నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ | State cabinet to meet today | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

Published Fri, Sep 20 2013 1:43 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత తొలిసారిగా శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత తొలిసారిగా శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రెండు నెలల విరామం తరువాత శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులు, అనుకూలంగా తెలంగాణ మంత్రులు చీలిపోయిన నేపథ్యంలో శుక్రవారం జరిగే భేటీకి ప్రాధాన్యం నెలకొంది.

భూ కేటాయింపులు, పోస్టుల మంజూరు వంటి అంశాలే తప్ప ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలేవీ ఉండబోవని అధికార వర్గాలు చెబుతున్నాయి. పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాల్సిం దిగా ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే రచ్చబండ నిర్వహణ కూడా నిలిచిపోయింది. ఈ రెండు అంశాలపై చర్చ జరిగే అవకాశముందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement