వైఎస్సార్ జిల్లా: ఇంట్లో కరెంటు షాక్ తగిలి మూడె మహేంద్ర(21) అనే డిగ్రీ విద్యార్థి శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా కలశపాడు మండలం తంబళ్లపల్లిలో చోటుచేసుకుంది. వైర్కు ఉన్న ఇన్సులేషన్ పోవడంతో లోపల ఉన్న కాపర్ తీగలు బయటకు వచ్చాయి. ఈ విషయం గమనించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మహేంద్ర పోరుమామిళ్లలోని ఓ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.
(కలశపాడు)
విద్యుదాఘాతానికి విద్యార్థి బలి
Published Fri, Apr 3 2015 8:28 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement