ప్రత్యేక హోదాపై స్పష్టత ఏది? | state, centeral govts should respond on ap special status: yv subbareddy | Sakshi

ప్రత్యేక హోదాపై స్పష్టత ఏది?

Sep 21 2015 11:51 AM | Updated on May 28 2018 1:52 PM

కేసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రత్యేక హోదా విషయం పట్టించుకోవటం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

విశాఖపట్నం: కేసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రత్యేక హోదా విషయం పట్టించుకోవటం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయాన్ని నీతి ఆయోగ్కు అప్పగించామన్న కేంద్రం, నెల రోజులైనా స్పష్టత ఇవ్వలేదన్నారు.

ఈ నెల 25లోగా ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం ప్రకటించాలి, లేదంటే ఈ నెల 26న వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించటంతోనే మా ఎన్నికల విజయ ప్రస్థానం ప్రారంభమవుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement