Mahindra & Mahindra
-
‘మహీంద్రా’ ఇండియన్ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులకు 20 ఏళ్లు
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్లో భాగమైన మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ లిమిటెడ్ (MASL) భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది. 2005లో మహీంద్రా తొలిసారి ద్రాక్ష పండ్ల షిప్మెంట్ను యూరప్కి ఎగుమతి చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, చైనా, ఆగ్నేయాసియా, ఇతర మార్కెట్లలోని కస్టమర్లకు అత్యంత నాణ్యమైన ద్రాక్షలను అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఎగుమతి చేస్తోంది.సబోరో, ఫ్రూకింజ్ బ్రాండ్ల కింద థామ్సన్, సొనాకా పేరిట వైట్ సీడ్లెస్ ద్రాక్షలు, ఫ్లేమ్, క్రిమ్సన్ పేరిట రెడ్ సీడ్లెస్ ద్రాక్షలు, జంబో, శరద్ పేరిట బ్లాక్ సీడ్లెస్ ద్రాక్షలను ఎంఏఎస్ఎల్ సంస్థ ఎగుమతి చేస్తోంది. దాంతో ఉద్యోగాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా స్థానిక కమ్యూనిటీలకు తోడ్పాటు అందిస్తోంది. ఎగుమతి చేయగలిగే విధంగా దిగుబడులను మూడు రెట్లు మెరుగుపర్చుకోవడంలో (ఎకరానికి 2.5 ఎంటీ నుంచి ఎకరానికి 7.5 ఎంటీ వరకు) రైతాంగానికి తోడ్పాటు అందిస్తోంది. సంస్థకు నాసిక్లో అధునాతన గ్రేప్ ప్యాక్ హౌస్ ఉండగా నాసిక్, బారామతి, సాంగ్లిలో 500 మంది పైచిలుకు రైతులతో కలిసి పని చేస్తోంది.ఇదీ చదవండి: భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత‘గత 20 ఏళ్లలో ద్రాక్ష వ్యాపారంలో సాధించిన వృద్ధి ఎంఏఎస్ఎల్కు గర్వకారణం. వ్యవసాయ వేల్యూ చెయిన్లో భాగంగా ద్రాక్ష సాగులో పరివర్తన తేవడంపై నిబద్ధతతో పని చేస్తున్నాం. మా కృషి ఫలితంగా ఇతర దేశాలకు భారతీయ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. అలాగే ప్రాంతీయంగా వందల కొద్దీ రైతుల జీవితాలపై సానుకూలంగా ప్రభావం చూపగలిగాం’ అని ఎంఏఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో రమేష్ రామచంద్రన్ తెలిపారు. 6.5 ఎకరాల్లో, 75,000 చ.అ. విస్తీర్ణంలో విస్తరించిన మహీంద్రా గ్రేప్ ప్యాక్ హౌస్లో నిత్యం 80 మెట్రిక్ టన్నుల ద్రాక్షలు ప్యాక్ చేస్తారు. ఇందులో 12 ప్రీకూలింగ్ చాంబర్లు, 170 ఎంటీ సామర్థ్యంతో రెండు కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీలు ఉన్నాయి. ఒక్కో షిఫ్టులో 500 మంది పైచిలుకు ఉద్యోగులు ఉంటారు. సుస్థిర సాగు విధానాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నాసిక్లో ఎంఏఎస్ఎల్కు 15 ఎకరాల్లో డెమో ఫార్మ్ ఉంది. -
రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్లో..
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన.. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీకి చెందిన ''స్కార్పియో ఎన్'' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ 2,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్యూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ స్కార్పియో-N కార్బన్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 19.19 లక్షల నుంచి రూ. 24.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ పటిష్టమైన డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రీమియం లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్తో.. స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. డార్క్ ట్రీట్మెంట్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వానో ఫినిష్డ్ రూఫ్ రెయిల్స్ వంటివి దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ కొత్త ఎడిషన్ Z8, Z8L సెవెన్-సీటర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.స్కార్పియోదశాబ్దాల చరిత్ర కలిగిన మహీంద్రా స్కార్పియో.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే స్కార్పియో ఎన్ లాంచ్ అయింది. ఇప్పుడు స్కార్పియో ఎన్ కార్బన్ వేరియంట్ లాంచ్ అయింది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!స్కార్పియో ఎన్ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. మంచి డిజైన్, కొత్త ఫీచర్స్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఈ కారును చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పటికే రెండు లక్షల మంది ఈ కారును కొనుగోలు చేసారంటే.. దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
శత్రువు దాడులకు ‘అటానమస్’ కౌంటర్..యూఎస్ కంపెనీతో ‘ఎమ్అండ్ఎం’ ఒప్పందం
ముంబయి: అత్యాధునిక భద్రతా,నిఘా సాంకేతికత అభివృద్ధి చేయడంలో పేరుగాంచిన అమెరికాకు చెందిన అండ్యూరిల్ గ్రూపుతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా(ఎమ్అండ్ఎమ్) కంపెనీ తెలిపింది. అండ్యూరిల్ గ్రూపు సహకారంతో కృత్రిమమేధ (ఏఐ) ఆధారంగా నడిచే అటానమస్ (స్వయం ప్రతిపత్తి) మారిటైమ్ సిస్టమ్స్, కౌంటర్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్(సీయూఎస్ఎస్) సొల్యూషన్స్, నెక్స్ట్ జనరేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సాఫ్ట్వేర్లు తయారు చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది.ఈ అత్యాధునిక సాంకేతికతో ప్రాంతీయ భద్రత మరింత పటిష్టమవుతుందని పేర్కొంది. ఇంతేగాక మాడ్యులార్ అటానమస్ అండర్వాటర్ వెహికిల్స్(ఏయూవీ)లను అభివృద్ధి చేసేందుకు అండ్యూరిల్తో కుదిరిన ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్అండ్ఎమ్ తెలిపింది. సముద్ర తీర ప్రాంత భద్రత,నిఘాకు ఏయూవీలు ఎంతగానో ఉపయోగపడతాయని,ఏయూవీలతో జలాల లోపల మోహరించే ఆయుధ సంపత్తి మరింతగా పెరుగుతుందని పేర్కొంది. ఇవే కాకుండా డ్రోన్ దాడులను గర్తించి నిర్వీర్యం చేసే సీయూఏఎస్ సాంకేతికత అభివృద్ధి కోసం రెండు కంపెనీలు పనిచేస్తాయని తెలిపింది. డ్రోన్లతో పెరిగిన వైమానక దాడుల ముప్పును అరికట్టడంలో సీయూఏఎస్ సాంకేతికత దోహద పడుతుందని వెల్లడించింది.రక్షణ నిఘా వ్యవస్థల్లో వాడే పలు రకాల సెన్సార్ సాంకేతికతలన్నింటిని కలిపి సెన్సార్ ఫ్యూజన్ ప్లాట్ఫాం అభివృద్ధి చేసేందుకు రెండు కంపెనీలు పనిచేస్తాయని ఎమ్అండ్ఎమ్ తెలిపింది.భద్రత పరంగా ముంచుకొస్తున్న ముప్పును అత్యాధునిక సాంకేతికతో ఎదుర్కొనేందుకు రెండు కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని ఎమ్అండ్ఎం గ్రూపు ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ వినోద్ సహాయ్ తెలిపారు. ప్రస్తుతం డ్రోన్లు, మానవరహిత ఆయుధాల ద్వారా ఎదురువుతున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన సాంకేతిక వ్యవస్థలు ఎంతో ముఖ్యమని అండ్యూరిల్ గ్రూపు సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ గ్రెగ్ కాస్నర్ అభిప్రాయపడ్డారు. -
మహీంద్రా ఈవీల రికార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా తయారీ ఎలక్ట్రిక్ ఎస్యూవీలు ఎక్స్ఈవీ–9ఈ, బీఈ–6 సరికొత్త రికార్డు సృష్టించాయి. తొలి రోజు 30,179 యూనిట్ల బుకింగ్స్తో ఈవీ రైడ్కు సిద్ధం అయ్యాయి. ఎక్స్షోరూం ధర వద్ద వీటి విలువ రూ.8,472 కోట్లు. బుకింగ్స్లో ఎక్స్ఈవీ–9ఈ వాటా 56 శాతం నమోదైంది. ఈ రెండు మోడళ్లలో కలిపి అధిక సామర్థ్యం ఉన్న వేరియంట్స్కు వినియోగదార్లు మొగ్గుచూపారు. 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచిన ప్యాక్–3ని 73 శాతం కస్టమర్లు ఎంచుకున్నారు. ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్కెట్ మళ్లుతోందనడానికి ఈ బుకింగ్స్ నిదర్శనంగా నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 99,068 యూనిట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో మహీంద్రా కొత్త ఈవీల రికార్డు స్థాయి బుకింగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎక్స్ఈవీ–9ఈ, బీఈ–6 డెలివరీలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మోడళ్లూ 59 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఆప్షన్స్తో తయారయ్యాయి. ఒకసారి చార్జ్ చేస్తే వేరియంట్ను బట్టి 535–682 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. -
మొదటి రోజే రూ.8,472 కోట్ల బుకింగ్లు
మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కార్ల కొనుగోలు కోసం వినియోగదారులు ఆసక్తి కనబరిచారు. కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్యూవీలకు రికార్డు స్థాయి బుకింగ్లు అందినట్లు పేర్కొంది. సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6ల మొదటి రోజు బుకింగ్ విలువ రూ.8,472 కోట్లుగా నమోదైంది. సుస్థిర, పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కోసం పెరుగుతున్న డిమాండ్ను ఈ బుకింగ్లు హైలైట్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మహీంద్రా సంస్థ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ముంచుకొస్తున్న జనాభా సంక్షోభంమహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృత శ్రేణి వినియోగదారులు ఆదరిస్తున్నారని మొదటి రోజు బుకింగ్ డేటా సూచిస్తుంది. మొత్తం బుకింగ్స్లో ఎక్స్ ఈవీ 9ఈ 56 శాతం, బీఈ 6 44 శాతం వాటాను దక్కించుకున్నాయి. రెండు మోడళ్లు విభిన్న కస్టమర్ అవసరాలను ఆకట్టుకునే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, అధునాతన ఫీచర్లు, లగ్జరీల సదుపాయాలను కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. బుకింగ్లను పరిశీలిస్తే 79 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ ప్యాక్ త్రీకి డిమాండ్ అధికంగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం బుకింగ్లలో ప్యాక్ త్రీ వేరియంట్ 73% వాటాను కలిగి ఉంది. ఇది లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని అందించే వాహనం అని కంపెనీ పేర్కొంది. -
ఓలా ఎలక్ట్రిక్ 'నష్ట' కష్టాలు..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన(ఈ2డబ్ల్యూ) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ (Ola Electric) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(Q3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 564 కోట్లకు చేరింది. ఆదాయం నీరసించడం, తీవ్రతర పోటీ, సర్వీస్ సవాళ్లతో పెరిగిన వ్యయాలు ప్రభావం చూపాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 376 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,296 కోట్ల నుంచి రూ. 1,045 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 1,597 కోట్ల నుంచి రూ. 1,505 కోట్లకు తగ్గాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 3.33 లక్షల యూనిట్ల ఈ2డబ్ల్యూ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఓలా వెల్లడించింది. గతేడాది క్యూ3తో పోలిస్తే ఇవి 37 శాతంపైగా అధికమని తెలియజేసింది. సర్వీసింగ్ సమస్యల పరిష్కారానికి రూ. 110 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఓలా షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం నీరసించి రూ. 70 వద్ద ముగిసింది.ఎంఅండ్ఎం లాభం స్పీడ్ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్చేసి రూ. 3,181 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,658 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 41,470 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 35,299 కోట్ల టర్నోవర్ నమోదైంది.ఆటో విభాగంలో అమ్మకాలు 16 శాతం పుంజుకుని 2,45,000కు చేరగా.. యూవీ విక్రయాలు 1,42,000 యూనిట్లను తాకాయి. ఈ విభాగం ఆదాయం 21 శాతం జంప్చేసి రూ. 23,391 కోట్లకు చేరింది. నికర లాభం 20 శాతం బలపడి రూ. 1,438 కోట్లయ్యింది. వ్యవసాయ పరికరాల విభాగం నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 996 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు ఎన్ఎస్ఈలో 1.7 శాతం లాభంతో రూ. 3,193 వద్ద ముగిసింది. -
ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్
జనవరిలో ఢిల్లీలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025''లో.. భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించింది. కంపెనీ ప్రదర్శించిన బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లు భారతీయులను మాత్రమే కాకుండా.. విదేశీయులను సైతం ఫిదా చేశాయి. జపాన్, కొరియా నుంచి వచ్చిన ప్రతినిధులు ఆ కార్లను ఫోటోలు తీస్తూ కనిపించారు. ఇది మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)ను భావోద్వేగానికి గురిచేసింది.దశాబ్దాల క్రితం, నేను ఆటో పరిశ్రమలో నా కెరీర్ను ప్రారంభించినప్పుడు, విదేశాలలో తయారైన అధునాతన కార్లను ఫోటో తీయడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి భారతీయ ప్రతినిధులు అంతర్జాతీయ ఆటో షోలకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు దేశీయ వాహనాలను విదేశీయులను ఆకట్టుకుంటున్నాయని.. తన ఎక్స్ ఖాతాలో ఆనంద్ మహీంద్రా భవోద్వేగ పోస్ట్ చేసారు.మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈభారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కూడా ఉన్నాయి. ఇవి సాధారణ ఎలక్ట్రిక్ కార్లకు భిన్నంగా ఉన్నాయి. ఈ రెండూ తమ భవిష్యత్ డిజైన్లు, అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండటం వల్ల హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.స్పోర్టీ డిజైన్ను కలిగి ఉన్న BE 6.. సొగసైన కూపే లుక్ను స్వీకరించే XEV 9e రెండూ 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్లను పొందుతాయి. ఇవి 170kW, 210kW మోటార్ ద్వారా పవర్ డెలివరీ చేస్తాయి. పూర్తి ఛార్జ్పై 683 కిమీ (BE 6) మరియు 656 కిమీ (XEV 9e) వరకు పరిధిని అందిస్తాయి.ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6 బుకింగ్స్ & డెలివరీమహీంద్రా కంపెనీ దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.Decades ago, when I began my career in the auto industry, it was our Indian delegations that would make the pilgrimage to International Auto shows to photograph & study the advanced cars made overseas.At the recent Bharat Mobility Show in Delhi, you can imagine my emotions when… pic.twitter.com/z3x4su5JSA— anand mahindra (@anandmahindra) February 6, 2025 -
