా రూ.30 కోట్లకు మించడం లేదు. ఇదిలా ఉంటే రీచ్ల నుంచి ఇసుకను వెలికితీసి స్టాక్ పాయింట్లకు తరలిస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా రూ.400 కోట్ల మేర పెండింగ్లో ఉన్నట్టు టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి.సంస్థ ఆదాయం రాష్ట్ర ఖజానాకు మళ్లుతుండటంతో ఈ తరహా పరిస్థితి తలెత్తినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థ ఆదాయం పెంచుకునే దిశగా టీజీఎండీసీ ఆలోచన చేస్తోంది. సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఎక్స్ప్లొరేషన్ ఏజెన్సీ(ఎన్ఈఏ) గుర్తింపు ఉండటంతో జాతీయస్థాయిలోనూ ఖనిజాల వెలికితీత, విక్రయాలపై దృష్టి సారించింది.సున్నపురాయి గనుల లీజు కోసం.. రాష్ట్రంలో ఐదుచోట్ల 83.23 హెక్టార్ల ప్రభుత్వ, అటవీభూముల్లో ఉన్న నాపరాయిని వెలికితీయడం, ఖమ్మం జిల్లా ఇల్లెందు పరిసరాల్లో పాలరాయి నిల్వల మదింపుపై టీజీఎండీసీ దృష్టి పెట్టింది. ⇒ మంచిర్యాల జిల్లా దేవాపూర్ సమీపంలో 880 హెక్టార్ల అటవీ భూ మిని సున్నపురాయి వెలికితీత కోసం 2018లోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ⇒ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో క్వారŠట్జ్, ఫెల్డ్స్పార్ క్వారీల లీజు కోసం దరఖాస్తులు అందాయి. ⇒ గుండాల అటవీ ప్రాంతంలోని పలు కంపార్ట్మెంట్లలో నిల్వలు ఉన్నట్టు తేలడంతో ప్రస్తుతం మైనింగ్ లీజుల అనుమతుల ప్రక్రియను ప్రారంభించింది. ⇒ గతంలో నేషనల్ మినరల్ ఎక్స్ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ) నిధులతో తెలంగాణతోపాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో సున్నపురాయి అన్వేషణ ప్రాజెక్టులను టీజీఎండీసీ పూర్తి చేసింది. కేవలం అన్వేషణకే పరిమితం కాకుండా సున్నపురాయి గనులను లీజుకు తీసుకోవాలని సంస్థ భావిస్తోంది. ఒడిశాలోని కొన్ని సున్నపురాయి క్వారీలను లీజుకు తీసుకోవడంపై ఆసక్తి చూపుతున్న టీజీఎండీసీ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. ⇒ ఎన్ఎంఈటీ నిధులతో మాంగనీస్, మాలిబ్డినం అన్వేషణ కార్యకలాపాలు కూడా చేపట్టనుంది. ⇒ రాబోయే రోజుల్లో రోడ్ మెటల్కు భారీ డిమాండ్ ఉంటుందని టీజీఎండీసీ అంచనా వేస్తోంది. రంగారెడ్డి జిల్లా బండ రావిర్యాలలో రోడ్మెటల్ క్వారీయింగ్ చేపట్టేందుకు టీజీఎండీసీ సన్నద్ధమవుతోంది. ఇతర కార్యకలాపాల ద్వారా ఆదాయం పెంచుకునే ప్రణాళికలపై కసరత్తు జరుగుతున్నట్టు సంస్థ ఎండీ సుశీల్ కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
మితిమీరిన టీడీపీ ఇసుక దందా..ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
ఉచిత ఇసుక ఊరికే రాదు .. డబ్బులిస్తే మాత్రం .
-
పెన్నా నదిలో ‘వసూళ్ల గేటు’
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరుడు గుర్రప్ప అలియాస్ గురివిరెడ్డి ఏకంగా పెన్నా నదిలో అనధికార గేటు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒంటెద్దు బండికి రూ.150, రెండు ఎడ్ల బండ్లకు రూ.300, ట్రాక్టర్కు రూ.1,000 నుంచి రూ.1,200 చెల్లిస్తే కానీ పెన్నా నదిలోకి అనుమతించడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా పెన్నా నదిలో గేటు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని కొందరు వ్యక్తులు పెన్నా నదిలోని ఇసుకకు మీకు ఎందుకు గేటు చార్జీలు చెల్లించాలని సోమవారం వాగ్వాదానికి దిగడంతో ఈ పంచాయితీ రూరల్ పోలీస్ స్టేషన్కు చేరింది. అయినా ఫలితం లేకపోయింది. గేటు దగ్గర వసూళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.అక్రమ రవాణాకు అడ్డారామాపురం గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండటంతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మండల పరిధిలోని పెన్నా నది పరీవాహక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
కేసులకు, జైళకు భయపడే పిరికి వోళ్ళం కాదు: Govardhan Reddy
-
ఇసుకపై ఇంకో అబద్ధం
సాక్షి, అమరావతి: ఇసుకపై కేబినెట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలను వల్లె వేసింది. ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. నిజానికి జీఎస్టీని రద్దు చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. అయినా సరే ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని మంత్రి రవీంద్ర ప్రకటించడంపై అధికార యంత్రాంగం సైతం విస్తుపోతోంది.ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం వినియోగదారులపైనే పడుతుంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఇసుక సేల్ పాయింట్ల దగ్గర విక్రయిస్తే ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇది కూడా వినియోగదారులపైనే పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారంతో జీఎస్టీని రద్దు చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.జీఎస్టీ కౌన్సిల్దే నిర్ణయంఇసుక సహా ఏదైనా సరే జీఎస్టీ నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జీఎస్టీ కౌన్సిల్కు ప్రతిపాదించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై జీఎస్టీ నుంచి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తారని, అది దేశమంతా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రానికో మాదిరిగా జీఎస్టీ ఉండదని, మీడియా సమావేశంలో మంత్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇసుకపై సీనరేజ్ రద్దు చేసే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే జీఎస్టీ కూడా రద్దు చేశామని ప్రకటించడమంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టం గురించి తెలియదా?ఇసుక కార్యకలాపాలపై ఎస్జీఎస్టీని మాత్రమే రీయింబర్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, అంతకు మించి జీఎస్టీని రద్దు చేసే అధికారం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. అందరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశానని, తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు జీఎస్టీని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలియదా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిర్మాణ రంగానికి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ఇసుకపై 2017 సీజీఎస్టీ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంలో సీజీఎస్టీ చట్టం సెక్షన్ 7 (1) ప్రకారం 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ చట్టం జమ్మూ–కశ్మీర్ మినహా దేశమంతా వర్తిస్తుంది.మాఫియాను అరికట్టలేక చేతులెత్తేశారు..!తనకు ఏమాత్రం అధికారం లేని జీఎస్టీని రద్దు చేసినట్లు అబద్ధాలు చెబుతూ సీఎం చంద్రబాబు ఇసుక వినియోగదారులతో చెలగాటం ఆడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక దొరకపోవడానికి, అత్యధిక ధరలకు విక్రయించడానికి మూల కారణం పచ్చ ముఠాలేనని తెలిసినా వారిని నిరోధించకుండా గత ప్రభుత్వంపై నిందలు మోపటాన్ని బట్టి ఇసుక మాఫియాను అరికట్టలేక చంద్రబాబు చేతులెత్తేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇసుక బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని, అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లితే ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రిగా తానే ఉన్నాననే విషయాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు టీడీపీ నేతల ఇసుక దోపిడీని అరికట్టకుండా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. ఇసుక విధానంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు మార్పులు చేసినా ప్రయోజనం శూన్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరఫరా కేంద్రాల వద్ద గంటల తరబడి వాహనాలు నిరీక్షించాల్సి రావడం వల్ల ఎక్కువ రవాణా చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. బ్లాక్ మార్కెటింగ్, అస్తవ్యస్థంగా రీచ్ల నిర్వహణ గురించి తెలిసినా పట్టించుకోకపోవటాన్ని బట్టి ప్రభుత్వం ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నిర్మాణ రంగం కుప్పకూలింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని, ఇందుకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్, నిర్వహణ లోపాలు, అక్రమ కార్యకలాపాలే కారణమని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఇసుక ఉచితం ప్రకటనలకే పరిమితమని, ధరలు మాత్రం భారీగా పెరిగాయని పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్లడం, అక్రమ విక్రయాల కారణంగా డిమాండ్కు తగినట్లుగా సరఫరా చేయలేకపోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సుమారు 40 లక్షల మంది కార్మికులకు జీవనోపాధి కల్పించే నిర్మాణ రంగం కుప్పకూలిపోవడానికి ఇసుక ధరలు భారీగా పెరగడంతో పాటు లభ్యత లేకపోవడమేనని కారణమని తేల్చారు. ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి నిర్మాణ రంగంలో జీఎస్టీ ద్వారా రూ.1,260 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.955 కోట్లు మా త్రమే సమకూరినట్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ.300 కోట్లకుపైగా ఆదాయం పడిపోవడానికి కారణం నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోవడమేనని, ఇసుక లభ్యత లేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. గత ఆర్నెళ్లలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకకు డిమాండ్ ఉండగా కే వలం 32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి నట్లు తెలిపారు. ఇసుక రీచ్లను దక్కించుకునేందుకు తక్కువ ధరకు కోట్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు అక్రమాలకు తెరతీశాయన్నారు. గత 30 రోజుల్లో సగటున రోజుకు 26, 000 మెట్రిక్ టన్నుల చొప్పున 5.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇసుక సరఫరా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి రోజుకు 80,000 నుంచి 90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ఇసుక కొరతకు గత సర్కారు విధానాలే కారణమంటూ ప్రభుత్వ పెద్దలు నిందలు మోపడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం పెరుగుదల ఇసుక కొరతతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని, నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోయాయని ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అధికారుల నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో జీఎస్టీ రూపంలో రూ.974 కోట్లు ఆదాయం రాగా 2023–24 నాటికి రూ.2,083 కోట్లకు పెరిగిందని, అంటే సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం మేర పెరిగిందని అధికారులు తెలిపారు. -
దళారులెవరు బాబూ.. తమ్ముళ్లేగా?
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
నన్ను చంపేందుకు.. పోలీసులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే స్కెచ్
-
తమకు దక్కలేదని.. ఇసుక టెండర్లే రద్దు
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మంత్రి ఇసుక రీచ్ల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారు. జిల్లాలో గురువారం నాలుగు ఓపెన్ ఇసుక రీచ్లకు టెండర్లు తెరిచారు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువవడంతో కలెక్టర్ లాటరీ విధానంలో నలుగురికి అనుమతులు ఇచ్చారు. మెట్ట నియోజకవర్గంలో ఒక రీచ్ దక్కిన కాంట్రాక్టర్పై మంత్రి వీరంగం వేశారు. ఆ కాంట్రాక్టర్ను పిలిపించుకుని.. నా ఇలాఖాలో ఎలా టెండర్ వేస్తావంటూ బూతులు తిట్టారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఏకంగా ఇసుక టెండర్లనే రద్దుచేయించారు. జరిగింది ఇలా.. జిల్లాలోని పెన్నానదిలో నాలుగుచోట్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇహ్వాది. మినగల్లు, పడమటి కంభంపాడు, పల్లిపాడు, విరువూరుల్లో ఓపెన్ రీచ్ల ద్వారా 2.86 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నెల ఏడో తేదీన టెండర్లు ఆహ్వానించారు. ఆ రీచ్లకు 23 మంది కాంట్రాక్టర్లు 43 దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిలో ఒకటి జీఎస్టీ సక్రమంగా లేకపోవడంతో రద్దయింది. మిగిలిన దరఖాస్తులు అర్హత సాధించడంతో కలెక్టర్ ఆనంద్ లాటరీ విధానంలో నలుగురు కాంట్రాక్టర్లకు నాలుగు రీచ్లు కేటాయించారు. రీచ్లను పంచుకునేందుకు.. నాలుగు ఓపెన్ రీచ్లను పంచుకునేందుకు ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు తమ షాడోలతో టెండర్లు దాఖలు చేయించారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రం చేసి తమ షాడోలకు అప్పగించేందుకు పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారు. నదుల్లో ఇసుక తవ్వకాలు జరిపించేందుకు మెట్రిక్ టన్నుకు గతంలో రూ.90–100 చొప్పున చెల్లించారు. ఇప్పుడు అదే ధరతో టెండర్లు ఆహ్వానించినా.. తమ్ముళ్లు మాత్రం రీచ్ల్లోకి ఎంట్రీ అయితే చాలన్నట్లుగా గిట్టుబాటు చూడకుండానే టన్నుకు రూ.36 మాత్రమే కోట్ చేశారు. అంత తక్కువ ధరకే కేటాయిస్తే గిట్టుబాటు కాదని, అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లే అవుతుందని భావించి టన్నుకు రూ.114.90 వంతున నిర్ణయించిన కలెక్టర్ లాటరీతో ఒక్కో రీచ్కు ముగ్గురిని ఎంపికచేసి ప్రథమస్థానంలో ఉన్నవారికి రీచ్ కేటాయించారు. మరో ఇద్దరిని రిజర్వులో ఉంచారు. తమ అనుచరులకు టెండర్లు దక్కలేదని ఆ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు టెండర్ల ప్రక్రియ జరిగినప్పుడు లాటరీ విధానంలో ఎలా ఎంపిక చేస్తారంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్లనే రద్దుచేయించారు. నా ఇలాఖాలోకి వస్తావా.. తాట వలిచేస్తా.. లాటరీ విధానంలో ఇసుక రీచ్ దక్కించుకున్న ఒక కాంట్రాక్టర్పై మెట్ట ప్రాంతానికి చెందిన ఒక మంత్రి చిందులు తొక్కారు. తన నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్కు తన అనుమతి లేకుండా టెండర్ ఎలా దాఖలు చేస్తావంటూ గురువారం రాత్రి బండబూతులతో రెచి్చపోయారు. ‘నా ఇలాఖాలోకి వచ్చి ఇసుక రీచ్కు టెండరు వేస్తావా.. నీ తాట తీస్తా..’ అంటూ మంత్రి కన్నెర్ర చేయడంతో వణికిపోయిన కాంట్రాక్టర్ తాను రీచ్ నుంచి తప్పుకుంటానని వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
జంగారెడ్డిగూడెం: ఇసుక ఉచితమంటూ ప్రచారం చేస్తున్నారని.. తీసుకెళుతుంటే మాత్రం అధికారులు కేసులు నమోదు చేస్తున్నారంటూ శుక్రవారం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం జల్లేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేసేందుకు 8 ట్రాక్టర్లు వెళ్లాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు జల్లేరు వాగు సమీపానికి వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీస్స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దుర్గారావు అనే ట్రాక్టర్ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు దుర్గారావును నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఎస్ఐ ఎస్కే జబీర్, సీఐ వి.కృష్ణబాబులు బైపాస్ రోడ్డుకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబితే చంద్రబాబు, పవన్కళ్యాణ్లకు ఓట్లేసి ఇప్పుడు నట్టేట మునిగామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇసుకను ఫ్రీగా ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం వచ్చాక ఆ హామీని విస్మరించారని, ఉపాధి లేక తమ పరిస్థితి దయనీయంగా మారిందని ట్రాక్టర్ డ్రైవర్ వెంకటే‹Ù, ట్రాక్టర్ యజమాని దుర్గారావు చెప్పారు. నమ్మి ఓట్లు వేశాం ఇసుక ఉచితంగా ఇస్తే గ్రామాల్లో ఉపాధి పెరుగుతుందని నమ్మి కూటమి పార్టీలకు ఓట్లేశాం. పవన్కళ్యాణ్, చంద్రబాబు చెబుతున్న మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ట్రాక్టర్లు కొనుకున్న ఉపాధి పొందుతున్న యువతను సైతం నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలున్నాయి. ఇకనైనా మేలుకోకుంటే కూటమి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. –కుక్కల సత్యనారాయణ, వేగవరం, జనసేన ఎంపీటీసీ -
నల్లబజారులో యథేచ్ఛగా
సాక్షి, అమరావతి: ఇసుకను బ్లాక్లో అమ్ముకుంటున్నారని, నిజంగా అవసరమైన వారికి దొరకడం లేదని, ధర బాగా ఎక్కువగా ఉందని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రీచ్ల నుంచి ఇసుక తీసుకున్నవారు తిరిగి అధిక ధరకు విక్రయిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని తెలిపారు. రోజు, వారం కోటాల లెక్కన ఇసుక బుకింగ్ జరుగుతుండటంతో అత్యవసరంగా కావాల్సినవారికి బుకింగ్ అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. పరిమిత బుకింగ్తో ఇసుక అవసరమైన వారికి లభ్యత ఉండటం లేదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై అధికారులు ప్రభుత్వానికి రెండురోజుల కిందట నివేదిక సమర్పించారు. ఇసుక తీసుకున్నవారు తిరిగి విక్రయించడం, బ్లాక్ మార్కెట్తో ధర చాలా ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఇసుక వినియోగదారులు సొంత వాహనాల్లో తీసుకెళ్లి తిరిగి అత్యధిక ధరకు విక్రయిస్తుండటంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా చార్జీలతో పాటు బ్లాక్ మార్కెటింగ్, తిరిగి ఇసుకను విక్రయిస్తుండటంతో వినియోగదారులు గతంలో కన్నా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. పేరుకు ఉచిత ఇసుక విధానమేగానీ వినియోగదారులు మాత్రం అత్యధిక ధర చెల్లించాల్సి వస్తోందని, ఇది వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని వివరించారు. లోడింగ్, రవాణా చార్జీలనే వసూలు చేస్తున్నామని చెబుతున్నా గతంలో కన్నా ఇసుక ధర ఎక్కువగా ఉందని వినియోగదారులు చెబుతున్నారని తెలిపారు. రీచ్లు, స్టాక్ పాయింట్లు లేని ఏడు జిల్లాల్లో రవాణా చార్జీలతో ఇసుక ధర తడిసిమోపెడవుతోందని, ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి దారితీస్తోందని వివరించారు. రీచ్లు, స్టాక్ పాయింట్లు లేని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి జిల్లాలవారు ఇసుక కోసం పొరుగు జిల్లాలపై అధారపడాల్సి రావడంతో రవాణా చార్జీలు భరించలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాల్లో వచ్చే మార్చి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ఏడు జిల్లాల్లో ఇసుక సరఫరా, స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అధికారబలంతో ఇష్టారాజ్యం అధికారుల నివేదికనుబట్టి చూస్తే కూటమి నేతలు అధికార బలంతో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడి, బ్లాక్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఇసుక రీచ్ల నుంచి తీసుకువెళ్లి మళ్లీ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పేరుకు ఉచిత ఇసుక విధానం అని చెప్పి అధికార పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా రీచ్ల నిర్వహణ, విక్రయాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఉచిత ఇసుక పేరుతో వినియోగదారుల జేబులకు భారీగా కన్నం వేస్తూ తమ జేబులు నింపుకొంటున్నట్లు అధికారుల నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా ఇసుక బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారంటే.. ప్రభుత్వ పెద్దల అండతోనే జరుగుతున్నట్లు ఎవరికైనా అర్థం అవుతుంది. -
ఈ దొంగల రాజ్యంలో బ్రతకలేం.. ఇసుక దోపిడీపై డ్రైవర్ల ఆగ్రహం
-
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబూ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు మోడస్ ఆపరండీకూడా అలాగే ఉందంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? ‘‘గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అందుకే ఆయన్నే అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక కొందామంటేనే మా ప్రభుత్వంలోకన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నలు గుప్పించారు.ఇది నిజం కాదా?‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టాక్యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయింది? ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజం కాదా?’’ అని ఎక్స్ వేదికగా నిలదీశారు.ఇదీ చదవండి: ఉచిత ఇసుకకు ‘టెండర్’!మోడస్ ఆపరండీకి సృష్టికర్త మీరే కదా చంద్రబాబూ..‘‘2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా? ఈ మోడస్ ఆపరండీకి సృష్టికర్త, మూలపురుషుడు మీరే కదా చంద్రబాబూ.. ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు, 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. పేరుకు ఉచితం అంటున్నారంతే.. ..ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్ టు సేమ్. అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంతే.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా వల్ల, ముఠాకొరకు, ముఠా చేతులమీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజం కాదా చంద్రబాబు? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవ్వరినీ టెండర్లలో పాల్గొనకుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానం‘‘అదే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరాచేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుకరేట్లను ప్రకటించింది. 1.పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో @ncbn గారి మోడస్ ఆపరండీకూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 13, 2024ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా? ..వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావడంలేదన్నది వాస్తవం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైఎస్సార్సీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఇదీ చదవండి: సిండికేట్ కైవశం! -
రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం .. పామర్రులో టీడీపీ నేతల కుమ్ములాటలు
-
ఉచిత ఇసుకకు ‘టెండర్’!
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు..’ అని చిన్నప్పుడు చదువుకున్న పద్యంలో ప్రభుత్వ పెద్దలు ఈ వాక్యాన్ని బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇసుకను అడ్డు పెట్టుకుని ఎన్ని విధాలా డబ్బులు పిండుకోవచ్చో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వం ముందు చూపుతో సమకూర్చిన 80 లక్షల టన్నుల ఇసుకను అడ్డగోలుగా దోచేసి జేబులు నింపుకున్నది చాలదన్నట్లు.. తాజాగా దొడ్డి దారిలో అంతకు మించి దోపిడీకి భారీ స్కెచ్ వేశారు. రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు పిలిచి వారికి కావాల్సిన వాళ్లకు కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి : ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.సీఎంవోలో ముఖ్య నేత నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీలు పూర్తి ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీ వారికి రీచ్లను కట్టబెట్టేశాయి. ఇందుకోసం గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ తెలియనీయకుండా అత్యంత రహస్యంగా జిల్లాల్లో టెండర్ల ప్రక్రియను నిర్వహించాయి. లక్షల రూపాయల విలువ ఉండే చిన్న టెండర్లకే వారం రోజుల వ్యవధి ఇవ్వాల్సివుండగా, రూ.వందల కోట్ల విలువైన ఇసుక టెండర్లను ఎటువంటి ప్రచారం లేకుండా, ఎవరికీ సమాచారం కూడా ఇవ్వకుండా రెండు రోజుల్లోనే గోప్యంగా తన వాళ్లకు కట్టబెట్టడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవడం, ఖరారు చేసేయడం భారతదేశ టెండర్ల చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదని నిపుణులు సైతం విస్తుపోతున్నారు. అసలు ఇసుక రీచ్లకు టెండర్లు పిలుస్తున్న విషయమే ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేశారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇసుకను ఉచితంగా ఇస్తామన్న ప్రభుత్వం దానికి టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమిటి? అది కూడా షార్ట్ టెండర్లు ఎందుకు పిలవాల్సివచ్చింది? ఎవరికీ తెలియకుండా ఆగమేఘాల మీద వాటిని ఎందుకు ఖరారు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అడ్డగోలుగా తవ్వేయొచ్చనే అతి తక్కువ ధరకు.. టన్ను ఇసుక ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120 వరకు వివిధ జిల్లాల్లో బేస్ ధరగా నిర్ణయించారు. చాలా జిల్లాల్లో టన్ను ఇసుకను రూ.50 నుంచి రూ.60కే తవ్వుతామని బిడ్లు దాఖలవ్వడం గమనార్హం. అధికారం ఉండడంతో ఎలాగైనా టెండర్ దక్కించుకుని, ఆ తర్వాత అడ్డగోలుగా తవ్వేయొచ్చనే ఉద్దేశంతో అతి తక్కువకు కోట్ చేసి రీచ్లు దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా ఉన్న జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రభుత్వం చెప్పిన వారికి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాయి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ప్రశ్నించినా వారిని దబాయించి, బెదిరించి పంపించేశారు. రెండు, మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఇసుక టెండర్లు ఖరారైపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి అక్కడ తవ్వకాలు ప్రారంభించనున్నారు. తూ.గోలో అడ్డగోలుగా టెండర్ల ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లాలోని 17 రీచ్లకు 7వ తేదీన టెండరు పిలిచి 9వ తేదీ సాయంత్రం లోపు బిడ్లు దాఖలు చేయాలని నిర్దేశించారు. 48 గంటల్లోనే అప్పటికే సిద్ధంగా ఉన్న టీడీపీ వారి నుంచి బిడ్లు స్వీకరించి 9వ తేదీ రాత్రికల్లా ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో విషయం తెలుసుకుని కొందరు టెండర్లు వేయడానికి వస్తే వారిని బెదిరించి కలెక్టరేట్ లోపలికి సైతం వెళ్లనీయలేదు. మరికొందరు ఎలాగోలా టెండరు దాఖలు చేసినా, బిడ్లు ఓపెన్ చేసే సమయంలో వారిని కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఉండనీయకుండా పంపేశారు. వారంతా గురువారం రాత్రి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసుల సాయంతో వారిని బయటకు పంపి, టెండర్లు ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్వయంగా తన కంపెనీ పేరుతో సీతానగరం మండలంలోని ఒక రీచ్కు టెండర్ వేసి దక్కించుకున్నట్లు తెలిసింది. కర్నూలులో నోటిఫికేషన్ ఇవ్వకుండానేకర్నూలు జిల్లాలో ఇసుక టెండర్ల నోటిఫికేషన్ ఇవ్వకుండానే టెండర్ను ఖరారు చేశారు. కేవలం మైనింగ్ శాఖ వెబ్సైట్లో మాత్రమే ప్రకటన ఇచ్చారు. టెండర్ గురించి ఎవరికీ తెలియకుండా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బంగారయ్య అనే వ్యక్తితో మాత్రమే టెండర్ దాఖలు చేయించారు. ఎవరినీ రానీయకుండా ఒకే టెండర్ వచ్చేలా చేయడంతో అతనికే రీచ్ తవ్వకాల కాంట్రాక్టు ఖరారైంది. ఒకే టెండర్ దాఖలైతే టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనకు నీళ్లొదిలారు. పల్నాడు జిల్లాలో 8వ తేదీన టెండర్ పిలిచి 10వ తేదీన ఖరారు చేశారు. బాపట్ల జిల్లాలో 7న పిలిచి 8న టెండర్లు ఫైనల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి టెండర్ వేసేందుకు వెళ్లగా వెనక్కి పంపించారు. మీ వాహనాలకు జీపీఎస్ సిస్టం (డివైస్) బాగా లేదని, టెండర్ వేసేందుకు వీలు లేదని నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు. పాలసీ లేకుండానే తవ్వకాలకు రెడీ మూడు నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక విధానాన్ని రద్దు చేసింది. త్వరలో పూర్తి స్థాయి ఇసుక విధానాన్ని ప్రకటించి రీచ్ల్లో తవ్వకాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈలోపు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను ఉచితంగా ప్రజలకు సరఫరా చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వం వర్షాకాలం కోసం స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు సగానికి సగం వారం రోజుల్లోనే మాయం చేశారు. మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికక్కడ భారీ రేట్లకు ప్రభుత్వం విక్రయించడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఉచిత ఇసుక పేరుతో జనాన్ని నిండా ముంచిందే కాక, ఇప్పుడు అడ్డగోలు తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరో భారీ దోపిడీకి తెరలేపింది. 2, 3 రోజులే సమయం.. అంతా రహస్యంసరికొత్త దోపిడీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 మాన్యువల్ ఇసుక రీచ్ల్లో (యంత్రాలు ఉపయోగించకుండా) తవ్వకాలకు ఉన్నట్టుండి ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఎటువంటి ఇసుక విధానం లేకుండా, మార్గదర్శకాలు చెప్పకుండా అన్ని జిల్లాల్లో ఈ రీచ్ల్లో తవ్వకాలకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీల ద్వారా షార్ట్ టెండర్లు పిలిచింది. ఇసుక తవ్వకాల గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, టెండర్లలో తమ వారు తప్ప బయట వారు పాల్గొనే అవకాశం లేకుండా చేసేందుకే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టింది. షార్ట్ టెండర్కు కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. కానీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు, మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన వారు మాత్రమే టెండర్లు వేయడానికి ముందుగానే సిద్ధం చేశారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి వారితో దగ్గరుండి దాఖలు చేయించి, వారికే ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద నిర్ణయాన్ని పాలసీ ప్రకటించకుండా ఎలా చేశారనే దానికి అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. -
ఉచిత ఇసుక వట్టిదే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సంక్షోభం నెలకొందని, 4 నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటికీ ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతోందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. లాసన్స్బే కాలనీలోని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్మాణ రంగం కుదేలు కాగా, దానిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా, వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితం అని ప్రకటిస్తున్న నేపథ్యంలో సీనరేజ్ చార్జీలు రూ.3,500 తగ్గించి, 10 టన్నుల ఇసుకను రూ.10 వేలకే సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ భాగస్వాములు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసుపై సీఎం, డీజీపీ, సీబీఐకి లేఖ రాస్తామన్నారు. -
ఇసుక దొరక్క.. ఉపాధి లేక.. కార్మికుల ఆకలి కేకలు
గతంలో ఆదివారం కూడా పని ఉండేది. ఇప్పుడు వారంలో రెండు రోజులు కూడా పని దొరకడం లేదు. రోజూ సెంటర్కు వెళ్లి ఎవరైనా కూలికి పిలుస్తారేమోనని ఎదురుచూస్తున్నాం. పిల్లల చదువు కోసం వేరే ఊరి నుంచి విజయవాడకు వచ్చాం. రోజు పనికి వెళితేగానీ పూట గడవదు. పనులు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – శ్రీనివాస్, సెంట్రింగ్ కార్మికుడు, విజయవాడ‘మేం అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తా... పేదలకు పంచుతా... ఇందుకోసం పెద్దగా చేయాల్సింది కూడా ఏమీలేదు.. ఉచిత ఇసుక ఇస్తే చాలు... రోజూ పెద్ద ఎత్తున పనులు జరుగుతాయి. ప్రజల ఆదాయం పెరుగుతుంది...’ అంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చెప్పిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఉచిత ఇసుకను ప్రచారానికే పరిమితం చేశారు. రాష్ట్రంలో ఇసుకను ‘తమ్ముళ్ల’కు ఆదాయ వనరుగా మార్చేశారు.భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి ఉరి వేశారు. ఒకవైపు ఇసుకను బ్లాక్లో అధిక ధరలకు విక్రయించుకుని ‘తమ్ముళ్లు’ తమ సంపదను పెంచుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పనుల్లేక పస్తులు ఉంటున్నారు. అదేవిధంగా గతంలో ఇసుకపై ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఇప్పుడు అలా రాకపోగా ధర మూడు రెట్లు పెరిగింది. ఆ రేటుకు కూడా బ్లాక్లో దొరకని పరిస్థితి నెలకొంది. సాక్షి, అమరావతి: విజయవాడ బెంజ్ సర్కిల్ భవన నిర్మాణ కార్మికులకు అడ్డా. ఉదయం ఆరు గంటలకే తలకు కండువా చుట్టుకుని, క్యారేజీ పట్టుకుని వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇక్కడికి చేరుకుంటారు. మేస్త్రీలు, కాంట్రాక్టర్లు వచ్చి కూలీలను పనికి తీసుకువెళతారు. ఉదయం తొమ్మిది గంటల్లోపే ఆ ప్రాంతం ఖాళీ అవుతుంది. కానీ.. రెండున్నర నెలలుగా అక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పని కోసం కూలీలు పడిగాపులు పడుతున్నారు.అటుగా బైక్, కారుపై వెళ్లేవారు ఒక్క క్షణం ఆగితే... వారి వద్దకు పరుగున వెళ్లి ‘సార్... ఏదైనా పని ఉంటే చెప్పండి... ఎంతో కొంత ఇద్దురుగానీ..’ అని వేడుకుంటున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరికి ఎవరూ పనికి పిలవకపోవడంతో ఉపాధి లేక ఉసూరుమంటూ ఇంటి ముఖం పడుతున్నారు. విజయవాడలోని రామవరప్పాడు వంతెన, చిట్టినగర్ సెంటర్... గుంటూరులో గాంధీ పార్క్, లాడ్జి సెంటర్... విశాఖపట్నంలోని ఇసుకతోట, పూర్ణా మార్కెట్ జంక్షన్, ఎన్ఏడీ జంక్షన్.. నెల్లూరులోని కొండాయిపాలెంగేటు... అనంతపురంలోని రామ్నగర్ రైల్వేగేటు సెంటర్... ఇలా రాష్ట్రవ్యాప్తంగా కూలీలు పని కోసం పలు అడ్డాల్లో ఎదురు చూస్తూ అల్లాడిపోతున్నారు. ఎవరిని కదిలించినా రెండున్నర నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణాలు నిలిపివేశారు... మాకు పని దొరకడంలేదు.. అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు చౌడాడ వెంకటరమణ. సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా పాలకొండ. తమ ఊరిలో ఉపాధి లేక భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పదేళ్ల కిందట విశాఖపట్నం వచ్చేశాడు. గాజువాక పరిధిలోని దయాల్నగర్లో అద్దెకు ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పనికి వెళుతూ వచ్చిన డబ్బులతో పిల్లలను చదివిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండున్నర నెలలుగా ఇసుక దొరక్క భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, పని దొరకడం లేదని వెంకటరమణ తెలిపారు. రోజూ ఉదయం మేస్త్రీల వద్దకు వెళ్లి రెండు గంటలు కూర్చుంటున్నానని, ఎక్కడా పని లేదని చెబుతుండటంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నానని, ఆరి్థకంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పనులు లేక తాను, తన భార్య ఒకపూట పస్తు ఉండాల్సి వస్తోందని, తమ భవిష్యత్ ఏమిటో అర్థం కావడం లేదని వెంకటరమణ ఆందోళన వ్యక్తంచేశారు. ‘తమ్ముళ్ల’కు కాసులు.. కార్మికులకు కష్టాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా ముందుచూపుతో 80 లక్షల టన్నులు నిల్వ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే 40 లక్షల టన్నుల ఇసుకను ఆయా పార్టీల నేతలు ఊడ్చేశారు. మిగిలిన 40 లక్షల టన్నులను ఉచితం పేరుతో అధిక ధరలకు విక్రయించారు. దాదాపు రెండున్నర నెలలుగా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీంతో బ్లాక్లో 18 టన్నుల ఇసుక లారీ రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతోంది. అంత ధర చెల్లించి ఇసుక కొనుగోలు చేయలేక భవన యజమానులు, కాంట్రాక్టర్లు నిర్మాణాలను నిలిపివేశారు.ఒక ట్రాక్టర్ ఇసుక దొరికినా పూర్తయ్యే పనులు కూడా ఆగిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న తాపీ మేస్త్రీలు, కూలీలతోపాటు అనుబంధంగా ఇటుకల తయారీ, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, కార్పెంటర్, పెయింటింగ్, సీలింగ్, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్ తదితర 36 రకాల విభాగాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులకు పని లేకుండాపోయింది. భవన నిర్మాణ, అనుబంధ రంగాలపై ఆధారపడి మన రాష్ట్రానికి చెందిన సుమారు 31 లక్షల మంది జీవనం సాగిస్తుండగా.. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి మరో 14 లక్షల మంది ఈ పనుల కోసం వలస వచ్చారు. మొత్తం 45 లక్షల మంది కూటమి ప్రభుత్వ తీరుతో జీవనోపాధి కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జీవనాధారం కరువు నేను రోజూ తాపీ పనులకు వెళితేనే మా ఇల్లు గడుస్తుంది. రోజువారి కూలీతో భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభ్యత బాగుండటంతో వారం రోజులు పని ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అంటున్నారు. కానీ కైకలూరు నియోజకవర్గానికి రాజమండ్రి, విజయవాడ, భద్రాచలం వంటి ప్రాంతాల నుంచి ఇసుక రావాలి. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఇసుక రావడం లేదు. దీనివల్ల మాలాంటి కార్మికులకు జీవనాధారం కరువైంది. – కోమటి శ్యామ్ప్రసాద్, పెరికెగూడెం, ఏలూరు జిల్లా ఇళ్లలో పనికి పోతున్నా గతంలో రోజూ భవన నిర్మాణ పనులకు వెళ్లేదానిని. రెండు నెలలుగా ఇసుక లేక భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇక పిల్లల కోసమైనా కష్టపడి ఏదో ఒక పని చేయాలి కదా... చివరికి ఏ పనీ దొరక్క ఇళ్లలో పాచిపని చేయడానికి వెళుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పరిస్థితి ఏ రోజూ లేదు. – సరోజని, నెల్లూరు కొరత తీవ్రంగా ఉంది ఉచిత ఇసుక పాలసీ సక్రమంగా అమలు కావడంలేదు. దీనివల్ల ఇసుక కొరత తీవ్రంగా ఉంది. భవన నిర్మాణాలు ఆగిపోతున్నాయి. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలి. – మామిడి రాము, క్రెడాయ్ గుంటూరు చాప్టర్ అధ్యక్షుడు -
చంద్రబాబు.. ఉచిత ఇసుక ఎక్కడ?: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి : కూటమి ప్రభుత్వ నిర్వాహాకాలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా, ఇసుక మాఫియాపై చంద్రబాబును నిలదీశారు విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికుల జీవన ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇసుక టన్ను ధర రూ.475కే అందితే.. కూటమి హయాంలో టన్ను ఇసుక ధర రూ.3వేలు పలుకుతుందన్నారు. ఇక చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక పథకం నీటిమీద రాతల్లా తయారైందని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.With TDP, the devil always lies in the detail. On one hand, Chandrababu @ncbn promises free Sand on the other hand TDP is causing sand scarcity in the state affecting the livelihood of lakhs of construction workers. The cost of sand has spiked to ₹3,000/tonne now instead of the…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 7, 2024 -
అసలే కరువు.. ఆపై చేతివాటం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో నాలుగున్నర టన్నులు పట్టే ట్రాక్టర్ ఇసుక రూ.9 వేలు, రూ.10 వేల చొప్పున అమ్ముతున్నారు. అంత ధర పెట్టి కొనుగోలు చేద్దామంటే కూడా నూటికి పది మందికి కూడా దొరకడంలేదు. దీంతో చాలా మంది పనులు ఆపుకున్నారు. చీరాల నియోజకవర్గంలోని పందిళ్లపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూముల నుంచే కాక వరద కాలువ గట్లలోని ఇసుకను కూడా టీడీపీ నేత ఒకరు అక్రమంగా తరలించి అమ్ము కుంటున్నాడు. రేపల్లె నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. వేమూరు నియోజకవర్గంలోని జువ్వలపాలెం, ఓలేరు, పెసర్లంక, గాజుల్లంక గ్రామాల పరిధిలో కృష్ణా నది నుంచి టీడీపీ నేతలు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని కృష్ణా నది నుంచి 300 ఎద్దుల బండ్లలో ఇసుకను తరలిస్తున్నారు. వెల్లటూరు, కొల్లూరు, పెదపులివర్రు గ్రామాల సమీపంలోని కరకట్టకు వెలుపల గుట్టగా పోసి ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. బాపట్లలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పని దొరక్క తిరిగొచ్చేస్తున్నాంనేను తెనాలి, గుంటూరులో పనులకు వెళతాను. కొంత కాలంగా ఇసుక అందుబాటులో లేక పోవడంతో సక్రమంగా పనులు జరగడం లేదు. పనికి వెళ్లిన తర్వాత ఇసుక లోడు రాకపోవడంతో పని నిలిపి వేశామని నిర్మాణ దారులు చెబుతున్నారు. రోజూ పనికి వెళ్లే వారిలో పది శాతం మందికి కూడా పనులు దొరకడం లేదు. అంత దూరం వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తున్నాము. – డి.రవీంద్రనాథ్, రాడ్ బెండింగ్ మేస్త్రీ, వరహాపురం, వేమూరు మండలంఉపాధి కరువైందిమా ప్రాంతంతో పాటు తెనాలికి పనుల కోసం వెళతాము. కొంత కాలంగా ఇసుక కొరత వల్ల పనులు అందరికీ దొరకడం లేదు. పని కోసం వెళితే ఇసుక దొరకడం లేదని కట్టుబడి దారులు చెబుతున్నారు. బయట కూడా పనులు లేవు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.– కట్ట మరియదాసు, బేల్దార్ మేస్త్రీ, బలిజేపల్లి, వేమూరు మండలంప్రత్యేక సాయం ప్రకటించాలికూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నాం. ఉచిత ఇసుక విధానం అంటూ అసలు ఇసుకే లేకుండా చేశారు. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నెలలో పది రోజులు కూడా పనులు దొరకని పరిస్థితి. దీంతో పస్తులు ఉండాల్సి వస్తోంది. భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వం వెంటనే ఉపాధి చూపాలి. లేదంటే ప్రత్యేక సాయం ప్రకటించాలి. – జొన్నలగడ్డ ధర్మరాజు, భవన నిర్మాణ కార్మికుడు, పేటేరుపెనమలూరులో పెద్ద ఎత్తున లూటీకృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురులో అక్రమ ఇసుక దందా పెద్ద ఎత్తున సాగుతోంది. టీడీపీ నేతలు ఏకంగా 40 ట్రాక్టర్లును అక్రమంగా నదిలోకి దించి, పొక్లయినర్తో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 300 ట్రిప్పులకు పైగానే తరలిస్తున్నారు. ట్రాక్టర్ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. విజయవాడ నగర శివారులో ఇంతలా ఇసుక మాఫియా నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ కొరడా ఝుళిపించారు. ఒకేసారి మల్టీజోన్–2లోని తొమ్మిది జిల్లాల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వేటు పడిన వారిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నట్టు ఐజీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేటు పడింది వీరిపైనే..సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. త్వరలో వీరిని లూప్లైన్కు బదిలీ చేస్తామని ఐజీ తెలిపారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్పేట, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేసినట్టు పేర్కొన్నారు.వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్పై వేటుజోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓబా లికపై జరిగిన రేప్ కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవక లకు పాల్పడినందుకు సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. నాగరాజు ప్రస్తుతం వికారాబాద్ టౌన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాడు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక నిందితులతోపాటు అంతర్రాష్ట్రంగా అక్రమ రవాణా చేసే ప్రధాన నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఐజీ ఆదేశించారు. -
ఇసుక బంద్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : ఇసుక ఉచితం.. ఇసుక ఉచితం అంటూ ఊరూవాడా ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు సర్కారు చేతకానితనంతో ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చి0ది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఏ జిల్లాలోనూ ఇసుక దొరకడంలేదు. అన్ని జిల్లాల్లోనూ స్టాక్ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కారు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం తర్వాతే ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతాయని.. అప్పటివరకు ఇసుక ఉండదని అధికారులు తేల్చిచెబుతున్నారు. మరోవైపు.. ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరక్కుండా చేశారని జనం.. తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి.. స్టాక్ యార్డుల్లో గత ప్రభుత్వం నిల్వచేసిన 80 లక్షల టన్నుల ఇసుకకుగాను టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చీ రాగానే 40 లక్షల టన్నులను ఊడ్చేసి సొమ్ము చేసుకోవడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ ఖజానాకు ఒక్క పైసా రాకుండా మొత్తం దోచేశారు. అక్కడక్కడా కొద్దిగా మిగిలిన ఇసుక బ్లాక్ మార్కెట్కి తరలిపోవడంతో ఆ రేటు ఇప్పుడు షాక్ కొడుతోంది. ఎంతలా అంటే.. 18 టన్నుల లారీ ఇసుక రూ.30 నుంచి రూ.60 వేలు పలుకుతోంది. దీంతో నిర్మాణ రంగం రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయింది. లేని ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్.. ఇక మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు గెలవగానే వారంతా ముందుగా ఇసుక స్టాక్ యార్డులపై పడ్డారు. వీరు ఆ ఇసుకను మొత్తం ఊడ్చేశాక ప్రభుత్వం సెపె్టంబరు 13 నుంచి ఆన్లైన్ ఇసుక బుకింగ్ను ప్రారంభించింది. మొదట్లో ఉ.10 నుంచి సా.5 గంటల వరకు స్లాట్లు ఓపెన్ అవుతాయని చెప్పారు. ఫోన్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుకింగ్ అవకాశం ఉంటుందన్నారు. తీరా ఆచరణలోకి వచ్చాక వాటిలో ఒక్కటంటే ఒక్కటీ అమలుకాలేదు. స్టాక్ యార్డుల్లో ఇసుక ఖాళీ అయిపోవడంతో ఆన్లైన్ బుకింగ్ ఉపయోగం లేకుండాపోయింది. దీంతో ప్రజలకు ఇసుక కష్టాలు రెట్టింపయ్యాయి. ఇక కొద్దిరోజులుగా అయితే అసలు ఇసుక బుకింగ్ పోర్టల్ తెరుచుకోవడమేలేదు. అంతకుముందు కూడా అప్పుడప్పుడు రాత్రి 12 గంటల సమయంలో ఓపెన్ అయ్యేదని.. 10 నిమిషాల్లోనే స్లాట్లన్నీ అయిపోయేవని, ఎంత ప్రయతి్నంచినా తాము ఇసుకను బుక్ చేసుకోలేకపోయామని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కూటమి నేతల అక్రమ తవ్వకాలు.. మ్యాన్యువల్గా ఇసుక బుకింగ్లు లేకపోవడంతో ఎవరిని అడగాలో తెలీక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్వల్ల లారీ ఓనర్లు సిండికేట్ అయిపోయి బల్క్ బుకింగ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నందిగామలో ఒక వ్యక్తి మూడు టిప్పర్ల ఇసుక కోసం ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ శతవిధాలుగా ప్రయత్నించినా ఇసుక దొరకలేదు. సామాన్య జనం ఇలా ఇసుక దొరక్క అల్లాడుతుంటే ఆయా జిల్లాల్లో కూటమి పార్టీలకు చెందిన కొందరు అక్రమార్కులు మాత్రం నదులు, పొలాల్లో అక్రమంగా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేసుకుంటున్నారు. వీరి అక్రమాలను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇసుక మాఫియా వారిపై దాడులకూ తెగబడుతోంది. ఈ వార్తలు రాసే విలేకరులను సైతం భయకంపితుల్ని చేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తాం.. నువ్వు అడ్డుకోగలవా.. దమ్ముంటే రా అని సవాల్ చేస్తున్నారు.భవన నిర్మాణ కార్మికులు కుదేలు..మరోవైపు.. కూటమి ప్రభుత్వం అధికారికంగా స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయకుండా తమ పార్టీ నాయకులకు లబి్ధచేకూరేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో పెద్దపెద్ద బిల్డర్లు తప్ప సాధారణ ప్రజానీకం ఎవరూ ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితిలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ రంగం స్తంభించిపోయింది. ఫలితంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు.. ఇసుక ఎగుమతి, దిగుమతి కూలీలు పస్తులుండాల్సిన దుస్థితి. వీరితోపాటు.. ఈ రంగంపై ఆధారపడ్డ టైల్స్ కార్మికులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర కార్మికులకు సైతం పనులు తగ్గిపోయాయి. ఉత్తరాంధ్రలో 18 టన్నుల లారీ రూ.40 వేల పైనే..సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఇసుక ధర పేలుతోంది. 18 టన్నుల ఇసుక లారీ ధర రూ.40 వేలకు పైమాటే పలుకుతోంది. రాత్రి సమయాల్లో అక్కడక్కడ అనధికారికంగా తవ్వకాలు చేపడుతున్న కూటమి నేతలు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకుంటున్నారు. టన్ను ఇసుక రూ.2,200 నుంచి రూ.2,300 చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవానికి.. ఎన్నికలకు ముందు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా నాలుగు లక్షల టన్నుల ఇసుకను స్టాకు పాయింట్ల వద్ద నిల్వ ఉంచింది. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నేతలు రాత్రికి రాత్రి ఈ ఇసుక మొత్తాన్ని స్వాహా చేసేశారు. మిగిలిన కొద్దిపాటి ఇసుకను అధిక ధరకు అమ్ముతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని కొన్నిచోట్ల చీకటిపడితే ఇసుక లారీల జాతర నడుస్తోంది.అధికారంలోకి రాగానే 40 లక్షల టన్నుల ఇసుక హాంఫట్..నిజానికి.. వర్షాకాలంలో ఇసుక కొరత వస్తుందనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 70కి పైగా స్టాక్యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేసింది. కానీ, జూన్లో అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు ఆ నిల్వలను అడ్డగోలుగా అమ్మేసుకున్నారు. రోజుల వ్యవధిలోనే 40 లక్షల టన్నులకు పైగా ఇసుకను దోచేశారు. ఆ తర్వాత చంద్రబాబు తీరిగ్గా ఉచిత ఇసుక విధానమని ప్రకటించినా ఎక్కడా ఉచితంగా ఇచ్చిన పాపానపోలేదు. ప్రతిచోటా వినియోగదారులు రెట్టింపు రేట్లకు ఇసుకను కొనుక్కోక తప్పలేదు. 18 టన్నుల ఇసుక లారీ రూ.30 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోవడంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు. గోదావరి పరీవాహక ప్రాంతం రావులపాలెంలో అయితే ఐదు యూనిట్ల ఇసుక రూ.25 వేల వరకు ధర పలికింది. మిగిలిన చోట్ల ఇది రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. గతంలో ఎనీ్టఆర్ జిల్లా పరిధిలో లారీ ఇసుక ధర రూ.13 వేలు ఉండేదని.. ఇప్పుడు రూ.36 వేలకు చేరిందంటున్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు అధిక రేట్లతో ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రభుత్వానికి చిల్లిగవ్వ ఆదాయం కూడా రాలేదు. ఇక టీడీపీ నేతలు దోపిడీ చేయగా అక్కడక్కడా కొన్ని స్టాక్ యార్డుల్లో మిగిలిన కొద్దిపాటి ఇసుకను వారు రెట్టింపు రేట్లకు అమ్ముకున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఏ స్టాక్ యార్డులోనూ ఇసుక లేకపోవడంతో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉంది. వర్షాకాలం తర్వాతే ఇసుక అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతుండడంతో నిర్మాణ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇసుక కోసం నానా ఇబ్బందులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ ఒక్క ఇసుక రీచ్ కూడా పూర్తిగా తెరవలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డైరెక్ట్గా ఇసుక రీచ్లోనే టన్ను రూ.475కి ఇచ్చేవారు. దీనిని మేం కస్టమర్కి రూ.1,000 లేదా రూ.1,100కి విక్రయించే వాళ్లం. ఇప్పుడు అష్టకష్టాలు పడితే శ్రీకాకుళం రీచ్లో రూ.1,200కి టన్ను ఇసుక దొరుకుతోంది. దానిని విశాఖ తీసుకొచ్చి రూ.2,200 నుంచి రూ.2,300 చొప్పున విక్రయిస్తున్నాం. ప్రస్తుతం వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లారీ యజమానులూ రోడ్డున పడ్డారు. – కర్రి వెంకటరమణ, లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి, మధురవాడ (విశాఖ జిల్లా) -
ఇసుక లారీలకు డిపాజిట్టా?
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : లక్షలాది రూపాయలు అప్పులు చేసి, లారీ కొనుక్కొని కిరాయికి తిప్పుకుంటున్న తమను ప్రభుత్వం వేధిస్తోందని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సరఫరాకు తాము ప్రభుత్వానికి ముందస్తుగా ఎందుకు డిపాజిట్ చెల్లించాలని, ఇది ఎవరి నిర్ణయమని నిలదీశారు. పైగా రూ.50 బాండ్ పేపర్పై మైనింగ్ శాఖతో అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) చేసుకుని, లారీని కిరాయికి తిప్పుకోవాలా? అని ప్రశ్నించారు. విజయవాడ విద్యాధరపురంలోని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీపై ధ్వజమెత్తుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇసుక రీచ్కు లోడు కోసం వెళితే ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. కొన్ని ఊళ్లల్లో స్థానిక కూటమి నాయకులు లోకల్ అంటూ రోజుకు మూడు ట్రిప్పులు తోలుకుంటుంటే తాము అలా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు (విజయవాడ అర్బన్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్), అన్నే చిట్టిబాబు (ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు) సూరెడ్డి సాంబిరెడ్డి (పైపుల రోడ్ శాండ్ లారీ ఓనర్ల అసోసియేషన్), చుక్కాపు రమేష్, రత్తయ్య, తన్నీరు పాపారావు (డిస్ట్రిక్ట్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు) తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి» కిరాయికి ఇసుక తోలే ట్రాక్టర్కు రూ.1500, 6 టైర్ల లారీకి రూ.3 వేలు, 10 టైర్ల లారీకి రూ.6 వేలు, 12–14 టైర్ల లారీకి రూ.10 వేలు డిపాజిట్ చేయాలనడం దుర్మార్గమైన చర్య కాదా?» ఇసుక రవాణా చార్జిల విషయంలో రవాణా శాఖ, కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులు లారీ యజమానులతో చర్చించకుండా వారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం లారీ ఓనర్లను మోసం చేయడం కాదా?» లారీ కిరాయి ధరపై జీఎస్టీ విధింపు ఎంత వరకు సమంజసం?» బుక్ చేసుకున్న వారికి లోడును చేరవేయడంలో జాప్యం (ట్రాఫిక్ రద్దీ లేదా లారీ రిపేర్) జరిగితే జరిమానా విధిస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయం?» ఇంతకూ ఇసుక కిరాయి ఎవరు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారు.. ఎక్కడ ఇస్తారు? » వేలకు వేలు ట్యాక్స్లు, డ్రైవర్ జీతభత్యాలు కట్టుకుంటూ ప్రభుత్వ ఆంక్షలు పాటించే కంటే మా లారీలను సర్కారుకే అప్పగిస్తాం.. అలా చేస్తే నెలకు ఎంత ఇస్తారు?ఇసుక ఫ్రీ అని చెప్పి బ్లాక్లో అమ్ముకుంటారా? డాబాగార్డెన్స్: ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి ధరలు మరింత పెంచి బ్లాక్లో అమ్ముతూ.. భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొడుతున్న చంద్రబాబు, పవన్కళ్యాణ్ కార్మికులను తీవ్రంగా మోసం చేశారని భవన నిర్మాణ కార్మికులు ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకపోతే వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక రోడ్డున పడ్డామంటూ సిటూ ఆధ్వర్యంలో మంగళవారం గొల్లలపాలెం సింగ్ హోటల్ జంక్షన్ వద్ద నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం.సుబ్బారావు, కె.నర్సింగరావు, చంద్రమౌళి, సిమ్మినాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ గాల్లోకి వదిలేసిందన్నారు. ఇసుక లభించకపోవడంతో వేలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇంతగా రోడ్డున పడినా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. -
ఏపీ వ్యాప్తంగా ఖాళీగా దర్శనమిస్తున్న ఇసుక స్టాక్ యార్డులు
-
ఇసుక ఖతం.. దోచేస్తున్న పచ్చ నేతలు
-
సోమిరెడ్డి అవినీతి బట్టబయలు.. రూ.100 కోట్ల దోపిడీకి స్కెచ్!
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్ టు రిచ్కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోర్డ్ వర్కర్స్ అండ్ అదర్ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్ వద్దకు పంపి డ్రెడ్జింగ్ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్ ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడిఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్ తోలి రీచ్కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు. -
ఇసుక రాకాసులు.. రెండు చేతులా కోట్ల రూపాయల సంపాదన
-
పారని మంత్రి సుభాష్ పాచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ద్రాక్షారామం జగనన్న కాలనీలో ఇసుక చోరీ వ్యవహారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల మెడకే చుట్టుకుంది. ఈ వ్యవహారం నుంచి తన అనుచరులను తప్పించేందుకు మంత్రి రెండు రోజులుగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన అనుచరులే ఇసుకను చోరీ చేశారని తేటతెల్లమవటంతో చేసేది లేక అధికార యంత్రాంగం కేసు నమోదు చేసింది. మంత్రి ప్రధాన అనుచరుల్లో ఒకరైన టీడీపీ నేత దొంగల శ్రీధర్, మరి కొందరిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని రామచంద్రపురం ఆర్డీవో ఎస్.సుధాసాగర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 26న ద్రాక్షారామ జగనన్న కాలనీ లేఅవుట్–04లో జరిగిన ఇసుక దోపిడీపై ‘జగనన్న కాలనీలో టీడీపీ దొంగలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. ఈ కథనం అధికారులను, అధికార పార్టీ నేతలను పరుగులు పెట్టించింది. ఈ కేసు నుంచి మంత్రి సుభాష్ అనుచరుడు దొంగల శ్రీధర్ను తప్పించే ప్రయత్నాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. అయినా అతనిపైన, ఇతర అనుచరులపైన కేసు నమోదు కాకుండా మంత్రి సుభాష్ తీవ్రంగా ప్రయతి్నంచారు. అధికార బలాన్ని ఉపయోగించారు. మంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇసుక వ్యవహారంలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇదంతా వైఎస్సార్సీపీ నేతల పనేనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసికొట్టాయి. ఆయన మీడియా సమావేశం పెట్టిన రెండు గంటలకే అధికారులు దొంగల శ్రీధర్పై కేసు నమోదు చేశారు. ఆయనే ఇసుక చోరీలో నిందితుడని స్పష్టం చేశారు. కాగా, ఈ ఇసుక దోపీడిపై పోలీసులు కేసు నమోదు చేసిన వాసంశెట్టి బాల, కాండ్రేగుల సాయిరాంలను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి సుభాష్ ప్రకటించారు. ప్రధాన అనుచరుడైన దొంగల శ్రీధర్పై మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
అమాంతం పెరిగిన ఇసుక రేట్లు.. ఇదేనా చంద్రబాబు నీ పాలన..
-
ఇసుక స్టాక్ యార్డులో.. తుళ్లూరు సీఐ వీరంగం
గుంటూరు టాస్్కఫోర్స్: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం ఇసుక స్టాక్ యార్డులో తుళ్లూరు సీఐ ఆగడాలు మితిమీరుతున్నాయని, అకారణంగా, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వీరంగం వేస్తున్నట్లు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నోటితో చెప్పలేని రీతిలో బండ బూతులు తిడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా.. శనివారం సాయంత్రం ఇసుక లోడింగ్ చేసుకుంటుండగా ఆ సీఐ వచ్చి.. రికార్డులు పరిశీలించి లోడింగ్ జరుగుతున్న ట్రాక్టర్ డ్రైవర్ను కిందకు దించి ‘నీకిది మూడో ట్రిప్పు.. నువ్వెందుకు వచ్చావురా? నీ ఊరేది, నీ కులం ఏంటి రా..?’ అని గద్దించారు. డ్రైవర్ ఉద్దండరాయునిపాలెం అని బదులివ్వగానే.. మా.. లం..కో..ల్లారా.. అంటూ అతన్ని బిల్లులు రాసే దగ్గరకి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి బూతులు తిడుతూ ఇష్టమొచ్చినట్లు కొట్టి వే బిల్లును లాక్కొని ట్రాక్టర్ను వే బ్రిడ్జి దగ్గర కాటా పెట్టించి స్టేషన్కు తీసుకురావాలని కానిస్టేబుల్కు చెప్పారు. నిజానికి.. లోకల్ ట్రాక్టర్ కావడం, ట్రాక్టర్లు తక్కువ సంఖ్యలో ఉండటంతోపాటు స్థానిక గ్రామాల్లోనే ఇసుకను తోలుతుండటంవల్ల సదరు ట్రాక్టర్ ఆ రోజు క్యూలోనే మూడో ట్రిప్పు కింద వచ్చింది. అయితే, అసలు వే బిల్లులు ఇచ్చిన వారిని వదిలిపెట్టి తనను కావాలనే టార్గెట్ చేసి కులం పేరుతో దూషించి కొట్టాడని బాధితుడు ప్రసన్నకుమార్ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వానికి నిర్ణీత ధర చెల్లించి వే బిల్లులు తీసుకుని ఇసుకను తీసుకెళ్తున్న దళితుడినైన తనపై సీఐ దుర్మార్గంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించాడు. స్టాక్ యార్డులో వేబ్రిడ్జి ఉండాల్సి ఉన్నప్పటికీ అవేమీ నిర్ణీత ప్రమాణాలు పాటించకుండా కేవలం జేసీబీ బొచ్చ ప్రామాణికంగా లోడింగ్ జరుగుతుంటే వాహనాలపై అధిక లోడు కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరో యువకుడిపైనా మాటల దాడి.. ఇక ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన మణికంఠ అనే మరో ఎస్సీ యువకుడి లారీపై కూడా ఓవర్ లోడింగ్ కేసు నమోదు చేసిన సీఐ అతన్ని కూడా పిలిపించి.. రాయడానికి వీల్లేని భాష మాట్లాడుతూ.. ‘మా.. నా కొ.. నీ మీద తొమ్మిది కేసులున్నాయి.. ఇంకోసారి కనపడితే నీ మీద రౌడీïÙట్ ఓపెన్ చేసి బొక్కలో వేస్తా నువ్వు ఊరు వదిలి పారిపోవాలి’.. అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని బాధితుడు వాపోయాడు. ఇలా ఉద్దండరాయునిపాలెం ఎస్సీ యువకులే టార్గెట్గా సీఐ బెదిరింపులు ఎక్కువయ్యాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. పడిగాపులు కాసి ఒక్క ఇసుక ట్రాక్టరు తీసుకెళ్లి అన్లోడ్ చేస్తే యజమాని వద్ద నుంచి మాకు వచ్చేది రూ.300–రూ.400లేనని.. పోలీసులు ఇలా తమను టార్గెట్ చేస్తే బతికేదెలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. ఇసుక తరలింపులో టీడీపీ నేతల వాహనాలను వదిలేసి వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలే టార్గెట్గా సీఐ వ్యవహరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అదే టీడీపీకి చెందిన వారి వాహనాలు కూడా ఎక్కువ ట్రిప్పులు వేసినట్లు రికార్డుల్లో ఉన్నా తమనే టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కులం పేరుతో తిట్టి కాళ్లతో తన్నాడు.. బిల్లు రాయించుకుని లోడింగ్ చేసుకునేందుకు వెళ్లిన నన్ను పిలిచి మాదిగ లం..కొ..ల్లారా అంటూ జుట్టు పట్టుకుని (రాయలేని భాషలో తిడుతూ) చెంపల మీద కొట్టి కిందపడేసి బూట్లతో కడుపులో గట్టిగా తన్ని ‘నా కొ.. ఉద్దండరాయునిపాలెం మా.. నా కొ.. ఊళ్లో ఒక్కడినీ ఉండనివ్వను’ అంటూ నానా మాటలన్నాడు. – ప్రసన్నకుమార్, ట్రాక్టర్ డ్రైవర్ రౌడ్షీట్ ఓపెన్ చేసి బొక్కలో.. నాపై గతంలో టీడీపీ వాళ్లు పెట్టిన కేసు విషయంలో స్టేషన్కు పిలిపించి ఏ కులం అని అడిగి.. ‘మా.. నా కొ.. మీకు ఎక్కడవిరా ఈ లారీలు? నీ మీద 9 కేసులున్నాయి. ఇంకోసారి కనబడితే ‘నా కొ.. నీ మీద రౌడీïÙట్ ఓపెన్ చేస్తానంటూ చెప్పలేని మాటలతో దూషించాడు. – నందిగం మణికంఠ -
పగలు తోడేస్తూ.. రాత్రి తోలేస్తూ..
జగ్గయ్యపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఆపేవారే కనబడకపోవడంతో సరిహద్దులు దాటిపోతోంది. ఉచిత ఇసుక పథకం అక్రమార్కుల జేబులు నింపుతోంది. మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్ నుంచి జూలై 8న ఇసుక విక్రయాలు ప్రారంభించింది. మొత్తం 81వేల టన్నుల ఇసుకను ఈ ప్రాంతంలోని లబ్ధిదారులకు ఇచ్చేందుకు టన్ను రూ.290 చొప్పున ధర నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు విక్రయిస్తోంది. ఇందు కోసం ఇక్కడ రెవెన్యూ, పంచాయతీ, ఎస్ఈబీ అధికారులను నియమించారు. ఇసుక ప్రారంభం నాటి నుంచి నేటి వరకు 16,800 మెట్రిక్ టన్నులు ఇసుక విక్రయించినట్లు అధికారులు చెబున్నారు. అయితే ఇందులో కొన్ని వందల టన్నులు తెలంగాణకు తరలినట్టు సమాచారం.తెలంగాణకు తరలింపు ఇలా..స్టాక్ పాయింట్ వద్ద కొందరు అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుకను రవాణా చేసేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించారు. ఈ ప్రాంతం తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో ఏ గ్రామం నుంచి చూసినా 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణ సరిహద్దు గ్రామాలు కనిపిస్తాయి. దీంతో అక్రమార్కులు ఇసుకను సామాన్యులకు అందనీయకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు 10 నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఇసుకను రహస్య ప్రదేశాలకు తరలిస్తారు.అధికార పార్టీ నేత హవా?స్టాక్ పాయింట్ వద్ద గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు తన హవా కొనసాగిస్తున్నారు. తన గ్రామంలో స్టాక్ పాయింట్ ఉండటంతో గ్రామానికి ప్రతి రోజు 30 ట్రాక్టర్ల ఇసుక తను చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేయడంతో అధికారులు కూడా ఆయనకు తలొగ్గి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక ఒక్కో ట్రాక్టర్ నుంచి సదరు నాయకుడికి రూ.200 ఇస్తున్నట్లు కూడా సమాచారం.ఉదాసీనంగా అధికారులు..అక్రమంగా తరలిపోతున్న ఇసుకను నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ముఖ్యంగా స్టాక్ పాయింట్ వద్ద అనుభవం లేని పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులను నియమించడంతో కూపన్లు జారీ చేసి విషయంలో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వే బిల్లుపై 2 నుంచి 3 సార్లు ఇసుకను తీసుకువెళ్తున్నారు. కనీసం వీటి పర్యవేక్షణకు సిబ్బంది లేకపోవడంతో ప్రతి రోజు 20 నుంచి 80 టన్నుల ఇసుక అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఎస్ఈబీ అధికారులు సమాచారం ఇస్తే తప్ప నియంత్రణ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఏపీ ఇసుకకు మంచి డిమాండ్..తెలంగాణలో మునేరు, కృష్ణా ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. ఒక లారీ ఇసుక రూ.30వేలు నుంచి రూ.70వేల వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇసుక కొరత ఉండటంతో ఏపీ ఇసుక కోసం ధర ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.చెక్పోస్ట్లు ఉన్నా..65వ నంబర్ జాతీయ రహదారి రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన ముక్త్యాల, గండ్రాయి, అన్నవరం గ్రామాల్లో చెక్ పోస్టులు ఉన్నప్పటికీ తూతూ మంత్రంగానే సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ముక్త్యాల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది ఉన్నప్పటికీ అనుమంచిపల్లి స్టాక్ పాయింట్ నుంచి తెలంగాణ రాష్ట్రం వజినేపల్లికి ఓ ట్రాక్టర్ ఇసుకలోడు సిబ్బంది కనుచూపులోనే వెళ్లింది. సమీపంలోని తెలంగాణ బుగ్గ మాధవరం చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక తరలి వెళ్లడం గమనార్హం. -
ఇసుక పేరుతో పచ్చ మోసం
తిరుపతికి చెందిన శ్రీనివాసరావు ఆటోనగర్ సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది కదా అని గురువారం ట్రాక్టర్ తీసుకుని పాడిపేట వద్ద స్వర్ణముఖి నదికి వెళ్లారు. అక్కడ ఇసుక తీసుకునేందుకు అనుమతి లేదని స్థానికులు చెప్పారు. దీంతో ఇసుక అనుమతి కోసం తిరుపతి, రేణిగుంట తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లారు. వెంకటగిరి లేదా నాగాలాపురం, పిచ్చాటూరు మండలాల్లోని అధికారిక రీచ్లకు వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక శుక్రవారం ఉదయం ముందుగా వెంకటగిరి మండలం మోగళ్లగుంటలోని రీచ్కు కారులో చేరుకున్నారు. అక్కడ ఇసుక నిల్వ లేకపోవడంతో దొరవారిసత్రం మండలం మావిళ్లపాడులోని ఇసుక రీచ్కు వెళితే మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఉసూరుమంటూ నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగకు చేరుకున్నా అక్కడా ఇసుక లేదు. ఇక మిగిలిన పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు రీచ్కు వెళితే ఇసుకైతే ఉంది కానీ.. డంప్ యార్డు వద్ద అధికారులెవ్వరూ లేరు. కాపలాగా ఓ కానిస్టేబుల్ ఉన్నారు. ఇసుక కోసం వచ్చిన సుమారు 100 టిప్పర్లు ఉదయం నుంచి వేచి ఉన్నాయి. రాత్రి వరకు ఎదురుచూసి తిరిగి తిరుపతికి వచ్చేశారు. శ్రీనివాసరావు తన కారుకి రూ.2,500 పెట్రోల్ పట్టుకుని రోజంతా సుమారు 350 కిలోమీటర్లు ప్రయాణించి తిప్పలు పడినా చివరకు ఇసుక దొరకలేదు. కుప్పం పట్టణానికి చెందిన మురుగప్ప అసంపూర్తిగా నిలిచిపోయిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు అప్పుచేశాడు. ఈనెల 9వ తేదీన పనులు ప్రారంభించాడు. నిర్మాణ పనుల కోసం ఇసుక తెచ్చుకునేందుకు ప్రయతి్నంచాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్కారు ఏర్పాటు చేసిన రీచ్ల వద్దే ఇసుక కొనుగోలు చేయాలి అని అధికారులు స్పష్టం చేశారు. కుప్పానికి సమీపంలో ఇసుక తెచ్చుకునేందుకు అనుమతులు లేవని తెగేసి చెప్పారు. దీంతో సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని గంగవరం మండలం నాలుగురోడ్ల కూడలి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్కు వెళ్లాడు. తీరా అక్కడ రీచ్లో ఇసుక లేదు. తిరిగి వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉట్టి చేతులతో ఇంటికి వచ్చేశాడు. చివరకు చేసేది లేక కుప్పం సమీపంలో తయారుచేసే కృత్రిమ ఇసుకను అధిక ధరకు కొనుగోలు చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించుకున్నాడు.శ్రీకాళహస్తికి చెందిన రమేష్బాబు స్వగృహ నిర్మాణం చేపట్టాడు. పట్టణానికి సమీపంలోని విరూపాక్షిపురం, పెన్నలపాడులో ఇసుక దొరుకుతుందని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. టిప్పర్ ఇసుక తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. వెంటనే అక్కడున్న టీడీపీ నేతల అనుచరులు అడ్డుకున్నారు. ‘మీరంతా నదిలో యంత్రాలతో తవ్వి ఇసుక తరలిస్తున్నారు కదా.’ అని రమేష్బాబు ప్రశ్నించడంతో కొట్టినంత పనిచేశారు. మరి ఇసుక కావాలంటే ఏం చేయాలని అడిగితే టిప్పర్ ఇసుకకు రూ.25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము అడిగినంత సొమ్ము ఇస్తే ఇసుకను ఇంటికే చేరుస్తామని స్పష్టం చేశారు. ఇసుక ఉచితమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కదా అని రమేష్బాబు అడిగితే.. అదంతా తమకు తెలియదని, నగదు కడితేనే ఇసుక పంపుతామని తేలి్చచెప్పారు. అక్కడి నుంచి పలువురికి ఫోన్చేసి ఇసుక గురించి ఆరా తీసినా ఎక్కడా ఉచిత ఇసుక దొరకదని, టీడీపీ వాళ్లే విక్రయిస్తున్నారని తెలియడంతో చేసేదిలేక రమేష్బాబు రూ.25వేలు చెల్లించి టిప్పర్ ఇసుక కొనుగోలు చేసుకున్నాడు.‘‘మీ ఊరి దగ్గర వాగు ఉందా..? కాలువ ఉందా..? నది ఉందా..? అక్కడకు వెళ్లి తట్టలతో తెచ్చుకుంటారో.. ఎద్దుల బండిలో తెచ్చుకుంటారో.. కావాల్సినంత ఇసుకను ఉచితంగా తీసుకెళ్లండి.. ఎవరు వద్దంటారు..? పైసా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.’’ అని చాలా తేలిగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించేశారు. అంతలోనే బండిలో ఇసుక తరలించడం నిషేధం అంటూ ప్లేటు మార్చేశారు. ఎప్పటికప్పుడు ఉచిత ఇసుక అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు. దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు.. ఇసుక కోసం వెళ్లిన వారికే లోగుట్టు తెలుస్తోంది. ఉచితం పేరిట టీడీపీ నేతల అనుచిత వైఖరి అర్థమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీచ్లలో మాత్రం ఇసుక రేణువు కూడా ఉండదు. అదే పచ్చమూక అనధికారికంగా పాగా వేసిన పాయింట్లలో మాత్రం కావాల్సినంత ఉంటుంది. అక్కడ వాళ్లు చెప్పిందే రేటు.. అడిగినంత చెల్లిస్తేనే పనవుతుంది. ఉచిత ఇసుక అంటూ ఊదరగొడుతూ జనం చెవిలో పువ్వులు పెడుతున్న కూటమి సర్కారు నాటకాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వం ఏడు ఇసుక రీచ్లను అధికారికంగా ఏర్పాటు చేసింది. అయితే వాటిలో కేవలం మూడు రీచ్లలో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. తిరుపతి జిల్లా పిచ్చాటూరు అడవికోయంబేడు, చిత్తూరు జిల్లా గంగవరం మండలం నాలుగురోడ్ల కూడలి, చిత్తూరు రూరల్ మండలం దిగువమాసపల్లె, పాలూరులో మాత్రమే ఇసుక నిల్వలు ఉన్నాయి. మిగిలిన నాలుగు రీచ్లలో ఇసుక డంప్లు లేవు. ప్రభుత్వం ఉచితమంటూ ప్రకటించిన రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఇసుక డంప్చేశారు. తర్వాత ఖాళీ అయిన రీచ్లలో ఇసుకను మళ్లీ డంప్ చేయలేదు. యథేచ్ఛగా ట్రాక్టర్లతో ఇసుక తరలింపు అడిగినంత చెల్లిస్తేనే.. ప్రస్తుతం మూడు రీచ్లలో ఉన్న ఇసుక కోసం వెళ్లిన వినియోగ దారులకు నిర్వాహకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టన్ను ఇసుక రూ.155 లెక్కన ట్రాక్టర్ (ఐదు టన్నులు)రూ.775 అవుతుంది. బాడుగ 0–10 కిలోమీటర్ల అయితే రూ.1,200. అదే టిప్పర్ ఇసుక అయితే రూ.1,550. దూరం పెరిగే కొద్దీ వాహనం బాడుగ పెరుగుతుంది. ఇదిలా ఉంచితే.. టీడీపీ నేతలు ఒక వాహనానికి అదనంగా రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని అధికారులతో కలిసి వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. పిచ్చాటూరు మండలం అడవికోయంబేడులో అదనపు వసూళ్లకు పాల్పడడంతో వినియోగదారులు నిలదీశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు శుక్రవారం ఇసుకను విక్రయాలు నిలిపివేసినట్లు సమాచారం. ఫలితంగా వందలాది వాహనాలు రోజంతా వేచి ఉండాల్సి వచ్చింది. పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు రీచ్లో ఇసుక నింపకపోవడంతో బారులు తీరిన వాహనాలు ఊరూరా అక్రమ రీచ్లు! ప్రభుత్వ రీచ్లలో ఇసుక లేకుండా చేసి.. కూటమి నేతలు సొంతంగా ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు. చంద్రగిరి నుంచి నాయుడుపేట వరకు స్వర్ణముఖి నదీ తీరంలో టీడీపీ నేతల అనధికారికంగా రీచ్లే కనిపిస్తున్నాయి. భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కంటైనర్ల ద్వారా చెన్నై, బెంగుళూరుకు తరలించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. మరో వైపు రైతులను బెదిరించి వారి భూముల్లోని ఇసుకను సైతం తవ్వేసి విక్రయించేస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజక వర్గాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. రెండు రోజుల క్రితం తిరుపతి రూరల్ మండలం పాడిపేట వద్ద, ఏర్పేడు మండలం పెనుమల్లం వద్ద వెలుగుచూసిన టీడీపీ నేతల బాగోతమే ఇందుకు నిదర్శనం. డీకేటీ పట్టాలు పొందిన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో టీడీపీ నేతలు దౌర్జన్యంగా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి వందలాది వాహనాల ద్వారా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అదే విధంగా శ్రీకాళహస్తి మండల పరిధిలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.7వేలకు విక్రయించి డబ్బులు పోగేసుకుంటున్నారు. టిప్పర్ అయితే రూ.25వేల నుంచి రూ.36వేలకు విక్రయించేస్తున్నారు. చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు అయితే లోడ్ ఇసుక రూ.లక్షపైనే ఉంటుందని అంచనా.పాడిపేట వద్ద స్వర్ణముఖిలో ఇసుక తవ్వకాలకు వచ్చిన టీడీపీ వారిని అడ్డుకున్న స్థానికులు(ఫైల్) వెలుగులోకి మరో మోసం ఇసుక ఉన్న రీచ్ల వద్ద అధికారులు, టీడీపీ నేతలు లాలూచీ పడి ఎవరికీ అనుమానం రాకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. 10 టన్నులకు చలానా కట్టి టిప్పర్లో 15 టన్నులు ఇసుక నింపి సొమ్ముచేసుకుంటున్నారు. అలాగే 4 టన్నులకు రశీదు వేసి ట్రాక్టర్లో 5 టన్నుల ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు.తట్టలతో ఇసుక లోడ్ చేస్తున్న కూలీలు తమ్ముళ్లవైతే కేసే లేదు!టీడీపీకి చెందిన వారు ఎక్కడైనా ఇసుకను తవ్వి తరలించుకెళ్లినా అధికారులు పట్టించుకోరు. ఇంకొకరు చలానా కట్టి ఇసుక తీసుకెళుతున్నా కేసులు తప్పవు. శ్రీకాళహస్తి పరిధిలో ఓ వ్యక్తి రూ.1,200 చెల్లించి ట్రాక్టర్ ఇసుక తీసుకెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పైసా కట్టకుండా రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారు. ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాలను స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత ఒకరు పోలీసులకు ఫోన్ చేయటంతో తెలుగు తమ్ముళ్లను మాత్రం రాచమర్యాదలు చేసి విడిచిపెట్టేశారు. ప్రభుత్వానికి నగదు చెల్లించి ఇసుక తరలించిన వ్యక్తిపై మాత్రం కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేయడం గమనార్హం.రాచ‘మార్గం’లో.. అక్రమార్జన కోసం టీడీపీ నేతల కుయుక్తులు అన్నీ ఇన్నీ కావు. ఇసుక తవ్వకాల కోసం ఏకంగా స్వర్ణముఖి నదిలోకి పలు ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేసేశారు. నేరుగా నది మధ్యలోకే వెళ్లేలా దారులు వేసేశారు. ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు సులువుగా సజావుగా బయటకు వచ్చేలా ఆయా మార్గాలను రూపొందించారు. ఈ క్రమంలోనే యంత్రాలు అందుబాటులోని చోట్ల ఇసుక లోడ్ చేసేందుకు కూలీలను వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనానికి ఇంత అని కూలి చెల్లించి.. అది కూడా ఇసుక కొనుగోలు చేసేవారిపైనే భారం మోపుతున్నారు. ఏది ఏమైనా కాసులు మూటగట్టుకోవడమే లక్ష్యంగా నదీమతల్లికి గర్భశోకం కలిగిస్తున్నారు. -
రాజకీయ పాలనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక రాజకీయ పాలనే ఉంటుందని, అధికార యంత్రాంగం అందుకనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక రవాణా వ్యయం ఐదు రెట్లు పెరిగిందని, రవాణా చార్జీలు పెరిగినా తామే పెంచామనుకుంటారని చెప్పారు. సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకుని రవాణా చార్జీలు సైతం చెల్లించవచ్చన్నారు. వినియోగదారుడికి ఇసుక అందినట్లు నిర్థారించుకున్నాకే రవాణా ఛార్జీలు ట్రక్కు యజమానికి విడుదలయ్యే పద్ధతి తెస్తామన్నారు. ఇసుక తరలించే ట్రక్కులను ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఊబరైజేషన్ చేస్తామన్నారు.లారీలు ఇసుక రీచ్ల దగ్గరకు వచ్చి రెండేసి రోజులు ఉండకూడదన్నారు. బడి మానేసిన పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలోనూ చేర్పించాలని నిర్దేశించారు. రోడ్లు అన్నీ పీపీపీ విధానంలోనే నిర్మాణం చేపట్టాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్నకు ఆకాశమే హద్దని, అమరావతిలో ప్రత్యేకంగా ఒక పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.రోడ్ల నిర్వహణను 50 కి.మీ. చొప్పున అవుట్ సోర్సింగ్కు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలనూ అవుట్ సోర్సింగ్కు అప్పగించాలన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రైవేట్ రంగంలో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కొనసాగించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో శాఖల వారీగా సీఎం సమీక్షించారు. సమావేశం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు కొనసాగింది. అనంతరం సచివాలయం గార్డెన్లో కలెక్టర్లకు విందు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే చర్యలుసహజ వనరులైన ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ఇబ్బందులను తొలగించాలని అంతకుముందు సమావేశంలో సీఎం సూచించారు. ఉచిత ఇసుకపై సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రవాణా చార్జీలు పెరగకుండా రీచ్లను దగ్గరగా ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సహజ వనరుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.ఇసుక రీచ్లో ఏం జరిగిందో సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెప్పాలని, లేదంటే మీకు ఇబ్బందులు వస్తాయని కలెక్టర్లకు స్పష్టం చేశారు. గత సర్కారు పాలనలో ఇసుక దోపీడీపై సీఐడీతో విచారణ జరిపి తప్పుచేసిన వారిని శిక్షిస్తామన్నారు. వరదను ఒడిసిపట్టి తక్షణమే రిజర్వాయర్లను నింపాలని జలవనరులపై సమీక్షలో ఆదేశించారు. ఎక్కడైనా గేట్లు కొట్టుకుపోతే ఏఈ, డీఈని డీమ్డ్ సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. డ్రాప్ అవుట్స్ సున్నాకు రావాలిబడికి వెళ్లే పిల్లలకు కిట్స్ ఇవ్వడం ఇప్పటికే మూడు నెలలు జాప్యమైందని, వీలైనంత త్వరగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైన ఏజెన్సీని పక్కనబెట్టాలని ఆదేశించారు. డ్రాప్ అవుట్స్ సున్నాకు రావాలన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పామని, అందుకోసం ప్రైవేట్లో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా 5–10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రోడ్లు అన్నీ పీపీపీలోనేరహదారులన్నీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టాలని, రాష్ట్ర హైవేలన్నీ కూడా పీపీపీలోనే ఉండాలని సీఎం చెప్పారు. పీపీపీలో విధానంలో చేపట్టేందుకు 14 ప్రాజెక్టులను గుర్తించామని అధికారులు పేర్కొనగా ఇంకా పాత మూసలోనే ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. టోల్ గేట్లు ఏర్పాటు ద్వారా వ్యయం రాబట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించి ఒక్క ఫిర్యాదు రాకూడదన్నారు.వైద్య సేవలు అవుట్ సోర్సింగ్ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 20 సేవలకు పైగా అవుట్ సోర్సింగ్కు ఇచ్చామని, ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్కు వైద్య సేవలను అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలో కాకుండా ఈపీసీ విధానంలో చేపట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈపీసీ విధానంలో పోర్టుల నిర్మాణానికి డబ్బులు, గ్యారెంటీ ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడు తాను వెనక్కు వెళితే చెడ్డపేరు వస్తుందని, అందువల్ల వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.డ్రోన్లతో డ్రైనేజీల పూడికల గుర్తింపుసోలార్ పవర్కు భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, మడకశిర ప్రాంతంలో నాలుగైదు వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని సీఎం చెప్పారు. దీన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాన్నింటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 1,000 నుంచి 2,000 ఫీడర్లలో సోలార్ పవర్ ద్వారా వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తెస్తామన్నారు. గతంలో దోమల నివారణకు డ్రోన్స్ వినియోగించామని, ఇప్పుడు డ్రైనేజీల పూడికలు, రహదారుల మరమ్మతులను డ్రోన్స్ ద్వారా గుర్తించాలని సీఎం సూచించారు. జిల్లాకో జాయింట్ కలెక్టర్ను అదనంగా నియమించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్కు సూచించారు. ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం..రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ నిర్మించి ఇస్తామని సీఎం చెప్పారు. పీఎంఏవై–అర్బన్, రూరల్, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ తదితర పథకాల కింద 9,11,594 గృహాలు పెండింగ్లో ఉండగా, 5,74,710 ఇళ్ల నిర్మాణం అసలు చేపట్టలేదన్నారు. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకుంటామన్నారు. 25 లక్షల ఇళ్లు కడతానని గొప్పగా చెప్పి కేవలం 7 లక్షలు మాత్రమే చేపట్టారన్నారు. నీరు – చెట్టు, ఉపాధి హామీ పెండింగు బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. సంపద సృష్టించండి.. వంద రోజుల్లో మార్పుకలెక్టర్లు, అధికారులు వినూత్న ఆలోచనతో సంపద సృష్టించాలని సీఎం సూచించారు. అక్టోబర్ 2న రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు. జిల్లాల్లోనూ కలెక్టర్లు విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలన్నారు. సెప్టెంబర్ 20న ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయ్యేనాటికి మార్పు కనిపించాలని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గరా ఉంటుందని తెలిపారు. సమర్థులైన అధికారులు గత ఐదేళ్లలో నిర్వీర్యమైపోయారని చెప్పారు. తాను కూడా మళ్లీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని, గతంలో స్పీడు మళ్లీ చూపిస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. తనకు వచ్చిన ఐదు వేల పిటిషన్లలో సగం భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష గత ప్రభుత్వంలో బటన్ నొక్కడం మినహా ప్రజలను పరామర్శించలేదన్నారు. పేదరికాన్ని సున్నాకి తీసుకురావడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి శనివారం సీఎంవో పనితీరుపై సమీక్ష చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు చెప్పే అంశాలను కలెక్టర్లు, అధికారులు వినాలని స్పష్టం చేశారు. త్వరలో పరిపాలనకు సంబంధించి ఒక యాప్ తెస్తామని తెలిపారు. ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేసి ఏపీలో 36 మందిని చంపామని ఆరోపణలు చేశారని, నిజంగా అలా జరిగి ఉంటే ఎఫ్ఐఆర్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. అడవులంటే పవన్కు ఇష్టం.. 2014–19 మధ్య ఉచితంగా నిర్వహించిన భూసార పరీక్షలను మళ్లీ మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం పేర్కొన్నారు. అడవులంటే పవన్ కల్యాణ్కు చాలా ఇష్టమని, వాటి విస్తీర్ణం పెంచాలని సూచించారు. ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవాన్ని చీరాలలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదన్నారు. గత ఐదేళ్లుగా స్వచ్ఛ భారత్ నిధుల యూసీలు ఇవ్వలేదని కేంద్ర అధికారులు తనకు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. కొత్త లిక్కర్ పాలసీ..రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ గురించి ఆలోచించి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో ఏపీలోకి లిక్కర్ను అనుమతిస్తామన్నారు. తద్వారా మద్యం అక్రమ రవాణాను అరికడతామన్నారు. కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ, ఎంటర్ ప్రెన్యూర్ పాలసీ, ఎఫ్డీఐ, ఎంఎస్ఎంఈ, హార్డ్ వేర్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, స్టార్టప్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, పీపీపీ మోడల్లో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, వయబులిటీ గ్యాప్ ఫండింగ్, వాటర్, లాజిస్టిక్, యూత్, స్పోర్ట్స్ పాలసీలు తెస్తున్నట్లు ప్రకటించారు.జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఐదేళ్ల కిందట రూ.వందల కోట్లు ఖర్చు చేసి 15వేల కెమెరాలు ఏర్పాటు చేస్తే అవి ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసి కొట్టేసే పరిస్థితికి వచ్చారన్నారు. ఐదేళ్లలో జరిగిన తప్పులను వెలికితీసి శిక్షిస్తామన్నారు. ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ అంటూ వాహనాలు తెచ్చి రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టారు. రేషన్ పంపిణీకి 15రోజుల పాటు ఇద్దరిని నియమించి వారికి జీతాలు ఇచ్చారు. పంపిణీ పూర్తయ్యాక ఆ వాహనాలను మళ్లీ వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారు. రేషన్ దుకాణాలకు రాలేని వారి ఇంటికి వెళ్లి ఇవ్వాలి. కాకినాడలో ఒకే ఫ్యామిలీ నుంచి సివిల్ సప్లై శాఖకు సంబంధించి మూడు పదవులు నిర్వహిస్తున్నారు. దీంతో దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లయింది. ఇలాంటి వాటిని నియంత్రించాలి’ అని సీఎం పేర్కొన్నారు.రాజధానిలో పేదలకిచ్చిన 50,800 ఇళ్ల స్థలాలు రద్దు!వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, గుంటూరు వాసులకు రాజధాని అమరావతిలో ఇచ్చిన ఇళ్ల స్థలాల స్థానంలో ప్రత్యామ్నాయంగా మరోచోట ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్లోని ఆర్–5 జోన్లో లేఅవుట్లు వేసి సుమారు 50,800 మందికి ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి లబ్ధిదారులకు వారి ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలన్నారు. అవసరమైతే టిడ్కో తరహా ఇళ్లను నిర్మించి, ప్రథమ ప్రాధాన్యం వారికే ఇవ్వాలని పేర్కొన్నారు.సార్.. హామీలు నెరవేర్చండిసీఎం చంద్రబాబు సమావేశం సందర్భంగా లైవ్లో విన్నపాలు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సమావేశాన్ని సమాచార శాఖ యూట్యూబ్ లింక్ ద్వారా లైవ్ ఇచ్చింది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన పలువురు పలు సమస్యలను వివరిస్తూ కామెంట్లు పెట్టారు. సీఎం సార్.. హామీలు నెరవేర్చండంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుని చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ‘వీజీఎన్’ అనే పేరుతో కామెంట్ చేశారు.ఎంఎల్హెచ్పీలకు జీతాలు రాలేదంటూ విజయ్కుమార్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పేదలకు స్థలాలు, ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని గౌరి నాయుడు కోరాడు. ప్రతి ఇంటికి ఉచిత విద్య, వైద్యం అందించే దిశగా విద్యా సంస్థలు, ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని చంద్రధర్ అనే వ్యక్తి సూచించాడు. కేజీబీవీ టీచర్ల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ సమస్యలను కొందరు ప్రస్తావించారు.వ్యవస్థల బలోపేతంగత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చింది. వ్యవస్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. పంచాయతీల బలోపేతానికి అందరూ సహకరించాలి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. పిఠాపురంలో ద్రవ వ్యర్థాల నిర్వహణను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. – పవన్ కళ్యాణ్, ఉపముఖ్యమంత్రిత్వరలో ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని సవరిస్తాం. గత ప్రభుత్వ పాలనలో 9 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించగా అందులో దాదాపు 25 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మాకు అందే విజ్ఞప్తుల్లో 80 శాతం రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయి. – అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రికలెక్టర్లకు వంద రోజుల ప్రణాళికరాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్లు సమర్థంగా అమలు చేయాలి. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుంటే ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చొరవ చూపాలి. – నీరభ్ కుమార్ ప్రసాద్, సీఎస్ -
ఇసుక ధర పెంపు.. కొనుగోలుదారుల నిరసన
భీమునిపట్నం/అగనంపూడి (విశాఖ): ఒక పక్క ప్రభుత్వం ఇసుక ఉచితమని ప్రకటనలు గుప్పిస్తూ.. మరోవైపు భారీ మొత్తంలో వసూలు చేస్తుండటంపై ఇప్ప టికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. అయినా రేటు రోజురోజుకు పెంచేస్తున్నారు. బుధవారం భీమిలి ర్యాంపు వద్ద ఒక్కసారిగా టన్నుకు రూ.318 పెంచడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఒకటే ధర ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో కలెక్టర్ సారథ్యంలోని కమిటీ ధరలను సమీక్షించింది. అగనంపూడి, భీమిలి డిపోల్లో టన్ను రూ.1,076 కు విక్రయించాలని నిర్ణయించింది. దీంతో భీమిలి వద్ద ధర పెరగ్గా, అగనంపూడి డిపోలో అంతే స్థాయిలో ధర తగ్గింది. భీమిలి వద్ద మంగళవారం టన్ను రూ.758కి ఇవ్వగా, బుధవారం ఒక్కసారిగా రూ. 1076కు పెరగడంతో కొనుగోలుదారులు నిరసనకు దిగారు. ఉచిత ఇసుకపేరుతో ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డుపై రోజుకు 20 టన్నులు ఇస్తున్నారు. రవాణా ఖర్చులు కొనుగోలుదారులే భరించాలి. దీంతో ఇసుక భారం మోయలేనంతగా పెరిగింది. ఉచితమని ప్రకటించి ప్రభుత్వం ఇలా డబ్బులు వసూలు చేస్తున్నా గత్యంతరం లేక విశాఖ, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల వారు భీమిలి వద్ద ఇసుక కొంటున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వారంతా షాక్ తిన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా పెంచేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి లారీలు తెచ్చామని, ఇప్పుడు పెరిగిన రేటుకు ఇసుకను కొనలేక ఖాళీ లారీలతో వెనక్కి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితమన్న పేరుతో ఇలా దోచేస్తే ఇళ్లెలా కట్టుకొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరను తగ్గించి ఇసుకను అందివ్వాలని డిమాండ్ చేశారు.ఒక్కసారిగా పెంచేస్తే ఎలా కొనగలం?ఇసుక ధరను ఇలా పెంచుతారని ఎవరూ ఊహించలేదు. ఉదయం ర్యాంపు వద్దకు లారీలు తీసుకొస్తే... రేటు పెంచినట్టు తెలిపారు. టన్నుకు రూ.300 పైనే పెంచేశారు. ఉచితమని చెబుతూ ఇలా రేటు ఒక్కసారిగా పెంచేస్తే తట్టుకునే పరిస్థితి లేదు. – తుపాకుల సురేష్, మజ్జివలసఉచితమని ప్రకటించడం ఎందుకు?ఇసుక ధర ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించడం ఎందుకు? కనీసం పాత ధరకు కూడా ఇవ్వకుండా కొద్ది రోజుల్లోనే ధర ఇలా పెంచేయడం పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? – జి.శ్రీను, ఆనందపురం -
ఉచితం అన్నారు.. దోచేస్తున్నారు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేశాం. ఫలితంగా ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.765 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,825 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో ఈ ఆదాయం అంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఎవరెవరు ఎంత పంచుకున్నారో చెప్పగలరా?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా, సామాన్య ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందుబాటులో ఉండేలా చూస్తే అవినీతి జరిగిపోయిందంటూ లేనిపోని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని నమ్మబలికి, తీరా ఇప్పుడు ఉచిత ఇసుక మచ్చుకైనా కన్పించని విధంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇసుక పాలసీపై చంద్రబాబు విడుదల చేసిన వైట్ పేపర్పై జగన్ ఫ్యాక్ట్ పేపర్ ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే.. ఏ రేటుకు అమ్మాలో పత్రికల్లో ప్రచారం చేసే వాళ్లంఉచిత ఇసుక పేరిట జరిగిన దోపిడీకీ అడ్డుకట్ట వేస్తూ 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అత్యంత పారదర్శకంగా ఇసుక పాలసీని తీసుకొచ్చాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా టెండర్లు పిలిచాం. ఈ టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు. చంద్రబాబు, రామోజీ మనుషులే కాదు.. ఎవరైనా నేరుగా పాల్గొనే అవకాశం ఉంది. 2 కోట్ల మెట్రిక్ టన్నుల మినిమమ్ గ్యారంటీ పెడుతూ ఏటా రూ.765 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కట్టేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా ఐదేళ్లలో రూ.3,825 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. పైగా ప్రతి టన్నుకు రూ.375 చొప్పున ముందుగా ప్రభుత్వానికి రాయిల్టీ చెల్లించిన తర్వాతే ఇసుక తవ్వే కార్యక్రమం చేపట్టాం. ఇలా తవ్విన ఇసుకను రీజనబుల్ ట్రాన్స్పోర్టు చార్జీతో కలిపి ఏ నియోజకవర్గంలో ఏ రేటుకు విక్రయించాలో ప్రజలందరికీ తెలిసేలా ప్రతి ఆదివారం పత్రికల ద్వారా ప్రచారం చేశాం. నిర్దేశించిన ధరకు ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాం. తప్పు చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా అంటూ ప్రతి వారం పత్రికల్లో ప్రచారం చేశాం.40 లక్షల టన్నుల ఇసుక కాజేశారు వర్షా కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ముందు చూపుతో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేస్తే ఎన్నికల్లో ఆ యార్డుల వద్దకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ వెళ్లి సెల్ఫీలు దిగారు. ఇసుకగుట్టలు చూపించి లేనిపోని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడా ఇసుక గుట్టలు, కొండలు ఏమైపోయాయి? అధికారంలోకి వచ్చీ రాగానే ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు మనుషులు ఎడాపెడా అమ్మేసుకున్నారు. వాళ్లపై యాక్షన్ తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఈ రోజు ఉచిత ఇసుక అని చెప్పిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన రేటు కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. వైఎస్సార్సీపీ హయాంలో టన్నుకు రూ.375 చొప్పున ఏటా రూ.765 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే నేడు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అలాగని ఉచిత ఇసుక అమలవుతుందా.. అంటే అదీ లేదు. ఎడాపెడా దోచుకుంటున్నారు. ఇసుక రేట్లు చూస్తుంటే వైఎస్సార్సీపీ హయాంలోనే మేలు.. అప్పుడే రేట్లు తక్కువగా ఉన్నాయని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. ఎక్కడా స్టాక్ లేదు. దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. కళ్లెదుట దోపిడీ కనిపిస్తుంటే వేరొకరిపై వేలెత్తి చూపిస్తున్నారు. -
తమ్ముళ్లే ఇసుకాసురులై..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ పెద్దలే ఇసుకాసురుల అవతారమెత్తారు. ఎన్టీఆర్ జిల్లాలోని స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలను యథేచ్ఛగా తోడేస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాల్లో మాత్రమే ఇసుక లోడ్ చేస్తూ కాసులు దండుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కానర్ వద్ద తిష్టవేసి భవన నిర్మాణదారులకు ఇసుక దొరకనివ్వడం లేదు. స్టాక్ పాయింట్లలో స్కానర్లు పని చేయడం లేదని బుకాయిస్తూ సామాన్యులకు ఇసుక దొరక్కుండా చేస్తున్నారు. ఇదేమని ఉద్యోగులు ప్రశ్నిస్తే.. ఉద్యోగం చేయాలంటే తాము చెప్పింది వినాలని, లేకపోతే ఉద్యోగం ఉండదని బెదిరిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న రెవెన్యూ, మైనింగ్ శాఖల కిందిస్థాయి ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహించలేమని వాపోతున్నారు. రవాణా వాహనాలూ వారివేనందిగామ సమీపంలోని కీసర స్టాక్ యార్డు పూర్తిగా నందిగామ మండల టీడీపీ నేత చేతుల్లో ఉంది. అక్కడ ఇసుక లోడుచేసే జేసీబీలు మొదలు ఇసుక రవాణాచేసే వాహనాలన్నీ టీడీపీ నేతలవే ఉండేలా పెత్తనం చేస్తున్నారు. వాస్తవానికి కూపన్ తీసుకున్నా.. అనధికారికంగా ప్రొక్లెయిన్ ఉపయోగించి రూ.700 వసూలు చేస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల నుంచి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నారు. తాము చెప్పిన వారికే ఇసుకపోయాలని అక్కడి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితే అనుమంచిపల్లె స్టాకు యార్డు వద్ద నెలకొంది. గ్రామస్థులు కొందరు మహిళలకు కూలీ ఇచ్చి క్యూలో నిలబెట్టి కూపన్లు పొందుతున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కీసర స్టాక్ యార్డు నుంచి భారీ ఎత్తున ఇసుకను లోడ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారు.ఒకే బిల్లుపై మూడు ట్రిప్పులుటీడీపీ నేతలు స్టాక్ పాయింట్ల వద్ద తిష్టవేసి ఉదయం 20 వేల టన్నులకు ఒక బిల్లు తీసుకుంటున్నారు. ఆ బిల్లుతో ఇసుకను లోడ్ చేయించుకుని విజయవాడ పరిసర ప్రాంతాలకు మూడుసార్లు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. 20 టన్నులకు బదులు 36 టన్నుల వరకు లోడ్ చేసుకుని ఇసుకను లూటీ చేస్తున్నారు. టీడీపీ నేతలు, ప్రొక్లెయిన్ యజమాని కలసి ఒక్కో లారీ టిప్పర్కు అదనంగా ఇసుకను లోడ్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డుల వద్ద నిల్వ ఉంచిన ఇసుకను టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. 47 వేల టన్నులకు పైగా విక్రయంఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 7న ఉచిత ఇసుక ప్రారంభం కాగా.. అప్పటికి 5,54,361 టన్నుల ఇసుక నిల్వలు ఉండేవి. ఇప్పటికే దాదాపు 47 వేల టన్నులకు పైగా స్టాక్ యార్డుల నుంచి తరలించేశారు. రోజుకు 8 వేల నుంచి 9 వేల టన్నుల ఇసుక జిల్లాలోని యార్డుల నుంచి తరలిపోతోంది. ప్రస్తుత ఇసుక నిల్వలు కేవలం 30 నుంచి 40 రోజుల మాత్రమే సరిపోతాయి. వర్షాకాలంలో నది నుంచి ఇసుక తీసేందుకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ లోపు సిల్ట్ లేదా ఓపెన్ రీచ్లను గుర్తించకపోతే ఇసుక కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు ముందస్తుగానే యార్డుల నుంచి ఇసుకను డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలో 8 స్టాకు యార్డులున్నాయి. కృష్ణా జిల్లా స్టాకు యార్డులో ఇసుక నిల్వలు లేవు. ఎన్టీఆర్ జిల్లా నుంచే కృష్ణా జిల్లాకు ఇసుక తీసుకెళ్లాల్సి వస్తోంది.‘అక్రమ ఇసుక’లో మా వాటా ఏదీ?» శ్రీకాకుళం జిల్లా పెద్దసవళాపురంలో టీడీపీ సీనియర్ల ఆక్రోశం » వంశధార నదిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు» అక్రమ ఇసుక రవాణా అవకాశం చోటామోటా కార్యకర్తలకు అప్పగింత » తమకూ వాటా ఇవ్వాలంటూ నాయకులపై సీనియర్ల ఒత్తిళ్లు సాక్షి, టాస్క్ఫోర్స్: అక్రమ ఇసుక తవ్వకాలు, వసూళ్లు, రవాణాలో తమకు వాటా ఇవ్వడం లేదంటూ టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి టీడీపీకి సేవ చేసిన తమను పక్కనపెట్టి.. ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీలో చేరిన చోటామోటా కార్యకర్తలకు అవినీతిలో భాగస్వామ్యం కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక దందాలో తమకూ వాటా ఇవ్వాలంటూ నాయకులపై ఒత్తిడి చేస్తున్నారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని పెద్దసవళాపురం వద్ద ఉన్న వంశధార నదిలో నుంచి ఎలాంటి అనుమతి లేకుండా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ ఇసుకను ప్రతి రోజూ దాదాపు 20 ట్రాక్టర్ల ద్వారా.. వెన్నెలవలస వద్ద గల ఆశ్రమ పాఠశాల సమీప ప్రదేశానికి తరలించి నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఆ ఇసుకను ఇష్టారీతిన అమ్మేస్తున్నారు. ఇసుక కోసం వచ్చే ప్రతి ట్రాక్టర్ నుంచి రూ.100, టైరు బండ్ల నుంచి రూ.50 చొప్పున టీడీపీ కార్యకర్తలు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందా, రవాణాను నెల రోజుల కిందట పార్టీలో చేరిన వారికి అప్పగించారంటూ స్థానిక టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య లుకలుకలు వచ్చి.. ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు సమాచారం ఇవ్వడంతో ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి పోలీసులు మంగళవారం ఉదయం ఇసుక ర్యాంపు వద్దకు చేరుకున్నారు. కానీ అప్పటికే సమాచారం లీక్ అవ్వడంతో తెలుగు తమ్ముళ్లు ఇసుక రవాణా నిలిపేశారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ రమేశ్బాబును ప్రశ్నించగా.. ప్రతి రోజు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. మండలంలో ఇసుక ర్యాంపుల నిర్వహణకు ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.పెనుమూడి రేవులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు»రెవెన్యూ మంత్రి అండతో రెచ్చిపోతున్న కూటమి నేతలు» చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులురేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి రేవులో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అండదండలతో కూటమి నేతలు అక్రమార్జనకు తెగబడుతున్నారు. అనుమతి లేకుండా రేవు లోపలకు చొరబడి పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ట్రాక్టర్లలో లోడ్ చేసి పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. రేవు వద్ద ట్రాక్టర్లలో లోడ్ చేసినందుకు రూ.1500 నగదు, రేవు వద్ద నుంచి రేపల్లె పట్టణానికి చేరవేస్తే రూ.2500 నుంచి రూ.3000 వరకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తే దూరాన్ని బట్టి మరింత నగదు వసూలు చేస్తున్నారు. ఒక పక్క ఉచిత ఇసుక విధానం అంటూనే మరో వైపు పెనుమూడి రీచ్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి అమ్ముకుంటున్నారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటంలేదని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తహసీల్దార్ రవీంద్ర వివరణ ఇస్తూ పెనుమూడి ఇసుక రీచ్లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రీచ్ వద్ద తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే గ్రామ రెవెన్యూ అధికారిని ఆదేశించామని తెలిపారు. తవ్వకాలను అడ్డుకోవటంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. -
ఈ ఉచితం చాలా కాస్ట్లీ!
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసినా.. తెలుగు నిఘంటువులు,శబ్ద రత్నాకరం తిరగేసినా వాటిల్లో వాస్తవ అర్థాలే ఉంటాయి.కానీ సీఎం చంద్రబాబు డిక్షనరీ మాత్రం వేరే ఉంది. ప్రతి పదానికీ తనదైన అర్థాలు, నిర్వచనాలు ఉంటాయి! అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎలాగంటే.. ఉచితం అంటారు.. కానీ దానికో ధర ఉందంటారు! ఇసుక ఉచితంగా ఇస్తామంటూనే ఊరికే ఏదీ రాదంటారు మరి!! ఉచితం అంటే టీడీపీ పెద్దల దృష్టిలో అమ్మకమే. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ యార్డుల వద్ద బోర్డు పెట్టి మరీ టన్నుల చొప్పున బహిరంగంగా విక్రయిస్తున్నా సరే అది ఉచితంగా ఇవ్వడమే!సీనరేజి ఫీజు, తవ్వకం, లోడింగ్, ఇతర పన్నులతోపాటు రవాణా చార్జీలు కూడా వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించి కొన్నా సరే ఇసుకను ఉచితంగా ఇస్తున్నారనే చెప్పాలి. లేదంటే సీఎం చంద్రబాబుకు కోపం వస్తుంది. ‘ఉచితం అంటే మీ ఇంటికి నేనే ఫ్రీగా తీసుకొచ్చి ఇవ్వాలా?’ అని ఎదురుదాడి చేస్తారు. డబ్బులిచ్చి కొంటున్నాం..కదా అని ఎవరైనా వినియోగదారుడు ఉచితం కాదని చెబితే టీడీపీ శ్రేణులు చితకబాదినా దిక్కుండదు. ఎందుకంటే అది టీడీపీ సర్కారు ఉచిత విక్రయ పథకం కాబట్టి! – సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్పల్నాడులో పచ్చనేతలు చెప్పిందే ధరమాచర్లలో.. 30,000పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమ డంప్లు పెద్ద ఎత్తున ఉన్నాయి.కృష్ణానది, గుండ్లకమ్మ, వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి డంపింగ్ యార్డులలో నిల్వ ఉంచారు. ఇటీవల వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తలర్లపల్లిలో గుండ్లకమ్మ వాగు నుంచి టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఓ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. కొండమోడులో టన్ను ఇసుక ధర రూ.564లు ఉండగా, వినుకొండలో రూ.793లు ఉంది. వీటికి రవాణా చార్జీలు అదనం. తాళ్లాయపాలెం నుంచి గుంటూరుకు ఇసుక లారీ రావాలంటే రూ.15,000 పైనే అవుతోంది. మాచర్లలో 18 టన్నుల ఇసుక రవాణాతో కలిపి రూ.30వేలు అవుతోంది.కడపలో కొల్లగొట్టేస్తున్నారు.. మదనపల్లెలో..28,300వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఉచిత ఇసుక పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పోటాపోటీగా ఉచిత ఇసుకను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ వర్గీయులకు పోటీగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. మదనపల్లెకు 18 టన్నుల ఇసుక తరలించాలంటే రవాణా చార్జీలతో కలిపి రూ.28,300 వరకు ఖర్చవుతోంది. జమ్మలమడుగుకు అయితే రూ.20వేలకు పైగా అవుతోంది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా వేలల్లో ధరలుఎన్టీఆర్ జిల్లాలో..25,200ఉచిత ఇసుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రవాణా, లోడింగ్, సీనరేజీ, జీఎస్టీ చార్జీల పేరుతో స్టాకు యార్డుల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ట్రక్కు బాడుగ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. కంచికచర్ల మండలం మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద అధికారులు నామమాత్రంగా ఉండగా, 20 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకే బిల్లుపై రెండు వాహనాల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. పెనమలూరు పరిధిలోని చోడవరంలో 50–70 లారీలకు పైగా ఇసుక నిల్వలను అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు లారీ రూ.16 వేల నుంచి రూ.20 వేల చొప్పున అమ్మేశారు. స్టాకు యార్డుల్లో నిల్వలు లేవంటూ కృత్రిమ కొరత సృష్టించి ట్రాక్టరు లోడ్ రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. దూరప్రాంతాలకు 18 టన్నుల ఇసుక లారీలో తేవాలంటే బాడుగ, పన్నులతో కలిపి రూ.20,835 నుంచి రూ.25,200 అవుతుంది. కర్నూలులో కొనలేం..శ్రీశైలంలో 32,000కర్నూలు జిల్లాలో ఇసుక ధరలు భారీగా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పెట్టి దోచుకుంటున్నారు. మరోవైపు కౌతాళం మండలం గుడికంబాళి రీచ్లోని ఇసుకను టీడీపీ నాయకులు ఇతరుల ఆధార్ కార్డులతో కొల్లగొట్టి డంపింగ్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో 18 టన్నులు ఇసుక గరిష్టంగా లారీ రవాణా చార్జీలతో కలిపి రూ.32వేలు వరకు అవుతోంది. ఉత్తరాంధ్రలో విచ్చలవిడిగా లూటీ.. పెందుర్తిలో.. 28,800ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉచితం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. ఆచరణలో మాత్రం అధిక ధరలు వసూలు చేస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 18 టన్నుల ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.20వేల నుంచి 28,800 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉండే విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అనంతలో అతి కష్టం పెనుకొండలో..25,000అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురంపల్లి సమీపంలో వేదావతి హగరి నది వద్ద ఇసుక విక్రయాలు ప్రారంభించారు. ఇక్కడి నుంచి అనంతపురం లాంటి దూర ప్రాంతాలకు తరలించాలంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. పెనుకొండలో గరిష్టంగా 18టన్నుల ఇసుక రవాణాచార్జీలతో కలిపి రూ.25,000 వరకు అవుతోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చిత్ర విచిత్రాలు.. నెల్లూరు రూరల్..23,000 ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు మండలం దిగువ మాసపల్లి రీచ్లో టన్నుకు రూ.289 సీనరేజీ కింద చెల్లిస్తూ అదనంగా రూ200 వసూలు చేస్తున్నారు. నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల ప్రజలు చిత్తూరు రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపో వద్దకు వచ్చి తీసుకెళ్లేందుకు రవాణా చార్జీలతో కలిపి ట్రాక్టర్ లోడు ఇసుక రూ.7,500 వరకు ఖర్చు అవుతోంది. కుప్పం, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల ప్రజలు గంగవరం మండలం బైరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఇసుక డిపోనకు వచ్చి ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి రవాణా ఖర్చులతో కలిపి ట్రాక్టర్ లోడు రూ.8,500 వరకు ఖర్చు అవుతోంది. గూడూరుకు వెళ్లేందుకు ట్రాక్టర్ ఇసుకకు రూ.9 వేల నుంచి రూ.10వేలు వ్యయం అవుతోంది. చంద్రగిరికి లారీ ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.21,600 వరకు అవుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 18 టన్నుల ఇసుక లారీ తీసుకువెళ్లేందుకు రూ.23,000 అవుతోంది. -
వాటాలు తేలకపోవటంతో ఇసుక దందా గుట్టు బయటపెట్టిన టీడీపీ నేతలు
-
ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాయ... పేరుకు మాత్రమే ఉచితం.. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మాయం మాయం 25 రోజుల్లో అంతా మాయం ఇదే చంద్ర తంత్రం
-
ఉచిత ఇసుక పేరుతో ప్రజలకు పంగనామాలు
-
రండి బాబు రండి.. ఇసుక ఫ్రీ..కానీ..!
-
35 లక్షల టన్నుల ఇసుక మాయం..
-
నర్సీపట్నం ఇసుక డిపోలో!
సాక్షి, అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఇసుక డిపోలో రూ.5 కోట్ల విలువైన ఇసుక తరలించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ వేశారని.. ఉచిత ఇసుక అంటూ ప్రజల్ని టీడీపీ మోసం చేస్తోందంటూ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మండిపడ్డారు.టన్నుకు కేవలం రూ.175 తగ్గించి ఉచిత ఇసుక అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమ్తెతారు. మా ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇచ్చామని ఉమాశంకర్ అన్నారు. డిపోకి వచ్చిన, అమ్మిన ఇసుక వివరాలు వెల్లడించాలని అధికారులను ఉమా శంకర్ గణేష్ కోరారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. -
పేరుకే ఉచిత ఇసుక.. షరతులు షరా మామూలే..
సాక్షి, అమరావతి : ఉచితంగా ఇసుక పేరుతో అందినకాడికి దండుకోవడానికి అధికార పార్టీ నేటి నుంచి ముసుగు తీయనుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినా స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుక నిల్వలను నేటి నుంచి అవసరమైన వారికి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఆ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే పరిస్థితి ఉండడంతో కొరత రాకుండా ఉండేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టాక్ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసింది. ఇప్పుడు ఆ ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఆ ముసుగులో ఆ పార్టీ నేతలకు భారీగా లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమైంది. పైకి మాత్రం వినియోగదారులే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకుంటే, అందులో ఉచితంగా ఇసుకను నింపి పంపుతారని అధికారులు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో మరో రకంగా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. ఇసుక లోడింగ్, స్టాక్ యార్డ్ నిర్వహణ, రవాణా, పన్నులు, లెవీకి సంబంధించి కొంత మొత్తాన్ని వసూలు చేయనున్నారు. వీటన్నింటికీ కలిపి జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపి టన్నుకు రూ.250 నుంచి రూ.300 వరకు వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందని చెబుతున్నా, వాస్తవంగా అంతకు రెట్టింపు వసూలు చేయనున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టన్నుకు రూ.475తో ఇసుకను విక్రయించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.780 కోట్లకుపైగా ఆదాయం లభించేది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొత్తగా అమలు చేసే విధానంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. అదే సమయంలో వినియోగదారులపై భారం తప్పదు. ‘వాహనాలన్నీ టీడీపీ నేతలవే.. అలాంటప్పుడు ఆ పన్ను, ఈ పన్ను అంటూ బాదుడు మామూలే’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. సచివాలయ ఉద్యోగులకు స్టాక్ యార్డ్ బాధ్యతలు ఇసుక స్టాక్ యార్డు బాధ్యతలను ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కాంట్రాక్టు సంస్థలుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమి ఇన్ఫ్రా సంస్థలకు చెందిన సిబ్బందిని గత నెల అధికారం మారగానే టీడీపీ శ్రేణులు బెదిరించి అక్కడి నుంచి పంపించేశాయి. స్టాక్ యార్డులన్నీ ప్రస్తుతం టీడీపీ శ్రేణుల చేతిలో ఉన్నాయి. ఉచిత ఇసుక సరఫరాను అమలు చేయడం కోసం శనివారం నుంచి జిల్లా కలెక్టర్లు వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కొలిక్కి వచ్చినట్లు లేదు. మైనింగ్ సిబ్బందితోపాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వాటిని అప్పగించనున్నట్లు తెలిసింది. వారితోపాటు వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా ఇసుకను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి స్టాక్ యార్డ్రే ఒక ఇన్ఛార్జిని నియమించి, అతని ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సిబ్బంది కొందరు పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో సెప్టెంబర్ వరకు ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అప్పటి వరకు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక నిల్వల్ని ఉచిత ఇసుక విధానంలో సరఫరా చేయనున్నారు. ఆ తర్వాత ఇసుక రీచ్లను తెరిచి తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఇసుక కాంట్రాక్టు సంస్థలు జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రాలను పక్కకు తప్పించి ఇసుక తవ్వకాలకు కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇసుక స్టాక్ యార్డులను స్థానిక టీడీపీ లీడర్లే నిర్వహించనున్నట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల పాత్ర నిమిత్త మాత్రమేనని తెలుస్తోంది. -
టీడీపీలో ఇసుక దుమారం?
సాక్షి, రాజమహేంద్రవరం : నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజమహేంద్రవరంలో ఇప్పుడు ఇసుక తుపాను చెలరేగుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చీరావడంతో ఆ పార్టీల నేతలు ఇసుక మీద పడ్డారు. వర్షాకాలం పురస్కరించుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందస్తుగా నిల్వ ఉంచిన ఇసుకను ఊడ్చేశారు. ఇప్పుడిదే వారి మధ్య వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఓ జనసేన నేత అత్యుత్సాహం రాజమహేంద్రవరంలోని ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నగర రాజకీయాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారిన ఈ ఇసుక బాగోతం కథాకమామిషు ఏంటంటే.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య ఈ ఇసుక దుమారం రేగింది. గోరంట్లకు అనుచరుడిగా పేరుగాంచిన ఓ జనసేన నేత ఇసుక వ్యాపారమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు ఇసుక దందాకు తెరలేపారు. ఇందులో భాగంగా.. గోదావరి వరదల సమయంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా ర్యాంపుల్లో నిల్వ ఉంచిన ఇసుకను ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు ఆ గుట్టలు మింగేశారు. రాత్రి, పగలు అన్న తేడాలేకుండా అక్రమంగా తరలించి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ పరిధిలోని గ్రాయత్రి–1, 2, 3, 4, 5 పేర్లతో ఉన్న ఇసుక ర్యాంపుల్లోని నిల్వలను ఆ నియోజకకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదే అదునుగా బుచ్చయ్య అనుచరుడైన ఓ జనసేన నేత ఇసుక మొత్తం ఊడ్చేశాడు. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో అధికారులు అటువైపు వెళ్లేందుకు కూడా సాహసించలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ నేత రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలోని కోటిలింగాల ర్యాంపులపై కూడా కన్నేశాడు. పరిస్థితులు అనుకూలంగా ఉండటం.. నూతన ఇసుక పాలసీ త్వరలో రానుండటంతో ముందుగానే తరలించేయాలన్న ఆలోచనతో దానిని ఎడాపెడా తరలించేసి అమ్మేశారు. ఇలా రూరల్, సిటీ నియోజకవర్గాల పరిధిలో నిల్వ ఉన్న సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఇసుక కొల్లగొట్టినట్లు సమాచారం. దోపిడీ చేసిన సొమ్ములో తన గురువుకు కొంత లాభం చేకూర్చినట్లు తెలిసింది. సిటీ ఎమ్మెల్యే తండ్రి సీరియస్.. ఇదిలా ఉంటే.. ఈ విషయం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దృష్టికి వెళ్లడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తమ ఇలాకాలో తమకు తెలీకుండా ఇసుక తరలించుకుపోవడంపై అవాక్కయ్యారు. అదీ తన విరోధి బుచ్చయ్యచౌదరి అనుచరుడని తేలడంతో మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న నిల్వలకు సంబంధించిన నగదు తనకివ్వాలని సదరు నేతకు కబురు పంపినట్లు సమాచారం. ఆ నేత నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై అప్పారావు కారాలు మిరియాలు నూరుతున్నారు. అలాగని ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే కూటమిలో భాగమైన జనసేన నేత కావడం, పార్టీ పెద్దలకు మరో రకమైన సంకేతాలు వెళ్తాయని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అధికారులపై చిందులు? మరోవైపు.. ఇసుక తరలించేస్తుంటే ‘మీరేం చేస్తున్నారు? అడ్డుకోవాలి కదా..’ అంటూ ఆదిరెడ్డి అప్పారావు మైనింగ్ అధికారులపై చిందులేసినట్లు తెలిసింది. రాజమండ్రి సిటీ పరిధిలో ఒక్క ఇసుక రేణువు తీసుకెళ్లాలన్నా తన అనుమతి ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నేత కావడంతో ఏమీ చెప్పలేక అధికారులు మిన్నకుండిపోయారు. ఇసుక తరలించిన వ్యక్తి కూటమి నేత కావడం, ఆయన్ను ఏమీ అనలేక తమపై రుబాబు చూపడంపట్ల అధికారుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
రామాపురంలో టీడీపీ నేత ఇసుక తవ్వకం
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురంలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ మొదలుపెట్టారు. పార్టీ నాయకుడు పెన్నానది పరిధిలో ఏర్పాటుచేసిన ఇసుక డంప్పై ఆదివారం బ్లూకోట్ పోలీసులు దాడి చేశారు. పెన్నానదిలో జేసీబీ ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్లను వెంబడించడంతోపాటు పెన్నానదిలోకి వెళ్లారు.టీడీపీ అధికారంలోకి వచి్చన వారం రోజుల్లోనే ప్రొద్దుటూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక అక్రమ తవ్వకాలు మొదలుపెట్టారు. పలు గ్రామాల్లో ఇసుక తవ్వుతుండటంతో రెవెన్యూ అధికారులు పెన్నానది పరిసర ప్రాంతాల్లో గోతులు తవ్వారు. దీంతో వారం రోజులుగా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రామాపురం వద్ద ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. చాలాకాలంగా రామాపురానికి ఇసుక అక్రమ తవ్వకాల అడ్డాగా పేరుంది. గతంలో గ్రామ టీడీపీ నేతలు ఏకంగా తహసీల్దార్ భాస్కర్రెడ్డిని నడిరోడ్డుపై బెదిరించారు. -
మేడిగడ్డలో సిరుల మేట!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ‘మేడిగడ్డ బ్యారేజీ’ రాష్ట్ర ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిపించబోతోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా భారీఎత్తున ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మేడిగడ్డలో బయటపడిన ఇసుక నిల్వల ద్వారా ఖజానాకు రూ.800 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశమున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తొలిదశలో రూ.380 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకునేలా 14 బ్లాక్లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)కు అప్పగించారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్ల షెడ్యూల్ను ప్రకటించిన టీజీఎండీసీ జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని బ్లాక్ల నుంచి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ ఇసుక లభ్యతపై ఇప్పటికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు (డీఎల్ఎస్సీ) ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇసుక వెలికితీతకు ఇతరత్రా ఎలాంటి ఆటంకాలు లేకుంటే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని టీజీఎండీసీ లెక్కలు వేస్తోంది. వెలికితీతకు 18–24 నెలల గడువు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద సుమారు రూ.800 కోట్ల విలువైన సుమారు 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక మేట వేసినట్లు డీఎల్ఎస్సీ గుర్తించింది. అయితే ప్రస్తుతానికి రూ.380 కోట్ల విలువైన 92.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వెలికితీత సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇసుక వెలికితీత, స్టాక్ యార్డుకు చేరవేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ‘ఇ ప్రొక్యూర్మెంట్ టెండర్’ ద్వారా టీజీఎండీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనుంది. ఈ నెల 25 వరకు టెండర్లు స్వీకరించి, వచ్చే నెల 3న తెరిచేలా సంస్థ ఇప్పటికే టెండర్ షెడ్యూల్ను ప్రకటించింది. మహదేవ్పూర్ మండలంలోని 14 బ్లాక్ల నుంచి ఇసుకను వెలికితీస్తారు. బెగ్లూరు, ఎలే్కశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ పరిధిలో ఈ బ్లాక్లు ఉన్నాయి. గోదావరి నదికి ఎగువ నుంచి వచ్చే వరద, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇసుక వెలికితీతకు 18 నుంచి 24 నెలల గడువును టీజీఎండీసీ నిర్దేశించింది. అన్నారం, సుందిళ్ల ఇసుకతో రూ.500 కోట్ల ఆదాయం! మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఉన్న ఇసుక మేటల పరిమాణాన్ని గుర్తించడంపై డీఎల్ఎస్సీలు దృష్టి సారించాయి. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఎల్ఎస్సీ సభ్యులుగా ఉన్న రెవెన్యూ, పంచాయతీ, భూగర్భ జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, భూగర్భ వనరుల విభాగాలకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ బ్యారేజీలను సందర్శించినట్లు సమాచారం. రెండు బ్యారేజీల్లోని ఇసుకతో మరో రూ.500 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డీఎల్ఎస్సీల నుంచి నివేదికలు అందిన తర్వాత వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి. -
బ్యూటీఫుల్ ఫాదర్ అండ్ డాటర్
ఆటవిడుపులో భాగంగా సెలబ్రిటీలు కుటుంబంతో గడిపే సంతోష సమయాలు వారికి మాత్రమే పరిమితమైనవి కాదు. అభిమానులకు కూడా సంతోషం కలిగిస్తాయి. ‘క్రికెటర్గా రోహిత్శర్మ ఏమిటి?’ అని చెప్పడానికి బోలెడు సమాచారం ఉంది. ‘తండ్రిగా రోహిత్ ఏమిటి?’ అని చెప్పడానికి ఈ వైరల్ ఫొటో ఒక్కటి చాలు. ‘ఫాదర్స్ డే’ సందర్బంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సముద్రపు ఒడ్డున తన కూతురు సమైరతో కలిసి రోహిత్శర్మ ఇసుకలో పిచ్చుక గూడు కడుతున్న ఫొటో ‘ఆహా’ అనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘ఫ్యామిలీ టైమ్ ఈజ్ ది బెస్ట్ టైమ్’ అని కాప్షన్ ఇచ్చారు నెటిజనులు.‘ది ఫాదర్, ది కెప్టెన్, ది హిట్మ్యాన్, ది భయ్యా, ది ఓపెనర్’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.మరో యూజర్ ‘బ్యూటీఫుల్ డాటర్ అండ్ ఫాదర్. లవ్ యూ మై మ్యాన్’ అని కామెంట్ పెట్టాడు. -
ఇసుక వాహనాలపై టార్పాలిన్ కవర్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనంపైనా టార్పాలిన్ కవర్ కప్పడాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమ ఇన్ఫ్రా లిమిటెడ్, వారి అసైనీలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించాలి, ఇసుక రవాణా చేయాల్సిన సమయాలను తదుపరి విచారణలో తేలుస్తామని తెలిపింది. జరిమానా విషయంలో అడ్వొకేట్ జనరల్, కోర్టు సహాయకారి సలహాలు ఇవ్వొచ్చునంది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. టార్పాలిన్ కవర్ విషయంలో తాము కూడా లీజుదారులకు తగిన ఆదేశాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. ఇసుక రవాణా విషయంలో హైకోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటిస్తామని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాల విషయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కే వదిలేయాలని ఏజీ శ్రీరామ్, అమికస్ క్యూరీ నోర్మా అల్వరీస్ విన్నవించారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, ఇసుక విషయంలో మరికొన్ని అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇసుక రవాణాకు వేళలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని అమికస్ క్యూరీ తెలిపారు. రవాణా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలను పర్యవేక్షించి, పరిమితులను దాటితే ఆ ప్రాంతాల్లో ఇసుక వాహనాల రాకపోకలను తగ్గించాలని, అవసరమైతే రవాణా మార్గాన్ని మార్చాలని సూచించారు. -
చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు
-
లోకేశ్ కపట ప్రేమ!
తాడేపల్లిరూరల్: ఇసుక కార్మికులపై టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ కపట ప్రేమ చూపుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్ర భుత్వ హయాంలో ఇసుక కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, భారీ యంత్రాలతో ఇసుక దోచుకుంటున్నారని ఎన్నికల వేళ పసలేని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్న సంఘటనలు, అడ్డుకున్న అధికారులపై జరిగిన దాడులు మరిచి, మేము అధికారంలోకి వస్తే ఇసుక, భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామంటూ హామీ లు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యల నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు పరిణామాలను పరిశీలిస్తే... 2014కు ముందు... ఉండవల్లి ప్రకాశం బ్యారేజ్ పైభాగంలో సైతం ఇసుక కార్మికులు నీటిలోకి దిగి పారలతో ఇసుక లోడింగ్ చేసేవారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పాతూరు, గుండిమెడ, చిర్రావూరు, గొడవర్రు, రామచంద్రాపురం, పెదకొండూరు, వీర్లపాలెం దళిత కుటుంబాలు ఇసుక ట్రాక్టర్లకు, లారీలకు లోడింగ్ చేసి, పొట్ట నింపుకునేవారు. 2014 తర్వాత అక్రమంగా హైదరాబాద్కు ఇసుక టీడీపీ అధికారం చేపట్టగానే ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు రేపల్లె నుంచి అచ్చంపేట వరకు మకాం వేశారు. దొరికిన కాడికి ఇసుక దోచుకుంటూ జేబులు నింపుకొన్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక కార్మికులను ఒక్కొక్కరిని తొలగించారు. అనుమతులు లేని భారీ పడవలను దించి, వాటికి ఇసుక తోడే యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు ఒక్కొక్క ఇసుక క్వారీ నుంచి 30 వేల టన్నుల ఇసుకను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీ వాహనాల్లో తరలించేవారు. ఇది గమనించిన స్థానిక నాయకులు మా ప్రాంతంలో కూడా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని తలచారు. అంతే... భారీ యంత్రాలతో దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి గుంటూరు ఎమ్మెల్యే సోదరుడిది కీలక పాత్ర ఈ దోపిడీలో అప్పటి గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, నారా లోకేశ్ మిత్రుడు కీలక పాత్ర పోషించారు. చినబాబుకు సైతం భారీగా సొమ్ములు పంపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాతూరు, గుండిమెడ ఇసుక రీచ్లో కార్మికులను పోలీసులతో బెదిరించి మరీ బయటకు పంపివేశారు. చిర్రావూరులో కొంతకాలం అక్కడి కార్మికులకు పని కల్పించారు. తర్వాత భారీ వాహనాల్లో ఇసుకను బయటకు తరలించాలంటే కార్మికుల వల్ల కాదని తాత్కాలికంగా మూడు రోజులపాటు క్వారీని నిలుపుదల చేశారు. అనంతరం 200 యంత్రాలు తీసుకువచ్చి ఇసుక లోడింగ్ నిర్వహించారు. దీంతో కార్మికులకు ఉపాధి కరవైంది. అధికారులను బెదిరించి... ఇసుక రీచ్ల్లో అధికారులు యంత్రాలకు అనుమతులు ఇవ్వనప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేసి భారీగా తవ్వకాలు చేపట్టారు. అనుమతులకు మించి తవ్వకాలు వల్ల ఆ గుంతల్లో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వీటిని మూసివేయాలని పాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులచేత బెదిరించి, ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారని నేటికీ కార్మికులు చెబుతున్నారు. -
ఇసుక లేకుండానే ఇల్లు కట్టేయొచ్చట! ఎలాగో తెలుసా..!
ఇల్లు కట్టాలంటే ముందుగా చేతినిండా దండిగా డబ్బు ఉండాలి. అప్పుడే కలల ఇంటిని నిర్మించగలం. దీనికి సిమ్మెంట్, ఇటుక, ఇసుక తదితరాలు లేకుండా ఇంటి నిర్మాణమే మొదలవ్వదు. నిజానికి ఇప్పుడు, సిమ్మెంట్, ఇటుకలు ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో మనకు తెలిసిందే. ఇక అందులో ఇసుకను కొనడం ఒక ఎత్తు తరలించేందుకు మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఓ ఇంటి నిర్మాణానికి చాలా ఇసుక కావాల్సి ఉంటుంది. అలా ఇసుకు అవసరమే లేకుండా ఇల్లునే కట్టేయొచ్చట. ఎలాగంటే.. సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడేలా ఓ సరికొత్త మెటీరియల్ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు నిర్మాణాలకు అవసరమయ్యే సహజ ఇసుక స్థానంలో కొత్త మెటీరియల్ను రూపొందించారు. నిర్మాణ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఇసుక కొరత కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (సీఎస్టీ)లోని ఒక బృందం పారిశ్రామిక వ్యర్థ వాయువులలో సేకరించిన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. తవ్విన మట్టి, నిర్మాణ వ్యర్థాలను కార్బన్ డయాక్సైడ్తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్థారించారు. ఈ కొత్త మెటీరియల్ నిర్మాణాల కారణంగా ఏర్పడే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి, నిర్మాణ నాణ్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా నిర్మాణ రంగాల్లో మట్టికి కార్బన్ డయాక్సైడ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇసుక బదులుగా వాడే ఈ ప్రత్యేక మెటీరియల్ సిమెంట్, సున్నం మధ్య చర్యను మెరుగుపరుస్తుంది. ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఇసుక, కంకర, చువ్వ వీటికే లక్షలు ఖర్చు అవుతాయి.. పైగా రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే ఖర్చు తడిసిమోపడవ్వడం తగ్గుతుంది. ఎకో ఫ్రెండ్లీగా మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు కూడా. (చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!) -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
ఇసుక తవ్వకాలపై..తప్పుడు రాతలు
-
డేంజర్ లోడ్స్!
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణ రహదారి భద్రతకు సవాల్గా మారింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఇసుకలారీలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఓవర్లోడ్తో వచ్చే లారీల వల్ల రహదారులు సైతం ధ్వంసమవుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5 వేల లారీలు వివిధ జిల్లాల నుంచి నగరానికి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నాయి. ఈ క్రమంలో మోటారు వాహన నిబంధనలకు బేఖాతరు చేస్తూ యధేచ్చగా పరిమితికి మించిన బరువుతో రోడ్లపైకి వస్తున్నట్లు రవాణాశాఖ గుర్తించింది.కృష్ణా,గోదావరి, తదితర పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించే క్రమంలోనే కచి్చతమైన పరిమితిని విధించే అవకాశం ఉన్నప్పటికీ చాలా వరకు తూకం వేయకుండానే రోడ్డెక్కుతున్నాయి. కొన్ని లారీల్లో 25 టన్నుల వరకే అనుమతి ఉండగా అందుకు విరుద్దంగా 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. 35 టన్నుల ఇసుక రవాణాకు అవకాశం ఉన్న 16 టైర్ల లారీల్లో ఏకంగా 45 టన్నులకు పైగా ఇసుకను తరలిస్తున్నట్లు అంచనా. ఓవర్లోడ్..చీకట్లో స్పీడ్ ఇలా ఓవర్లోడ్తో వచ్చే భారీ వాహనాల వల్ల తరచుగా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఇసుక లారీలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు రవాణా అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారు జామున సిటీకి వచ్చే క్రమంలో ఓవర్లోడ్ లారీలను డ్రైవర్లు అదుపు చేయలేకపోతున్నారు. వేగాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇక ఓవర్లోడ్ వచ్చే వాహనాలను కట్టడి చేసేందుకు గ్రేటర్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. తూకంలోనే మోసం... హైదరాబాద్లో భవననిర్మాణ రంగానికి ప్రతి రోజు వేల టన్నుల ఇసుకను వినియోగిస్తున్నారు.నదీతీరాల్లో లభించే సన్న ఇసుకకు నగరంలో ఎంతో డిమాండ్ ఉంది.దీంతో కృష్ణా,గోదావరి పరీవాహాక ప్రాంతాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, తదితర ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద మొత్తంలో ఇసుక తరలివస్తుంది.అలాగే విజయవాడ నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుకను లారీల్లో నింపిన తరువాత క్వారీల్లోనే తూకం వేయవలసి ఉంటుంది. కానీ చాలా వరకు క్వారీల్లో కాంటాలు అందుబాటులో లేకపోవడం వల్ల పెద్దమొత్తంలో ఇసుకను నింపేస్తున్నారు. నిర్ధేశించిన బరువుపైన 5 శాతం వరకు అదనంగా తెచ్చేందుకు ఆర్టీఏ అనుమతిస్తుంది.ఉదాహరణకు 25టన్నులకు అవకాశం ఉన్న లారీల్లో మరో ఒకటిన్నర టన్ను అదనంగా తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొందరు వాహన యజమానులు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకటిన్నర టన్నుకు బదులు 10 టన్నులకు పైగా అదనంగా నింపేసి తరలిస్తున్నారు. క్వారీలు దాటిన 20 కిలోమీటర్ల దూరంలో కాంటాలు ఉంటాయి. కానీ ఇక్కడి వరకు వచి్చన లారీల్లో ఓవర్లోడ్ను తొలగించకుండా ఏదో ఒకవిధంగా కాంటాల నిర్వాహకులతో కుమ్మౖMð్క తప్పుడు తూకం లెక్కలతో రోడ్లపైకి వస్తున్నారు. ఇలా ఓవర్లోడ్తో వచ్చే వాహనాలను చెక్పోస్టుల వద్ద నిలిపేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొందరు మోటారు వాహన ఇన్స్పెక్టర్లు ఇసుక వ్యాపారాల నుంచి ప్రతి లారీకి కొంత మొత్తంగా వసూలు చేసుకొని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘ఆరీ్టఏ అధికారులు బడా వ్యాపారులను వదిలేసి నిబంధనల మేరకు ఇసుకను తెచ్చే చిన్న వ్యాపారులు, లారీ డ్రైవర్లపైన మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని’ పలువురు వాహనయజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్.. వివిధ దశల్లో ఏదో ఒక విధంగా తనిఖీలను తప్పించుకొని నగరానికి చేరుకొనే ఓవర్లోడ్ ఇసుక లారీలపైన ఆర్టీఏ ప్రస్తుత స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పరిమితికి మించిన బరువుతో నగరానికి వచ్చే లారీలపైన తనిఖీలను ప్రారంభించారు.సోమవారం ఒక్క రోజే 19 వాహనాలపైన కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు జేటీసీ రమేష్ తెలిపారు.ఓవర్లోడ్ వాహనాలపైన తనిఖీలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.క్వారీల్లోంచి ఇసుకను నింపే సమయంలోనే మోటారు వాహన నిబంధనలకనుగుణంగా నింపాల్సి ఉంటుందన్నారు. -
బాబుకి ముందస్తు: ఆ మూడు కేసుల్లో జరిగింది ఇదే!
గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అన్ని కేసుల్లో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం మధ్యాహ్నాం తీర్పు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి రాష్ట్ర నేర దర్యాప్తు సంస్థ(సీఐడీ) చంద్రబాబుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇసుకను అలా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
fact check: మేలెంచినా కీడెంచుతారా!?
సాక్షి, అమరావతి : కుక్క తోక వంకరలాగే ఈనాడు రాతల్లో కూడా అంతకు మించి వంకర్లు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నయినా వంకర బుద్ధితో చూడడమే ఇందుకు కారణం. పేదలకు మేలు చేసేందుకు.. వారు కట్టుకునే ఇళ్లను మెరక చేసుకునేందుకు, రైతుల పొలాలకు మట్టి తోలుకునేందుకు మట్టి తరలింపులో మినహాయింపులు ఇవ్వడాన్ని సైతం తప్పన్నట్లు గుండెలు బాదుకుంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి చేసినా తప్పేనంటూ ఆ పత్రికాధిపతి రామోజీరావు వితండవాద కథనాలను ప్రచురించటం పరిపాటిగా మారింది. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా మినహాయింపు ఇస్తే తప్పు.. ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా తప్పేనంటూ రెండు నాల్కల ధోరణితో క్షుద్ర రాతలు రాయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎలాగైనా బురద జల్లి ప్రజల్లో అపోహలు సృష్టించడం, వారికి మేలు జరుగుతుంటే దాన్ని వక్రీకరించి ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టడం.. తద్వారా చంద్రబాబును గద్దెనెక్కించాలన్నది ఆయన అసలు లక్ష్యం. ఇందులో భాగమే తాజాగా సోమవారం ‘దోపిడీకి రాజమార్గం’ అంటూ మట్టి తవ్వకాలపై అతిగా ఊహించుకుంటూ ఎప్పటిలాగే అభూతకల్పనలతో ఓ కథనాన్ని చేతికొచ్చింది ఇష్టానుసారం రాసిపారేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నానా ప్రయాసపడ్డారు. ఈ క్షుద్ర రాతలపై వాస్తవాల ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఒత్తిడా? రాష్ట్రంలో పేదలు నిర్మించుకునే ఇళ్లు, రైతుల పొలాలను మెరక చేసుకునేందుకు వీలుగా వారిపై ఎలాంటి భారం లేకుండా చిన్నతరహా ఖనిజాల వినియోగంపై మినహాయింపులకు గనుల శాఖ సదుద్దేశ్యంతో ప్రతిపాదించింది. కానీ, అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుముల మినహాయింపులు ఇస్తున్నట్లు రామోజీ పెడబొబ్బలు పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. వాటిపై ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అభ్యంతరాలకు గనుల శాఖ వివరణ సమర్పించింది. ఆ విషయం ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉంది. ఇంకా ఆమోదం పొందని ఫైలుపై సీఎంఓ ఎలా ఒత్తిడి తెచ్చిందో, దానికి ఆమోదముద్ర ఎవరు వేశారో రామోజీరావుకే తెలియాలి. అయినా.. పేదల ఇళ్లకు ‘మినహాయింపు’లను ఉచిత ఇసుకతో ఎలా పోలుస్తారు రామోజీ? అసలు మీ బాబు హయాంలో ఉచితంగా ఇసుక ఎవరికి అందింది? ఆ ముసుగులో చంద్రబాబు బినామీలు, రియల్టర్లు, కమర్షియల్ సంస్థలు, టీడీపీ నేతలకే ఆయన దోచిపెట్టిన బాగోతాలు జగమెరిగినవే కదా..! పేదలకు మేలు జరుగుతుంది.. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఒకొక్కరు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీరు తమ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరంతా ఇంటిని నిర్మించుకునేందుకు కంకర, గ్రావెల్ వంటి చిన్నతరహా ఖనిజాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిపైన గనుల శాఖ వసూలు చేస్తున్న సీనరేజీ, కన్సిడరేషన్ రుసుం, డీఎంఎఫ్, మెరిట్ వంటి వసూళ్లతో పేదలపై ఆర్థికంగా భారం పడుతుంది. దీని మినహాయింపునకు ప్రభుత్వం అంగీకరిస్తే పేదలకు మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాల్లో చర్చించిన తర్వాతే ఈ రుసుం మినహాయింపు కోసం గనుల శాఖ ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. ఏటా రైతులు చెరువు మట్టిని వాడుకుంటారు.. ప్రతి ఖరీఫ్ సీజన్కు ముందు వేసవిలో రైతులు తమ పొలాల్లో మట్టిని సారవంతం చేసుకోవడం, లోతట్టు భూమిని మెరక చేసుకునేందుకు చెరువు మట్టిని సమీపంలోని పొలాల నుంచి తెచ్చుకుని వాడుకుంటారు. దీనివల్ల తిరిగి పంట వేసుకునే సమయానికి పొలం అనువుగా తయారై మంచి దిగుబడి లభిస్తుంది. తద్వారా రైతు కష్టానికి ఫలితం అందుతుంది. దీనికోసం వినియోగించే మట్టిపై కూడా గనుల శాఖ విధించే రుసుమునకు మినహాయింపులిస్తే రైతులపై ఆర్థిక భారం ఉండదు. ఈ సదుద్దేశంతోనే గనుల శాఖ వ్యవసాయ వినియోగం నిమిత్తం వాడే మట్టిపై మినహాయింపుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవాలిలా ఉంటే.. ఒత్తిడి తెచ్చి మరీ సీఎంఓ ఆమోదముద్ర వేయించుకుందని ఈనాడు అడ్డగోలుగా ఓ కథనాన్ని అచ్చేసింది. ఇలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడు పత్రికపై ఇప్పటికే ప్రభుత్వం పలు పరువు నష్టం దావాలు దాఖలు చేసింది. అయినా సరే.. రామోజీది వంకర బుద్ధి కదా.. వంకర రాతలు కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి కలుగుతుంది? ఇక ఈ ప్రతిపాదనల్లో వైఎస్సార్సీపీ నేతలకు ఎలా లబ్ధి చేకూరుతుందో రామోజీరావు చెప్పాలి. పేదలు, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటే దానిని రాజకీయ పార్టీలకు ఎలా ఆపాదిస్తారని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి.. ఈ మినహాయింపుల్లేని సమయంలోనూ వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.70 కోట్ల వరకు మాత్రమే ఆదాయం వస్తుంది. అయినా సరే.. ఈ మినహాయింపులతో ఖజానాకు భారీగా నష్టం జరుగుతుందని రాద్ధాంతం చేయడం చూస్తుంటే పేదలు, రైతులపట్ల రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న ఏహ్య భావానికి అద్దంపడుతోంది. ఆర్థిక శాఖకు పూర్తి వివరణ ఇచ్చాం పేదల ఇళ్లు, రైతుల పొలాలు మెరక చేసుకునేందుకు తరలించే మట్టి విషయంలో మినహాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సందేహాలు, పరిశీలనలపై పూర్తి వివరణ ఇచ్చాం. గనుల శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలవల్ల ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్క్వాడ్ తనిఖీలు, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. వాటిపై తక్షణ చర్యల ద్వారా మైనింగ్ అక్రమాలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. పేదలు, రైతులకు ఇచ్చిన ఈ మినహాయింపులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఈ మినహాయింపులవల్ల మైనింగ్ రెవెన్యూలో తగ్గుదల చాలా పరిమితంగా ఉంటుంది. అక్రమాలకు ఆస్కారంలేదు కాబట్టి ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ఫైలుపై గనుల శాఖ పంపిన వివరణను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ ఫైలుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. అయినా తప్పుడు సమాచారంతో అసత్యాలను పోగేసి ఈనాడు వార్తలు రాయడం దారుణం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు ఊహించని షాక్
-
సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోగల సొరంగంలో కూలీలు చిక్కుకుపోయి నేటికి (బుధవారం) సరిగ్గా 11 రోజులు అయ్యింది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఈ సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ నేపధ్యంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. బాధిత కార్మికులను రక్షించేందుకు ఓన్జీసీ, ఎస్జేవీఎన్ఎల్, ఆర్వీఎన్ల్, ఎన్హెచ్డీసీఎల్ బృందాలు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశాలోని పూరీ నగరానికి చెందిన సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల భద్రత, రక్షణను కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. దీనికి ప్రతిగా ఇసుకతో ఒక కళాఖండాన్ని రూపొందించారు. సొరంగంలో చిక్కుకున్న కూలీలు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యత అని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు.. #WATCH पुरी, ओडिशा: रेत कलाकार सुदर्शन पटनायक ने उत्तरकाशी में सुरंग में फंसे श्रमिकों की सुरक्षा और बचाव के लिए प्रार्थना करने के लिए रेत से एक कलाकृति बनाई। (21.11) pic.twitter.com/YSmCnML9ZY — ANI_HindiNews (@AHindinews) November 22, 2023 -
రాజకీయంగా బురద జల్లేందుకే ఇసుకపై అసత్య కథనం
-
కేబినెట్ కళ్లుగప్పి ఖజానాకు కన్నం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి బరి తెగించిన మాజీ సీఎం చంద్రబాబు ఉచిత విధానం ముసుగులో నిర్భీతిగా అన్ని విధి విధానాలను ఉల్లంఘించారు. ఒకపక్క ఇసుక ఉచితమంటూనే మరోపక్క అక్రమ తవ్వకాలకు భారీ జరిమానాలంటూ మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతోపాటు కేబినెట్ను చీకట్లో ఉంచి మరీ దోపిడీకి తెరతీశారు. కేబినెట్ ఆమోదం లేకుండా మొదట ఓ మెమో.. తరువాత జీవో ద్వారా ఇసుక దందాకు తెగబడ్డారు. ఇప్పుడు పారదర్శకంగా ఇసుక తవ్వకాలను నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రెండేళ్లలో దాదాపు రూ.770 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అంటే గత సర్కారు హయాంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి ఖజానాకు చంద్రబాబు గండి కొట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆ ఆదాయం అంతా పచ్చ ముఠాలకు చేరిపోయింది. అంతేకాకుండా ఉచితం ముసుగులో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీ పర్వం సాగించారు. వీటిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణా రహితంగా దాడులకు బరి తెగించారు. స్వయంగా నాటి సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం పక్కనే ఇష్టారాజ్యంగా ఇసుక లూటీ జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చోవడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా తప్పుబడుతూ భారీ జరిమానా సైతం విధించింది. రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని ఆక్షేపించినా చంద్రబాబు చలించలేదు. ఈ ఇసుక దోపిడీ కేసులో సీఐడీ తీగ లాగుతుంటే పచ్చ ముఠాల డొంక కదులుతోంది. ఆది నుంచి కన్ను 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక రీచ్లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించినట్లు చంద్రబాబు కథ నడిపారు. మహిళా సమాఖ్యల ముసుగులో రెండేళ్ల పాటు భారీగా ఇసుక కొల్లగొట్టినా ఆయన సంతృప్తి చెందలేదు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు 2016లో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రీచ్లను వేలం వేసి ఇసుక విధానాన్ని రూపొందించారు. ఈమేరకు కేబినెట్ తీర్మానం చేసి 2016 జనవరి 1న జీవో 19 ఇవ్వగా అదే ఏడాది జనవరి 15న జీవో 20 వెలువడింది. ఈ విధానం ద్వారా కూడా మిగిలిన మూడేళ్లలో తాను ఆశించిన మేరకు ఇసుక దోపిడీ సాధ్యం కాదని భావించిన చంద్రబాబు రెండు నెలల్లోనే టెండర్ల ద్వారా ఇసుక రీచ్ కేటాయింపు విధానాన్ని పక్కన పెట్టేశారు. పచ్చ ముఠాలకే ఉచితం రాష్ట్రంలో ఇసుకను ప్రజలందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు చంద్రబాబు నమ్మబలికారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండా జారీ చేసిన మెమో 3066, జీవో 43 మధ్యలో మరో జీవో కూడా తెచ్చారు. 2016 మార్చి 14న జారీ చేసిన ఆ జీవో ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు భారీ జరిమానాలను నిర్దేశించారు. ఇసుక ఉచితం అన్నప్పుడు ఇక అక్రమ తవ్వకాలు అనే మాటే ఉత్పన్నం కాకూడదు కదా? అంటే ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు కనికట్టు చేశారన్నది స్పష్టమైంది. ఆ పేరుతో కేవలం చంద్రబాబు బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుక రీచ్లను గుప్పిట్లో పెట్టుకున్నారు. మూడేళ్లపాటు దోపీడికి పాల్పడ్డారు. ఇతరులు ఇసుక రీచ్ల జోలికి రాకుండా కట్టడి చేసేందుకే జీవో 35 తెచ్చారు. కొసమెరుపు ఏమిటంటే జీవో 35కు కూడా కేబినెట్ ఆమోదం లేదు. ఉచిత ఇసుక విధానం పేరుతో తెచ్చిన మెమో 3066, అనంతరం జారీ చేసిన జీవోలు 35, 43లకు కేబినెట్ ఆమోదం లేదన్నది నిర్ధారణ అయింది. వాటికి సంబంధించిన నోట్ ఫైళ్లు అటు ఏపీఎండీసీలోగానీ ఇటు గనుల శాఖ, జలవనరుల శాఖ కార్యాలయాల్లోగానీ లేవని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు పక్కాగా సాగించిన పన్నాగంపై పూర్తి ఆధారాలతో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేబినెట్ను చీకట్లో ఉంచి.. ఉచిత ఇసుక విధానంతో దోపిడీ ఎంత ఇసుక అందుబాటులో ఉంది? ఎంత తవ్వుతున్నాం? ఎంతకు అమ్ముతున్నాం? అనే ప్రాథమిక లెక్కలతో కూడా నిమిత్తం లేకుండా యథేచ్ఛగా కాజేసేందుకు ఈ విధానాన్ని తెచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలోకి తొక్కారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కథ నడిపారు. అందుకోసం 2016 మార్చి 4న మెమో 3066 జారీ చేశారు. అది కూడా అప్పటికి రెండు రోజుల ముందు నుంచి అంటే 2016 మార్చి 2 నుంచే ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. అప్పటివరకు కేబినెట్ ఆమోదంతో అమలులో ఉన్న ఇసుక విధానాన్ని తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మెమో జారీ చేశారు. ఈ మెమోకు కేబినెట్ ఆమోదం లేదు. అంటే కేబినెట్ ఆమోదంతో రూపొందించిన విధానాన్ని పక్కనపెట్టి అడ్డదారిలో మెమో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అక్రమంగా ఇసుక తవ్వకాలపై భారీ జరిమానాలు విధించేందుకు విధివిధానాలను నిర్దేశిస్తూ 2016లో గత సర్కారు జీవో 35 జారీ చేసింది. రెండు నెలల తరువాత అంటే 2016 ఏప్రిల్ 6న జీవో 43 వెలువరించి అప్పటివరకు మెమో ద్వారా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానానికి రాజముద్ర వేసింది. విడ్డూరం ఏమిటంటే ఆ జీవో 43కు కూడా కేబినెట్ ఆమోదం లేదు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఉచిత ఇసుక విధానాన్ని దొడ్డిదారిలో తెచ్చి ఇసుక దోపిడీకి చంద్రబాబు తెరతీశారు. చదవండి: రోత పుట్టించే రాతలు రాయడంలో పచ్చమీడియా రికార్డు -
కనీస జ్ఞానం లేకుండా రాస్తే ఎలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారదర్శకంగా నిర్వహిస్తున్న ఇసుక గనులపై దురుద్దేశ్యంతో ప్రభుత్వంపై బురద జల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్పై ఆ పత్రిక ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంఓనా?’’ అంటూ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు. అనుమతుల్లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థంలేని రాతలు రాయడంపై ఆయన మండిపడ్డారు. నిజానికి.. ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం ఒక పారదర్శక విధానాన్ని అమలుచేస్తోందని, దానిపై అపోహలు కలిగించేలా ఇసుక తవ్వకాలు చేసే వారు సీఎంఓ పేరు చెబుతున్నారంటూ పొంతనలేని అంశాలతో అసత్య కథనాన్ని వండివార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ టెండర్లు అయ్యేవరకూ జేపీనే.. గతంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు టెండర్లు నిర్వహించామని.. ఈ టెండర్లలో జేపీ సంస్థ సక్సెస్ఫుల్ బిడ్డర్గా ఎంపికైన విషయాన్ని వెంకటరెడ్డి గుర్తుచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే గత రెండేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తుందన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, అప్పటివరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయని, గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినా అవే తప్పుడు కథనాలను ప్రచురించడం ఈనాడు దురుద్దేశ్యాన్ని తెలియజేస్తోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అభూతకల్పనలతో రాయొచ్చా?.. ఇక వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయినందున ఎండాకాలంలో జేపి సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్లలో నిల్వచేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే, తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్లలో ఇసుక తవ్వకాలకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ సిద్ధమవుతోందని, దీన్ని వక్రీకరిస్తూ బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంఓ నుంచి తమకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు అభూత కల్పనలతో కథనాన్ని ప్రచురించడం ఎంతవరకు సమంజసమంటూ ఆయన ప్రశ్నించారు. ఇసుక ఆపరేషన్స్కు గనుల శాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయని.. మైనింగ్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది తెలుసునన్నారు. అటువంటిది సీఎంఓ అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎవరైనా ఎలా చెబుతారని, ఒక్క ఈనాడుకు మాత్రమే ఇలా చెబుతున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక అంశంపై రాసే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసత్య కథనాలను ప్రచురించడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా? గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్రమాలు కనిపించలేదా అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, వర్షాకాలంలోనూ ఇసుక కొరతలేకుండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేక తప్పుడు వార్తలను వండివారుస్తోందన్నారు. నిజానికి.. ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్టీసీ ద్వారా ఇసుక టెండర్లు నిర్వహిస్తున్నామని.. ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశముందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయని.. జిల్లాకో ఇన్చార్జిని నియమించారంటూ ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించిందన్నారు. ఇకనైనా ఇటువంటి తప్పుడు కథనాలను మానుకోకపోతే ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
చంద్రబాబు ఇసుక స్కాం జరిగిందిలా.. ఆ నివేదికలో ఏముంది?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మాజీ ఎమ్మెల్యేపైన ఇసుక కుంభకోణం కేసు నమోదు అవడం విశేషం. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వ టైమ్లో జరిగిన అవినీతిని ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని గనుల అభివృద్ది సంస్థ అంచనా వేసింది. సీఐడీ ఆ మేరకు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తెలియచేసింది. బహుశా దీనికి కూడా 17ఎ వర్తింపచేయాలని, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేయవచ్చు. ✍️తాము ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నందున తమపై ఇసుక కేసును బనాయించారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రతి విమర్శ. ఎప్పుడు అక్రమం జరిగినా అది బయటకు రావల్సిందే కదా! టీడీపీ వారు ఆరోపిస్తేనే అవినీతి, ఏపీ ప్రభుత్వ సీఐడీ కేసు నమోదు చేస్తే అది అక్రమం అని ఎలా వాదిస్తారు?. ఇసుక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా సుమారు మూడు దశాబ్దాలుగా ఉంది. 1990వ దశకం మొదట్లో సుమారు వంద కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. పంచాయతీల ద్వారా కొంత కాలం, ఆ తర్వాత కేవలం ఎడ్ల బండ్ల మీద తీసుకువెళ్లేవారికే ఉచితం అని కొంత కాలం ఇలా పలు విధానాలు అమలు జరిగాయి. కాని అప్పట్లో ఇసుకలో ఇంత అవినీతి సొమ్ము ఉందని ఊహించలేకపోయారు. ✍️2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు జరిగేవి. చంద్రబాబు వచ్చాక అందులో పలు మార్పులు చేశారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు ఈ రీచ్లు అప్పగిస్తున్నామని, తద్వారా వారికి ఇది ఉపయోగం అవుతుందని ఆయన ప్రకటించారు. నిజంగానే ఇది మహిళోద్దరణమోనని అనుకున్నారు. తీరా చూస్తే మహిళా సంఘాలను అడ్డుపెట్టుకుని అధికారంలో ఉన్న టీడీపీ నేతలు ఇసుకపై అక్రమ సంపాదనకు అది ఒక మార్గం మార్చారన్న సంగతిగా తేలింది. ఈ సంఘాల మహిళలకు కొద్దిపాటి డబ్బు ముట్టచెప్పి, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా ఇసుకను తరలించి అమ్ముకునేవారు. ఒకే చలాన్ పై అనేక మార్లు లారీలను తిప్పడం, తదితర అవకతవకలకు పాల్పడేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ✍️కారణం ఏమోకాని, ఈ పద్దతి కన్నా అసలు ఇసుక ఉచితం అని చెబితే టీడీపీ నేతలకు ఎక్కువ లాభం అనుకున్నారేమో తెలియదు కాని ఉచిత విధానం తెచ్చారు. దీనికి మంత్రివర్గ ఆమోదం లేకపోవడం కూడా గమనించాలి. పోనీ చిత్తశుద్దితో దానిని అమలు చేశారా అంటే అదీ లేదు. ఇక పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి కలిగిన టీడీపీ నేతల ఇష్టారాజ్యం అయిపోయింది. వారు ఎక్కడ కావాలంటే అక్కడ తవ్వడం, అమ్ముకోవడం చేశారు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగేవి. ✍️నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. ఉచిత ఇసుకలో దందా జరిగిందనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై పాతికవేల కోట్ల అక్రమాలు జరిగాయంటూ దావాలు కూడా వేశారు. తర్వాత అవి ఏమయ్యాయోకాని, ఆయన మాత్రం తదుపరి టీడీపీ మద్దతుదారుగా మారారు బహుశా. ఆ శ్రవణ్ కుమారే అనుకుంటా! కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని అప్పట్లో ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ఆ సంస్థ తన నివేదికలో కూడా తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తే దానిపై కూడా కేసు పెడతారా అని టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా సంస్థలు ప్రశ్నించాయి. ✍️ఈనాడు అయితే జగన్ ప్రభుత్వంపై వేల కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసేసింది. ఇక్కడ సంగతి ఏమిటంటే చంద్రబాబు ఉచితం ఇసుక విధానం తెచ్చినందుకు కేసు పెట్టలేదు. ఆ పేరుతో ఇసుక దందా చేసినందుకు, వందల కోట్ల అక్రమార్జన చేసినందుకు అని గుర్తుంచుకోవాలి. అప్పట్లో ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు ఆమెపై దౌర్జన్యం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆ సందర్భంలో చింతమనేనిని కాకుండా వనజాక్షినే చంద్రబాబు మందలించడం కూడా విమర్శలకు గురైంది. ✍️అంతేకాదు. ఒకసారి ఈనాడు పత్రికలోనే ఏ ఏ టీడీపీ ఎమ్మెల్యే ఇసుక రీచ్లను ఎలా దోచుకుంటున్నారో వివరిస్తూ ఒక కథనాన్ని ఇచ్చింది. కాకపోతే లోపలి పేజీలో ఆ ఎమ్మెల్యేల పేర్లు రాయకుండా స్టోరీ ప్రచురించారు. బహుశా ఆయా ఎమ్మెల్యేలను బెదిరించడానికి అయి ఉండవచ్చు. ఇసుక దోపిడీ పై ప్రస్తుతం సీఐడి పెట్టిన కేసు వివరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి, జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికే ఈనాడు, తదితర టీడీపీ మీడియాలు ప్రయత్నించాయి. కొద్ది రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై ఇసుక దోపిడీ అంటూ ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం ఇసుకకు సంబంధించి ఒక నిర్దిష్ట విధానం తెచ్చి ఏడాదికి 750 కోట్ల మేర ఆదాయం సమకూర్చింది. అయినా అవినీతి జరిగిందని చెబుతున్నవారు గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన దందా గురించి ఎందుకు ప్రశ్నించడం లేదో తెలియదు. చదవండి: పురందేశ్వరి గారూ.. మీది వెన్నుపోటు రాజకీయమా?’ ✍️అసలు సీఐడీ కేసులు పెట్టడమే తప్పని వీరు వాదించడం ఆరంభించారు. మరి అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై టీడీపీ నేతలు, వారి అంతేవాసులు నిత్యం కోర్టులకు వెళ్లి ఎందుకు కేసులు వేస్తున్నారు?. వైసీపీ అసమ్మతి ఎంపీని అడ్డం పెట్టుకుని ఏకంగా జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరుతూ పిల్ ఎలా వేశారు. అలా చేయడం రైట్ అయినప్పుడు ఇప్పుడు ఏపీ సీఐడీ వారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో సహా కేసులు వేయడం ఎలా తప్పు అవుతుంది?టీడీపీ కాని, ఈనాడు వంటి మీడియా సంస్థలు కాని పరస్పర విరుద్దంగా వ్యవహరిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నాయని పదే, పదే రుజువు చేసుకుంటున్నాయి. ✍️గత ప్రభుత్వంలో ఇసుకకు సంబంధించి వేల కోట్ల అవినీతి జరిగిందన్నది పచ్చి నిజం. టీడీపీ హయాంలో వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని కేసు పెట్టారు. దానిని రుజువు చేయడానికి సీఐడీ ఎలాంటి ఆధారాలు చూపుతుందన్నది చూడాలి. అవినీతి జరగడం వేరు. దానిని కోర్టులలో రుజువు చేయడం వేరు. ఏది ఏమైనా ఇప్పటికే పలు అవినీతి కేసులలో కూరుకుపోయిన చంద్రబాబు నాయుడిని ఈ అవినీతి ఇసుక ఎలా కప్పివేస్తుందో, దానిని ఆయన ఎలా కడుక్కుంటారో వేచి చూడాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం
సాక్షి, అమరావతి : పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం ద్వారా స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందని శ్రావణ్కుమార్ అనే న్యాయవాది తమ దృష్టికి తెచ్చిన అంశాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను ధర్మకర్తలా పరిరక్షించాల్సిన ప్రభుత్వం.. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర వహించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. సహజ వనరులపై ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయనే అంశాన్ని గుర్తుచేసింది. ప్రజలకు సమాన హక్కులు ఉన్న సహజ వనరులను కొందరు పెద్దల ముఠాకే దోచిపెట్టడం సమానత్వం సిద్ధాంతాన్ని అవహేళన చేయడమేనని స్పష్టంచేసింది. ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తవ్వేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం చేస్తుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని అప్పట్లో ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం ద్వారా పర్యావరణం దెబ్బతిన్నదని.. దానివల్ల ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ప్రజల హక్కులను ఇసుక స్మగ్లర్లు కాలరాస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమిటని నాటి టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని 2019, ఏప్రిల్ 4న అల్టిమేటం జారీచేసింది. మహిళా సంఘాల ముసుగులో దోపిడీ.. నిజానికి.. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇసుక రీచ్ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మహిళలకు అప్పగిస్తూ తొలుత ప్రకటించింది. మహిళా సంఘాల ముసుగులో ముఖ్యనేత దన్నుతో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్లను హస్తగతం చేసుకుని.. అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2016, మార్చి 4న ఆ విధానాన్ని రద్దుచేసి.. ఉచిత ఇసుక ముసుగులో తమ ముఠా దోపిడీకి అప్పటి సీఎం చంద్రబాబు రాచబాట వేశారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ప్రకాశం బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా నదీ గర్భంలో భారీ పొక్లెయిన్లు, మర పడవలు ఏర్పాటుచేశారు. తద్వారా ఇసుకను తవ్వేసి, అధిక ధరలకు మార్కెట్లో విక్రయించిన ముఠా పెద్దఎత్తున అక్రమార్జన సాగించింది. దీనిపై 2016లోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2017, ఫిబ్రవరి 23న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. అయినా.. నాటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 2019 జనవరి 17–18న చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్కు అల్టిమేటం జారీచేసింది. ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టంచేసింది. ‘‘సహజ వనరులు ప్రజల ఆస్తులు. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరించాలి. నియంత్రణ లేకుండా ఇసుకను తవ్వి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం అవివేకమైన చర్య. ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేయడంవల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగింది. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించిన వారి నుంచి పరిహారాన్ని వసూలుచేసి.. దానితో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందుబాటులో ఉండేలా చేయడం ప్రభుత్వం బాధ్యత’’. – 2019, ఏప్రిల్ 4న ఇచ్చిన తీర్పులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేసిన వ్యాఖ్య. -
చంద్రబాబు ముఠా రూ.10 వేల కోట్ల దోపిడీపై మరో కేసు
-
బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!
నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిమెంట్ అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు. ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి. ఉక్కు (స్టీల్) సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది. ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! రంగాల వారీగా రికవరీ రేట్లు ఇసుక నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. -
'ఇసుక' అనుమతులు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటు ధరలో ఇసుకను అందించాలని అధికారులను గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక వెలికితీతకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పట్నం మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న మైనింగ్, క్వారీ లీజులు, రెవెన్యూ వసూలు తదితర అంశాలతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో గనుల శాఖ సాధించిన పురోగతిని పరిశీలించారు. ఖనిజాల బ్లాక్ల వేలానికి వీలుగా పర్యావరణ అనుమతులను వేగవంతం చేయాలని.. గనులు, చిన్న తరహా మైనింగ్ లీజులపై మరింత మంచి విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. లీజులో ఉండి పని నడవని గనులను క్రియాశీలం చేయాలని, జిల్లాల వారీగా మినరల్ రెవెన్యూ పెంచాలని ఆదేశించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన 127 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడేళ్లలో ఇసుక విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,444 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. -
పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో శివనందన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) ప్రాంతంలో గోతులు పడిన ప్రదేశంలో ఇసుకతో నింపి వైబ్రో కంపాక్షన్ చేసిన పనులను ఆయన తనిఖీ చేశారు. రానున్న వరదల కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం
పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని కేంద్రం చెబితే.. వద్దు మాకు ప్యాకేజీ చాలన్నారు చంద్రబాబు. అలా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోమని హామీనిచ్చేశారు. కేంద్రం సరేనని ప్యాకేజీలో భాగంగా పోలవరాన్ని అప్పగిస్తే.. రామోజీరావు వియ్యంకుడి కంపెనీ నవయుగకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేషన్పై రూ.3,302 కోట్ల విలువైన పనులు కట్టబెట్టేశారు బాబు. పనిలోపనిగా యనమల రామకృష్ణుడి బావ మరిదికీ కొంత పంచారు. ఇక అందిన ప్యాకేజీలో దత్తపుత్రుడు, తోక పత్రికకు వాటా చేరిపోయింది. కాబట్టే... ఎందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వాళ్లు ప్రశ్నించలేదు. ఒక్క ఒక్కరం ముక్కా రాయలేదు. ఇదీ.. దోచుకో– పంచుకో–తినుకో అంటే! మూసేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ గానీ, నడుస్తున్న మార్గదర్శి చిట్స్ గానీ ఏ నిబంధననూ పాటించవు. కోట్లకు కోట్లు డిపాజిట్లు తీసుకున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు క్రిమినల్ కేసులు నడుస్తుండగా.. రూ.2వేల కోట్లు ఫైన్ కట్టాల్సిన పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ఏకంగా సంస్థనే మూసేశారు. ఇక చిట్స్ సంస్థ బిడ్ పాడుకున్న వాళ్లనూ ష్యూరిటీల పేరిట నెలలకు నెలలు తిప్పుతుంది. అక్రమంగా డిపాజిట్లూ తీసుకుంటోంది. ఇలా ఏం చేసినా... చంద్రబాబు ప్రశ్నించరు. ముఖ్యమంత్రిగా ఉన్నా దాని జోలికెళ్లరు. ఇది కాదూ.. డీపీటీ అంటే!! ముఖ్యమంత్రిగా షాపుర్జీపల్లోంజీ సంస్థకు వేల కోట్ల నిర్మాణ కాంట్రాక్టులు కట్టబెట్టారు నారా వారు. ఆ సంస్థను పిలిచి... పార్టీకి కాదు, మా ‘బాబు’ గారికి ఫండ్ కావాలన్నారు బాబు పీఏ శ్రీనివాస్. డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వందల కోట్లు ప్రవహించాయి. వాటిలో కొంత రామోజీ తనయుడి వియ్యంకుడి కంపెనీకీ (ఆర్వీఆర్ ఇన్ఫ్రా) చేరాయి. అక్కడి నుంచి చంద్రబాబు జేబులోకీ కొంత మళ్లాయి. దుబాయ్లో ఆస్తులు కూడబెట్టిన బాబు... అక్కడా కొంత క్యాష్ తీసుకున్నారు మరి!. ఇదంతా సంబంధిత వ్యక్తులు స్వయంగా సంతకం చేసిన ఇన్కమ్ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్లోనిదే!. కానీ దీని గురించి రామోజీ, ఆయన తోకపత్రిక పెన్నెత్తితే ఒట్టు. ఇదీ.. తోడు దొంగల డీపీటీ అంటే!!. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఫైబర్నెట్ వరకూ దోచుకో– పంచుకో– తినుకో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన దుష్ట చతుష్టయం... ఇపుడో కొత్త రాగం ఎంచుకుంది. అధికార పారీ్టయే ఇసుక తవ్వకాల్లో ‘దోచుకో, పంచుకో, తినుకో’ అన్నట్లుగా వ్యవహరిస్తోందనే కథనాలకు దిగింది. మరి ఇందులో నిజం వీసమెత్తయినా ఉందా? బాబు హయాంలో ఇసుక విషయంలో జరిగిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎవరి హయాంలో దోపిడీ జరిగింది? ఎవరు పంచుకున్నారు? ఎవరు తిన్నారు? ఒకసారి చూద్దాం.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. పేరుకే ఇసుక ఉచితం!!. కానీ సామాన్యులు ఒక్కరికైనా ఫ్రీగా అందితే ఒట్టు!. అంతా బాబు కనుసన్నల్లోనే. అంతా టీడీపీ నేతల చేతుల్లోనే. ఉచితం పేరిట ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాకుండా వేల కోట్లు దోచేసి.. పంచుకుతినేశారు. సామాన్యులకు ఉచితంగా ఇవ్వకుండా... ప్రభుత్వానికి కూడా రూపాయి రాకుండా ఇసుకను తవ్వేయటం దారుణమని భావించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అందుకే జాతీయస్థాయిలో టెండర్లు పిలిచారు. అలా టెండర్లు పిలిచే బాధ్యతను ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీకి అప్పగించారు. బహిరంగ టెండర్లలో ఇసుక తవ్వి, విక్రయించే కాంట్రాక్టును జయప్రకాశ్ గ్రూపునకు చెందిన ‘జేపీ పవర్ వెంచర్స్’ దక్కించుకుంది. దీనికోసం ఇది ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లించాలి. అంటే... ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు. గతంలో ఇందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాలేదు. మరి ఈ సొమ్ము ఎక్కడికి పోయింది? ప్రజలకు కూడా ఇసుక ఫ్రీగా దొరకనప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది? ఇంకెవరు... చంద్రబాబు, రామోజీ, తోకపత్రిక యజమాని, దత్తపుత్రుడు. ఈ చతుష్టయమే మొత్తం ఇసుక వ్యాపారాన్ని శాసించింది. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు కట్టిన ఇంటి వెనకాల... రాత్రీపగలూ విరామం లేకుండా ఇసుక లారీలు తిరిగేవంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు! అక్రమంగా తవ్వేస్తున్నారని, ఉచితం పేరిట తినేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అడ్డుకోబోయిన నాటి ఎమ్మార్వో వనజాక్షిని... ఏకంగా జుట్టుపట్టుకుని ఈడ్చేశాడా ఎమ్మెల్యే. అంత దారుణం జరిగినా ‘ఈనాడు’ వ్యతిరేకించలేదు. మనవాడే కదా అని కిమ్మనకుండా ఊరుకున్నారు రామోజీ, ఆయన తోక మీడియా. ఇక చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఆ ఎమ్మార్వోను పిలిచి, ఎమ్మెల్యేపై ఎలాంటి ఫిర్యాదూ చేయకుండా ‘రాజీ’ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇదీ.. బాబు, ఆయన బృందం స్థాయి. ఇసుకను ఉచితంగా ఇస్తూ రామోజీరావు చెప్పినట్లుగా చంద్రబాబు మహా యజ్ఞమే చేసి ఉంటే... ఈ దౌర్జన్యాలెందుకు? ఈ దొంగ తవ్వకాలెందుకు? ఒకవేళ ఇసుక తవ్వకాలు తమ చేతుల్లోనే ఉండాలనుకుంటే జాతీయ స్థాయి టెండర్లలో రామోజీరావు కూడా పాల్గొని ఉండొచ్చుగా? ఎందుకు పాల్గొనలేదు?!. మరి ఇప్పుడెందుకీ కడుపు మంట? తమ అక్రమాలకు ఇపుడు ఫుల్స్టాప్ పడిందనేనా? వాళ్ల జేబుల్లోకి పోయిన సొమ్ము ఇపుడు నేరుగా ప్రభుత్వానికి అందుతోందనా? ఇసుక తవ్వకాలపై మరీ పనిగట్టుకుని అపోహలు రేకెత్తించేలా తరచూ రామోజీ రాస్తున్న కథనాల్లో నిజమెంత? ఒకసారి సబ్కాంట్రాక్టరుగా టర్న్కీని తప్పించారంటూ బాధ!. మరోసారి టర్న్కీ సంస్థ దోచేస్తోందని శివాలు. ఇంకోసారి ఇసుక దొరకటం లేదని బాధ! మరోసారి ఇసుక విచ్చలవిడిగా విక్రయంచేస్తున్నారని బాధ!. వీటన్నిటి వెనకా అసలు బాధ మాత్రం... తమ డీపీటీకి అడ్డుకట్ట పడిందనే!. 2 కోట్ల టన్నుల ఇసుకతో... రూ.1800 కోట్లు ఎలా సాధ్యం? ‘ఈనాడు’ వాదన ఎంత ఘోరమంటే... రాష్ట్రంలో ఇసుకను ఎడాపెడా తవ్వేస్తున్నారని... ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని శుక్రవారంనాటి వార్తలో రామోజీ మండిపడ్డారు. కానీ అదే వార్తలో... తూర్పు గోదావరి జిల్లాను సబ్కాంట్రాక్టుగా తీసుకున్న వ్యక్తి... వ్యాపారం సరిగా జరగటం లేదని, తాను చెల్లించాల్సింది తగ్గించమన్నాడట. కుదరదనటంతో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా రాసేశారు. ఎడాపెడా తవ్వేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నపుడు... వ్యాపారం జరగకుండా డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటుందా? ఏమనుకోవాలి రామోజీ మీ తెలివిని? మరో వాదన చూద్దాం. ఇసుకపై రూ.1800 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టి మిగిలిన సొమ్ము వైఎస్సార్సీపీ నేతలు దోచుకుంటున్నారనేది ‘ఈనాడు’ కథ. నిజానికి రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక అవసరం. దీనికి అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక టన్ను ఇసుకను ఓపెన్ రీచ్లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అంటే.. మొత్తంగా రూ.900 కోట్లు వస్తాయి. రాష్ట్రంలో లభ్యమయ్యే ఇసుకే 2 కోట్ల టన్నులైతే దానికి రెండు రెట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలిసి కూడా జేపీ సంస్థ నుంచి అంతకన్నా ఎక్కువ మొత్తం చెల్లించి వైఎస్సార్ సీపీ నాయకులెందుకు సబ్కాంట్రాక్టులు తీసుకుంటారు? ఒకటీఅరా చోట్ల తీసుకున్నా అంత ఎక్కువ మొత్తం ఎలా చెల్లిస్తారు? ఇవన్నీ కాస్త ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే అర్థమవుతాయి కదా రామోజీ? అక్రమ రవాణాపైనా అబద్ధాలేనా? యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అబద్ధాలన్నిటినీ రాసి పారేసింది ‘ఈనాడు’. వాస్తవానికి పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీనికోసమే ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడా ఇసుక ఎక్కువ రేట్లకు విక్రయించరాదన్న ఉద్దేశంతో ప్రతి వారం పత్రికల్లో స్థానికంగా విక్రయించే రేటును ప్రకటనల రూపంలో ప్రచురిస్తోంది. అక్కడే... ఒకవేళ ఎక్కువ ధరకు విక్రయిస్తే ‘సెబ్’ నెంబరుకు కాల్ చెయ్యవచ్చంటూ ఆ ఫోన్ నెంబరు కూడా ఇస్తున్నారు. ఇక వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ ఎక్కడైనా అక్రమంగా తరలిస్తున్న వ్యవహారాలు, ఎక్కువ ధరలకు విక్రయించిన ఘటనలు జరిగితే సెబ్ తక్షణం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేసులు కూడా పెడుతోంది. ఇదిగో... ఈ చర్యల ఫలితంగానే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందుతోంది. మరి ఇసుక విధానం ఇంత పారదర్శకంగా ఉన్నపుడు ‘దోచుకో.. పంచుకో.. తినుకో’ ఎలా అవుతుంది రామోజీ? అబద్ధమైనా అతికినట్లుండాలి కదా? బాబు అక్రమాలకు... ఎన్జీటీ 100 కోట్ల జరిమానా చంద్రబాబు హయాంలో ఇసుక విధానం ఎంత దారుణంగా ఉందో సాక్షాత్తూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునలే తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు.. సాక్షాత్తూ తన ఇంటి పక్కనే కృష్ణా నదిని తొలిచేస్తూ టీడీపీ నేతలు ఇసుకను తరలించడాన్ని ప్రోత్సహించారంటే దోపిడీ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ వందల లారీలు తన ఇంటి మీదుగానే అక్రమంగా తరలిపోతున్నా... వాటా వచి్చందో లేదో చూసుకున్నారు తప్ప పర్యావరణానికి జరుగుతున్న డ్యామేజీని ఆయన పట్టించుకోలేదు. దీనిపై ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరిపి... అక్రమాలు ముమ్మాటికీ నిజమని తేల్చింది. టీడీపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. విచిత్రమేంటంటే జాతీయ స్థాయిలో బాబు ఇసుక మాఫియా గురించి బట్టబయలైనా... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ ఒక్క అక్షరం కూడా రాయటానికి పూనుకోలేదు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగినా... వినియోగదారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇసుకను కొనుక్కోవాల్సి వచి్చనా ఇప్పుడు రాసిన తరహాలో రామోజీ ఎన్నడూ ఒక్క వార్త కూడా రాయలేదెందుకు? ఇసుక లారీలు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా... టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా ఎందుకు ప్రశి్నంచలేదు? తమ వాటా తమకు అందేసిందనా? అది కదా... అసలైన డీపీటీ!! సబ్ కాంట్రాక్టులు ఎవరికివ్వాలో చెప్పగలమా? వాస్తవానికి టెండర్లలో పాల్గొని దక్కించుకున్న కాంట్రాక్టరు... ఆ తరవాత టెండరు నిబంధనలను పాటిస్తూ ఎవరికి సబ్కాంట్రాక్టుకు ఇచ్చుకున్నా, తనను అలా చేయకుండా నిలువరించటం కష్టం. సబ్కాంట్రాక్టు ఎవరికివ్వాలన్నది కాంట్రాక్టరు ఇష్టం. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఇదే పద్ధతి. పోనీ చంద్రబాబు హయాం చూసుకున్నా ఇదే తీరు కదా? కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్కు ఇస్తే... ఆ శ్రీనివాస్ సదరు పనులను సీఎం రమేష్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుకిచ్చాడు. మరి అప్పుడెందుకు కలమెత్తలేదు రామోజీరావు గారూ? అసలు నిజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి. చదవండి: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
అక్రమాలకు అడ్డుకట్ట.. ఇసుక కోరినంత
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పారదర్శకంగా జిల్లా ప్రజలకు కోరినంత ఇసుకను జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తోంది. కృష్ణా, పెన్నా తీర ప్రాంతాల నుంచి ఉప్పునీటి తాకిడి లేని ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లను రెట్టింపు చేసి భారీగా నిల్వ చేసింది. జగనన్న కాలనీలకే కాకుండా ఇతర కట్టడాలకు సరిపడా ఇసుకను సరఫరా చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమార్కుల చెర నుంచి వినియోగదారులను గట్టున పడేసినట్లు అయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అన్ని రకాల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పెన్నా నది ఇసుక సంగం రీచ్ ద్వారా జిల్లాకు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 40 నుంచి 50 వేల టన్నుల ఇసుకను జిల్లాలోని వినియోగదారులకు అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంగోలుతో పాటు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో ప్రధాన ఇసుక స్టాక్ పాయింట్లు ఉండేవి. పుష్కలంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అదనంగా ఏడు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. త్వరలో కృష్ణా నది ఇసుకను జిల్లాకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 500 ఇళ్లకుపైగా ఉన్న జగనన్న కాలనీలకు ప్రత్యేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక ఉచితంగా సరఫరా అవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా 500 ఇళ్లకు పైగా ఉన్న జగనన్న కాలనీల్లోనే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఆయా కాలనీల సమీపంలో పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో జగనన్న కాలనీలకు సకాలంలో నాణ్యమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సింగరాయకొండలోని నిర్మిత కేంద్రం, కనిగిరి పట్టణం, పొదిలి, దర్శి, గిద్దలూరు టిడ్కో ఇళ్ల పక్కన, యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు కూడా అక్కడ నుంచే ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక జిల్లాలో ఇతర కట్టడాలకు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక ఉంచేలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా చార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు సరఫరా చేస్తోంది. ఎవరైనా ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే ఎస్ఈబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. నెలకు 20 వేల టన్నులకు పైగా... జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు నెలకు దాదాపు 20 వేల టన్నులకు పైగా ఇసుకను గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తోంది. ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు కోర్టు కేసుల వలన నిలిచిపోయాయి. అవి కూడా ప్రారంభమైతే మరో 5 నుంచి 10 వేల టన్నుల వరకు అదనంగా ఇసుక వాడకం పెరుగుతుంది. జిల్లాలో మొత్తం 570 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం ప్రస్తుతం 50,813 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యమైన ఇసుకతో ఇళ్లు నిర్మించుకున్నాం గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ అధికారులు నెల్లూరు జిల్లా, సంగం ప్రాంతంలోని పెన్నా నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఉచితంగా అందజేశారు. హాండ్లింగ్ చార్జీల కింద టన్నుకు రూ.175 చొప్పున మాత్రమే ఇచ్చిన ఇసుక తెచ్చుకున్నాం. నాణ్యమైన ఇసుక కావటంతో నిర్మాణం కూడా బాగా వచ్చింది. పటిష్టంగా నిర్మించుకున్నాం. జగనన్న కాలనీ వల్ల సొంతింటి కల నెరవేరింది. అందుకే ఇంటిపై జగనన్న ఫొటోను కూడా ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మా కుటుంబంలో జగనన్నను ఒక సభ్యునిగా చేసుకున్నాం. – ధారా నందిని భవానీ, రామాయణ కండ్రిక, పొదిలి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా... ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్లకు కూడా అందిస్తున్నాం. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా 20 నుంచి 25 వేల టన్నుల వరకు సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలకు అందుబాటులోనే ఇసుక సరఫరా చేస్తున్నాం. – ఈమని పేరయ్య, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ -
ముందస్తు చర్యలు..మస్తుగా ఇసుక నిల్వలు
సాక్షి ప్రతినిధి, కడప : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదులు పొంగి పొర్లాయి. దీంతో ఇసుక రీచ్లు దాదాపు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా డిపోల్లో లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుకను సిద్ధంగా ఉంచడంతో ప్రస్తుతానికి కొరత లేకుండా పోయింది. అవసరమైన వినియోగదారులకు ఇసుక డిపోల నుంచే తరలిస్తున్నారు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టిన వెంటనే అన్ని రీచ్ల ద్వారా 12,98,835 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది. ∙ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వైఎస్సార్ జిల్లాలో పెన్నా, చిత్రావతి, కుందూ, పాపాఘ్ని నదులు పొంగి ప్రవహించాయి. వీటి పరిధిలో జిల్లాలో 18 ఇసుక రీచ్లు ఉండగా, వరద ప్రభావంతో ప్రస్తుతం 15 మూతపడ్డాయి. జిల్లాలోని వెంకాయ కాలువ, ఏటూరు, గడ్డంవారిపల్లె రీచ్ల నుంచి మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. మొత్తం 18 రీచ్ల పరిధిలో 88.722 హెక్టార్ల పరిధిలో 8,43,765 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండేది. అయితే ఈ రీచ్లు మూతపడడంతో ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రభుత్వం ముందస్తు చర్యగా జిల్లాలోని బద్వేలు, చిన్నచౌకు, పోరుమామిళ్ల, మైదుకూరు, పగడాలపల్లె, కమలాపురం, నందిపల్లె, పులివెందుల, కె.వెంకటాపురం, పి.అనంతపురం, నంగనూరుపల్లె డిపోలలో 5,07,476 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచింది. అన్నమయ్య జిల్లాలో చెయ్యేరు, బాహుదా, మాండవ్యలు పొంగి ప్రవహించాయి. దీంతో ఆ జిల్లా పరిధిలోని 13 ఇసుక రీచ్ల్లో 11 మూతపడ్డాయి. కేవలం మందరం, గంగిరెడ్డిపల్లె రీచ్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మొత్తం 13 రీచ్ల పరిధిలో 53.427 హెక్టార్లలోని రీచ్ల ద్వారా 4,55,070 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండేది. అయితే రీచ్లు మూతపడడంతో ప్రస్తుతం అక్కడి నుంచి ఇసుక తరలించడం నిలిచిపోయింది.జిల్లాలోని మంగంపేట, వెంకటరాజుపేట, రాయచోటి, మందపల్లె, టంగుటూరు, పీలేరు ఇసుక డిపోల పరిధిలో 1,77,395 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. నదుల్లో నీరు తగ్గాక రీచ్లను పునరుద్ధరిస్తాం వర్షాల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని నదుల్లో నీరు పారుతుండడంతో 90 శాతానికి పైగా ఇసుక రీచ్లు మూతపడ్డాయి. అయితే వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 19 ఇసుక డిపోల పరిధిలో ప్రస్తుతం 6,84,873 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇసుక అందుబాటులో లేదన్న ఫిర్యాదులు మాకు లేవు. నదుల్లో నీరు తగ్గిన వెంటనే రీచ్లను పునరుద్ధరిస్తాం. – పి.వెంకటేశ్వరరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భగనులశాఖ, కడప రెండు జిల్లాల పరిధిలో ప్రస్తుతం 19 ఇసుక డిపోల్లో 6,84,873 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. దీంతో అవసరమైన వినియోగదారులకు డిపోల నుంచి ప్రభుత్వం ఇసుకను తరలిస్తోంది. వరద ప్రవాహం తగ్గిన వెంటనే రెండు జిల్లాల్లోని 31 రీచ్ల పరిధిలో 142.149 హెక్టార్లలో 12,98,835 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి రానుంది.