Kiran Kumar Reddy Nallari
-
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుపై మిథున్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
కిరణ్కుమార్ను చిత్తుగా ఓడిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కారణమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, పెద్దిరెడ్డి శుక్రవారం పుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. విద్య, వైద్యం కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం ఖర్చు చేసే పనిలేకుండా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకున్నారు. సీఎం జగన్ను మళ్లీ గెలిపించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకే కుటుంబం ఇక్కడ 30 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించాం. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తాం. మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాను. మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ విజయానికి మనమంతా కృషి చేయాలి. ఇదే సమయంలో.. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తాం. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్ను వేధించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు. కిరణ్ కుమార్ నమ్మకద్రోహి’ అంటూ కామెంట్స్ చేశారు. -
నల్లారి కిరణ్పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, అనంతపురం: చంద్రబాబుకి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు కట్టడా? అంటూ ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. సీఎం జగన్ రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ‘‘చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం. కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్. సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. అమిత్ షా కాళ్లు పట్టుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీనే పొత్తు అడిగిందని అబద్దాలు చెప్తున్నాడు’’ అంటూ పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కిరణ్కుమార్ రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్రెడ్డిది. ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతాడు. సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం జగన్ని అణగదొక్కడానికి సోనియాగాంధీతో కుమ్మక్కయ్యాడు. ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తాము’’ అని పెద్దిరెడ్డి అన్నారు. ‘‘సీఎం జగన్ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోంది. నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు. 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్సు యాత్రతో కలిగింది’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
రబ్బరు బుల్లెట్లకు కూడా ఒప్పుకోలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై సోనియా గాంధీ చాలా సానుకూలంగా ఉండేవారని, ఉద్యమం ఎంతటి తీవ్ర రూపం దాల్చినా బలప్రయోగం చేయవద్దని, కనీసం రబ్బరు బుల్లెట్లు కూడా ఉద్యమకారులపై ప్రయోగించకూడదని ఆమె కచ్చితమైన ఆదేశాలిచ్చారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి చెప్పారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్కుమార్రెడ్డికి సోనియా గాంధీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. సమైక్య రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలే తప్ప అణచివేతలు వద్దని ఆదేశించారన్నారు. వైఎస్ దిగ్రేట్.. కాగా, తనకు విమానం ఎక్కడం ఇష్టం ఉండదని, అయినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆదేశాలతో ఒకసారి ఎక్కానని జగ్గారెడ్డి చెప్పారు. ఏ విషయాన్నయినా ఫాలోఅప్ చేయడంలో వైఎస్ దిగ్రేట్ అని, ఆయన సీఎం అవడానికి ఎంత కష్టపడ్డారో, అయ్యాక కూడా అంతే కష్టపడ్డారని చెప్పారు. వైఎస్ తనకు అప్పగించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేయడం చాలా సంతోషానిచ్చేదని అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకులు ఇప్పుడు లేకపోవడం దురదృష్టకరమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, ఉమ్మడి రాష్ట్రంలోనే తనకు మంత్రిపదవి ఆఫర్ చేసినా వద్దన్నానని చెప్పారు. కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి వస్తుందని, అందరూ కలసి పనిచేయాలని ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ తమకు దిశానిర్దేశం చేశారన్నారు. సీఎల్పీ కార్యాలయానికి మంత్రి వేముల ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ సభ్యులు సభలోకి వెళ్లకపోవడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి.. సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. లాబీల్లో నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తీసుకుని ఆయన సీఎల్పీకి వచ్చారు. ఆ సమయంలో సీఎల్పీ నేత భట్టి, శ్రీధర్, వీరయ్యలు అక్కడే ఉన్నారు. దీంతో సభకు వచ్చి అసెంబ్లీ సమావేశాలు సజావుగా నడిచేందుకు సహకరించాలని ప్రశాంత్రెడ్డి వారిని కోరారు. శనివారం కేటీఆర్ మాట్లాడిన సందర్భంగా తమను జంతువులతో పోల్చడం బాధ కలిగించిందని, ఈ విషయంలో స్పీకర్ను కలుస్తామని చెప్పారు. కానీ, ప్రశాంత్రెడ్డి సర్దిచెప్పి వారిని సభలోపలికి తీసుకెళ్లడం గమనార్హం. -
కమలంలో ఆగని లుకలుకలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోని అసంతృప్త స్వరాలు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన సభలో వేదికపై కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ట్వీట్ల ద్వారా స్పందించిన వైఖరిపై పార్టీలో చర్చ జరుగుతోంది. తన విషయంలో వ్యవహరించినట్టుగా కాకుండా కిషన్రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, ఢిల్లీకి వెళ్లి లేనిపోని ఫిర్యాదులు, రిపోర్టులు ఇవ్వొద్దని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి పాల్గొనడంపై బీజేపీ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే ఒరవడి శుక్రవారం అర్ధ్థరాత్రి దాకా సాగిన రాష్ట్ర పార్టీ కోర్కమిటీ సమావేశంలోనూ కొనసాగినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణకు కిరణ్కు సంబంధమేమిటి? తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమానికి ఎలా పిలుస్తారని విజయశాంతి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇది తెలంగాణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ విషయంలో జాతీయ, రాష్ట్ర నేతలను హెచ్చరించి, ఆమె తన నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. అలా ఎలా సంజయ్? కిషన్రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో బండి సంజయ్ మాట్లాడిన తీరు బాగా లేదని రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బండి వ్యాఖ్యలు పార్టీకేడర్ను గందరగోళంలో పడేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఏవైనా ఇలాంటి అభిప్రాయాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలే తప్ప, బహిరంగంగా మాట్లాడడం ఏమిటని సంజయ్ తీరును తప్పు పట్టినట్లు సమాచారం. ఈ మేరకు కోర్ కమిటీ మీటింగ్లో వారు సంజయ్కి క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. గతం నుంచే బండి సంజయ్, ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావుల మధ్య కొంత గ్యాప్ ఉండడంతో ఈ సమావేశంలోనూ అది బయట పడినట్టు తెలిసింది. దీంతో ఆయన సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఉద్యమ కార్యాచరణ... శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా సాగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రజాసమస్యలపై ఉధృతంగా ఉద్యమించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, హామీల అమల్లో వైఫల్యంపై ప్రధానంగా కార్యాచరణను రూపొందించుకోవాలని భావించారు. తొలిసారిగా కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కోర్ కమిటీ భేటీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. అలాగే ముఖ్యనేతలు ఎవరొచ్చినా.. దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీఆర్ఎస్ సర్కారు వారికి చేసిన మోసాన్ని తెలియ జేసేలా చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. బీజేపీ మాత్రమే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించగల దనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని.. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. -
కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో, తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇక, శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ నేతలు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్లో రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్చుగ్ పాల్గొన్నారు. ఇక, ఈ మీటింగ్ సందర్బంగా తెలంగాణలో బీజేపీ నేతల మధ్య సమన్వయం కోసం హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించే పనిలో హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీకి మరో కొత్త టెన్షన్ కలవరపెడుతోంది. బీజేపీ నేతల సమావేశాలకు ఏపీ నేతలు రావడంతో తెలంగాణ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్కుమార్ రెడ్డి రాకను బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యతిరేకించారు. కిరణ్ కుమార్ మాకొద్దు అని రాష్ట్ర బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, కిరణ్కుమార్రెడ్డిని స్థానిక నేతలు మరో చంద్రబాబులాగా భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ను ఫాంహౌస్ అరెస్టు చేస్తాం -
కిరణ్ కుమార్ రెడ్డిపై విజయశాంతి ఘాటు విమర్శలు
-
తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిని ఎలా ఆహ్వానిస్తారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే పార్టీ నేతల మధ్య లుకలుకలు బయట పడ్డాయి. కిషన్రెడ్డి బాధ్య తల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డిని ఆహ్వానించడాన్ని, ఆయన సభలో పాల్గొనడాన్ని పార్టీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఆయనను ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడ్డట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కేటాయించబోమని, ఏమి చేసుకుంటారో చేసుకోండన్న కిరణ్కుమార్రెడ్డిని ఎలా పిలుస్తారని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, విజయశాంతి, తదితరులు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. ఉద్యమ సమయంలో తనపై కేసులు పెట్టి వేధించిన వ్యక్తిని పిలవడంపై విజయశాంతి నిలదీసినట్టు తెలిసింది. ఇదే తరహాలో రాజ్గోపాల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సభలో పాల్గొన్న విజయశాంతి కొంతసేపటి తర్వాత వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత ఆమె ఒక ట్వీట్ చేశారు. ‘కిషన్రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానంటూ పాత్రికేయ మిత్రులు నన్ను అడుగుతున్నారు. కానీ అది సరి కాదు. కిషన్రెడ్డిని అభినందించి, శుభాశీ స్సులు తెలియజేసిన తర్వాతే వచ్చాను. అయితే నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ వాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలని ప్రయత్నించిన వారు ఉన్నచోట ఉండటం నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఆ పరిస్థితి వల్ల ముందుగా వెళ్లవలసి వచ్చింది. అక్కడ చివరి వరకు ఉండటం అసాధ్యం. అందుకే కార్యక్రమం ముగియకముందే వెల్లిపోవాల్సి వచ్చింది..’ అని వివరణ ఇచ్చారు. నేతల వ్యాఖ్యల కలకలం కిషన్రెడ్డి బీజేపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేతల ప్రసంగాలు దుమా రం రేపుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు తనపై నాయకత్వానికి ఫిర్యాదులు చేశారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకు.. సీఎం కేసీఆర్ ఈడీని మేనేజ్ చేశారని ఆయన అనడం పార్టీ నేతల మధ్య చర్చకు దారితీసింది. కిరణ్కుమార్రెడ్డి రాకను విజయశాంతి వ్యతిరేకించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. -
టీడీపీతో పొత్తులాంటి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్కు మనుగడ ఎలా?
సాక్షి, అమరావతి: విభజన తర్వాత కూడా ఒక దశలో రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటు బ్యాంకు 8 శాతానికి పెరిగినట్లు ఓ సర్వేలో తేలిందని, ఆ సమయంలో ఆ పార్టీ పెద్దలు హఠాత్తుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇలాంటి నిర్ణయాల వల్ల ఆ పార్టీ ఎలా ముందుకు పోతుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండోసారి తాను కాంగ్రెస్లో చేరిన తర్వాత పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానన్నా.. తాను నిరాకరించానని తెలిపారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన బుధవారం విజయవాడ వచ్చారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్లో ఉండే వారికి ప్రజాజీవితంలో కొనసాగే పరిస్థితి లేదని.. తాను ఇంకా ప్రజాజీవితంలో కొనసాగాలనే బీజేపీలో చేరినట్టు వివరించారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నప్పటికీ.. గతంలో కేంద్రం హోదాకు బదులు ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధపడగా అప్పటి ప్రభుత్వం దానికి అంగీకరించిందని పరోక్షంగా చంద్రబాబు నిర్ణయాన్ని గుర్తుచేశారు. మూడు రాజధానులపై పార్టీ అభిప్రాయమే తన అభిప్రాయమని తెలిపారు. తన తమ్ముడు టీడీపీలో కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏ పా ర్టీలో కొనసాగాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
‘కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే!’
వర్తమాన రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఏ విలువలు అయితే పాటించకూడదో, ఎలాంటి వ్యక్తిత్వానికయితే దూరంగా ఉండాలో ఆ ఇద్దరు వ్యక్తులు సజీవ సాక్ష్యంగా కనిపిస్తారు. మొదటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి అన్ని హంగులు, అర్భాటాలు అనుభవించి.. చివరికి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించి.. ఇప్పుడు ఏకంగా పార్టీకే పంగనామాలు పెట్టారు కిరణ్ కుమార్. ఇక రెండో వ్యక్తి చంద్రబాబు. ఆయన మాస్టర్ ప్లాన్ మామూలుగా ఉండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఎప్పటికప్పుడు అతి తెలివి ప్రదర్శిస్తునే ఉంటారు. తన అనుయాయులందరిని బీజేపీలోకి పంపించి తన పబ్బం గడుపుకుంటున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వెనక కూడా చంద్రబాబే ఉన్నారా? కావొచ్చంటున్నారు సీనియర్ జర్నలిస్టు దేవుల పల్లి అమర్. కిరణ్ కుమార్, చంద్రబాబు.. ఇద్దరి వ్యవహారాలు కచ్చితంగా భిన్నంగా చూడాల్సిందేనంటున్నారు. -
అదానీ, ఐదుగురు నేతలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
-
కిరణ్ కుమార్రెడ్డి.. తెలంగాణ బీజేపీ కోసమా? ఏపీ బీజేపీకా?
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన కుటుంబం ప్రస్తుతం రాజకీయాలలో తలోదారి చూసుకుంటున్నట్లుగా ఉంది. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కిరణ్ అయితే 2014 నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అలా అని రాజకీయాలను వదలివేయలేదు. మధ్యలో కొంతకాలం కాంగ్రెస్లో చేరివచ్చారు. కాని అంత సంతృప్తి కలగలేదు. ఆ పార్టీ అధిష్టానం కూడా కిరణ్ను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆయన బీజేపీలో ఏమైనా గుర్తింపు వస్తుందేమోనన్న ఆశతో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉన్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతోందని ఆయన అన్నారు. తప్పు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. అంటే దీని అర్ధం కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేయడం కూడా తప్పు నిర్ణయమేనా?అని ప్రశ్నిస్తూ పోస్టింగ్లు పెడుతున్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఆయనకు నచ్చలేదు. బాగానే ఉంది. కాని ఆయన ఒకసారి పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లు? ఆ తర్వాత బీజేపీలో చేరడంలోని ఆంతర్యం ఏమిటి? బీజేపీ కూడా ఉమ్మడి ఏపీ విభజనకు సహకరించిన పార్టీనే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి విభజన హామీలన్నిటిని నెరవేర్చలేదు కదా! పోలవరం ప్రాజెక్టు కు పూర్తిస్థాయిలో నిదులు ఇవ్వడానికి వెనుక, ముందాడుతోంది కదా! తెలంగాణ బీజేపీ కోసమా? ఏపీ బీజేపీకా? విశాఖ రైల్వేజోన్ ను ఆరంభించలేదు కదా! తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనకు చొరవ తీసుకోవడం లేదు కదా! ఇలా పలు అంశాలలో బీజేపీ పెద్ద సీరియస్గా లేదని విమర్శలు ఉన్న తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో చేరడం విశేషం. అసలు కిరణ్ తెలంగాణ బీజేపీ కోసం పనిచేస్తారా?లేక ఏపీకి పరిమితం అవుతారా? లేక రెండు రాష్ట్రాలలో కీలక పాత్ర పోషిస్తారా? అందుకు తెలంగాణ బీజేపీ నేతలు అంగీకరించే అవకాశం ఉంటుందా?ఏపీతో పాటు తెలంగాణలో కూడా కిరణ్ ప్రభావం ఉంటుందని పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి అన్నారు. అది అయ్యేపనేనా! ఇప్పటికే భారతీయ రాష్ట్ర సమితి ఈ విషయమై విమర్శలు చేసింది. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించిన కిరణ్ ను బీజేపీలో చేర్చుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే బల్క సుమన్ ద్వజమెత్తారు. ఏపీలో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకున్నా,అక్కడ పార్టీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జనసేనతో పొత్తు ఉంటుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నేపధ్యంలో కిరణ్ సోదరుడు టీడీపీలో ఉండడం, ఈయనేమో బీజేపీలో చేరడం ఏమైనా వ్యూహం ఉందా అన్న అనుమానం వస్తుంది. నేరుగా తెలుగుదేశం లో చేరలేని పరిస్థితిలో ఆయన బీజేపీలో చేరవలసి వచ్చిందా? కిషోర్ కుమార్ రెడ్డి 2014లో అన్న స్థాపించిన జై సమైక్యాంద్ర పార్టీ తరపున పీలేరులో పోటీచేసి ఓడిపోయారు. తదుపరి ఆయన టీడీపీలో చేరి గతసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఒకరు టీడీపీ.. మరొకరు బీజేపీ? కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన మరో సోదరుడు సంతోష్ రెడ్డి ఆయా వ్యవహారాలను చక్కబెట్టేవారని అంటారు. నిజానికి నల్లారి కుటుంబం వ్యక్తి ఒకరు టీడీపీలో చేరడం, మరొకరు బీజేపీలో ప్రవేశించడం ఆశ్చర్యమే. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కిరణ్కు మధ్య ఉప్పు,నిప్పు మాదిరగా పరిస్థితి ఉండేది. కిరణ్ స్పీకర్ గా ఎన్నికైనప్పుడు ఆయనను సీటులో కూర్చోబెట్టడానికిగాను ముఖ్యమంత్రి ,ఇతర పార్టీల నేతలతో కలిసి సీటువరకు రావడానికి చంద్రబాబు అంత ఇష్టపడలేదని చెబుతారు. కాని రాజకీయం ఎప్పుడూ ఒకమాదిరిగా ఉండదు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో రాజకీయాలు మారిపోయాయి. సీనియర్ నేత రోశయ్య సీఎం అయ్యారు. తదుపరి కిరణ్ అధిష్టానాన్ని ఎలా దారిలోకి తెచ్చుకున్నారో తెలియదు కాని, అందరిని ఆశ్చర్యపరుస్తూ రోశయ్య తర్వాత , ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. సీనియర్ నేత చిదంబరం, ఏపీకి చెందిన పల్లంరాజు, ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ ల ద్వారా రాహుల్ గాంధీని ఆకట్టుకోగలిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజనకు పరోక్ష కారణమన్న ప్రచారం కూడా.. కిరణ్ ముఖ్యమంత్రి అవడం సంగతి ఎలా ఉన్నా, రాష్ట్ర విభజనకు ఆయన కూడా పరోక్షంగా కారణమన్న ప్రచారం ఉంది. అదెలా అంటే ఒకదశలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉమ్మడి ఏపీని విభజించకుండా తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అనుకున్నారు. ఆ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జరగవలసి ఉంది. ఆ సమావేశాలు అయిన తర్వాత ప్యాకేజీని ప్రకటించాలని కిరణ్ కోరారని చెబుతారు. దాంతో అధిష్టానానికి ఈయనపై నమ్మకం సన్నగిల్లి తెలంగాణ ఏర్పాటుకు మొగ్గు చూపారని చెబుతారు. దానికి తోడు కాంగ్రెస్ ఎమ్.పిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని వదలిపెట్టి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుని సంచలనంగా మారడంతో ఆయన హవా తగ్గించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ విభజన వైపు వెళ్లిందని అంటారు. కిరణ్ కుమార్ రెడ్డికి బదులుగా జగన్ కు ముఖ్యమంత్రి బాద్యతలు అప్పగించి ఉంటే విభజనకు ఆస్కారం ఉండేదికాదని చాలా మంది నమ్ముతారు. అదంతా చరిత్ర. ఒక సారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు సహకరించి కిరణ్ ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడారు.అంతకుముందే జగన్ పై సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు కేసులు పెట్టి, ఆయనను జైలుకు పంపించిన స్నేహం కూడా ఉంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్ అధిష్టానం విభజనకు సంబందించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు ఇస్తానని చెప్పిన కిరణ్ అప్పట్లో చిత్ర, విచిత్రంగా వ్యవహరించారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి సమైక్యాంధ్ర పార్టీ.. ఆంధ్ర, రాయలసీమ మంత్రులతో క్యాబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేశారు. అలాగే అసెంబ్లీలో గందరగోళం మధ్య కేంద్రం పంపిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఆ పరిణామాలను పార్టీ ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ వంటివారు సమర్దించడం మరో విడ్డూరం. ఈ పరిణామాలన్నిటిని గమనించిన ప్రజలు కాంగ్రెస్ను అసహ్యించుకున్నారు.ఈ నేపద్యంలో కిరణ్ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జై సమైక్యాంద్ర పార్టీ అంటూ సొంతంగా పార్టీ పెట్టుకుని, చెప్పుల గుర్తుతో ఎన్నికలలో దిగారు. ఆయన పోటీచేయకుండా తన అభ్యర్ధులను నిలబెట్టారు. కాని ఒక్క చోట కూడా గెలవలేదు సరికదా..దాదాపు అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. ఆ ఎన్నికలలో విభజిత ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తదుపరి కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ టీడీపీలో ప్రవేశించడం విశేషం. దీనికి కిరణ్ అనుమతి లేకుండా జరిగిందా అన్న చర్చ కూడా వచ్చింది. అయినా రాజకీయాలలో ఇలాంటివి మామూలే అనుకున్నా, కిరణ్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తదుపరి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కాని యాక్టివ్ కాలేదు. ఇప్పుడు సడన్ గా బీజేపీ వైపు ఆయన మనసుపడ్డారు. ప్రధాని మోడీ బాగా పనిచేస్తున్నారని మెచ్చుకుంటున్నారు. కిరణ్ వల్ల ఏపీలోకాని, తెలంగాణలో కాని బీజేపీకి ఎంత ప్రయోజనమన్నది అప్పుడే చెప్పలేం.కాకపోతే కిరణ్ బాల్యం నుంచి హైదరాబాద్ లోనే ఎక్కువకాలం పెరిగారు. అదే కిరణ్కు టర్నింగ్ పాయింట్ ఆయన తండ్రి అమరనాధ్ రెడ్డి కరడుకట్టిన కాంగ్రెస్ వాదిగా గుర్తింపు పొందారు. ఇందిరాగాంధీకి విదేయుడుగా ఉన్నారు. తండ్రి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కిరణ్ తల్లి టీడీపీపై పోటీచేసి ఓటమిచెందడం మరో ప్రత్యేకత. ఆ తర్వాత కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి 1989, 1999, 2004, 2009లలో గెలుపొందారు. తొలుత వైఎస్ హయాంలో ఛీప్ విప్ గా పనిచేసి, అనేక సందర్భాలలో చంద్రబాబును ఇరుకున పెట్టడానికి యత్నించేవారు. 2009లో కిరణ్ కు వైఎస్ స్పీకర్ పదవి ఇచ్చారు. అది ఆయనకు టర్నింగ్ పాయింట్ . ఆ హోదాతో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అంతేకాక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రోశయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలన్న ఆలోచన రావడం వంటివి ఆయనకు కలిసి వచ్చాయి. తన పదవిలో ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసి కొన్ని కేసులలో జైలులో పెట్టించడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అయినా కాంగ్రెస్కు అవేమీ పనికి రాలేదు. అభయహస్తం పేరుతో వంద రూపాయలకే నిత్యావసర వస్తువులు ఇచ్చే స్కీమును తీసుకు వచ్చారు కాని జనం పట్టించుకోలేదు. తెలుగులో అంత పెద్ద వాగ్దాటి లేని కిరణ్ ఉమ్మడి ఏపీలో చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కాంగ్రెస్ను కాదని బీజేపీలో చేరిన కిరణ్ ఆ పార్టీకి ఎలా ఉపయోగపడతారో అప్పుడే చెప్పలేం.కొసమెరుపు ఏమిటంటే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా ఏపీ, తెలంగాణలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు పెద్దగా డిల్లీలో కనిపించకపోవడం. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ -
నల్లారి కుటుంబంపై పీలేరు ఎమ్మెల్యే సవాల్
-
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తథ్యం
సాక్షి, వనపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కంటే సీఎం కేసీఆర్ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, ప్రజాఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపేందుకు బుధవారం వనపర్తికి వచ్చిన ఆయన మాట్లా డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏనాడూ ప్రభుత్వ అత్యున్నత అధికారి, మరో ముగ్గురు ఐఏఎస్లను హైకోర్టు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే అన్యాయం ప్రభుత్వం వైపు ఉందని తెలుస్తోందన్నారు. తెలంగాణ ఇస్తే చాలా రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని కేంద్రం అంటే.. ఉన్న తెలంగాణ ఇవ్వాలని అడిగినం. అలాగే ఆర్టీసీ విలీనం చేస్తే 91 కార్పొరేషన్ల డిమాండ్ చేస్తాయని చెబుతున్న సీఎం కేసీఆర్.. పూర్వం ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీనే విలీనం చేయమని కోరుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు. హైకోర్టులో తీర్పు రాకముందే సుప్రీం కోర్టు వెళ్తామని చెప్పడం కార్మికుల అంతిమ విజయానికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ సంగతి చూస్తాం... అంతు తేలుస్తాం అంటారే తప్పితే చేసిందేమీ లేదని, న్యాయస్థానంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు బోనులో దోషిగా నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్కు శాపనార్థాలు పెట్టవద్దని, దేవుడా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రతి కార్మికుడు కోరుకోవాలని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకావడం తథ్యమని అన్నారు. యుద్ధంలో శత్రువు బతికి ఉన్నప్పుడే గెలవాలని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్ జాగీరుకాదని, ఏవడబ్బ సొమ్మని అమ్ముకుంటావు అంటూ నిప్పులు చెరిగారు. కార్మికులు విధుల్లో చేరకపోతే 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చూస్తే కేసీఆర్ ముందే కుట్రపన్నాడని తెలుస్తోందన్నా రు. హైకోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి అక్షింతలు తప్పడంలేదని, ఒక దశలో ఇదేమి రాజరికంకాదని వ్యా ఖ్యానించిందంటే ప్రభుత్వంపై రాజ్యాంగ సంస్థ ఎంతమేర అసహనంతో ఉందో ఇట్టే అర్థమైతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆర్.గోపిగౌడ్, జేవీ స్వామి, ఖయ్యాం, విశ్వనాథ్, యాదయ్య, డీబీకే రెడ్డి, వీవీమూర్తి, చలపతిరెడ్డి, బాలస్వామి ఉన్నారు. 40వ రోజుకు చేరిన సమ్మె ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 40వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యా్యమూర్తులతో కమిటీ వేస్తామంటే విముఖత చూపడం ప్రభుత్వ దివాళాకోరు తానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, బీసీ సంఘం నేత యుగంధర్గౌడ్, బీజేపీ కృష్ణ, పరశురాం, వెంకటేశ్వర్రెడ్డి. ఎమ్మార్పీఎస్ గద్వాల కృష్ణ, కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాడీ బిల్డర్స్కు మంత్రి తనయుడి చేయూత
మారేడుపల్లి : చైనా దేశంలోని మంగోలియాలో సెప్టెంబర్ 12 నుండి 18 వరకు జరుగనున్న మిస్టర్ ఏషియన్, మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపికైన బాడీ బిల్డర్స్కు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ చేయూతనిచ్చారు. కార్ఖానా కాకగూడకు చెందిన కిరణ్కుమార్ సాధించిన పతకాలతో పాటు మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీల ఎంపికకు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో ‘చేయూతనందిస్తే సత్తా చాటుతా’ అనే కథనం సోమవారం ప్రచురితమైంది. తలసాని సాయికిరణ్ యాదవ్ స్పందించి కిరణ్కుమార్ను మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలను సేకరించారు. పోటీలకు ఎంపికైన కిరణ్కుమార్తో పాటు మహ్మద్ నిజాముద్దీన్లకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్న వారికి రానుపోను 6 లక్షల రూపాయలు చెల్లించి విమాన టిక్కెట్లను బుక్చేశారు (ఒక్కొక్కరికి 3 లక్షలు చొప్పున). ఈ సందర్బంగా సాయికిరణ్యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనందిస్తుందని ఆయన అన్నారు. -
బాలస్వామి సన్యాస స్వీకార మహోత్సవం ఆరంభం
సాక్షి, విజయవాడ/తాడేపల్లిరూరల్ (మంగళగిరి) : విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్కుమార్ శర్మ బాలస్వామి సన్యాస స్వీకరణ, పట్టాభిషేక మహోత్సవాలకు.. వేద మంత్రోచ్ఛారణలు, హోమాల మధ్య శనివారం ఉదయం అంకురార్పణ జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టవెంట ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం.. సన్యాస స్వీకరణ కార్యక్రమానికి వేదికైంది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం తొలిరోజు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో అంగరంగవైభవంగా జరిగింది సన్యాసదీక్ష స్వీకరిస్తున్న కిరణ్కుమార్ శర్మ స్వస్థలం విశాఖ జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్ 4న ఆయన జన్మించారు. హనుమంతరావు ఇద్దరి కుమారుల్లో పెద్దవాడు కిరణ్కుమార్ శర్మ. మూడో తరగతి చదువుతున్నప్పుడు తల్లిదండ్రులతో స్వామిజీ ఆశ్రమానికి వచ్చారు. మహాస్వామి కంటికి ఆ బాలుడు అపర శంకరుడుగా గోచరించడంతో పీఠంలో చేర్చాలని తల్లిదండ్రులను మహాస్వామి కోరారు. తర్వాత మహాస్వామికి ప్రధాన శిష్యుడయ్యారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శ్రీరాజశ్యామలాదేవి పీఠం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్వరూపానందేంద్రను దర్శించుకున్న ప్రముఖులు రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, సినీనటి శారద, సినీ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. -
ప్రజా విజయ 'కిరణం'
సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్ట నష్టాలు చూసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై ఉన్న ఆధరాభిమానాలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్కు ఎమ్మెల్యేగా ప్రజలు భారీ మెజార్టీతో పట్టంకట్టారు.గురువారం విడుదలైన 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో భారీ గెలుపుతో ఫ్యాన్ స్పీడ్ విజయకేతం ఎగురవేసింది. టీడీపీ అరాచక, అవినీతి పాలనను అనుభవిస్తూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందక, మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించే జననేత వచ్చారని, ఐదేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు ఉండవని, జగన్మోహన్రెడ్డి సుపరిపాలనతో పాటు నవరత్నాల పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురుచూశారు. టీడీపీ అరాచక పాలనతో విసుగెత్తిన ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గొర్లె కిరణ్కుమార్, టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ప్రజలతో మమైకమై ప్రజా కష్టాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరి ఓటేశారు. వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. వైఎస్సార్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్కుమార్ను ఎన్నుకున్నారు. గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అనుహ్య మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ను గెలిపించారు. మండలంలోని 115 పంచాయతీల్లో అన్ని గ్రామాలు వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చి ప్రజలు వైఎస్సార్సీపీపై ఉన్న ఆదరాభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్సీపీదే ఆధిక్యత ఎచ్చెర్ల నియోజకవర్గంలో జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో అన్ని రౌండ్ల్లోనూ వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఏ దశలోనూ కనీసం టీడీపీ పోటీ ఇవ్వలేకపోయింది.కళా వెంకట్రావుపై గొర్లె కిరణ్కుమార్ అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. గొర్లె కిరణ్కుమార్ 18,813 ఓట్ల ఆధిక్యతతో టీడీపీకి చెందిన కళా వెంకట్రావుపై గెలిచారు. పనిచేయని ఈవీఎంలు ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఓట్ల కౌంటింగ్లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. 45వ పోలింగ్ కేంద్రం నిద్దాం ప్రాంతానికి చెందిన ఈవీఎం, 172 కొవ్వాడకు చెందిన ఈవీఎంలు పనిచేయలేదు. ఓట్లు డిస్ప్లే కాకపోవడంతో ఆయా ఈవీఎంలను కౌంటింగ్ సూపర్వైజర్లు సరెండర్ చేశారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్లను లెక్కించి పరిగణనలోకి తీసుకున్నారు. స్పష్టమైన మెజార్టీ ఉండడంతో రాజకీయ పార్టీ ఏజెంట్లు సైతం ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు. మొరాయించిన 168వ నంబర్ పోలింగ్ ఈవీఎం విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఓటింగ్ కౌంటింగ్కు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో మెంటాడకు చెందిన 168వ పోలింగ్ కేంద్రం పనిచేయలేదు. ఈవీఎం స్థానంలో వీవీప్యాట్ను అధికారులు లెక్కించారు. ఈ కౌంటింగ్లో వైఎస్సార్సీపీకి– 335. టీడీపీకి–229 ఓట్లు, జనసేన–4 నమోదయ్యాయి. మిగిలిన ఓట్లు ఇతరకు నమోదయ్యాయి. ఎంపీకి స్పష్టమైన ఆధిక్యత వైఎస్సార్సీపీకి ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. 14,476 ఓట్లు ఆధిక్యత వచ్చింది. సుమారు 23 రౌండ్లో 22 ఆధిక్యం కొనసాగింది. బెల్లాన చంద్రశేఖర్ 96112 ఓట్లు, ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఎంపీ అశోక్కు 81636 ఓట్లు, జనసేన అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావుకు 4530, కాంగ్రెస్ అభ్యర్థి ఆదిరాజుకు 2134 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. కౌంటింగ్ను పరిశీలించిన కిరణ్కుమార్ శివానీ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన కౌంటింగ ప్రక్రియను గొర్లె కిరణ్కుమార్ పరిశీలించారు. తనకు మెజార్టీ వచ్చిన రౌండ్లు, గ్రామాలు పరిశీలించారు. జనరల్ ఏజెంట్లు పిన్నింటి సాయికుమార్, ఎం.మురళీధర్ బాబా పోలింగ్ సరళిని ఆయనకు వివరించారు. మెజార్టీ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల వివరాలు ఎచ్చెర్ల క్యాంపస్: విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించిన పోస్టల్ బ్యాలెట్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సగానికి పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో 1394 ఓట్లు వినియోగించుకోగా 726 ఓట్లు చెల్లలేదు. 668 ఓట్లు నమోదయ్యాయి. మూడు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 326 ఓట్లు వైఎస్సార్సీపీకి మెజార్టీ లభించింది. పోస్టల్ బ్యాలెట్లో నమోదైన ఓట్ల వివరాలు వైఎస్సార్సీపీ– 479, టీడీపీ– 153, జనసేన–42, కాంగ్రెస్–3, నోటా–5 తిరస్కరణ–3 మొత్తం– 685 422 సర్వీసులు ఓట్ల వినియోగం ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల జోన్లో 422 సర్వీసు ఓటర్ల నమోదయ్యాయి. ఇందులో 333 ఓట్లు చెల్లిన ఓట్లు 123,. టీడీపీకి–118, బీజీపే–34, జనసేన–51, కాంగ్రెస్–6, ఒక ఓటు తిరస్కరణకు గురైంది. -
తొలి గెలుపు అదుర్స్
సాక్షి, శ్రీకాకుళం: ఫ్యాన్ గెలుపు సునామీలో సైకిల్ కొట్టుకుపోయింది. తలపండిన టీడీపీ నేతలకు దిమ్మతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతిపరుల పాలనను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న నవ నాయకత్వానికి పట్టం కట్టారు. జిల్లాలో ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తొలిసారి గెలుపు రుచేంటో చూపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలిసారి అడుగిడునున్న రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, సీదిరి అప్పలరాజుల గెలుపునకు దోహదపడిన కొన్ని అంశాలు చదివిద్దేమిలా.. డాక్టర్ దెబ్బకు టీడీపీ కోట బద్దలు మందస: ఓ వైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం.. సామ, దాన, భేద, దండోపాయాలు తెలిసిన నాయకత్వం గౌతు శ్యామసుందర శివాజీ సొంతం. మరోవైపు పిన్న వయస్కుడు, అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు భారతంలోని అభిమన్యుడు లాంటి వాడే. ఈయన కురువృద్ధుడు లాంటి శివాజీ రాజకీయ బాణాలను, పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్రాలతో ఎదుర్కొని జయకేతనం ఎగురవేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఓమారుమూల గ్రామమైన దేవునల్తాడలో ఓ సామాన్య మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి దాలయ్య, నీలమ్మ దంపతులకు అప్పలరాజు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను రుజువు చేస్తూ, విద్యలో మంచి ప్రతిభ చూపారు. ఎంబీబీఎస్ చదివి పలాస–కాశీబుగ్గలో ప్రాక్టీసు చేస్తూ ఎంతో మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ అప్పలరాజు ప్రతిభ, నిపుణత చూసి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయాల్లో దూసుకుపోయారు. ప్రజల మనసులో మంచిస్థానం సంపాదించగలిగారు. ఈయన్ను ఎదుర్కొనలేక టీడీపీ కుటిల యత్నాలకు దిగింది. ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే గౌతు శివాజీ, అభ్యర్థిగా శిరీష, ఆమె భర్త వెంకన్నచౌదరి, గౌతు విజయలక్ష్మి, జీకే నాయుడు, పీరికట్ల విఠల్రావు, వజ్జ బాబురావు ఇలా ఒకరేమిటి ఎంతోమంది రాజకీయ అనుభవం గల నాయకులు ఒక వైపు.. తానొక్కడే ఒంటిచేత్తో మరో వైపు పోరాడిన అప్పలరాజు సునాయాస విజయాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శివాజీ కుమార్తె శిరీషను ఓడించి, పలాసలో వైఎస్సార్సీపీకి స్థానం కల్పించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయ వ్యూహానికి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రెడ్డి శాంతి ప్రభంజనం ఎల్.ఎన్.పేట: పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గెలుపు జన ప్రభంజనంగా నిలిచింది. ఈమెను ఓడించాలని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నిన కుయుక్తులు ఓటర్ల సునామీలో కొట్టుకుపోయాయి. స్థానికేతరాలని, ఈమెను కలవాలంటే ఢిల్లీ వెళ్లాలా అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. వంశధార నిర్వాసితులను బలవంతంగా గ్రామాల నుంచి బయటకు పంపించిన తెలుగుదేశం పార్టీకి వారి ఉసురే తగిలిందని నిర్వాసిత గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు నిర్వాసితుల అండగా నిలుస్తారని భావించినప్పటికీ గట్టి గుణపాఠమే చెప్పారు. మెళియాపుట్టి మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్లో నష్టపోయిన బాధితుల సమస్యలతోపాటు వంశధార నిర్వాసితుల సమస్యలపైన పోరాటం చేస్తూ అండగా నిలిచిన ఈమె తన విజయానికి బాటలు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు చేసిన అక్రమాలు ప్రజలకు వివరించడంతోపాటు ప్రజలకు అండగా ఉంటానని నియోజకవర్గం మొత్తంగా పర్యటించినందుకు ప్రజలంతా అక్కున చేర్చుకున్నారు. కిరణ్కే పట్టం ఎచ్చెర్ల క్యాంపస్: రాజకీయ కురువృద్ధుడు, మంత్రి కళా వెంకటరావును ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టి కరిపించారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ ఉనికి లేకుండా చేసిన కళాకు ఓటర్లు సైతం గట్టి సమాధానమిచ్చారు. ఈ మేరకు స్థానిక నేత గొర్లె కిరణ్కుమార్కు బ్రహ్మరథం కట్టారు. 2014 ఎన్నికల్లో కళా వెంకటరావు చేతిలో కిరణ్ ఓటమి చవిచూశారు. అయినప్పటికీ నిరాశ చెందకుండానే వైఎస్సార్సీపీ శ్రేణులతో కలసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం మీసాల నీలకంఠంనాయుడు కూడా పోటీపడినప్పటికీ కొన్ని నెలల క్రితం ఈయన మంత్రి కళా లాబీయింగ్తో టీడీపీలో చేరిపోయారు. దీంతో కిరణ్కుమార్కు టిక్కెట్టు ఖాయమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావటంవ వల్ల కళా విజయం తథ్యంగా టీడీపీ వర్గాలు భావించాయి. అయితే కిరణ్కుమార్ స్థానికుడు కావటం, ఎన్నికల్లో ఓడినా నిరంతరం ప్రజల్లో ఉండటంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు. -
అవకాశమిస్తే... అభివృద్ధి చేస్తా..
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): వైఎస్సార్సీసీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ స్థానికుడు. మాజీ మంత్రి, మాజీ జెడ్పీ చైర్మన్ గొర్లె శ్రీరాములనాయుడు రాజకీయ వారసుడిగా అందరికీ సుపరిచితుడే. నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు నిత్యం ప్రజలతో మమేకమై, వారి కష్టాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తూ అండగా ఉంటున్న గొర్లె కిరణ్కుమార్ నియోజకవర్గ ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న కిరణ్కుమార్ తన మనసులో మాటను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వ్యక్త పరిచారు. ప్రశ్న: నియోజకవర్గం ప్రజలతో ఎలా మమేకమయ్యారు? జవాబు: మాజీ మంత్రి, మాజీ జెడ్పీ చైర్మన్ దివంగత గొర్లె శ్రీరాములనాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను.రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నాను. నేను స్థానికుడిని, రణస్థలం మండలం పాతర్లపల్లి నా స్వగ్రామం. నా భార్య పరిమళ రణస్థలం ఎంపీపీగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో 2009 లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం తృటిలో తప్పింది. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాను. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ ప్రారంభించినప్పటి నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నాను. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉన్నాను. 115 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను నా కుటుంబంగా భావించాను. ప్రజలతో నాకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు? జవాబు: మహానేత వైఎస్సార్ హయాంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గంలోని సమస్యలను పూర్తిగా విస్మరించింది. నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉంది. తోటపల్లి, నారాయణపురం ఆనకట్టు ఆధునికీకరణ, ఎస్.ఎం.పురం పెద్దచెరువుకు మడ్డువలస మిగులు జలాలు తరలింపు జరగలేదు. ట్రిపుల్ ఐటీ ఎచ్చెర్లలో ఏర్పాటు చేసినా నూజివీడులో తరగతులు కొనసాగుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఉంది. పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేవు. ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రి కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. జెట్టీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. బుడుమూరు నారాయణసాగరం జలాశయం ఏర్పాటు సమస్యగా మిగిలిపోతుంది. ప్రశ్న: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు? జవాబు: స్థానికుడిగా ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉంది. సాగునీటి సమస్య పరిష్కారిస్తా. ట్రిపుల్ ఐటీ, బీఆర్ఏయూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తాను. స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు, యువతకు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. జెట్టీల నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్లు, ఎచ్చెర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,బి.ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాను. వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ప్రాధాన్యత నిస్తాను. ప్రశ్న: టీడీపీ పాలనలో ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు? జవాబు: టీడీపీ పాలనలో సంక్షేమ పథకాలు అమల్లో అర్హులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ పథకాల ఎంపికలో నిష్షక్ష పాతంగా జరగాలి, కాని జన్మభూమి కమిటీల పెత్తనం సాగింది. వైఎస్సార్సీపీ అధికారంలో వచ్చిన వెంటనే రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హునికీ ప్రభుత్వ పథకాలు ఇంటికి చేరేలా అమలు చేస్తాం. ప్రశ్న: మీ విజయానికి వ్యూహాలు ఏమిటి? జవాబు: ప్రత్యేక వ్యూహం అంటూ లేదు. టీడీపీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. నియోజక వర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండానే మంత్రి కుమారుడికి భూములు కేటాయించారు. మంత్రి కళా వెంకట్రావు పీఏలు, పథకాల పేరుతో టీడీపీ నాయకులు ప్రజా ధనం దోచుకున్నారు. ఎస్.ఎం.పురం తదితర ప్రాంతాల్లో జెడ్పీ ఛైర్పర్సన్ కుటుంబ సభ్యులు భూ పట్టాలు అక్రమంగా చేసుకున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం మంత్రి కళా వెంకట్రావు కనుసన్నల్లో సాగుతోంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను టీడీపీ నాయకులు అమ్ముకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాం. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో, నవరత్నాల పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నాం. మంత్రి కళా వెంకట్రావు నియోజకవర్గ సమస్యలను పట్టించుకోలేదు. ఈ విషయం ప్రజలకు తెలుసు. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రత్యేక హోదాపై మేం పోరాటాలు చేశాం. అన్ని అంశాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. -
ఇక కళా వెంకట్ర్రావు అక్రమాలు చెల్లవు
-
స్వైన్ఫ్లూనే..!
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వైన్ప్లూ కలకలం రేగినప్పటికీ స్వైన్ప్లూతో ఒక రోగి సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వైద్యశాఖ అధికారులు మాత్రం దీనిని దాచి పెట్టే యత్నం చేస్తున్నారు. స్థానిక శిఖామణి చర్చి వద్ద నివశిస్తోన్న పెట్షాప్ నిర్వాహకులు జూలూరు వెంకట రమణ కిరణకుమార్కు స్వైన్ఫ్లూ సోకింది. దీంతో జంగారెడ్డిగూడెం, రాజమండ్రి ఆసుపత్రుల్లో పలు వైద్యరీక్షలు నిర్వహించి రోగి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని సికింద్రాబాద్ తరలించారు. సికింద్రాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిరణ్కుమార్కు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతనికి స్వైన్ప్లూ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే కిరణ్కుమార్కు స్వైన్ప్లూ సోకిందని “సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురించడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం పీహెచ్సీ సిబ్బందిని కిరణ్కుమార్ వైద్య పరీక్షలు నివేదిక తీసుకువచ్చేందుకు సికింద్రాబాద్ పంపారు. అయితే తమకింకా కిరణ్కుమార్కు సంబంధించి వైద్యపరీక్షల నివేదికలు రాలేదని వైద్యాధికారులు చెప్పుకొస్తున్నారు. కిరణ్కుమార్కు స్వైన్ప్లూ సోకలేదని, ఇన్ప్లూయేంజాతో బాధపడుతున్నారని మభ్యపెడుతూ వచ్చారు. అయితే కిరణ్కుమార్కు స్వైన్ప్లూ సోకడమే కాకుండా అతనికి ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిని అపస్మారక స్థితిలో సికింద్రాబాద్లోని క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. కిరణ్కుమార్ వైద్యానికి సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చారు. అయినా వైద్యాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. కిరణ్కుమార్కు చెందిన వైద్య పరీక్ష నివేదికలు కూడా తమకు ఇంకా అందలేదని చెబుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిరణ్కుమార్కు స్వైన్ఫ్లూ నిర్ధారణ జూలూరి వెంకట రమణ కిరణ్కుమార్కు స్వైన్ప్లూ సోకినట్లు సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 5వ తేదీనే అక్కడి వైద్యులు కిరణ్కుమార్కు నిర్వహించిన వైద్యపరీక్షల నివేదిక సాక్షి సేకరించింది. ఆ నివేదికలో కిరణ్కుమార్కు ఇన్ప్లూయేంజా ఏ/హెచ్1–2009 ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంటే ఇన్ప్లూయేంజా–ఎ వైరస్ ఉన్నట్లైతే రోగికి స్వైన్ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఇప్పటికైనా వైద్యాధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకుని స్వైన్ప్లూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నారు. స్వైన్ప్లూ లేదని చెప్పే వైద్యులు దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కిరణ్కుమార్ వైద్యంపై వైద్యశాఖ జోక్యం చేసుకుని మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. -
కిరణ్కుమార్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్
-
ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం...
సాక్షి, స్టేషన్ఘన్పూర్: సీల్డ్ కవర్ సీఎం కావాలా, సింహం లాంటి కేసీఆర్ కావాలో తేల్చుకోవాలని ఓటర్లను తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. మంగళవారం స్టేషన్ఘన్పూర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని ఎద్దేవా చేశారు. తోడు దొంగలైన కాంగ్రెస్, టీడీపీ జట్టు కట్టి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నాయని విమర్శించారు. రైతులను రాబందులుగా కాల్చుకుతిన్న ఈ రెండు పార్టీలు ఒక్కటైయ్యాయని, తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పట్లో తేలేది కాదన్నారు. ‘వాళ్లు సీట్లు పంచుకునే లోపు మనం స్వీట్లు పంచుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్నివర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎవరు చేయనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం కిరణ్కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోపే విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాకపోయివుంటే ఇవన్నీ జరిగేవా అని ప్రశ్నించారు -
అవధుల్లేని అవకాశవాదం
త్రికాలమ్ నిర్దిష్టమైన సిద్ధాంతాలూ, విలువల ఆధారంగా రాజకీయాలు ఉంటాయన్న సంగతి రాజకీయ నేతలు మరచిపోయారు. సూత్రబద్ధమైన రాజకీయాలూ, జన హితమైన విధానాల కంటే ఎత్తులూ, వ్యూహాలూ నేటి రాజకీయాలను శాసిస్తు న్నాయి. గెలుపే ప్రధానంగా అభ్యర్థులను ఎంపిక చేయడం, సర్వేలు జరిపించి ఎవరికి విజయావకాశాలు ఉంటే వారికే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించడం సర్వ సాధారణమైపోయింది. ఎన్నికలలో గెలుపుకోసం డబ్బు ఖర్చు చేయాలనీ, కుల సంఘాల నాయకులను పట్టుకోవాలనీ, ఏ కులం ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ కులానికి చెందిన అభ్యర్థికే టిక్కెట్టు ఇవ్వాలనీ, అలవికాని హామీలు గుప్పించైనా సరే, నిన్నటి వరకూ ప్రబల ప్రత్యర్థులుగా పరిగణించినవారిని కలుపుకొని పోవ లసి వచ్చినా సరే ఆ పని నిస్సంకోచంగా చేసేయాలనీ మినహాయింపు లేకుండా అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. పచ్చి అవకాశవాదం రాజ్యమేలుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల విన్యాసాలు చూస్తుంటే ప్రజా స్వామ్యంలో విశ్వాసం ఉన్నవారి మనసు వికలం అవుతుంది. పరమ నికృష్టమైన క్రీడలో పావులవుతున్నందుకు ప్రజల పట్ల సానుభూతి పెరుగుతుంది. నేతలను ప్రశ్నించకుండా, నిలదీయకుండా వెన్నెముకలేని అమాయక జనం వారినే పదే పదే గెలిపిస్తున్నందుకు ఆగ్రహం కలుగుతుంది. కాంగ్రెస్–టీడీపీ చెలిమి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు తనదైన శైలిలో కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. అదే ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, లోక్సభ ఎన్నికలలోనూ అమలు చేయబోతున్నట్టు సమాచారం. 2014లో భాగస్వామ్య పక్షాలతో వైరం పెట్టు కోవాలనీ, అప్పటి వైరిపక్షాలతో స్నేహం చేయాలన్నది తాజా వ్యూహం. నాలుగు న్నర సంవత్సరాలలో సాధించిన ఘనకార్యం ఏదీ ప్రజలకు చూపించడానికి లేదు కనుక తాను ఏమీ చేయలేకపోవడానికి ఎన్డీఏ సర్కార్, ప్రధాని నరేంద్రమోదీ కారణమని చెప్పాలని కొన్ని మాసాల కిందటే నిర్ణయించుకు న్నారు. ఆ విధంగానే ముందుకు పోతున్నారు. అయినదానికీ, కానిదానికీ మోదీతో లింకు పెట్టి ఆయనను ప్రతినాయకుడిగా చిత్రించడానికి చేయవల సిందంతా చేస్తున్నారు. ఒక పథకంగా ప్రకారం అడుగులు వేస్తున్నారు. అటు వంటి అడుగే ఒకటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా వేశారు. తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాననీ, బీజేపీ పడనీయలేదనీ, తనకూ, కేసీఆర్కీ మధ్య మోదీ దూరం పెంచారనీ చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. మోదీలో లౌకికతత్వం లోపించిందని టీడీపీ లెజిస్లేచర్పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. గోధ్రా ఉదంతాన్నీ, గుజరాత్ అల్లర్లనూ ప్రస్తావించారు. ‘నారా హమారా’ అంటూ ముస్లింల సమావేశం ఏర్పాటు చేశారు (అది బెడిసికొట్టిందనేది వేరే విషయం). బీజేపీతో కూటమి కట్టడం వల్ల మైనారిటీలు దూరమైనారు. వారిని ఆకర్షించడానికి ఏదో ఒక నినాదం పట్టుకొని, ఒక సభ పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టుకోవచ్చునని ఆశ. ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకుండా ఇంతకాలం ప్రభుత్వం నడిపిన సంగతి ముస్లిం ప్రజలు గుర్తించకుండా గుడ్డిగా ‘నారా హమారా’ అంటారని అనుకోవడం భ్రమ. గుజరాత్లో అల్లర్లు జరిగిన తర్వాత కూడా చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకోలేదు. 2004లో బీజేపీతో కలిసే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు. ఓడిపోగానే ‘జీవితంలో బీజేపీతో కలిసి పోటీ చేసే సమస్య లేదు’ అంటూ ప్రకటించారు. అల్లర్లు జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారో, ఎవరికి రాజ ధర్మం గురించి నాటి ప్రధాని వాజపేయి ప్రబోధం చేశారో ఆ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతోనే 2014లో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో, రాష్టప్రభుత్వంలో భాగస్వాములుగా సహజీవనం చేశారు. మోదీకి తిరుపతి ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇచ్చేవారు. అణుకువగా ఉండేవారు. ఎన్నికలు దగ్గరపడేవరకూ ఒక బలిపశువు అవసరం ఏర్పడింది. బీజేపీని బలి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండుసార్లు పొత్తు పెట్టుకొని విడిపోయిన చంద్రబాబు 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో మూడోసారి సంబంధం కలుపుకోరన్న పట్టింపు ఏమీ లేదు. మోదీ సైతం రియల్పొలిటిక్ (ఏది ఆచ రణయోగ్యమో, ఏది అవసరమో అదే చేసే గడుసు రాజకీయం) తెలిసిన నేత కనుక ఎన్నికల తర్వాత అవసరం ప్రకారం వ్యవహరిస్తారు. 2002లో తనను చంద్రబాబు ఏ విధంగా విమర్శించారో మోదీకి తెలుసు. అయినా టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాదు ఉమ్మడి వేదికలపైన ప్రచారం చేశారు. ఒకరినొకరు పొగుడుకున్నారు. ఇప్పుడు చేస్తున్న విమర్శలను సైతం రాజకీయ అవస రార్థమేనని మోదీ అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్పార్టీనీ, సోనియాగాంధీని ఇటలీ మాఫియా అనీ, అవినీతి అనకొండ అనీ, ప్రజలు కత్తులూ, కొడవళ్ళతో వీధులలోకి వచ్చి కాంగ్రెస్ని నరికి భూస్థాపితం చేయాలనీ, మన్మోహన్ సింగ్ పనికిమాలిన ప్రధాని అనీ తిట్టిన తిట్టు తిట్టకుండా నాలుగున్నర సంవత్సరాలు తిట్టి ఇప్పుడు అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడటాన్ని అస్మదీయులు చక్రం తిప్పడంగా అభివర్ణించి ఆనందించవచ్చు. సాధారణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? రాజకీయ నాయకుల అవసరాలకు అను గుణంగా రంగులు మార్చితే ప్రజలు కూడా అదే విధంగా అభిప్రాయాలు మార్చుకుంటూ పోవాలా? టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామని అనుకున్నారట. అదేమీ చంద్ర బాబుకి కొత్త కాదు. 2009 ఎన్నికలలో టీఆర్ఎస్తో కలిసే పోటీ చేశారు. మరోసారి అదే పని చేయాలని అనుకున్నా అది ఏకపక్ష నిర్ణయమే. టీఆర్ఎస్ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? శాసనసభ్యుల ఫిరాయింపులతో దాదాపు గల్లంతైన పార్టీకి మళ్ళీ ఊపిరెందుకు పోస్తుంది? టీడీపీ టిక్కెట్టుపై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్లో చేరినప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు ఎంత తీవ్రంగా టీఆర్ఎస్నీ, కేసీఆర్నీ నిందించారో అవసరార్థం ఆయన మరచిపోవచ్చును కానీ కేసీఆర్ మరచిపోతారా? ‘ఓటుకు కోట్ల’ కేసులో ఏసీబీకి చిక్కినప్పుడు ‘చంద్రబాబూ, నిన్ను బ్రహ్మదేవుడుకూడా రక్షించలేడు’ అంటూ కేసీఆర్ హుంకరించిన విషయం ప్రజలకు గుర్తుండదా? నాయకులు మరచిపోయినట్టు నటించవచ్చును కానీ ప్రజలకు నటించవలసిన అవసరం ఏమున్నది? ప్రతి ఎన్నికలకూ భాగస్వామ్య పక్షాలను మార్చి కొత్త కూటములు కట్టడం తెలివైన రాజకీయపుటెత్తుగడ కావచ్చునేమో కానీ నైతికం మాత్రం కానేకాదు. ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొని, విడిపోయి, మళ్ళీ కలిసి, మళ్ళీ విడిపోయి రకరకాల కపట విన్యాసాలు చేసే రాజకీయ నాయ కులను ప్రజలు ఎందుకు గౌరవించాలి? నలభై ఏళ్ళు అధికార రాజకీయాలలో అనుభవం ఉన్నా విలువలు లుప్తమైనప్పుడు ఆదరించవలసిన అవసరం ఏమున్నది? తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ స్నేహం అందుకే కృతకంగా కనిపిస్తోంది. ఇది అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠ. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించి ఆంధ్రులకు అన్యాయం చేసిందంటూ తిట్టిపోసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు చంద్రబాబుకి ఎందుకు అవసరం? కాంగ్రెస్తో భాగస్వామ్యం ఉన్నట్లయితే దళితులలో, ఆదివాసీలలో, ముస్లింలలో కొంత శాతమైనా ఓట్లు దక్కు తాయేమోనన్న ఆశ. నరేంద్రమోదీకీ, పవన్కల్యాణ్కీ దూరం జరిగిన అనంతరం కేవలం టీడీపీ ఓట్లు మాత్రమే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ ఓట్లు కలిస్తేనే ఒకటిన్నర శాతం తేడాతో 2014లో అతికష్టంపైన గట్టెక్కగలిగారు. అప్పుడు లేని కొత్త అంశం ప్రభుత్వం పట్ల బలంగా ఉన్న వ్యతిరేకత. అదనుకోసం ఎదురు చూస్తున్న జనం ప్రభుత్వం చేతల వల్ల, చేతకానితనం వల్ల, చిత్తశుద్ధిలేమి వల్ల నష్టపోయిన ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు అదను కోసం ఎదురు చూస్తున్నారు. నెపం అంతా మోదీపైకి తోసినంత మాత్రాన ప్రజలు చంద్రబాబును క్షమించరు. మోదీపట్ల వ్యతిరేకత పెరుగుతుంది. కానీ చంద్రబాబుపట్ల సానుకూలత పెరిగే అవకాశం లేదు. దొందూ దొందే అని ప్రజలు ఛీత్కరించే అవకాశాలే ఎక్కువ. మోదీ, చంద్రబాబు మాత్రమే ప్రజల ముందున్న ప్రత్యామ్నాయాలు కాదు. మోదీకి కానీ బీజేపీకి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రాబల్యం లేదు. టీడీపీకి ప్రత్యామ్నాయం వైఎస్ఆర్సీపీ రూపంలో సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు రేపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయబోతున్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో జనసందోహం, ప్రజలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న ఆశాభావం, ఆనందోత్సాహాలు ఇప్పుడు గాలి ఎటు వీస్తున్నదో స్పష్టం చేస్తున్నాయి. రాజకీయం అంటే కేవలం ఎత్తుగడలూ, వ్యూహాలూ, ధనబలం, కండబలం, కులబలం మాత్రమే కాదనీ ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను ఆలకిస్తూ, సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకం కలిగిస్తూ నిజా యితీగా నడిచే రాజకీయాన్ని జనం గౌరవిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావంచకుండా ప్రజల దృష్టిని సమస్యలపై నుంచీ, వాస్తవాలపై నుంచీ మరల్చేందుకు టీవీ చానళ్ళలో ‘టాక్షోల’లో విని యోగిస్తూ, సోషల్ మీడియాను ప్రయోగిస్తూ సంచలనాత్మక, వినోదాత్మక, వ్యూహాత్మక, ఊహాజనిత సన్నివేశాలను ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికలలో గెలు పొందవచ్చునని భావించడం ప్రజలనూ, వారి వివేకాన్నీ అవమానపరచడమే. ప్రజల విషయమే కాదు సొంత పార్టీలోని నాయకుల, కార్యకర్తల వివేకం పట్ల కూడా టీడీపీ అధినేతకు గౌరవం లేదు. 2009లో సీమాంధ్ర నాయకులకు ఇష్టం లేకపోయినా ఆదరాబాదరాగా ఒక కమిటీ వేసి, దాన్ని రాష్ట్రం అంతటా తిప్పించి, తనకు కావలసిన నివేదికను ఇప్పించుకొని, పార్టీ పొలిట్బ్యూరో చేత ఒప్పించి రాష్ట్ర విభజనకు సుముఖమేనంటూ ప్రణబ్కుమార్ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు. తీరా 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ఎంపీలూ, ఎంఎల్ఏలతో కలిసి టీడీపీ ఎంపీలూ, ఎంఎల్ఏలూ రాజీనామా చేయడాన్ని నిరోధించకపోవడం చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతానికి నిదర్శనం. ఇప్పుడు కాంగ్రెస్తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీలో అత్యధికులకు కాంగ్రెస్తో పొత్తు సుతరామూ ఇష్టం లేదు. నిజానికి జీవితకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులలో చాలామందికి ఇది మింగుడుపడటం లేదు. మింగలేకా కక్కలేకా సతమతం అవుతున్నారు. బాబు జాగ్రత్త మొన్న కర్నూలు సభ తర్వాత ఢిల్లీకి తిరిగి వెడుతూ శంషాబాద్ విమానా శ్రయంతో తనను కలిసిన కాంగ్రెస్ నాయకులతో రాహుల్ మాట్లాడుతూ, ‘బాబు మీద ఈగ వాలనివ్వకండి. ఒకవేళ టీఆర్ఎస్ నేతలు బాబుని విమర్శిస్తే మీరు ఎదురుదాడి చేయండి’ అంటూ ఉద్బోధించారని వార్త. కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓట్లు టీడీపీకీ, టీడీపీ ఓట్లు కాంగ్రెస్కీ బదిలీ అవుతాయో లేదో తెలియదు కానీ టీఆర్ఎస్కి బలమైన ప్రచారాస్త్రాలు లభిం చాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకహోదా ఇస్తామంటూ వాగ్దానం చేస్తున్న కాంగ్రెస్ని గెలిపిస్తే, కాంగ్రెస్–టీడీపీ సర్కార్ ఏర్పడితే, ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి తరలివెడతాయని టీఆర్ఎస్ బలంగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే హరీష్రావు, కేటీఆర్ ఈ దిశగా ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్ సభలు ఆరంభమైతే ఇది అనూహ్యంగా ఊపందుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం 30 లేఖలు రాసిందంటూ టీఆర్ఎస్ ధ్వజం ఎత్తుతుంది. టీడీపీ వల్ల కాంగ్రెస్కూ, కాంగ్రెస్ వల్ల టీడీపీకీ నష్టం జరుగుతుందనీ, రెండు పార్టీల వల్ల తెలంగాణకు విపరీతంగా అపకారం జరుగుతుందనీ టీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కమిటీలు వేస్తేనే భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ఎన్ని వీరంగాలు వేస్తారో, కుంటియానూ, గులాంనబీనీ ఎంతగా కడిగిపారేస్తారో ఊహించుకోవచ్చు. మొత్తంమీద తెలంగాణలో ఎన్నికల ప్రచారం అత్యంత వేడిగా, వాడిగా, రసవత్తరంగా, బూటకంగా, నాటకీయంగా జరగబోతున్నదని మాత్రం నిస్పందేహంగా చెప్పవచ్చు. కె. రామచంద్ర మూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి దినపత్రిక -
పీలేరులో అన్నదమ్ముల సవాల్..
సాక్షి, తిరుపతి: పీలేరులో నల్లారి సోదరుల మధ్య పోరు ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో వీరి మధ్య పోటీ తప్పదని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నా, వచ్చే ఎన్నికల్లో కిశోర్కుమార్ రెడ్డి అన్నకు మద్దతుగా ఉంటారని ఆయన వర్గీయులు భావించారు. తిరుపతిలో సోమవారం నల్లా రి కిశోర్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కిరణ్కుమార్రెడ్డి వర్గీయులకు ఆగ్రహం తెప్పించాయి. పీలేరు బరిలో తాను టీడీపీ అభ్యర్థిగా ఉంటానని, ఎవరి మీదైనా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. సొంత అన్న అయినా పోటీ చేసి తీరుతానని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కిరణ్కుమార్ రెడ్డి పోటీ చేస్తే తప్పుకుంటారా? అని విలేకరులు కిశోర్ని ప్రశ్నించారు. ఎవరు పోటీ చేసినా.. చేయకపోయినా తాను టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానన్నారు. కిశోర్ మాటలు ఆయన సోదరుడి వెంట ఉన్నవారిని కంగు తినిపిం చాయి. కిరణ్కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా... సీఎం అయినా పెత్తనం అంతా తమ్ముడికే అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. షాడో సీఎంగా చెలామణి కావడానికి కారణమైనవారెవరో తెలుసుకోవాలని కిరణ్ వర్గీయులంటున్నారు. అన్నకు కిశోర్ వెన్నుపోటు సీఎంగా కిరణ్కుమార్ రెడ్డి ఉన్నా...అభివృద్ధి చేసిందంతా తానేనని కిశోర్కుమార్రెడ్డి .. ఆయన అనుచరులు, నియోజక వర్గంలో చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కిరణ్ వర్గీయులకు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం పదవుల కోసం టీడీపీలో చేరినా... వచ్చే ఎన్నికల్లో అన్న కిరణ్కు అండగా నిలబడతారని మాజీ సీఎం వర్గీయులు ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. కిశోర్ తన సిసలైన వైఖరి బట్టబయలు చేశారు. దీనిపై కిరణ్ వర్గీయులు మండిపడుతున్నట్లు భోగట్టా. చంద్రబాబు పంచన చేరి ఆయన బుద్ధులే వచ్చాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచినట్లు... నీవు అన్నకు వెన్నుపోటు పొడుస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో అక్రమాలు చేస్తున్నా పట్టించుకోలేదని కిరణ్ వర్గీయులంటున్నారు. ఎన్ని చేసినా అన్నకు అండగా ఉంటారని భావించామని కిరణ్ వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీలో చేరాక స్వార్థం చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్న ఉన్న సమయంలో, ప్రస్తుతం చేస్తున్న అక్రమాలన్నీ తొందర్లోనే బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ‘నీకు దమ్ముంటే... మేము చేసిన అక్రమాలను నిరూపించు’ అని కిరణ్ వర్గీయులు సవాల్ విసురుతున్నారు. కిశోర్ వర్గీయులు కూడా తాము తక్కువేం కాదంటూ... కిరణ్కుమార్ రెడ్డిని, ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేయటం ప్రారంభించడం గమనార్హం. -
చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్
చిత్తూరు జిల్లా: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో తాను ఎంతో సీనియర్నని చెప్పుకునే చంద్రబాబు, 10 ఏళ్లు హైదరాబాద్లో ఉండటానికి అనుమతి ఉన్నా అకస్మాత్తుగా హైదరాబాద్ను వదిలి పెట్టి కోట్ల రూపాయలు అద్దె రూపంలో చెల్లిస్లూ అన్నీ తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారని రామచంద్రా రెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు హైదరాబాద్లో ఉండి ఉంటే ఏపీ రాజధానిలో శాశ్వత భవనాలు నిర్మించుకుని ఉండేవాళ్లమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నావల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పడం, రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని ఏపీలో చెప్పడం బాబు రెండు నాల్కల ధోరణికి నిదర్శమన్నారు. విడిపోయిన తర్వాత హోదా కోసం కాకుండా ప్యాకేజీ కోసం పాకులాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ పోరాడుతున్నా పార్లమెంటులో చర్చకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఎటువంటి గొడవ లేకుండానే టీడీపీకి అనుమతి ఇచ్చారన్నారు. దీన్ని బట్టే బీజేపీ, టీడీపీలు కుమ్మక్కు అయినట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరారని అన్నారు. భారత దేశంలో ఎక్కువ సంపాదించిన వారిలో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరని చెప్పింది చంద్రబాబు కాదా అని సూటిగా అడిగారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కొనసాగడానికి కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని కుట్రలైనా పన్నుతారని, ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఎంత మోసం చేశారో, మోదీ కూడా అంతే మోసం చేశారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీ ఓట్ల కోసమే చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మహిళల రుణమాఫీ చేయడం కాదు కదా.. వారిని చంద్రబాబు అప్పులపాలు చేశారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. బీసీ అధ్యయన సదస్సులు నిర్వహించి సమస్యలను, అభిప్రాయాలను క్రోడీకరించి, పాదయాత్ర పూర్తి అయ్యే లోపు బీసీలకు మనం ఇవ్వబోయే హామీల గురించి చెబుతామని వివరించారు. -
కాంగ్రెస్లోకి కిరణ్.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి ఆప్షన్ వారు చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన కిరణ్కుమార్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆయన పార్టీ ప్రజాభిమానం పొందలేకపోయిందని అన్నారు. గత నాలుగేళ్లుగా ఏ పార్టీలో చేరని కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొనసాగారని, ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం ఢిల్లీలో రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్,టీడీపీల మధ్య రహస్య డీల్
-
కాంగ్రెస్లో చంద్రుడి కిరణమా...!!!
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ : జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్లో చేర్చుకున్న పరిణామాలు రాష్ట్రానికి చెందిన ఆ పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామరూపాల్లేకుండా చేయడంలో తన వంతు దోహదం చేసిన కిరణ్ను తిరిగి చేర్పించుకోవడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదని చెబుతున్నారు. గడిచిన ఎన్నికల్లో పార్టీ నామరూపాల్లేకుండా పోయినప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్న పలువురు సీనియర్లకు అధిష్టానం చర్య మింగుడుపడటం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతారని గతంలో వార్తలొచ్చాయి. ఆ తరుణంలోనే కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. సోదరుడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో కిరణ్ చేరిక కూడా ఖాయమైందని అధికార పార్టీ నేతలు భావించారు. అయితే ఏడాది కాలంగా తెర వెనుక ఏం జరిగిందో కానీ, ఉన్నట్టుండి ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరడం ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్కు ఒరిగేదేమీ లేదని ఆ పార్టీ నేతలంతా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో పదవులిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో 2014 ఎన్నికల బరిలో దిగినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. అసెంబ్లీ, లోక్సభ సాధారణ ఎన్నికల్లో నోటాకు లభించినన్ని ఓట్లు కూడా ఆ పార్టీకి లభించలేదు. దాంతో తన సత్తా ఏమిటో గ్రహించిన కిరణ్ గడిచిన నాలుగేళ్లుగా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చీఫ్ విప్గా, స్పీకర్గా, ముఖ్యమంత్రిగా పదవులు కట్టబెట్టినప్పటికీ రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీని తిట్టనితిట్టు తిట్టకుండా దూషించి మరీ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని పార్టీపైనా నేతలపైనా నిప్పులు చెరిగారు. అన్ని పదవులు అనుభవించి ఆ తర్వాత పార్టీనే దూషించిన కిరణ్కు రాజకీయంగా ఆయన బలమేంటో కూడా గడిచిన ఎన్నికల్లోనే తేలిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కనీసం చిత్తూరు జిల్లాలోని ఆయన సొంత నియోజకవర్గంలో కూడా అదనపు ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. రాజకీయంగా తెరమరుగై ఇంట్లో కూర్చున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికెళ్లి మరీ రమ్మంటూ పార్టీలో చేర్పించుకోవడం అర్థం లేని చర్యగా ఆయన పేర్కొన్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో సోదరుడిని చేర్పించి ఆయన కూడా చేరుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్లో చేర్చుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా, ఆ సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో కాంగ్రెస్కు అండగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014 లో ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన చంద్రబాబు గడిచిన నాలుగేళ్లలో ఏ ఒక్కసారి కూడా కిరణ్ ప్రభుత్వ పనితీరును గానీ కిరణ్పైన గానీ విమర్శలు చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య ప్రభుత్వాలపై విమర్శలు చేయకుండా చంద్రబాబు నిత్యం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా తయారైందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో బలం లేని నాయకుడిని చేర్చుకోవడమంటే మరెవరి ప్రయోజనాల కోసమో పనిచేస్తున్నామన్న అనుమానాలు తలెత్తుతున్నాయని ఏపీసీసీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. విడదీయడం ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, అందువల్ల శాసనసభకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని 2014లో రాజీనామాకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ వల్లే సాధ్యమని ఇప్పుడంటున్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరకపోగా గడిచిన నాలుగేళ్లుగా మౌనముద్ర దాల్చి ఇప్పుడు అది కూడా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో యువతీ యువకులు రోడ్ల మీద కొచ్చి నినదించినప్పుడు సైలెంట్గా ఉన్న కిరణ్ ఎన్నికల ఏడాదిలో తిరిగి కాంగ్రెస్లో చేరడం వంటి పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని ఆ నాయకుడు విశ్లేషించారు. రోశయ్య రాజీనామా అనంతరం 2010 నవంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నెల రోజులకు ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జై సమైక్యాంధ్ర పార్టీకి కనీసం నోటాకు పడినన్ని ఓట్లు కూడా పడలేదు. ఆ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ చాలా దారుణ ఓటమిని చవి చూసింది. దాంతో ఆ ఫలితాల రోజు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెర మీదకు రాలేదు. గడిచిన నాలుగేళ్లుగా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే, మధ్యలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్న వార్తలొచ్చాయి. వారి మధ్య కొందరు నేతలు మధ్యవర్తిత్వం జరిపినట్టు కూడా వార్తలొచ్చాయి. ఆ వార్తలను ఇరు పక్షాలు తోసిపుచ్చలేదు. ఆ తర్వాత పరిణామాల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దాంతో టీడీపీతో సంబంధాలు నెరుపుతున్న విషయం రూఢీ అయింది. ఈ నాలుగేళ్ల రాజకీయ పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఏర్పడిందన్న విషయం అనేక సందర్భాల్లో బయటపడింది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అంచనాల మేరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం పని చేయకపోవడం, అవినీతి పెరిగిపోవడం, అద్భుత రాజధాని నిర్మిస్తామని గ్రాఫిక్స్తో మాయా చేస్తూ చూపించిన పంచ రంగుల ప్రపంచం ఉత్తుత్తిదే అని తేలిపోవడం, అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకపోవడం వంటి అనేక అంశాల్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు తీవ్రమయ్యాయి. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో మాట మార్చిన విధానం చంద్రబాబుపై సొంత పార్టీలోనే నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడటం వంటి అనేక పరిణామాలు జరిగాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని భావించిన కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక అంతర్గత ఉభయ ప్రయోజనాలు ఉన్నాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. -
మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కుట్రదారుడు
-
‘కిరణ్ తప్పుడు దారిలో సీఎం అయ్యాడు’
సాక్షి, చిత్తూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కుట్రదారుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ తప్పుడు దారిలో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే ప్రభుత్వాన్ని నడిపారని వివరించారు. టీడీపీతో కలిసి నడవకపోయినా రాబోయే కాలంలో మద్దతు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. కిరణ్ సోదరుడు టీడీపీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఖర్చు పెట్టకుండా చెప్పుల పార్టీ పెట్టాడని, పీలేరు నుంచి కూడా ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఏకాకిగా దొంగ చాటుగా కండువా వేసుకున్న వ్యక్తులు తమ జిల్లాలో పుట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన రోజున కాంగ్రెస్ చచ్చిపోయిందని, ఇపుడు ఆ పార్టీలో ద్రోహులు మాత్రమే ఉన్నారన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్మును కూడబెట్టెందుకే పాటుపడుతున్నారని ఆరోపించారు. దోచుకున్నది దాచుకునేందుకే చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నాడు స్టీల్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోకుండా ఇపుడు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. -
కాంగ్రెస్లోకి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి
-
కాంగ్రెస్లో చేరిన కిరణ్కుమార్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో సొంత గూటికి చేరారు. కిరణ్కు రాహుల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏఐసీసీ కమ్యూనికేషన్ ఇన్చార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, పల్లంరాజులతో కలసి కిరణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో నాబంధం విడదీయలేనిది. రాజకీయంగా నాకు లభించిన గుర్తింపు, పదవులు కాంగ్రెస్ పుణ్యమే. మధ్యలో కొన్ని జరిగాయి. జరిగిన దానికంటే ఇక జరగాల్సిందే ముఖ్యం. అందుకే ఒక సామాన్య కార్యకర్తలా మళ్లీ కాంగ్రెస్లో చేరుతున్నా. అధిష్టానం ఇచ్చే బాధ్యతలు నిర్వర్తిస్తాŠ’’ అని కిరణ్ చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలు అమలవుతాయని అన్నారు. ఇక తన సోదరుడు టీడీపీలో చేరడంపై మీడియా ప్రశ్నించగా.. టీడీపీలో చేరవద్దని తన తమ్ముడికి చెప్పానని, అయితే వ్యక్తిగత నిర్ణయంతో ఆయన టీడీపీలో చేరినట్టు కిరణ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ను వీడి జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరగవడమే కాకుండా కిరణ్కుమార్రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కిరణ్ చేరికతో కాంగ్రెస్కు బలం చేకూరిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ అన్నారు. ‘భావోద్వేగంతో కాంగ్రెస్ను వీడిన నా మిత్రుడు కిరణ్కుమార్రెడ్డికి తిరిగి పార్టీలోకి ఇదే నా స్వాగతం’ అని రఘువీరారెడ్డి అన్నారు. కిరణ్ చేరికపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కిరణ్కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. రాహుల్ సమక్షంలో కిరణ్ తిరిగి పార్టీలో చేరే కార్యక్రమానికి కాంగ్రెస్లోని కీలకమైన నేతలు దూరంగా ఉన్నారు. రఘువీరా, జేడీ శీలం, పల్లంరాజు మినహా ఇతర నేతలెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కిరణ్కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రులెవరూ కూడా హాజరుకాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించి చివరికి పార్టీకే తీరని ద్రోహం చేసిన కిరణ్ను తిరిగి పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ పలువురు నేతలు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఒకవేళ ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ఆయనతో క్షమాపణలు చెప్పించాలని కొంతమంది నేతలు డిమాండ్ చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ‘కిరణ్కుమార్ రెడ్డి సీఎం పదవిలో చివరి వరకు ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచి పోయాడు’ అని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఏఐసీసీలో మీడియా సమావేశంలో, ఆ తరువాత కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు ముభావంగా ఉండటం, కిరణ్కుమార్ రెడ్డితో అంటీముట్టనట్టు వ్యవహరించడం వారిలో ఉన్న అసంతృప్తిని వ్యక్తపరుస్తోందని ఏఐసీసీలో చర్చ నడుస్తోంది. -
సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు!
ఈ మాట వింటుంటే ఎక్కడో విన్నట్టుంది కదూ. కాకపోతే సెల్ఫీలకు బదులు అక్కడ డబ్బులు అని ఉంటుంది. ‘అవును మరి డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు’.. ఈ మాటని టీవీ యాడ్స్లో పదేపదే చెప్పి, తన వేషదారణతో ఫేమస్ అయ్యారు లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్. అయితే గతకొంతకాలం నుంచి ఈ యాడ్ టీవీల్లో పెద్దగా కనిపించటం లేదు. అయినా సరే ఈయన చెప్పిన డైలాగ్ను మాత్రం జనం మరిచిపోలేదు. తాజాగా మెగా హీరో అల్లు శిరీష్.. ఈయన్ను ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు ఓ సెల్ఫీ దిగి ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘సెల్ఫీలు ఎవ్వరికీ ఊరికే రావు! లక్ ఉండాలి. హహ అంటూ.. ఎయిర్పోర్ట్లో కలిశాను .. ఓ సెల్ఫీ అడిగాను’ అంటూ కిరణ్తో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. Selfies evvariki urike raavu! Luck undali ;) Haha! Met Lalitha Jewelry MD, Mr Kiran Kumar on the flight. Had to ask for a selfie! pic.twitter.com/NjBoDnVR6s — Allu Sirish (@AlluSirish) July 3, 2018 -
ఏపీలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి
-
పరీక్షల ‘కీ’.. అక్రమార్కుల చేతికి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఆన్లైన్ పరీక్షలైన టోఫెల్, పీటీఈ, ఐఈఎల్టీఎస్ల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటికి సంబంధించిన ‘కీ’లు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. లాడ్జిల్లో ‘కోచింగ్ సెంటర్లు’ఏర్పాటు చేసి అభ్యర్థులకు తర్ఫీదు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ దందాలో దాదాపు 40 మంది మంచి స్కోర్స్ సాధించి విదేశీ విద్యకు వెళ్లారు. మరో 40 మంది సఫలీకృతులు కాలేకపోయారు. తమ సిరీస్కు చెందిన ‘కీ’లు ఇస్తామంటూ మోసం చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వేట మొదలుపెట్టిన మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక ఏజెంట్ కె.కిరణ్కుమార్ను అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన ‘కీ’లు తీసుకువచ్చి అందిస్తున్న సూత్రధారి యువరాజ్ సింగ్ కోసం గాలిస్తున్నారు. వీరి ద్వారా లబ్ధిపొంది, ఆన్లైన్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి విదేశాలకు వెళ్లిన విద్యార్థులకూ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పరీక్ష కోసం అయిన పరిచయంతో... నిజామాబాద్లోని ఆనంద్నగర్కు చెందిన కుర్రా కిరణ్కుమార్ 2013లో అక్కడి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2016 మేలో హైదరాబాద్కు వచ్చి కేపీహెచ్బీలో ఉన్న మలేషియా టౌన్షిప్లో స్థిరపడ్డాడు. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేద్దామనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) పరీక్ష రాయాలని సిద్ధమయ్యాడు. విదేశాల్లో విద్యనభ్యసించాలని భావించే వారు ఐఈఎల్టీఎస్, పీయర్సన్ టెస్ట్స్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్) వంటి పరీక్షలు ఆన్లైన్లో రాసి మంచి స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కిరణ్కు పంజాబ్లోని జలంధర్కు చెందిన యువరాజ్ సింగ్తో పరిచయమైంది. పరీక్ష అడ్డదారిలో పాస్ కావడానికి సహకరిస్తానని చెప్పడంతో కిరణ్ అంగీకరించడమే గాక, పరీక్ష రాసే అభ్యర్థుల్ని వెతికే పనిలోపడ్డాడు. 12 గంటల ముందే ‘కీ’ బయటకు... పరీక్షల్లో అడ్డదారిలో స్కోర్ సాధించాలనుకునే వారి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసేవాడు. కిరణ్, యువరాజ్ సగం సగం తీసుకునేవారు. పరీక్షకు ముందు రోజు.. దాదాపు 12 గంటల ముందు యువరాజ్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ని తెచ్చి ఇచ్చేవాడు. వీరిద్దరూ కలసి స్థానికంగా ఉన్న లాడ్జిల్లో గదులు బుక్ చేసి, నగదు చెల్లించిన అభ్యర్థుల్ని తీసుకువచ్చి రాత్రంతా ప్రిపేర్ చేయించేవారు. అయితే మూడు నాలుగు సిరీస్లుండే పేపర్లో ఒక్క సిరీస్ మాత్రమే తెచ్చేవారు. మరుసటి రోజు ఆ సిరీస్ వచ్చిన వారు ఉత్తీర్ణులవుతుండగా... మిగిలిన వారికి సరైన స్కోర్ రావట్లేదు. ఇలా మంచి స్కోర్ పొందిన వారిలో 40 మంది విదేశాలకు వెళ్లిపోయారు. మోసపోయామని ఫిర్యాదు చేయడంతో... కిరణ్కు రూ.50 లక్షలు చెల్లించిన మరో 40మందికి సరైన స్కోర్ రాలేదు. దీంతో వీరిలో కొందరు కిరణ్పై సైఫాబాద్, మీర్చౌక్, జూబ్లీహిల్స్ ఠాణాల్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం గత వారం కిరణ్ను పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది. ఇతడి విచారణలోనే యువరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడికి క్వశ్చన్ పేపర్ ‘కీ’ బ్రిటిష్ కౌన్సిల్ నుంచే అందుతున్నట్లు బయటపెట్టాడు. దేశ వ్యాప్తంగా ఈ దందా చేస్తున్న యువరాజ్ కోసం గాలిస్తున్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో పంజాబ్, హరియాణాల్లో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. వీరి ద్వారా అక్రమంగా లబ్ధిపొంది విదేశాలకు వెళ్లిన 40 మందికి నోటీసు లు జారీచేయాలని భావిస్తున్నారు. మోసపోయినట్లు చెప్తున్న వారూ అక్రమ మార్గంలో స్కోర్ సాధించాల ని ప్రయత్నించిన వారే కాబట్టి వీరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉం దా? అనే కోణాన్నీ పరిశీలిస్తున్నారు. -
సొంతూరు పీలేరు.. ఓటున్నది మార్టేరు
పెనుమంట్ర: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటే మారిపోయింది. ఆయనది చిత్తూరు జిల్లా పిలేరు నియోజకవర్గం.. అయితే పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం మార్టేరులో ఓటు ఉన్నట్టు నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓటు కూడా మార్టేరులో ప్రత్యక్షమైంది. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికులు అధికారులను ప్రశ్నించారు. వీఆర్వో జి.దుర్గాప్రసాద్ వివరణ ఇస్తూ.. రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని గుర్తించామని, వెబ్సైట్ పనిచేయకపోవడం వల్లే బొత్స, కిరణ్కుమార్ పేర్లను జాబితాలో నుంచి తొలగించలేకపోయామని తెలిపారు. కాగా, ఓటర్ల జాబితాలో ఇటీవల వింతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆయన భార్య, ఇద్దరి కుమార్తెల ఓటును జాబితా నుంచి తొలగించారు. -
‘సెండ్ ఫాస్ట్’గా డెలివరీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ కంపెనీల సక్సెస్లో ప్రధానమైంది డెలివరీనే. వేగంగా, నాణ్యంగా ఉత్పత్తులు డెలివరీ అయితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ కొంటారు. కానీ ఈ–కామర్స్ సంస్థలన్నీ సొంతగా లాజిస్టిక్స్ను ఏర్పాటు చేసుకోలేవు. మెట్రో నగరాల వరకైతే థర్డ్ పార్టీ మీద ఆధారపడి పని లాగించేయొచ్చు. మరి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల పరిస్థితేంటి? ఇదిగో దీన్నే వ్యాపారంగా మలుచుకుంది హైదరాబాద్కు చెందిన డికార్ట్ లాజిస్టిక్స్! ‘సెండ్ ఫాస్ట్’ బ్రాండ్ పేరిట తృతీయ శ్రేణి ప్రాంతాల్లో డెలివరీ... అదీ జస్ట్ 24 గంటల్లోనే అందించడం దీని ప్రత్యేకత. అందుకే కాబోలు సంస్థ ప్రారంభించిన 5 నెలల్లోనే ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్నూ కస్టమర్గా చేసేసుకుంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్, సీఈఓ కిరణ్ కుమార్ రెడ్డి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మా స్వస్థలం తిరుపతి. అక్కడే చదివా. ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ చేశా. అక్కడే లాజిస్టిక్ అండ్ ట్రాన్స్పోర్ట్లో ఎంటెక్ కూడా పూర్తి చేశా. ఈ–కామర్స్ సంస్థలిస్తున్న లాస్ట్మైల్ డెలివరీ ప్రాముఖ్యం కేవలం మెట్రోలకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి ఈ–కామర్స్లకు వచ్చే ఆర్డర్లలో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉంటాయి. ఆయా ప్రాంతాలకు ఆర్డర్లు వేగంగా చేరితేనే మరింత ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఇదే స్టార్టప్ ఆలోచనకు బీజం వేసింది. మొదట్లో సొంతంగా రూ.2 లక్షల పెట్టుబడితో 2015 జూలైలో ప్రారంభించిన డికార్ట్ లాజిస్టిక్స్లో తర్వాత కార్తీక్, శశాంక్ రెడ్డి కో–ఫౌండర్లుగా చేరారు. ఫ్లిప్కార్ట్, మింత్రతో ఎక్స్క్లూజివ్ ఒప్పందం.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో డెలివరీ సేవలందిస్తున్నాం. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్ర, బిగ్బాస్కెట్, జబాంగ్ వంటి 200కు పైగా ఈ–కామర్స్ కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. ఇందులో ఫ్లిప్కార్ట్, మింత్ర కంపెనీలకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ఉంది. ప్రస్తుతం మా సంస్థలో 500 మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. మార్చి నాటికి మరో 500 మందిని నియమించుకుంటాం. కుటుంబ నేపథ్యం, విద్యార్హత, స్థానిక పోలీస్ వెరిఫికేషన్ వంటివి పూర్తయ్యాకే డెలివరీ బాయ్స్ను నియమించుకుంటాం. వీరికి వేతనాలు రూ.13 వేల నుంచి ఉంటాయి. మరో 6 నెలల్లో 100 ఈ–కామర్స్ కంపెనీలను కస్టమర్లుగా చేర్చాలని లకి‡్ష్యంచాం. పేటీఎంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విస్తరించనున్నాం. ఆ తర్వాత దశలవారీగా దేశమంతటా సేవలను విస్తరిస్తాం. ఈ ఏడాది రూ.10 కోట్ల వ్యాపారం లక్ష్యం ప్రస్తుతం నెలకు 6 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాం. ఇందులో 2.5–3 లక్షల ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉంటాయి. ఏపీ, తెలంగాణ నుంచి 40 శాతం వాటా ఉంటుంది. ప్రతి ఆర్డర్ డెలివరీ మీద ఈ–కామర్స్ కంపెనీల నుంచి రూ.35 చార్జీ తీసుకుంటాం. నెలకు రూ.65–70 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. గతేడాది రూ.3 కోట్ల టర్నోవర్ను నమోదు చేశాం. ఈ ఏడాది రూ.10 కోట్లు లకి‡్ష్యంచాం. గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న యువతకు ఉద్యోగ, ఆదాయ మార్గాలను కల్పించేందుకు కొత్తగా నెట్వర్క్ పార్ట్నర్ను ప్రారంభించాం. ఇదేంటంటే.. మా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ–కామర్స్ కంపెనీల ఆర్డర్లను డెలివరీ చేయవచ్చు. ప్రస్తుతం విశాఖపట్నం, భీమవరం, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి 25 మంది నెట్వర్క్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. రెండేళ్లలో దీన్ని వెయ్యి మందికి చేర్చాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుత నెట్వర్క్ పార్ట్నర్స్ మా ద్వారా నెలకు రూ.50 వేల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. రూ.120 కోట్ల నిధుల సమీకరణ.. ఇటీవలే సౌదీలోని రిటైల్ స్టోర్ గ్రూప్ సినర్జీ గ్లోబల్తో డెలివరీ ఒప్పందం చేసుకున్నాం. స్థానికంగా కొన్ని అనుమతులు రావాలి. ఆయా సేవలకు గాను ప్రతి డెలివరీపై రూ.40 చార్జీ ఉంటుంది. లైన్ హాల్ పేరిట సిటీ నుంచి సిటీ లాజిస్టిక్స్ సేవలు కూడా అందిస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 5 టన్నుల వరకు డెలివరీ చేస్తున్నాం. దీనికి కిలోకు రూ.50 వరకు చార్జీ ఉంటుంది. గతేడాది ప్రారంభంలో హైదరాబాద్ ఏంజిల్స్ నుంచి రూ.1 కోటి సమీకరించాం. తాజాగా రూ.120 కోట్లు సమీకరిస్తున్నాం. అమెరికాకు చెందిన 3 ఇన్వెస్టర్స్ క్లబ్స్తో చర్చలు జరుపుతున్నాం. ఒకటి పూర్తయింది. ఈక్విటీ ఆడిట్ జరుగుతోంది. మరో 5 నెలల్లో డీల్ను క్లోజ్ చేస్తాం’’ అని కిరణ్ కుమార్ వివరించారు. -
ఏఓ కిరణ్కుమార్రెడ్డి సస్పెన్షన్
అనంతపురం అగ్రికల్చర్: కళ్యాణదుర్గం భూసంరక్షణా విభాగంలో పనిచేస్తున్న వ్యవసాయాధికారి (ఏఓ) కె.కిరణ్కుమార్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. బ్రహ్మసముద్రం మండలానికి ఇన్చార్జ్ ఏఓగా పనిచేస్తున్న కిరణ్కుమార్రెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ విత్తన పంపిణీతో ఇతర వ్యవసాయ పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నందున ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. -
మళ్లీ తెరపైకి కిరణ్కుమార్రెడ్డి!
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తిరిగి కాంగ్రెస్పార్టీలో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తిరిగి హస్తం గూటికి చేరేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్టు చెప్తున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డి.. విభజన బిల్లును వ్యతిరేకించి.. చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తిరిగి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని, ఇందులోభాగంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో తనకు తెలిసిన కాంగ్రెస్ పెద్దలతో కిరణ్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. -
నటికి పెళ్లి హామీ.. మోసం.. ప్రైవేట్ ఫొటోలు
కొచ్చి: ఓ సినీ నటితో సన్నిహితంగా ఉండి ఆమె ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేసిన ఆరోపణలు కూడా అతడిపై నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరణ్ కుమార్ (38) అనే వ్యక్తికి మలయాళంలో ఓ ప్రముఖ నటికి పరిచయం ఉంది. అతడు ఇండస్ట్రీలో ఫిల్మ్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేవాడు. తొలుత వారిమధ్య పరిచయం ఉండేది. కాలక్రమంలో అదికాస్త మరింత ఎక్కువై ఇద్దరు సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రైవేట్ సంబంధం కూడా మొదలైంది. ఈ సమయంలోనే అతడు పెళ్లి చేసుకుంటానని కూడా ఆ నటితో చెప్పాడు. అప్పుడే వారు పలు ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే, అతడికి అప్పటికే వివాహమయినా ఆమె చెప్పకపోవడం ఆ తర్వాత ఆ నటి తెలుసుకొని అతడు మోసగాడని గుర్తించి దూరం పెట్టింది. అయితే, డబ్బును డిమాండ్ చేస్తూ బెదిరించే క్రమంలో వారిద్దరు కలిసి దిగిన ప్రైవేట్ ఫొటోలను కిరణ్ సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆ నటి పోలీసులను ఆశ్రయించగా వారు అతడిని నాన్బెయిలబుల్ వారెంట్తో అరెస్టు చేశారు. -
మలబద్ధకం... కడుపుబ్బరం..?
నా వయసు 38. తిన్న వెంటనే టాయిలెట్కు వెళ్లాల్సి వస్తోంది. మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. పొట్టలో మెలిపెట్టినట్లుగా నొప్పి, తేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. – నీలిమ, ఖమ్మం ఈ లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్వాడటం ∙జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్కు దోహదం చేస్తుంటాయి. వీటితోపాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్కు వెళ్లాల్సివస్తుంది. ఐబీఎస్ ప్రాణాంతకం కాకున్నా, చాలా ఇబ్బందికరమైనది. దీనికి నిర్దిష్టమైన పరీక్షలు లేకున్నా, లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా... వంటి అంశాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. –డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం...
హైదరాబాద్ : సాఫ్ట్వేర ఇంజినీర్ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం ....వరంగల్ జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ మూడు రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. ట్రాన్స్పోర్ట్ పేపర్ల కోసం వరంగల్ నుంచి భార్య అశ్వినితో కలసి సోమవారం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని హనీవెల్ కంపెనీకి వచ్చాడు. కిరణ్ భార్య కంపెనీ మొదటి గేటు దగ్గరే వేచి ఉండగా, అతడు లోపలికి వెళ్లాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు ల్యాండ్ లైన్ నుంచి భార్యకు ఫోన్చేసి మరో రెండు గంటల సమయం పడుతుందని చెప్పాడు. సాయంత్రం వరకూ ఆమె అక్కడే ఉన్నా కిరణ్ బయటకు రాకపోవడంతో కంపెనీ సెక్యూరిటీని వాకబు చేయగా, అతడు రెండు గంటల క్రితమే బయటకు వెళ్లిపోయినట్లుత తెలిపారు. దీంతో ఆమె మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీలో ‘నల్లారి’ చేరికకు రంగం సిద్దం!
కలికిరి: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్కుమార్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికలలో జై సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే గత మూడు సంవత్సరాలుగా నల్లారి సోదరులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయినప్పటికి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీలో చేరుతారని పుకార్లు షికార్లు చేశాయి. ఏడాది కాలంగా ఏదో ఒక పార్టీలో చేరుతారని, నేడో రేపో ప్రకటన చేస్తారంటూ ఊహాగానాలు హల్చల్ చేశాయి. ఇంతలో నల్లారి కిరణ్కుమార్ రెడ్డి తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇటీవల టీడీపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరనాధరెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ, జడ్పీ చైర్మెన్ గీర్వాణీ చంద్రప్రకాష్ తదితర ప్రముఖులు ఆదివారం సాయంత్రం నగిరిపల్లిలో నల్లారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ తంతులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు నల్లారి కిషోర్కుమార్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే కిషోర్కుమార్రెడ్డి సైతం టీడీపీలో చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలో తాను పార్టీలో చేరుతానని అయితే తనకు రాజంపేట ఎంపీ టికెట్తో పాటు, టీటీడీ చైర్మన్ పదవి అడిగినట్లు సమాచారం. ఎంపీ టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధినేత సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా తన సోదరుడు నల్లారి కిషోర్కుమార్రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై మాజీ ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేయనట్లు విశ్వసనీయ సమాచారం. -
చంద్రయాన్-2 సిద్ధమౌతోంది
-
చంద్రయాన్-2 సిద్ధమౌతోంది: కిరణ్కుమార్
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 మిషన్ను 2018 ప్రథమార్ధంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. వెల్స్ విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన చంద్రునిపై స్పేస్క్రాఫ్ట్ను దింపేందుకు అవసరమయ్యే సాంకేతికతపై ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఇస్రో ప్రత్యేక ఇంజిన్ను తయారుచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఓ కృత్రిమ కార్టర్తో ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహేంద్రగిరి, తిరెనెల్వేలి, చల్లకెరెల్లో గల ఇస్రో స్ధావరాల్లో గ్రౌండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఉపగ్రహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వీనస్ మిషన్పై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ప్రాజెక్టుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు. కాగా, చంద్రయాన్ 2లో ఒక ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్ ఉంటాయి. చంద్రయాన్-1కి ఇది ఆధునిక వెర్షన్. జీఎస్ఎల్వీ మార్క్ 2 ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించాలనే ఇస్రో చూస్తోంది. -
ప్రభుత్వ స్థలంపై కబ్జాకోరుల కన్ను
► రాత్రికి రాత్రే వెలసిన గుడిసెలు ► సకాలంలో స్పందించిన అధికారులు ► ఆక్రమణల తొలగింపు ► భూమి ఆక్రమిస్తే జైలుకే : తహసీల్దార్ కిరణ్కుమార్ తిరుపతి రూరల్ మండలంలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు కబ్జా రాయుళ్లు బరితెగిస్తున్నారు. కోట్ల విలువైన భూముల్లో రాత్రికి రాత్రే గుడిసెలు వేసేస్తున్నారు. తుడా నిర్లక్ష్యంతో అన్యాక్రాంతమవుతున్న రూ.10 కోట్ల విలువైన భూమిని రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించడంతో కాపాడుకోగలిగారు. తిరుపతి రూరల్: తిరుచానూరు పంచాయతీ సర్వే నంబర్ 234లో 100 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉంది. అందులో 30 ఎకరాలను ప్రజా ప్రయోజనాల కోసం 2006లో తుడాకు కేటాయిం చారు. అక్కడ ఎకరా దాదాపు రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తమ పరిధిలోకి తీసుకోవటంలో చూపిన చొరవను దానిని కాపాడటంలో తుడా చూపలేకపోయింది. విలువైన ఈ స్థలంపై కబ్జారాయుళ్లు కన్ను వేశారు. రూ.10 కోట్ల విలువ చేసే రెండు ఎకరాల స్థలంలో గురువారం రాత్రి దాదాపు 30 గుడిసెలు వేసి, ఆక్రమించుకునేందుకు యత్నించారు. సకాలంలో స్పందించిన తహసీల్దార్.. విలువైన తుడా భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్లు తిరుపతి రూరల్ తహసీల్దార్ కిరణ్కుమార్కు స్థానికులు సమాచారం అందించారు. స్పం దించిన ఆయన ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ ఇ¯ŒSస్పెక్టర్ శివకుమార్ను ఆదేశించారు. ఆక్రమణదారులు అడు్డకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించి, తుడా అధికారులకు సమాచారం అందించారు. కబ్జారాయుళ్లపై పోలీసులకు ఫిర్యాదు.. విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కిరణ్కుమార్ పోలీసులను ఆదేశించారు. తహసీల్దార్ ఆదేశాలతో ఆర్ఐ శివకుమార్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి జైలు తప్పదని తహసీల్దార్ కిరణ్కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అబ్బన్న, వీఆర్వో మల్లికారు్జనరెడ్డి, వీఆర్ఏ బాలకృష్ణ పాల్గొన్నారు. -
వైద్య చరిత్రలో అరుదైన కేసు
న్యూఢిల్లీ: కేరళ రాజధాని తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మనిషి శరీరంలో గుచ్చుకుపోయిన సూదిని 22 ఏళ్ల తర్వాత వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. కిరణ్ కుమార్ (34) అనే వ్యక్తి 12 ఏళ్ల వయసులో ఉన్నపుడు ప్రమాదవశాత్తూ సూది అతని శరీరంలోకి దూరింది. అప్పట్లో కుటుంబ సభ్యులు కిరణ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్ బాడీలో ఉన్న సూదిని వైద్యులు గుర్తించలేకపోయారు. సాధారణ చికిత్స చేసి పంపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని మరచిపోయారు. రెండు వారాల క్రితం వీపు భాగంలో నొప్పిగా ఉండటంతో కిరణ్ వైద్యులను సంప్రదించాడు. స్కాన్ చేయించగా కిరణ్ ఎడమ పిరుదులో సూది ఉన్నట్టు గుర్తించారు. తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్కు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. శనివారం వైద్యులు రెండున్నర గంటల సమయం శ్రమించి సర్జరీ చేసి సూదిని తొలగించారు. ఆర్థోపెడిక్, అనస్థేసియా నిపుణుల బృందం సర్జరీ చేసింది. కిరణ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. -
ఇద్దరు చంద్రులూ కుమ్మక్కయ్యారు!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో గద్వాల ఎమ్మెల్యే డి.కె. అరుణ తెలంగాణ ఇచ్చి తప్పు చేశామనుకోలేదు. చివరి నిమిషంలో కాకుండా ఒక సంవత్సరం ముందే ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండేది. కిరణ్కుమార్ రెడ్డి పూర్తిగా తెలంగాణకు వ్యతిరేక వైఖరి తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఆంధ్రకు ఏదో జరిగిపోతోందనే ఉద్వేగంతో ఆయన మరో మార్గం చేపట్టారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోయింది. రాజకీయాల్లో మహిళలు రాణించడం కష్ట సాధ్యమవుతున్న సంక్లిష్ట పరిస్థితుల్లో చట్టసభల్లో అత్యున్నత స్థానాలకు ఎదిగిన గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ.. అధికారంలో ఉన్నా లేకున్నా పోరాటమే మార్గం అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటును చూపి పబ్బం గడుపుకుంటున్నప్పటికీ చంద్రబాబుకీ, కేసీఆర్కీ మధ్య చక్కగా ఒప్పందాలు కుదిరిపోయాయని అంటున్నారు. ఇక్కడేమో ఫోన్ ట్యాంపింగ్, అక్కడేమో ఓటుకు కోట్లు.. వీటిలోంచి బయటపడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, కానీ సెంటిమెంటుతో రాజకీయం చేస్తున్నారని అరుణ విమర్శించారు. సీఎం పదవిపై ఆశ లేదంటూనే సమర్థ మహిళగా తనకు సీఎం అయ్యే అర్హత లేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తే లేదని, వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తంచేస్తున్న డీకె అరుణ మనసులోమాట కార్యక్రమంలో చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రావాలనే ఆసక్తి ఎలా కలిగింది? మా నాన్న నర్సిరెడ్డి మా చిన్నప్పటినుంచే రాజకీయాల్లో ఉండేవారు. తర్వాత కోడలిగా ఇంకో రాజకీయ కుటుంబంలో అడుగుపెట్టాను కానీ నేను రాజకీయాల్లోకి వస్తానని ఎన్నడూ భావించలేదు. రాజకీయాల్లోకి ఇష్టపడి రాలేదు. పార్టీ ఆహ్వానం మేరకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటివరకు నా భర్త ఎన్నికల్లో నిలిచినప్పుడు ప్రచారం చేశాను తప్ప నేరుగా రాజకీయాల్లో లేను. మీ నాన్న, మీరు ఏక కాలంలో అసెంబ్లీలో ఉండిన స్థితిని ఊహించారా? 2004లో నాన్న కాంగ్రెస్ తరపున పోటీ చేయగా నేను స్వతంత్ర అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేశాను.ఇద్దరంగెలిచాము. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాను. కాబట్టి అసెంబ్లీలో ఎలా ఉం డాలి, ఎలా మాట్లాడాలి అని ఆయన నన్ను గైడ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంవత్సరం తర్వాత 2005లో ఆగస్టు 15వ రోజునే మా నాన్నను, బ్రదర్ని ఇద్దరినీ నక్సలైట్లు చంపేశారు. అది జీవితంలో మర్చిపోలేని బాధాకరమైన సంఘటన. మీ కుటుంబం అక్రమ దందాలు, అక్రమ మైనింగు చేసిందని అంటున్నారు కదా ! ఇన్నేళ్ళుగా మేం రాజకీయాల్లో ఉంటున్నాము. అక్రమ దందాలు చేసి ఉంటే ప్రజలు మమ్మల్ని ఆదరించరు కదా. మైనింగ్లో అక్రమ వ్యవహారం కూడా కక్షసా దింపే. మా బంధువుగా చెప్పుకునేటాయన ద్వేషంతో మమ్మల్ని ఇబ్బందులపాలు చేయాలని మాపై ఫిర్యాదు చేశాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని ఆసరా చేసుకుని 33 కోట్ల రూపాయల అక్రమ మైనింగుకు పాల్పడినామని ప్రచారం చేసింది. 33 కోట్ల విలువైన మైనింగు మేము చేయలేదు. రాజశేఖరరెడ్డి స్వభావం ఎలాంటిది ? నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు వైఎస్సార్కి ఉన్నాయి. కింది స్థాయి నేతలను ఏవిధంగా ప్రోత్సహించాలి, ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా వారిని పార్టీవైపుకు లాక్కోవాలి అనే వాటికి సంబంధించి పూర్తి నాయకత్వ లక్షణాలు ఆయనకున్నాయి. మహిళలుగా రాజకీయాల్లోకి వచ్చిన మాకు కూడా ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. మేం దూరంగా ఉన్నప్పుడు కూడా రాండమ్మా ముందుకురండి, వాళ్లను ముందుకు రానియ్యండయ్యా అని మాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారు. చంద్రబాబుకు, వైఎస్సార్కు ఉన్న తేడా ఏమిటి? రాజకీయంగా తన వెంట ఉన్నవారు, తనవారు అనుకుంటే వారిని ఏం చేసైనా సరే కాపాడుకోవాలనే గొప్ప గుణం రాజశేఖరరెడ్డిలో ఉండేది. లేని ముద్రలు వేసి పరాభవించే తత్వం టీడీపీలో చూశాం. దానికీ దీనికీ చాలా తేడా ఉంది. కేసీఆర్, వైఎస్సార్.. ఈ ఇద్దరిపై మీ అంచనా ఏమిటి? పోలికే లేదు. కేసీఆర్ పూర్తిగా నియంతగా మారిపోయారు. తను చెప్పిందే శాసనం. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉదయం పూట ఒకటన్నర గంట పాటు వందలాది, వేలాది మంది ప్రజలను కలిసేవారు. కేసీఆర్ అయితే ప్రజలను పక్కన పెట్టండి, ఎమ్మెల్యేలకే సమయం ఇవ్వడం లేదు. ప్రజానేత ప్రజలను కలవాలి. వైఎస్సార్ ఆకస్మిక మరణంతో మీరంతా వైఎస్ జగన్ని సీఎంని చేయాలని కోరిన, అధిష్టానం చేయకపోవడంపై మీ స్పందన ఏమిటీ? వైఎస్సార్కు అలా జరుగుతుందని అనేది ఊహించలేదు. తల్చుకుంటేనే బాధేస్తుంది. ఆయన మీద అభిమానం అనుకోండి, ఆ సమయంలో రేగిన ఉద్వేగాలు అనుకోండి. అప్పట్లో వైఎస్ జగన్ని సీఎం చేయాలనే మేమంతా కోరుకున్నాం. వాళ్ల కుటుంబం మొత్తానికి అప్పట్లో పెద్ద అండగా ఉన్నాం. కొంత ఓపిక పట్టమని జగన్ కి కూడా చెప్పాం. కాని భిన్నమార్గంలో జరిగిపోయింది. పార్టీని వదిలిపెట్టడానే కోపంతోనే అధిష్టానం జగన్పై కేసులు పెట్టించిందా? కోపంతో కేసులు పెట్టించారని అనుకోను. కొందరు కోర్టుల్లో కేసులు వేశారు. అలా కేసులు వేసినప్పుడు అనేక పరిణామాలు జరిగాయి. అప్పుడు యూపీఏ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెసే చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులతోనే అనేక విధాలుగా యాక్షన్ జరిగాయి, రియాక్షన్స్ జరిగాయి. అంతే కానీ ప్రత్యేకంగా కక్ష గట్టి సాధించారని నేననుకోను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం ఏమంటారు? కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటుకు మరింతగా పెట్రోలు వేసి, మంటలు మండించి లబ్ది పొందడానికి ప్రజలకు అనేక హామీలిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నిజం అయిపోతాయి, కేసీఆర్ ఉంటేనే మాకు మేలు జరుగుతుందని, టీఆర్ఎస్కు ఒకసారి ఓటు వేసి చూద్దాం అనే ఆలోచనతోనే ఓటేశారు. చంద్రబాబుతో కేసీఆర్కి ఎలాంటి సంబంధాలున్నాయి? ఇద్దరు చంద్రులకూ ఒప్పందాలు జరిగిపోయాయి. బయటకు మాత్రం ఇద్దరూ సెంటిమెంటు చూపిస్తున్నారు. చంద్రబాబేమో తెలంగాణను చూపించి అక్కడ సెంటి మెంటు ఆట ఆడతాడు. ఈయనేమో చంద్రబాబును చూపించి ఇక్కడ ఆట ఆడతాడు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్, అక్కడ ఓటుకు కోట్లు. ఉన్నదల్లా సెంటిమెంటు రాజకీయమే. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పార్టీ ఉండ వచ్చు. కొందరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయవచ్చు. కొంతమంది గెలవవచ్చు. కానీ టీడీపీతో కాంగ్రెస్ కలిసి పోటీ చేసే ప్రశ్నే లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చే మాట అంతకంటే లేదు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కు మాత్రమే ఉంది. తెలంగాణ ప్రజలకు ఏం సందేశమిస్తారు కేసీఆర్ ఆడుతున్న సెంటిమెంట్ రాజకీయాలకు లోబడవద్దు. దేనికోసం తెలం గాణను అందరం కోరుకున్నామో ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తోందా అలోచించండి. ప్రజాస్వామ్యం లేనటువంటి రాష్ట్రంలో పాలకులకు సమిధలుగా మారకుండా మేల్కొనండి అని చెబుతున్నాను. (డి.కె. అరుణతో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=LqtKOOTupSs -
నేను చాలా స్ట్రిట్టు..!
‘నేను రోజుకు పది గంటలు పనిచేస్తున్నా.. నిన్న ఒక్క రోజే రూ.90లక్షల బిల్లులు పాస్ చేశా. ఒక్క పైసా బాకీ లేదు. నా గురించి ఎవరో తప్పుగా చెప్తున్నరు..’ అంటూ పరిగి గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ కిరణ్ కుమార్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన జోక్యం చేసుకుంటూ పైవిధంగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన తడబాటు.. చెప్పిన విషయాన్నే పదేపదే చెప్పడం.. పైఅధికారులు వారిస్తున్నా వినకుండా కొంత దూకుడుగా వ్యవహరించడంతో.. మద్యం సేవించి వచ్చారా సార్.. అంటూ సభ్యులు సెటైర్లు విసిరారు. ఇంతలో మంత్రి మహేందర్రెడ్డి జోక్యం చేసుకుని.. ఆయన ఆరోగ్యం బాలేదంటూ వెనకేసుకొచ్చారు. అయినప్పటికీ.. ఈఈ వ్యవహారశైలిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ అంతర్గతంగా ఆదేశించినట్లు తెలిసింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
గూడు వైపు అడుగు పడేనా ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఒక కొత్త పక్కా ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఎన్టీఆర్ గృహ పథకం పేరుతో ప్రతి జిల్లాలో భారీ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఏడాది కిందట ప్రటించినా ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో వివిధ పథకాల కింద 11,118 ఇళ్ల నిర్మాణానికి, 10,000 పక్కా గృహాల మరమతులకు ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి పేద వాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ పథకంలో వేలాది కుటుంబాలు లబ్ధి పొందాయి. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రులు వచ్చిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పెద్దగా శ్రద్ధ వహించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు ఇళ్ల కోసం వేలాది దరఖాస్తులు అందాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ దరఖాస్తులు అటకెక్కాయి. అప్పటికే నిర్మాణంలో ఉన్న వేలాది ఇళ్లను అనర్హుల సాకుతో రద్దు చేశారు. గృహ నిర్మాణాలపై విచారణ జరిపించే పేరుతో రెండేళ్లుగా ఒక్క కొత్త ఇంటిని మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలో గృహ నిర్మాణ శాఖకార్యకలాపాలు అటకెక్కాయి. నిధులేవీ..? ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో రూ.30,450 లక్షలతో 10,500 ఇళ్ల నిర్మాణానికి సర్కారు ఆమోదం తెలిపింది. అధికారులు 9052 మంది లబ్ధిదారులను గుర్తించి ఇంటి నిర్మాణానికి అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తి చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన 10,000 పక్కా ఇళ్ల మరమ్మతులకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అధికారులు ఈ పథకం కింద 5366 మంది లబ్ధిదారులను గుర్తించారు. అందరికీ పక్కా ఇళ్లు (హౌసింగ్ ఫర్ ఆల్ ) పథకం కింద 20681 ఇళ్ల నిర్మాణానికి రూ. 1,13,745 లక్షలు కేటాయించడానికి రాష్ర్ట ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ఆర్నెల్లు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. దరఖాస్తుదారులు ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోసం జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన ఉత్తర్వులు, నిధులు విడుదలయ్యే వరకు తామేమీ చేయలేమని వారు లబ్ధిదారులకు సమాధానం ఇచ్చి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశంలోనైనా ఇళ్ల నిర్మాణానికి, అవసరమైన నిధుల విడుదలకు ఉత్తర్వులు వెలువరించేలా నిర్ణయం తీసుకుంటారేమో చూడాల్సి ఉంది. -
‘పాలేరు’లో తిరుగులేని ‘పాచిక’
తెలంగాణలో కొడిగడుతున్న దీపం తెలుగుదేశం, తన అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. బహుశా తెలంగాణ టీడీపీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సలహాలు ఇంకా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ఆయన (కిరణ్) చెప్పినట్టే నడుచుకున్నారు కదా! కానీ కాంగ్రెస్, టీడీపీ స్నేహం ప్రజలకు పెద్దగా రుచించదు. ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ ఉప ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని ఇంతకు ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి విన్నపం వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి, ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం తెలంగాణ శాసనసభ రివాజుగా నివాళులు అర్పించింది.ఆ సందర్భంలో అదే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ శాసన సభ్యుడు పువ్వాడ అజయ్కుమార్, పాలేరు స్థానానికి కాంగ్రెస్ ఎంపిక చేసే వెంకటరెడ్డి కుటుంబ సభ్యులెవరినైనా ఏకగ్రీవంగా గెలిపించాలని అన్ని పార్టీ లకూ విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా గెలిపించాలన్న ప్రతిపాదనే ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైనది కాదు. దివంగత నేత కుటుంబంలో అర్హతలు కలిగిన వారుంటే స్వయంకృషితో రాజకీయాల్లో నిల దొక్కుకోవాలి. అలా జరగాలే తప్ప ఏకగ్రీవాల వల్ల ఎక్కువకాలం ఎవరూ మనలేరు. అయినా గతంలో కొన్ని సందర్భాలలో ఇటువంటి సంప్రదా యాన్ని పాటించారు కాబట్టి అజయ్ అట్లా అభ్యర్థించడంలో తప్పులేదు. ఆయన కూడా కొత్తగా శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. రాజకీయాలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు అజయ్ తండ్రి చాటు బిడ్డే. ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కమ్యూనిస్ట్ నాయకుడు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనది. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలోనే కూడా. తండ్రి అడుగుజాడల్లో కమ్యూనిస్ట్ పార్టీలో కాకుండా, కాంగ్రెస్లో చేరి శాసనసభ్యుడయ్యారు అజయ్. కొద్దిరోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అజయ్ తండ్రి ప్రస్తావన ఎందుకంటే ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో ఒకప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం చాలా ఎక్కువ. ఆ వైభవం రానురాను తగ్గి ఇప్పుడు తెలంగాణ శాసనసభలో ఆ పార్టీలు రెండు స్థానాలకు పరి మితం కావలసి వచ్చింది. 2014 ఎన్నికలలో ఖమ్మం నుంచి సీపీఎం సభ్యుడు, నల్లగొండ నుంచి సీపీఐ సభ్యుడు గెలిచారు. అంతకు ముందు ఒక సారి కాంగ్రెస్తో, ఇంకొకసారి తెలుగుదేశంతో పొత్తుల కారణంగా, తమ రెండు పార్టీలకూ ఉన్న బలం కారణంగా, ఎలా అయితేనేమి కమ్యూనిస్టులు కొన్ని స్థానాలు గెలుస్త్తూ ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎన్నికల రాజకీ యాల్లో కమ్యూనిస్ట్ల పరిస్థితి దేశమంతటా ఎట్లా ఉందో ఖమ్మం జిల్లాలో కూడా అట్లాగే తయారయింది. ఇవన్నీ ఆలోచించే అజయ్కుమార్ తండ్రి బాట వీడి కాంగ్రెస్ దారిన నడిచి ఉంటారు. తాను శాసనసభ్యుడిగా గెలి చారు, ఈ మధ్యనే జరిగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పది డివిజన్లలో కాంగ్రెస్ గెలవడానికి కృషి చేశారు. కాంగ్రెస్లో ఉంటే మంచి భవిష్యత్ ఉంది. మరి పాలేరు ఎన్నికను ఏకగ్రీవం చేసి కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపిద్దామన్న పువ్వాడ అజయ్, సరిగ్గా ఆ ఎన్నికల ముంగిట్లో పార్టీ ఫిరా యించి తెరాసలో ఎందుకు చేరారు? కాంగ్రెస్ భవిష్యత్తు మీద నమ్మకం లేక తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలని అనుకున్నా రేమో! గులాబీ రంగుకు దూరంగా ఖమ్మం జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు జిల్లా కాబట్టి తెలంగాణ వాదం ఎంత బలంగా ఉన్నదో, వ్యతిరేక వర్గం కూడా అంత బలంగానూ ఉండేది. నిజానికి మొదట తెలంగాణ ఉద్యమానికి నాంది, అంటే 1969 ఉద్యమానికి, ఖమ్మం జిల్లాలోనే. అప్పటి రాష్ట్ర హోం మంత్రి జలగం వెంగళరావు ఖమ్మం పర్యటనలో ఉండగా ఆయన కారు మీద బాంబు దాడికి విఫలయత్నం జరిగిన విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఆ తరువాత దశ తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో ఊతం ఇచ్చిన నాయకులు చాలామందే ఉండేవారు, ముఖ్యంగా ఉద్యోగవర్గాల్లో. 2001లో చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ర్ట సమితిని స్థాపించి ప్రత్యేక రాష్ర్ట ఉద్యమాన్ని ముందుకు ఉరికించినప్పుడు ఖమ్మం జిల్లా ఆ మార్గంలో వెనకబడి, పదో స్థానంలో ఉండేది. మలిదశ ఉద్యమ కాలంలో రెండు సార్వత్రిక ఎన్నికలొచ్చినా తెలంగాణ రాష్ర్ట సమితికి అభ్యర్థులు కూడా లభించని పరిస్థితి. ఉద్యమం ఉధృతంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలు - కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్; మెదక్ జిల్లా కొంత భాగం మాత్రమే గట్టిగా టీఆర్ఎస్ వెంట నడిచాయి. జంట నగరాలు సరే సరి. దక్షిణ తెలంగాణలో కూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉన్నా ఉద్యమ నిర్మాణం ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ. అయితే రాష్ర్టం ఏర్పడే నాటికి పరిస్థితి మారి దక్షిణ తెలంగాణ కూడా టీఆర్ఎస్ వశం కావడం చూశాం. ఖమ్మం మాత్రం అలాగే ఉండిపోయింది. ఉద్యమకాలంలో ఎలా ఉందో, 2014 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. శాసనసభ స్థానాలు పది, ఒక పార్లమెంట్ స్థానం జిల్లాలో ఉంటే టీఆర్ఎస్ ఒక్క చోట కూడా గెలవని పరిస్థితి. నాలుగుచోట్ల కాంగ్రెస్, మూడుచోట్ల వైఎస్ఆర్సీపీ, ఒక్కో స్థానంలో టీడీపీ, సీపీఎం, స్వతంత్రులు గెలిచారు. రాష్ర్ట సాధన తరువాత ముఖ్య మంత్రి స్వయంగా చెప్పినట్టు ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది కాబట్టి ఖమ్మం జిల్లాను అలా వదిలేయడానికి వీల్లేదు. మరేం చేయాలి? 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ అలా వదిలేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుంది. జిల్లాలో ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేకుండా వచ్చే ఎన్నికల నాటికి లేదా ఈ మధ్యలో వచ్చే ఏ ఎన్నికకయినా పార్టీని నడిపించడం ఎలా? ముఖ్యమంత్రికి ఆ జిల్లాతో మరో అనుభవం కూడా ఉంది. 2009లో ఆయన కరీంనగర్ నుంచి బయలుదేరి మెదక్ జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేయబూనినప్పుడు దానిని భగ్నం చేసి ఖమ్మం జిల్లాలోనే నిర్బంధించారు. అది ఆయనకు చేదు అనుభవం కూడా. ఈ కారణాలన్నింటివల్లా ఖమ్మం జిల్లాలో ఫిరాయింపులకు తెరలేపారు. తొలి నాళ్లలోనే ఒక స్వతంత్ర శాసనసభ్యుడు, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ సభ్యులు అధికార పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు అజయ్ కూడా చేరడంతో జిల్లాలో అధికార పార్టీ బలం నాలుగుకు పెరిగింది. పాలేరుకు ఎన్నిక రావడంతో జిల్లాలో కాంగ్రెస్ బలం రెండుకు పడిపోయింది. అందులో ఒకరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహకాధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క. ఇక పాలేరు ఉప ఎన్నిక దగ్గరికే వద్దాం. టీఆర్ఎస్ బరిలోకి దింపిన రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ జిల్లా పాత కాపు. చాలాకాలం తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు సన్నిహిత మిత్రుడు. ప్రస్తుతం తుమ్మల శాసనమండలి సభ్యుడిగా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయనను పాలేరు బరిలో దింపడం ద్వారా ఖమ్మం జిల్లాలో రాజకీయ శక్తిగా బలోపేతం కావడం ముఖ్యమంత్రి ఆలోచన. పార్టీ ప్లీనరీ ఖమ్మంలో నిర్వహించాలన్న నిర్ణయం కూడా అందులో భాగంగానే చూడాలి. చేతికొచ్చిన సైకిలు ఇక కాంగ్రెస్లో ఉండగా పువ్వాడ అజయ్ చేసిన పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అంశానికి వస్తే, అన్నీ సరిగ్గా ఉంటే ఏకగ్రీవాలు ఫర్వాలేదేమో కానీ, ఖమ్మం వంటి జిల్లాలో టీఆర్ఎస్ ఎందుకు ఒక స్థానాన్ని వదులు కుంటుంది? అయినా ఇంకా దుఃఖభారం నుండి కోలుకోని దివంగత నాయకుడి సతీమణిని బరిలోకి దింపి, వారి చేతనే ఏకగ్రీవం కోసం ఇతర పార్టీలను అభ్యర్ధింప చేయడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇక తెలంగాణలో కొడిగడుతున్న దీపం తెలుగుదేశం, తన అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. బహుశా తెలంగాణ టీడీపీ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి సలహాలు ఇంకా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాసనసభలో ఆయన(కిరణ్) చెప్పినట్టే నడుచుకున్నారు కదా! కానీ కాంగ్రెస్, టీడీపీ స్నేహం ప్రజలకు పెద్దగా రుచించదు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా పుట్టిన తెలుగుదేశం, చివరికి కాంగ్రెస్తో జతకట్టడం ఆ పార్టీ పరిస్థితిని స్పష్టం చేస్తున్నది. ఏకగ్రీవం కోసం ప్రయత్నించకుండా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని తానే తిరిగి పొందాలన్న ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లి ఉంటే చతుర్ముఖ పోటీలో గెలుపు అవకాశాలు ఉండేవి. తెలుగుదేశం తన అభ్యర్ధిని దింపి ఉంటే శ్రేణులు, అభిమానులు (ఇంకా మిగిలి ఉంటే) అటు పని చేసేవారు, కమ్యూనిస్టుల ఓట్లు సీపీఎం అభ్యర్ధి తీసుకునేవారు. అందరి మద్దతుతో బయటపడాలన్న దుగ్ధ వల్ల కాంగ్రెస్ పాలేరులో అసలుకే మోసం తెచ్చుకున్నట్టున్నది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక మినహాయిస్తే అధికార పార్టీ ఓడిందెక్కడా లేదు. పాలేరు అదే బాట పట్టే సూచనలున్నాయి. మొత్తానికి పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు గెలిస్తే దొడ్డిదారిన మంత్రి అయ్యారన్న విమర్శ నుంచి బయటపడతారు. ఖమ్మం జిల్లాలో పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన నాయకుడు ఒకరయినా ఉన్నారని చెప్పుకునే వీలు అధికార పక్షానికి కలుగుతుంది. datelinehyderabad@gmail.com - దేవులపల్లి అమర్ -
కదిరిలో భారీ చోరీ
కదిరి: అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. కదిరి పట్టణం మారుతీనగర్కు చెందిన భారత్ గ్యాస్ ఏజన్సీ నిర్వాహకుడు కిరణ్కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. కిరణ్ కుటుంబసభ్యులతో కలసి నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.5.40 లక్షల నగదుతోపాటు ఆరు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం చోరీని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. సీఐ శ్రీనివాసులు, పట్టణ ఎస్సై సాగర్ సంఘటన స్థలిని పరిశీలించారు. దొంగతనం తెలిసిన వారిపనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
బేగంపేట ఫ్లైఓవర్పై ప్రమాదం
నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికంగా నివాసముంటున్న కిరణ్కుమార్(35) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఈరోజు కార్యాలయానికి వెళ్తుండగా.. వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్తూరు జిల్లా పోలీసుల దాష్టీకం
తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ పాతకేసు విచారణలో భాగంగా కల్లూరు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులకు ప్రత్యర్థులవ్వడం కారణంగా తమను పోలీసులు వేధిస్తున్నారంటూ...విచారణ ఎదుర్కొన్న వారిలో కిరణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతనిని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఎస్.ఐ కృష్ణయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని కిరణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. -
భార్య ఉండగానే మరో పెళ్లి
కటకటాల్లోకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ చాంద్రాయణగుట్ట: ప్రేమ పేరుతో వల వేసి... ఒకరికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్న ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం...కర్మన్ఘాట్ గాయత్రీనగర్కు చెందిన శంకర్ నాయక్ కుమారుడు కిరణ్ కుమార్(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్. సైదాబాద్కు చెందిన పుష్పలత(25)ను ఐదేళ్ల పాటు ప్రేమించి 2013లో బాలాపూర్లోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు భార్యతో చక్కగా ఉన్న కిరణ్ ఆ తర్వాత బీటెక్లో తనతో పాటు చదువుకున్న గౌలిపురాకుచెందిన స్వాతి (24)ని ప్రేమలోకి దించాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి 2015 జూన్లో సీతాఫల్మండిలోని ఆర్యసమాజ్లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యను సైదాబాద్లో, రెండో భార్యను గాయత్రీనగర్లో ఉంచాడు. ఇదిలా ఉండగా... మొదటి భార్య పుష్పలతను కట్నం తీసుకురావాలని కిరణ్కుమార్తో పాటు అతని తండ్రి శంకర్ నాయక్, తల్లి, అన్న, తమ్ముడు వేధించసాగారు. ఈ క్రమంలోనే కిరణ్కుమార్ రెండో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న మొదటి భార్య పుష్పలత ఛత్రినాక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ కుమార్తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న కిరణ్కుమార్ తల్లి, అన్న, తమ్ముడి కోసం గాలింపు చేపట్టారు. -
ప్రేమ పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసం
ప్రేమ పేరుతో యువతులకు వలవేసి ఒకరి తర్వాత ఒకరిని పెళ్లిచేసుకున్న ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ను ఛత్రినాక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్మన్ఘాట్ గాయత్రీనగర్కు చెందిన శంకర్ నాయక్ కుమారుడు కిరణ్ కుమార్(27) సాప్ట్వేర్ ఇంజనీర్. సైదాబాద్కు చెందిన పుష్పలత(25) అనే యువతిని ఐదేళ్ల పాటు ప్రేమించి 2013లో బాలాపూర్లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చక్కగా కాపురం చేసుకున్న ఇతగాడు రంగు మార్చాడు. బీటెక్లో తనతో పాటు చదివిన గౌలిపురా శ్రీరాం కాలనీకి చెందిన స్వాతి (24)ని ప్రేమ ముగ్గులోకి దించాడు. అంతకు ముందు జరిగిన వివాహాన్ని దాచిపెట్టి 2015 జూన్ లో సీతాఫల్మండిలోని ఆర్యసమాజ్లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్య పుష్పలతను కట్నం తీసుకు రావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. కిరణ్ తో పాటు.. అతని కుటుంబ సభ్యులు కూడా పుష్పలతను వేధింపులకు గురిచేస్తూ ఉండే వారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెండో వివాహం సంగతి బయట పడింది. దీంతో పుష్పలత ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ కుమార్తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. కాగా.. కిరణ్ కుమార్ తల్లి, అన్న, తమ్ముడు పరారీలో ఉన్నారు. -
రాజధానిపై ప్రజలకు అపోహలున్నాయి
-మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి కంబాలచెరువు : నూతన రాజధానిపై ప్రజలకు ఎన్నో అపోహలున్నాయని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. వాటన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాజీవ్గాంధీ డిగ్రీ కళాశాల రజతోత్సవానికి హాజరైన ఆయన సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలో ఉండగా రైతులకు లక్ష రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వగా చంద్రబాబు రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తాము పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించామని, ప్రస్తుతం ఆరు లక్షల ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. డ్వాక్రా మహిళలను ఆదుకునేందుకు వారికిచ్చే రుణాలకు సంబంధించి రూ.1800 కోట్లు వడ్డీకే చెల్లించామన్నారు. చంద్రబాబు రుణాలు ఇస్తున్నా మహిళల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాలకూ ఉన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి నీటిని సాధించుకోవాలని సూచించారు. -
మంచి కథతో...
యానీ క్రియేషన్స్ పతాకంపై కిరణ్కుమార్ దర్శకత్వంలో గంటా రామకృష్ణ నిర్మించిన చిత్రం ‘అయ్యో రామ’. సంతోష్ కవల సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో హైదరాబాద్లో విడుదలైంది. బిగ్ సీడీని ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బ్యానర్ లోగోను మహర్షి చాముండేశ్వరినాథ్ ఆవిష్కరించారు. ఆడియో సీడీని దర్శకుడు సునీల్కుమార్ రెడ్డి విడుదల చేసి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని రామసత్యనారా యణ ఆకాంక్షించారు. మంచి కథ, కథనాలతో రూపొందిం చిన ఈ చిత్రానికి చక్కని పాటలు కుదిరాయనీ, అన్ని వర్గాలవారినీ ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ దర్శక, నిర్మాతలు అన్నారు. హీరోహీరోయిన్లు పవన్సిద్దు, కామ్నా సింగ్, నిషిత, బీజేపీ రాష్ట్ర సెక్రటరీ రంగారెడ్డి, కపిల్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎంతో ఇలాగేనా...!
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఆ దర్పం, దర్జా అన్నీ అనుభవించిన నల్లారి కిరణ్కుమార్రెడ్డిని శంకుస్థాపన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన పూర్తిగా చిన్నబుచ్చుకునేలా చేసిందట. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్లు మాజీ ముఖ్యమంత్రిని సమయం ఇవ్వాలని కోరారు. చెప్పిన సమయానికి తీరా మంత్రులు కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒకరు, ఆయనతో మరో ఇద్దరు చోటా టీడీపీ నేతలు ఆహ్వానపత్రం తీసుకెళ్లడంతో కిరణ్కుమార్రెడ్డికి కోపం వచ్చిందట. దాంతో ఆహ్వాన పత్రం అందజేసే సమయంలో ఫొటోలు తీయడంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కోసం కొంతమంది మీడియా ప్రతినిధులను వెంట తీసుకెళ్లిన టీడీపీ నేతలపై రుసరుసలాడారు. మంత్రులు వస్తున్నారు కదా అని ఆహ్వానపత్రం తీసుకోవడానికి సరేనని అన్నాననీ, చోటామోటా లీడర్లతో ఫొటోలు దిగాలా...! అని చిన్నబుచ్చుకున్న ఆ మాజీ సీఎంగారు ఆహ్వానపత్రం అందజేసే సమయంలో ఫొటోగ్రాఫర్లు, వీడియో కెమెరామెన్లను లోపలికి అనుమతించలేదట. అధికారం లేకపోతే అంతే మరి. -
మాజీ సీఎం కిరణ్ సోదరుడు టీడీపీలోకి!
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పార్టీ బలహీనంగా ఉండటంతో కిషోర్కుమార్రెడ్డిని చేర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కిషోర్కుమార్రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఆయనను పార్టీలో చేర్పించుకునే విషయాన్ని ఇటీవల జిల్లా పార్టీ సమావేశంలో చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారు కూడా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో మదనపల్లె నుంచి శాసనసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. కిషోర్కుమార్రెడ్డిని చేర్చుకుని ఆ స్థానం నుంచి మండలికి పోటీ చేయించాలని చంద్రాబాబు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కిషోర్ తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం కిరణ్కుమార్రెడ్డితో పాటు ఆయన సోదరులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ప్రతిపక్ష టీడీపీ ఆ పని చేయలేదు. కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని అధికార కాంగ్రెస్పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ సందర్భంలో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం గట్టెక్కడానికి వీలుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభలో ఓటింగ్ రోజున ఓటింగ్లో పాల్గొనకుండా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ తటస్థంగా ఉండాలంటూ విప్ జారీ చేశారు. ఆ కారణంగా వైఎస్సార్సీపీ అవిశ్వాసం వీగిపోయి కిరణ్ సర్కారు నిలబడిన సంగతి తెలిసిందే. ఇలావుండగా, నల్లారి కిషోర్కుమార్రెడ్డితో ఫోన్లో మాట్లాడి టీడీపీలో చేరుతున్న విషయం ప్రస్తావించగా, ఆయన దాన్ని ఖండించలేదు. అయితే తాను వేరే పనిలో ఉన్నానని, తర్వాత మాట్లాడుతానని మాత్రమే చెప్పారు. -
బంగారుతల్లి భరోసానిచ్చేనా..?
తెరుచుకోని వెబ్సైట్ శాఖల మధ్య సమన్వయ లోపం పథకాన్ని కొనసాగించాలని తల్లిదండ్రుల వేడుకోలు కావలిఅర్బన్ : మొదటి, రెండవ ఆడశిశువులకు బంగారుతల్లి పథకం 2013 మే 1వ తీదీ నుంచి వర్తించేవిధంగా అప్పటి సీఎం కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వం పథకానికి రూపకల్పన చేసింది. అప్పట్లో ఆన్లైన్లో తల్లీ బిడ్డల పూర్తి వివరాలు పుట్టిన 21 రోజుల్లోపు నమోదు చేసుకునే వారు. నమోదైన ఆడశిశువుల పేరిట సంవత్సరానికి రూ 2,500 అకౌంట్లో వేసేవారు. కానీ ్రపస్తుత ప్రభుత్వం పథకాన్ని మరుగున పడేసింది. దీంతో ఇప్పుడు పుట్టిన పిల్లలకు ఆ పథకం వర్తిస్తుందో లేదో తెలియక ఆడపిల్లల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. అమలులో శాఖల మధ్య సమన్వయ లోపం: ప్రారంభంలో ఇందిరా క్రాంతి పథం అధికారులు ఈ పథకాన్ని సమీక్షించేవారు. జనన ధ్రువీకరణ పత్రం, రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ నంబర్ తదితర వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేసేవారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న తొలి ఏడాది రూ 2,500లు, తరువాతి సంవత్సరం రూ 2,000లు ఆ తరువాతి సంవత్సరం కొంత నగదు నేరుగా తల్లీబిడ్డల ఖాతాల్లో జమయ్యేది. డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత మొత్తంగా రూ 2,16,000లు ఇస్తారు. వివాహ సమయం నాటికి ఈ నగదును ఉపయోగించుకోవడమే పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆ పథకం ప్రక్రియ నిలిచిపోయింది. బంగారు తల్లి పథకానికి ఆన్లైన్లో ధరఖాస్తులు చేసుకుందామని సంఘమిత్ర కార్యాలయానికి వెళ్తే ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగడంలేదంటూ సిబ్బంది సమాధానం చెబుతున్నారని అంటున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్లైన్ సైట్ తెరుచుకోవడంలేదని చెబుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు సుమారు 270, మున్సిపాలిటీలో సుమారు 300 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశామని ఆయా శాఖల అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే దరఖాస్తులు చేసుకోవడం ఎలా అని అడిగితే ఐసీడీఎస్ అధికారులకు ఇచ్చారని కొందరు చెప్పడంతో అక్కడకు వెళ్లి ఆరా తీస్తున్నారు. బంగారుతల్లి పథకం కొనసాగిస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్న దురాలోచనతోనే టీడీపీ ప్రభుత్వం దానిని నిలిపివేసిందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగించి ఆడబిడ్డలను ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బంగారుతల్లి పథకం కొనసాగించాలి: నాకు మొదటి కాన్పులో బాబు పుట్టాడు. రెండవ కాన్పులో ఇద్దరు ఆడశిశువులు పుట్టారు. బంగారుతల్లి పథకం ఉందనుకుంటున్నాను. ప్రస్తుతం పథకం ప్రక్రియ జరగడంలేదని తెలియడంతో ఆవేదనగా ఉంది. పథకాన్ని యథాతదంగా కొనసాగించి ఆదుకోవాలి. - ఉమ్మడిశెట్టి కామేశ్వరి, కొత్తపల్లి, కావలి మండలం. ఆన్లైన్ సైట్ ఓపెన్ కావడంలేదు: గత కొద్ది నెలలుగా బంగారుతల్లి పథకంలో ఆన్లైన్ ఫారమ్లు నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ సైట్ ఓపెన్ కావడంలేదు. అది వచ్చిన వెంటనే యథావిధిగా ప్రక్రియను కొనసాగిస్తాం. - షాలీమ్రోజ్, ఏపీఎం. ఐకేపీ కావలి మండలం. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం భరోసా కరువైంది. ప్రస్తుతం ఈ పథకం అమలులో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉండడంతో తల్లిదండ్రులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. -
'కిరణ్ సర్కార్ ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు'
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని తెలంగాణ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. సాంస్కృతిక వారిధిలో ఉద్యోగాలు దక్కని దగాపడ్డ కళాకారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ గొంతు నొక్కుతోందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మట్లాడుతూ.. ఈ రోజు నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసుకున్న ధూంధాం సభకు అనుమతి రద్దు చేసి వారిని అరెస్ట్ చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా కాకుండా పింక్ పార్టీ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దగాపడ్డ కళాకారుల పట్ల ధూంధాం సభకు పర్మిషన్ ఎందుకు రద్దు చేశారో రాష్ట్ర డీజీపీ సమాధానం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
సీఎం ఆదేశాలతోనైనా ‘రింగ్’ పూర్తయ్యేనా?
మేడ్చల్ : మేడ్చల్ పరిధిలో కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న అవుటర్ రింగ్రోడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనైనా పూర్తి అయ్యేనా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు, పటాన్చెరువు, మేడ్చల్ మండలం మీదుగా శామీర్పేట వరకు హుడా రెండో ఫేజ్లో రింగు రోడ్డు నిర్మాణాన్ని నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి 2012 డిసెంబర్లో అట్టహాసంగా ప్రారంభించారు. మొదటి దశలో శంషాబాద్ నుంచి పటాన్చెరు వరకు నిర్మించిన రోడ్డుకు శామీర్పేట వరకు రెండో దశలో రింగు రోడ్డును నిర్మించారు. మేడ్చల్ మీదుగా వెళ్లే రోడ్డు అలైన్మెంట్లో రాజకీయాలు చేసి రూట్ మ్యాప్ మార్చారని భూములు కోల్పోయిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మండలంలోని కండ్లకోయ వద్ద రోడ్డు నిర్మాణంపై స్టే విధించింది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా రింగు రోడ్డుకు 44 జాతీయ రహదారిని, మేడ్చల్ గండి మైసమ్మను రోడ్డులకు అనుసంధానం చేసి ప్రారంభించింది. కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపైనే జంక్షన్ ఏర్పాటు చేసిన అధికారులు అక్కడి నుంచి పటాన్చెరు వైపు వెళ్లాలంటే జాతీయ రహదారిపై మేడ్చల్ చెక్పోస్టు వరకు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎడమ వైపు తిరిగి మేడ్చల్ గండిమైసమ్మ ఆర్అండ్బీ రోడ్డులో రెండు కిలో మీటర్లు వెళ్లి సుతారిగూడ వద్ద ఉన్న రింగు రోడ్డు పైకి ఎక్కాలి. పటాన్చెరు నుంచి శామీర్పేట వెళ్లాలన్నా.. ఇదే రూట్లో వెళ్లాలి. దీంతో వాహన చోదకులకు ప్రయాణం నరకయాతనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈనెల 21న అవుటర్ రింగు రోడ్డు చుట్టూ సీఎం కేసీఆర్ పర్యటించారు. రింగురోడ్డు చుట్టూ మొక్కలు పెంచి అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెబుతూ.. అసంపూర్తిగా ఉన్న అవుటర్ రింగు రోడ్డును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మూడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సీఎం ఆదేశాలతోనైనా పూర్తి అవుతుందో వేచి చూడాలి. -
బెంగాల్ ఐఏఎస్ అధికారికి సీఐడీ కస్టడీ
సిలిగురి: పశ్చిమబెంగాల్లో ఐఏఎస్ అధికారి కిరణ్ కుమార్ను నాలుగు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. సిలిగురి-జల్పాయ్గురి అభివృద్ధి మండలి (ఎస్జేడీఏ)లో వంద కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన ప్రమేయమున్నట్టు ఆరోపణలు రావడంతో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసి సిలిగురి కోర్టులో హాజరుపరచగా సీఐడీ కస్టడీకి అప్పగించింది. కిరణ్ కుమార్ ప్రస్తుతం పశ్చమబెంగాల్ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. 2005 బ్యాచ్కు చెందిన కిరణ్ కుమార్ ఎస్జేడీఏ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్జేడీఏ సీఈవోగా పనిచేసినపుడు ఆయన అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. -
'మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలు'
నెల్లూరు: వచ్చే ఏడాది మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. మానవహిత ప్రయోగాల కోసం కేంద్రం నుంచి అనుమతి వస్తే ఆ దిశగా అడుగులు వేస్తామని ఆయన అన్నారు. సమాచార రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను మరిన్ని పంపుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. షార్ లో త్వరలో మూడో లాంచ్ నిర్మాణం చేపడుతున్నట్టు కిరణ్ కుమార్ తెలిపారు. -
స్వగ్రామానికి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి
కలికిరి (చిత్తూరు): మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి చిత్తూరు జిల్లాలోని తన స్వస్థలం నగిరిపల్లికి శుక్రవారం చేరుకున్నారు. శనివారం రాత్రి పీలేరులో తన అనుచరుడు కుమారుడైన శరత్కుమార్రెడ్డి వివాహ వేడుకులో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారని సమాచారం. కాగా, మూడు నెలల తర్వాత గ్రామానికి చేరుకున్న ఆయన్ను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. -
‘బంగారు తల్లీ’..ఎక్కడున్నావ్?
పిఠాపురం:బాలికా సంరక్షణ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రకటించిన ‘బంగారుతల్లి’ పథకం జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. 2013 మే ఒకటి నుంచి ఆడపిల్ల పుడితే ‘బంగారుతల్లి’ పేరిట ఆర్థిక సహాయం అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఆస్పత్రిలో ప్రసవం, ఇతర ఖర్చులకు రూ.2,500, తరువాత టీకాలకు రూ.వెయ్యి, అంగన్వాడీ చదువులకు ఏడాదికి రూ.1500, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఏడాదికి రూ.2 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే 6, 7, 8 తరగతులకు ఏడాదికి రూ.2500, తొమ్మిది, పది తరగతులకు ఏడాదికి రూ.3వేలు, ఇంటర్మీడియెట్కు ఏడాదికి రూ.3500, గ్రాడ్యుయేషన్కు ఏడాదికి రూ.4వేలు దశలవారీగా అందించాలని నిర్దేశించారు. అలాగే బాలికకు 18 సంవత్సరాల అనంతరం ఇంటర్మీడియెట్ తరువాత రూ.55 వేలు, గ్రాడ్యుయేషన్ తరువాత రూ.లక్ష కలిపి ఒక్కో లబ్ధిదారుకు రూ.1.55 లక్షల ఆర్థిక సహాయం అందే విధంగా పథకాన్ని రూపొందించారు. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో ప్రారంభంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. కానీ దరఖాస్తు స్వీకరణే తప్ప ఎటువంటి నిధులూ ఇవ్వలేదు. దీంతో దరఖాస్తులు వేలల్లో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నగారా మోగడంతో పథకం అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఖాతాలకు జమ కాని సొమ్ములు వాస్తవానికి రెండేళ్లుగా పథకం అమలు పూర్తిగా నిలిచిపోయిందనే చెప్పాలి. 2013 నవంబరు నుంచి మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. జిల్లా గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో సుమారు 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా 4 వేలమందిని ఎంపిక చేశారు. వీరికోసం మొదటి విడతగా రూ.1.10 కోట్లు విడుదల చేసినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. అలాగే జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 1200 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 350 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ అధికార పార్టీ నేతలతో అధికారులు అప్పట్లో బాండ్లు పంపిణీ చేయించారు. సాధారణంగా ఈ పథకం లబ్ధిదారుల పిల్లల సంరక్షణ కోసం మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. అయితే బాండ్లు పంపిణీ చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్కరి ఖాతాలోనూ డబ్బు జమ -
అంతరాత్మనే ఆవిష్కరిస్తారా?
కొణిజేటి రోశయ్యను చెప్పాపెట్టకుండా తొలగించి, కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని, శాసనసభ్యులెవరి మద్దతూ లేని తనను ఎందుకు అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించిందో కిరణ్ రాసుకుంటారా? రాష్ట్రాన్ని విభజిస్తున్నాం, మీరే ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రక్రియను సజావుగా పూర్తి చెయ్యాలని సోనియాగాంధీ స్వయంగా చెప్పిన విషయాన్ని కిరణ్ ఇప్పుడు కాదని రాయబోతున్నారా తన పుస్తకంలో? రాష్ర్టంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చి, ఒంటిచేత్తో రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చినవారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. కానీ వైఎస్ఆర్ అర్ధంతరంగా నిష్ర్కమించినప్పటికీ రాష్ట్ర ప్రజల మీద ఆయన వేసిన ముద్రను తుడిచిపెట్టే పని తనకే అప్పగించారని రాసుకుంటారా? ‘నేను నా సమాధి నుంచి మాట్లాడుతున్నానన్న విషయం ఈ ఆత్మకథ రాస్తున్నప్పుడు తప్పనిసరిగా దష్టిలో ఉంచుకుంటాను. నిజంగానే నేను నా సమాధి నుంచే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ఆత్మకథ పుస్తకంగా వెలు వడే నాటికి నేను జీవించి ఉండను. ఒక మంచి కారణంతోనే నేను సజీవుడిగా కంటే సమాధి నుంచి మాట్లాడటాన్నే ఇష్టపడ్డాను. అప్పుడే స్వేచ్ఛగా మాట్లా డగలను. ఒక మనిషి తన వ్యక్తిగత విషయాలను గురించి రాయవలసి వచ్చి నప్పుడు అది చాలా అవసరం. తాను జీవించి ఉండగానే ఇతరులు ఈ ఆత్మ కథను చదువుతారని అనుకున్నప్పుడు దాపరికం లేకుండా రాయడానికి సంకోచిస్తాడు. దాపరికం లేకుండా చేయటానికి అతను చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ‘ఒక మానవ హదయం, మెదడూ సజించే దాపరికం లేని, స్వేచ్ఛా యుతమైన, వ్యక్తిగతమైన విషయం ప్రేమలేఖేనని నా అభిప్రాయం. తాను రాస్తున్నది ఇతరులు ఎవరూ చూడరన్న భావన కారణంగా తన భావప్రకట నలో అపరిమితమైన స్వేచ్ఛను ప్రేమలేఖ రాస్త్తున్నప్పుడు మాత్రమే అనుభ విస్తాడు. నేను చనిపోయేంత వరకూ ఈ ఆత్మకథ ఎవరి కంటా పడకుండా ఉంటుందని తెలిస్తే నా ఆత్మకథను కూడా ప్రేమలేఖ రాసినంత స్వేచ్ఛగా, దాపరికం లేకుండా రాయగలనని అనిపించింది. అందుకే సజీవుడిగా కంటే సమాధి నుంచి మాట్లాడటాన్నే ఇష్టపడతాను.’ అమెరికాకు చెందిన విఖ్యాత రచయిత మార్క్టై్వన్ మహాశయుడు తన ఆత్మకథకు రాసుకున్న పరిచయ వాక్యాలు ఇవి. ‘కొంత పొడవే అయినా ఆయన రాసుకున్న ఈ మాటలు ఇక్కడ తప్పని సరిగా ప్రస్తావించడం అవసరం, సందర్భం కూడా. సమకాలీన సమాజంలో వెలువడిన కొన్ని వందల, వేల ఆత్మకథలూ, స్వీయచరిత్రలూ మనం చదు వుతూ ఉంటాం. కారణం, అవి ఆసక్తికరమే కాక అనేక విషయాలు తెలుసు కునేందుకు ఉపయోగపడతాయి. రాజకీయ నాయకులూ తమ అనుభ వాలను రాస్తూ ఉంటారు. అలాంటి స్వీయ అనుభవాలు జాతీయస్థాయిలో ఎక్కువ. అవి చాలా సందర్భాలలో తీవ్రమయిన సంచలనాలకూ, వివాదా లకూ దారి తీసి, బ్రహ్మాండంగా అమ్ముడుపోవడం కూడా తెలిసిందే. ప్రాంతీ యంగా కూడా మనం కొందరు రాజకీయ నాయకులు రాసిన అనుభవాలను చాలానే చదివాం. ఇప్పుడు ఆ కోవకే చెందిన ఇంకో రచన రాబోతున్నది. ఆత్మకథలు, స్వీయానుభవాలు రాసే వాళ్లకు నిజాయితీ; అలాగే జీవిత చరి త్రలు రాసే వాళ్లకు చరిత్ర పరిశోధనపై ఆసక్తి, శ్రద్ధ ఉండాలంటారు పెద్దలు. ఏం చెప్పబోతున్నారు కిరణ్కుమార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి అనా లనుకుంటా, నల్లారి కిరణ్కుమార్రెడ్డి తన అనుభవాలను పుస్తకరూపంలో వెలువరిస్తున్నారంటూ రెండురోజుల క్రితం ఒక ఆంగ్ల దినపత్రికలో వార్త వచ్చింది. నాలుగు వందల పేజీల ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సంబంధించి బోలెడు వివరాలు వెల్లడించను న్నట్టు తెలిసింది. దీని కోసం ఆయన కొన్ని మాసాల పాటు అమెరికాలో కసరత్తు కూడా చేశారు. బహుశా నెలలో ఈ పుస్తకం మన చేతుల్లో ఉంటుంది. కిరణ్కుమార్రెడ్డి ఈ పుస్తకం రాస్త్తున్నారన్న విషయం మనకు ఆ ఆంగ్ల దినపత్రిక ద్వారా తెలియడానికి రెండురోజుల ముందే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల ఎదుట ఆత్మ విమర్శ చేసుకుం టూ జీవితంలో తాను చేసిన పెద్ద తప్పిదం కిరణ్కుమార్రెడ్డిని ముఖ్యమం త్రిని చెయ్యడమే అన్నారట. రోశయ్యను తప్పించి కిరణ్కుమార్రెడ్డిని ముఖ్య మంత్రిని చెయ్యాలన్న నిర్ణయం పూర్తిగా తనదేననీ, ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు ఈ దుర్గతి పట్టిందనీ, మళ్లీ కాంగ్రెస్కు ఆ వైభవం ఎప్పుడొస్తుందో చెప్పలేననీ వాపోయారట కూడా. చేతులు కాలాక... రెండురోజుల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ తరు వాత కొద్ది రోజుల్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించి నిర్వీర్యమై పోయిన కాంగ్రెస్కు కొత్త ఊపిరి పోస్తారట. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టడానికి కిరణ్కుమార్రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యడమేనని రాహుల్ గాంధీ వాపోతుంటే, కిరణ్ మాత్రం సోనియాగాంధీ , రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు వైగైరా వైగైరా నాయకులంతా ఇవాళ్టి పరి స్థితికి ఎట్లా కారకుల య్యారో, ఎవరెవరు ఏం చేశారో తన పుస్తకంతో బయట పెడతానని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజనలో కిరణ్కుమార్రెడ్డి సహా ఎవరి పాత్ర ఏమిటో ఇప్పుడు ఆయన పుస్తకం రాస్తే కానీ తెలియదా తెలుగు ప్రజలకి? ఇంతకు అమెరికాలో కూర్చుని కిరణ్ తయారు చేసుకున్న ఈ ఆత్మ చరిత్రాత్మక రచనలో బయట పెట్టబోయే సంచలనాలు ఏమై ఉం టాయి? ఆయన ఎంత నిజాయితీగా సంఘటనలను రికార్డు చెయ్యబోతు న్నారు? ఇలాంటి అంశాలు మనం పుస్తకం చదివితే కానీ తెలియవు. మార్క్టై్వన్ చెప్పినట్టు ఈ రచన సమాధిలో నుంచి రాసినంత నిజా యితీగా ఉండగలదా? తన భావప్రకటనలో అపరిమితమైన స్వేచ్ఛను అను భవిస్తూ రాసిన ప్రేమలేఖ లాగా ఉంటుందా? అటువంటి నిజాయితీ మన కాలపు రాజకీయ నాయకుల నుంచి ఆశించడం అత్యాశే. ఇంతకూ కిరణ్ కుమార్రెడ్డి రాస్తున్న పుస్తకంలో ఈ క్రింది విషయాలన్నీ ఉంటాయా? ఈ విషయాలు చెప్పగలరా? సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్యను చెప్పాపెట్టకుండా తొలగించి, అధిష్టానం కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని, శాసనసభ్యులెవరి మద్ద తూ లేని తనను ఎందుకు ముఖ్యమంత్రిగా నియమించిందో కిరణ్ రాసు కుంటారా? రాష్ట్రాన్ని విభజిస్తున్నాం, మీరే ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రక్రి యను సజావుగా పూర్తిచెయ్యాలని సోనియాగాంధీ స్వయంగా చెప్పిన విష యాన్ని, కిరణ్ ఇప్పుడు కాదని రాయబోతున్నారా తన పుస్తకంలో? మూడు దశాబ్దాలకు పైబడి కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా కొనసాగి, రాష్ర్టంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తెచ్చి, ఒంటి చేత్తో రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అలా కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టడానికి మార్గం సుగమం చేశారా యన. కానీ వైఎస్ఆర్ అర్ధంతరంగా నిష్ర్కమించినప్పటికీ రాష్ట్ర ప్రజల మీద ఆయన వేసిన ముద్రను తుడిచిపెట్టే పని తనకే అప్పగించారని రాసుకుం టారా? వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్రెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టేం దుకు రాయలసీమ ప్రాంతానికే చెంది, వయసులో కొంత దగ్గరగా ఉన్న కారణంగానే తనను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారని నిర్భయంగా రాసుకుంటారా? 2009 డిసెంబర్ 9 ప్రకటన తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇందులో కొత్తగా కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా సోనియాగాంధీ, రాహుల్గాంధీ రాష్ర్ట విభజన విషయంలో అనుసరించిన ద్వంద్వవైఖరి కానీ, దాచిపెట్టిన విషయాలు కానీ ఏమీలేవు. మరి ఇంతకు మించి సంచలనమైన విషయాలు ఏం చెప్పబోతున్నారాయన? చంద్రబాబు పాత్రను ఎలా చిత్రిస్తారు? చంద్రబాబు నాయుడు గురించి కూడా కిరణ్కుమార్రెడ్డి తన పుస్తకంలో రాయబోతున్నారని తెలిసింది. రాష్ర్ట విభజన విషయంలో మొదటి నుంచి తెలుగుదేశం, చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి ప్రపంచానికం తటికీ తెలిసిందే. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా, అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండి చంద్రబాబు ఎలా కాపాడారో, దాని వెనక మత లబు ఏమిటో కొత్తగా రాస్తే చదవడానికి ఆసక్తికరంగా ఉంటుందేమో! ముఖ్య మంత్రి పదవిలో చివరి నిమిషం దాకా కొనసాగడమే లక్ష్యంగా తన సొంత పార్టీ నాయకులను కూడా అజ్ఞానాంధకారంలో ఉంచిన విషయం కూడా కిరణ్ రాసుకుంటారా? చివరికి పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకుని, ఎన్నికల అధికారి కార్యాలయం వరకూ ఊరేగింపుగా వెళ్లి ఆఖరి నిమిషంలో తను నామినేషన్ వెయ్యకుండా తమ్ముడితో వేయించడం వెనుక దాగిన గొప్ప వ్యూహం ఏమిటో కూడా వాస్తవికంగా పేర్కొంటారా? ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్కు చరమగీతం పాడించి, దిక్కులేకుండా వదిలేసి, భార తీయ జనతా పార్టీలో చేరిపోవాలనుకుని కూడా, అది ఎందుకు కుదరలేదో కారణాలు రాసుకుంటారా ఈ పుస్తకంలో? ముఖ్యమంత్రిగా చివరి రోజులలో క్యాంపు కార్యాలయంలోనే మీడియా మిత్రులను పిలిచి కిరణ్ నిర్వహించిన పత్రికా గోష్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏదో సంచలనమైన వార్త చెబుతారని అంతా ఆశించారు. తీరా కూలిన బెర్లిన్ గోడ ముక్క ఒకటి చూపించి రాష్ర్టం కలిసే ఉంటుందని చెప్పబోయారాయన. ఆయన రాస్తున్న పుస్తకంలో విషయాలు కూడా అలాగే ఉన్నా ఆశ్చర్యపోనక్కర లేదు. - దేవులపల్లి అమర్ -
ఆనాడు అన్న మాటలు గుర్తులేవా?: చెవిరెడ్డి
హైదరాబాద్: గతంలో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం కరెంట్ చార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో నిరాహార దీక్ష చేసిన చంద్రబాబు తాము అధికారంలోకొస్తే ఒక్క రూపాయి కూడా పెంచనని చెప్పిన విషయం గుర్తులేదా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను విస్మరించి చంద్రబాబు ఒక్క కలంపోటుతో కరెంట్ చార్జీలను పెంచి ప్రజలపై రూ.వెయ్యి కోట్ల భారం మోపారని దుయ్యబట్టారు. కరెంటు చార్జీలను పెంచడాన్ని శాసనసభలో తమ పార్టీ వ్యతిరేకిస్తే.. అధికారపక్షం బరితెగించిందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏ కేటగిరీకి ఒక్క రూపాయి కూడా పెంచలేదని ఆయన గుర్తుచేశారు. -
'బాబు, కిరణ్ బూడిద మిగిల్చారు'
* వైఎస్ ఉంటే రాష్ట్ర విభజన జోలికి ఎవరూ వచ్చేవారు కాదు * ఒక్క డ్వాక్రా మహిళకు రుణ మాఫీ జరిగిందని నిరూపించినా రాజీనామా చేస్తా * ప్రభుత్వానికి ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటున్నారు. చివరకు రాష్ట్రాన్ని విభజిస్తూంటే చేతులు ముడుచుకు కూర్చున్నారు’ అని సీఎం చంద్రబాబునుద్దేశించి వైసీపీ శాసనసభ్యుడు కొడాలి నాని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఎవరూ ఈ రాష్ట్రం జోలికి వచ్చే ధైర్యం చేసేవారు కాదన్నారు. చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి ఇద్దరూ కలిసి చివరకూ రాష్ట్రాన్ని విభజించారని దుయ్యబట్టారు. ఇప్పటివరకూ ఒక్క డ్వాక్రా మహిళకూ రుణమాఫీ జరగలేదని, అలా ఎక్కడైనా జరిగుంటే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని నాని సవాల్ విసిరారు. తాజాగా కొయ్యలగూడెంలో మహిళలతో కిరీటాలు పెట్టించుకుని చంద్రబాబు సన్మానం చేయించుకున్నారని.. ఒక్క మహిళకు కూడా రుణమాఫీ చెయ్యకుండానే ఎలా సన్మానం చేయించుకున్నారో ఆయనకే తెలియని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని కొనే దిక్కులేదన్నారు. ప్రభుత్వం కొంటున్నా నెలల తరబడి చెక్కులు రావడం లేదని, వచ్చిన చెక్కులనూ రుణమాఫీలో మినహాయించుకుని ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వైఎస్ ఐదేళ్లలో 45 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారని, టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయినా రాష్ట్రంలో ఒక్క ఇంటికీ నిధులివ్వలేదన్నారు. వైఎస్ మృతిచెందిన రోజే పోలవరం ప్రాజెక్టు చచ్చిపోయిందని, నాడు ప్రాజెక్టుకు కాల్వలు తవ్విస్తే ఎద్దేవా చేశారని, నేడు పట్టిసీమ ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బు కట్టలు ప్రవహింపజేస్తున్నారన్నారు. -
బంగారు తల్లీ ఎక్కడమ్మా..!
ప్రొద్దుటూరు టౌన్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బంగారుతల్లి పథకాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఒక్కరికి కూడా డబ్బు ఇవ్వకపోవడంతో ఈ పథకం అమలు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎంతో ఆర్భాటంగా గతంలో అధికారంలో ఉన్న కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడతలో ఆడ పిల్ల పేరున రూ.2,500 ప్రోత్సాహక మొత్తాన్ని జమ చేసింది. తెల్లరేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లో 2013 మే 1 నుంచి పుట్టిన ఆడ పిల్లలకు బంగారుతల్లి పథకం వర్తిస్తుందని, ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండేలోపు ఒక్కొక్కరికి రూ.2లక్షల వరకు వారి చదువులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది. బిడ్డ పుట్టగానే రూ.2,500, మొదటి, రెండో ఏడాదిల్లో రూ.1000 చొప్పున, 3-5 ఏళ్ల వరకు రూ.1500 చొప్పున, 6-10 ఏళ్ల వరకు రూ.2వేలు చొప్పున, 11-12 సంవత్సరాల వరకు రూ.2,500 చొప్పున, 13వ సంవత్సరం రూ.2,500, 14-15 సంవత్సరం రూ.3వేలు, 16-17 సంవత్సరాలకు రూ.3,500, 18-21 సంవత్సరాల వరకు రూ.4వేలు చొప్పున, ఇంటర్ పూర్తి చేశాక రూ.50వేలు, డిగ్రీ పూర్తి చేశాక రూ.లక్ష వారి ఖాతాల్లో జమ చేసే విధంగా పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా ఆడ పిల్లల భ్రూణ హత్యల నివారణతోపాటు ఆడ పిల్లల సంరక్షణకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నదే లక్ష్యం. జిల్లా వ్యాప్తంగా బంగారు తల్లి నమోదు, మొదటి విడత జమలు ఇలా జిల్లా కేంద్రమైన కడపలో 998 మంది దరఖాస్తు చేసుకోగా 953 మందికి అర్హత లభించింది. కేవలం 62 మందికి మాత్రమే రూ.లక్షా 55వేలు మొదటి విడత ఖాతాల్లో జమ చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 685 మంది దరఖాస్తు చేసుకోగా 633 మంది అర్హత పొందారు. వీరిలో 238 మందికి మొదటి విడత రూ.5.95 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ అయింది. బద్వేలు మున్సిపాలిటీలో 367 మంది దరఖాస్తు చేసుకోగా 344 మంది అర్హత పొందారు. వీరిలో 28 మందికి మాత్రమే రూ.70వేలు జమ చేశారు. అలాగే జమ్మలమడుగు మున్సిపాలిటీలో 223 దరఖాస్తు చేసుకోగా 210 మంది అర్హత సాధించారు. వీరిలో 26 మందికి రూ.65వేలు వారి ఖాతాల్లో జమ చేశారు. మైదుకూరు మున్సిపాలిటీలో 232 మందికి 213 మంది అర్హత సాధంచగా కేవలం 12 మందికి రూ.30వేలు వారి ఖాతాల్లో వేశారు. పులివెందుల మున్సిపాలిటీలో 356 మందికి 332 మంది అర్హత సాధించగా వీరిలో 60 మందికి రూ.1.50లక్షలు వారి ఖాతాల్లో జమ అయింది. రాజంపేట మున్సిపాలిటీలో 109 మందికి 101 మంది అర్హత సాధించగా 15 మందికి రూ.37,500 వారి ఖాతాల్లో వేశారు. రాయచోటి మున్సిపాలిటీలో 172 మందికిగాను 164 మంది అర్హత సాధించగా 67 మందికి రూ.1,67,500 ఖాతాల్లో జమ అయింది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 192 మందికిగాను 169 మంది అర్హత సాధించగా 35 మందికి రూ.87,500 వారి ఖాతాల్లో జమ చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 3334 మంది దరఖాస్తు చేసుకోగా 3199 మంది అర్హత సాధించారు. వీరిలో 543 మందికి మాత్రమే మొదటి విడత రూ.13 లక్షల 59 వేల 500 లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కిరణ్ కుమార్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకం గురించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
త్రిశంకుస్వర్గంలో ‘బంగారు తల్లి’
తెనాలి అర్బన్ : గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంతో లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఆ పథకానికి పేరు మార్చినప్పటికీ ప్రయోజనాలు అందించడం లేదు. పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే గర్భంలోనే చిదిమేసే దారుణానికి తిలోదకాలిచ్చేందుకు 2013 మే 1న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బంగారుతల్లి పథకం ప్రారంభించారు. ఈ పథకం ఆవిర్భావంతో అప్పటివరకు కొనసాగిన బాలికా శిశు బీమా పథకం మూలన పడింది. కొత్తగా వచ్చిన బంగారుతల్లి పథకానికీ దరఖాస్తులు చేసుకోవడం మినహా, పురోగతి లేకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి చందంగా ఉంది. గతంలో ప్రవేశపెట్టిన ఁబాలికా శిశు బీమా* పథకంలో ఒక ఆడపిల్ల అయితే లక్ష రూపాయలు బాలికకు 20 ఏళ్లు నిండగానే అందేలా భారతీయ జీవిత బీమా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదే ఇద్దరు ఆడపిల్లలైతే ఒకొక్కరికి రూ.30 వేల చొప్పున బీమా చేయించేది. వారు విధిగా చదువుకోవాలి. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ రూ.1200 చొప్పున ఏటా ఉపకార వేతనాన్ని అందించేది. బంగారుతల్లి రాకతో ‘బాలికా శిశు బీమా’ నమోదును నిలిపివేశారు. బంగారుతల్లి పథకం ప్రయోజనాలు బాలిక పుట్టిన వెంటనే పుట్టినతేదీ ధ్రువీకరణ, ఆ కుటుంబ తెల్ల రేషన్కార్డు, తల్లి బ్యాంకు ఖాతాతో ఈ పథకంలో నమోదు చేయించుకోవాలి. నమోదైన వెంటనే తల్లి ఖాతాలో రూ.2500 జమవుతాయి. తదుపరి మూడేళ్లు వ్యాక్సినేషన్ తదితర ఖర్చుల కోసం రూ.1000 వంతున మూడేళ్లు, చిన్నారి అంగన్వాడీలో చేరిన వెంటనే రూ.1500 అమ్మ ఖాతాలో చేరాలి. ఎనిమిదో తరగతి నుంచి ఏడాదికి రూ.మూడు వేల వంతున ఇంటర్ పూర్తయ్యే వరకూ ఆర్థిక సాయం అందుతుంది. డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.1.50 లక్షలు అందేలా పథకాన్ని రూపొందిం చారు. దీనికి చట్టబద్ధత కూడా కల్పించారు. పథకం ప్రవేశపెట్టిన సందర్భంగా 2013 నవంబర్లో నిర్వహించిన రచ్చబండలో కొద్దిమందికి బాండ్లు పంపిణీ చేశారు. అది మినహా పురోగతి లేదు. కొత్త ప్రభుత్వం దీనికి ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చడం మినహా చేసిందేమీ లేదు. 4800 పేర్ల నమోదు బంగారుతల్లి పథకంలో ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా 4800పై చిలుకు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయి. పట్టణ పరిధికి మాత్రమే వర్తించే ఈ పథకంలో అత్యధికంగా గుంటూరు కార్పొరేషన్లో 1184 దరఖాస్తులు దాఖలయ్యాయి. తెనాలిలో 462, బాపట్లలో 234, చిలకలూరిపేటలో 450, మాచర్లలో 323, మంగళగిరిలో 330, నరసరావుపేటలో 418, పిడుగురాళ్ళలో 215, పొన్నూరులో 232, రేపల్లెలో 194, సత్తెనపల్లిలో 279, తాడేపల్లిలో 260, వినుకొండలో 231 దరఖాస్తులు నమోదయ్యాయి. ఆన్లైన్లో నమోదైన వెంటనే బాలిక తల్లి ఖాతాలో రూ.2500 జమ కావాల్సి ఉంది. అయితే నగదు జమ కాకపోవడంతో లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రభుత్వం పేరు మార్చింది బంగారు తల్లి పథకం బాలికలకు వరమే. కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని ‘మా ఇంటి మహాలక్ష్మి’గా పేరు మార్చింది. గత ప్రభుత్వంలో ఈ పథకం ప్రారంభంలో 40 మందికి బాండ్లు పంపిణీ చేశారు. వారి ఖాతాల్లో రూ.2500 చొప్పున డబ్బు జమైంది. వీటికి దరఖాస్తు చేసుకున్న వారిలో తెనాలి మున్సిపాలిటీ జిల్లాలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికి 462 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయి. వీటికి ఎలాంటి చెల్లింపులూ లేవు. - ఎం.నాగేంద్ర, టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్, తెనాలి -
జీవో 101ను ఎందుకు అడ్డుకోలేదు
గుంతకల్లు: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా బీసీలకు శాపంగా పరిణమించిన జీవో నం-101ను విడుదల చేస్తే ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి బీసీ అయి కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ ప్రశ్నించారు. స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతో ప్రజాగ్ర హంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయిందన్నారు. చచ్చిన శవానికి ఎంత వైద్యం చేసినా ఫలితం ఉండదన్నారు. రఘువీరారెడ్డి కోటి సంతకాలు సేకరణతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని చూస్తుండటం వట్టి భ్రమే అన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్ ఉన్నపుడు బీసీలకు శాపంగా మారిన జీవో 101ను అడ్డుకోకపోవడం సిగ్గు చేటన్నారు. బీసీలపై మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 101 జీవోను రద్దు చేయించడంతోపాటు రిజర్వేషన్ బిల్లు 33/3 శాతం విద్య, ఉద్యోగం, ప్రమోషన్, రాజకీయంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై పోరాడాలని డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాల్మీకి, బెస్త, వడ్డెర కులాలను ఎస్టీల్లో కలిపే విధంగా, బీసీ సబ్ప్లాన్కు ఆమోదం లభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. -
పూరీ ఐడియాకు కౌన్సిలర్ దర్శకత్వం!
షార్ట్ఫిల్మ్కు క్లాప్ కొట్టిన బేబీనాయన బొబ్బిలి: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇచ్చిన స్టోరీ ఐడియాతో పట్టణ కౌన్సిలర్ కిరణ్కుమార్ లఘుచిత్రం రూపొందించనున్నారు. పూరీ ఇచ్చిన ఆరో ఐడియాతో సబ్జెక్టును రూపొందించుకుని బొబ్బిలి కోటలో సోమవారం షూటింగ్ నిర్వహించా రు. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభిం చారు. అందమైన గెస్టుహౌస్లో ప్రేమికుల కథ ను తీస్తున్నారు. ఇందులో వేదరామన్, సంజీవ్ యోగ, శిరీష, యువకిరణ్, సంతోష్లు నటిస్తున్నారు. అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుకొని బొ బ్బిలి 29వ వార్డుకు కౌన్సిలరుగా ఉంటున్న పొట్నూరు కిరణ్కుమార్ లఘుచిత్రాన్ని నిర్మిస్తున్నారు. పట్టణానికి చెందిన రాజు కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. -
ఇస్రో ‘మామ్’ బృందానికి స్పేస్ పయనీర్ అవార్డు
తొలి ప్రయత్నంలోనే సాధించిన విజయానికి నేషనల్ స్పేస్ సొసైటీ పురస్కారం ప్రకటన వాషింగ్టన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంగారక గ్రహంపై పరిశోధనలకు ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) బృందాన్ని ప్రతిష్టాత్మక 2015 స్పేస్ పయనీర్ పురస్కారం వరించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ బృందానికి డాక్టర్ మైల్స్వామి అన్నాదురై నేతృత్వం వహిస్తున్నారు. అరుణగ్రహంపైకి ఉపగ్రహ ప్రయోగమనే అరుదైన విజయాన్ని తొలి ప్రయత్నంలోనే సాధించినందుకుగాను ఇస్రో మామ్ బృందానికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నేషనల్ స్పేస్ సొసైటీ ఈ అవార్డును ప్రకటించింది. అమెరికాలోని టొరంటోలో ఈ ఏడాది మే 20 నుంచి 24వ తేదీ వరకూ జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష పురోగతి సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇస్రో 2013 నవంబర్ 5వ తేదీన మార్స్ ఆర్బిటర్ మిషన్ను ప్రయోగించగా.. ఈ ఉపగ్రహం 2014 సెప్టెంబర్ 24వ తేదీన్ అంగారక కక్ష్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగం రెండు తొలి విజయాలు సాధించిందని నేషనల్ స్పేస్ సొసైటీ పేర్కొంది. ఇస్రో చైర్మన్గా కిరణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ బెంగళూరు: ఇస్రో నూతన చైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త ఏ ఎస్ కిరణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్పేస్ కమిషన్ చైర్మన్గా, అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కుమార్ను ప్రభుత్వం సోమవారం ఇస్రో చైర్మన్గా నియమించింది. కిరణ్ కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. -
తనయుని తలపులు
నాన్నా.. కిరణ్. నీ దివ్యాత్మకు అమ్మ నివాళి. అశ్రుతర్పణ నివాళి. సజీవమై మాలో మిగిలిన నీ స్మృతుల నివాళి. నిండైన సుఖ‘శాంతి’లతో, ‘ఐక్య’ చిన్నారి అలరింపులతో నాడు కళకళలాడిన మన ఇంట్లో... నేడు నువ్వు లేక, వెలుగు రాక అంధకారం అలుముకుంది. నలుదిక్కులా శూన్యమే. నిత్యం బాధా వేదనలే. కుదిపి వేసే ఈ క్షోభ ఎలా తరుగుతుంది? ఆధ్యాత్మిక భావనలే ఆశ్రయమని తెలిసినా, వాటిని అందుకునే శక్తి నాకు ఉంటుందా? శక్తి కరిగిపోతోంది. శరీరం సహకరించడం లేదు. తనయుని తలపులు మాత్రమే ఇప్పుడీ హృదయాన్ని సాంత్వన పరుస్తున్నాయి. బాబూ... నువ్వు నా కన్నీరుగా మారి, గుండెలోని కార్చిచ్చును చల్లారుస్తుంటే అనిపిస్తోంది.. ఈ వృద్ధాప్యంలో కన్నీరే నాకు రక్షణ కవచమా అని! విఖ్యాత పిల్లల వైద్యుడు బర్టన్ గ్రెటిన్ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ‘‘ఒక బిడ్డను చేజార్చుకోవడం అంటే నీలో కొంత భాగాన్ని చేజార్చుకొన్నట్లే’’ అంటారు ఆయన. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులం.. మా శరీరంలో కొంత భాగాన్ని కోల్పోయి, ఆ వైకల్యంతోనే జీవితాన్ని భారంగా, మానసికమైన క్రుంగుబాటుతో గడుపుతూ, బాధ్యతల నిర్వహణలతో మమ్మల్ని మేము మరచి బతుకుతుంటాం కానీ... నాన్నా కిరణ్, నీ స్మృతులను మరచిపోలేం. - పి.లీలాచంద్రారెడ్డి (పి.ఆర్.కిరణ్కుమార్ రెడ్డి తల్లి) పి.ఆర్. కిరణ్కుమార్రెడ్డి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. విజ్ఞప్తులతో నిత్యం క్యాంప్ ఆఫీస్కు వస్తుండే నిరుపేద ప్రజానీకానికీ, ముఖ్యమంత్రి వై.ఎస్.కు మధ్య ఆయన చక్కటి అనుసంధానకర్తగా ఉన్నారు. వై.ఎస్.ఆర్. ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ‘ఆరోగ్యశ్రీ’ పథకం పటిష్టంగా అమలు కావడానికి శక్తి వంచన లేకుండా ఆయన సేవలు అందించారు. నేడు ఆయన ద్వితీయ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన తల్లి తన కుమారుడికి ఘటించిన నివాళే... ఈ ‘తనయుని తలపులు’. -
సీఎం కిరణ్.. డీఎల్ మంత్రి!
* తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెబ్సైట్లో విచిత్రం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరున్నర మాసాలు గడిచింది. కొత్త ప్రభుత్వమూ వచ్చింది. అయితే, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాత్రం ముఖ్యమంత్రిగా ఎన్.కిరణ్కుమార్ రెడ్డి, తమ శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంటూ వారి ఫొటోలు, బ్రోచర్లను వెబ్సైట్లో ఉంచేసింది. ‘కమిషనర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ వెబ్సైట్లో సమైక్యాంధ్ర సీఎం, మంత్రుల బొమ్మలను చేర్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పేరిట వైద్య ఆరోగ్యశాఖ కొత్త వెబ్సైట్ను ఏర్పాటు చేసినా, అందులో సీఎం కేసీఆర్, ఆశాఖ మంత్రి ఫొటోలు లేకపోవడం పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
యువశక్తిని ఉపయోగించుకుంటే అద్భుతాలు
అనంతపురం : భారత్లో యువశక్తిని ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని అహ్మదాబాద్ స్పేస్ డైరెక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ చంద్రయాన్ విజయవంతంతో భారత్ ప్రతిష్ట పెరిగిందన్నారు. వచ్చే ఏడాది జీ శాట్-6, ఐఆర్ఆర్ఎస్ను ప్రయోగిస్తున్నామన్నారు. శాటిలైట్ టెక్నాలజీ వైద్య పరిశోధనకు ఉపయోగపడుతుందని ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. స్పేస్ టెక్నాలజీ వల్ల భద్రత, పర్యావరణ అంశాలకు దోహదపడతాయన్నారు. -
ఎస్సీ,ఎస్టీలకు ‘ఉచిత’షాక్ !
బొబ్బిలి : ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తాం.. ఎవరూ బిల్లులు చెల్లించక్కరలేదని గత ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పుడు లబ్ధిదారుల కొంపముంచుతోంది. అప్పటి సీఎం హామీతో బిల్లులు చెల్లించని వారికి ఇప్పుడు వేలాది రూపాయల బిల్లులు అందుతున్నాయి. వాటిని చూసిన వినియోగదారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంత డబ్బు ఇప్పుడు ఎలా కట్టాలా అని వారు ఆందోళన చెందుతున్నారు. బొబ్బిలి డివిజన్లోని పది మండలాల్లో ఎస్సీ వినియోగదారులు 11,814 మంది ఉండగా, ఎస్టీ వినియోగదారులు 5,141 మంది ఉన్నారు. జిల్లా వాప్తంగా వీరి సంఖ్య భారీగా ఉంది. వీరిలో చాలా మందికి ఇప్పుడు ఉచిత విద్యుత్ షాక్ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలు నెలకు 50 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకోవచ్చని కిరణ్కుమార్ రెడ్డి ప్రకటించడంతో రంగంలోకి దిగిన ట్రాన్స్కో అధికారులు గ్రామాల్లోని ఎస్సీ,ఎస్టీ కాలనీలపై దృష్టి సారించి, వినియోగదారులను గుర్తించారు. వారందరికీ ‘ఉచితం’ పథకంలోకి తీసుకువచ్చారు. కుల ధ్రువీకరణపత్రాన్ని అందజేసిన వారికి ఉచిత విద్యుత్ను అమలు చేస్తామని ప్రకటించడంతో తహశీల్దార్ల చుట్టూ తిరిగి సర్టిపికేట్లు చేయించుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందిన వారి పేర్లను మొదటి లిస్టుల్లో నమోదు చేశారు. పత్రాలు లేనివారిని పక్కన పెట్టి రెండో లిస్టుకు సిద్ధం చేశారు. అయితే వీటిని ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి పూర్తి స్థాయిలో అమలులోనికి తెచ్చారు. 50 యూనిట్ల లోపు వినియోగించిన వారి నుంచి విద్యుత్ అధికారులు డబ్బులు కట్టించుకోవడం లేదు గానీ, బిల్లులు మాత్రం పంపుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ రాయితీకి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకూ పైసా కూడా ట్రాన్స్కోకు జమ కాాలేదు. దీంతో ట్రాన్స్కో అధికారులు ఆ సొమ్మును వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. వినియోగదారులకు పంపుతున్న బిల్లుల్లోనే ఉచిత విద్యుత్ బిల్లుల మొత్తాలను కూడా వేసి చూపిస్తున్నారు. బిల్లులు చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు చెల్లించని వారి కనెక్షన్లను తొలగిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది అప్పులు చేసి వేలాది రూపాయలను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి మండలంలోని పణుకువలస గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇప్పుడు వేలాది రూపాయలు బిల్లులు అందుతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. రూ. 1,314 బిల్లు వచ్చింది మేము, మా కొడుకులం కలిసి ఉంటున్నాం. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరంటు ఇస్తారంటే మేమెవ్వరమూ బిల్లులు కట్టలేదు. ఇప్పుడు 1,314 రూపాయలు వచ్చింది. పేదోళ్లం ఇంత డబ్బు ఇప్పుడు ఎలా కడతాం. - జలుమూరు వెంకన్నదొర, చిన్నమ్మి, ఎం పణుకువలస