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6: బుకింగ్స్.. డెలివరీ వివరాలు
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా & మహీంద్రా' (M&M) దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.ఫిబ్రవరి 14న మహీంద్రా కంపెనీ బుకింగ్లను స్వీకరిస్తే డెలివరీలు 2025 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. సంస్థ అన్ని వేరియంట్లకు బుకింగ్స్ స్వీకరించనుంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.మహీంద్రా BE 6 ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 18.90 లక్షలుప్యాక్ వన్ అబోవ్ (59 kWh): రూ. 20.50 లక్షలుప్యాక్ టూ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 24.50 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 26.90 లక్షలుమహీంద్రా XEV 9e ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ వన్ ఎబౌ (59 kWh): NAప్యాక్ టూ (59 kWh): రూ. 24.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 27.90 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 30.50 లక్షలు -
మహిళల ‘సెకండ్ కెరియర్’కు మహీంద్రా ప్రోగ్రామ్
వృత్తి జీవితాలను ఇతర కారణాలతో మధ్యలో వదిలేసిన మహిళలకు మహీంద్రా గ్రూప్(Mahindra Group) శుభవార్త చెప్పింది. సుదీర్ఘ విరామం తరువాత మహిళా ప్రొఫెషనల్స్(women professionals) తిరిగి వృత్తి జీవితంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఎస్ఓఏఆర్ (సీమ్లెస్ అపర్చునిటీ ఫర్ అమేజింగ్ రిటర్న్షిప్) పేరుతో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు విరామం తీసుకున్న కనీసం ఐదు సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం ఉన్న మహిళలకు ఈ ప్రాగ్రామ్ ద్వారా సాయం అందించనున్నారు.మహీంద్రా గ్రూప్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రెసిడెంట్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు రుజ్ బెహ్ ఇరానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘తిరిగి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పని చేసి గణనీయమైన వృద్ధిని తీసుకువస్తారు. సోర్ ప్రోగ్రామ్లో భాగంగా మహిళలకు మెంటార్ షిప్, అప్ స్కిల్, ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్స్, నెట్ వర్కింగ్ సెషన్లు అందిస్తారు. ప్రతి ఒకరికి ఒక మెంటార్ను కేటాయిస్తారు. దాంతో ప్రోగ్రామ్ సమయంలో ఏదైనా అనుమానాలు వస్తే నిత్యం మెంటార్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు’ అని అన్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదంకార్పొరేట్ హెచ్ఆర్ అండ్ గ్రూప్ టాలెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాక్షి హండా మాట్లాడుతూ..‘పనిప్రాంతంలో లింగ వైవిధ్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే కొంత పని అనుభవం ఉన్న మహిళలు కొన్ని కారణాల వల్ల పని చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారు. అలాంటి వారికి కొంత ప్రోత్సాహం, సమయం ఇస్తే తిరిగి వారు శ్రామికశక్తి(workforce)లో భాగమవుతారు. అందుకు కంపెనీ అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి సంస్థ సంస్కృతి, విలువల గురించి పరిచయం చేయడం కోసం మహీంద్రా లీడర్షిప్ యూనివర్శిటీలో ప్రత్యేక కోర్సు కూడా ఉంటుంది. -
నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం
న్యూఢిల్లీ: ‘నా భార్య అద్భుతమైనది. ఆమెను తదేకంగా చూడటం నాకు ఇష్టం’ అని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మహీంద్రా తాజాగా చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. పని గంటల పరిమాణాన్ని నొక్కి చెప్పడం తప్పు అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ‘మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎంత సమయం పని చేశామన్నది కాదు. కాబట్టి 40 గంటలా, 70 గంటలా, 90 గంటలా కాదు. మీరు ఏ అవుట్పుట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. 10 గంటలు అయినా మీరు ప్రపంచాన్ని మార్చవచ్చు’ అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో సమయం గడిపినంత మాత్రాన తాను ఒంటరిగా ఉన్నట్టు కాదని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఎక్స్ వేదికగా 1.1 కోట్ల మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వివరించారు. -
2025లో బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!
భారతదేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి కారణం కఠినమైన ఉద్గార నిబంధనలు. అయితే కొంతమంది ఇప్పటికి కూడా డీజిల్ కార్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)దేశీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్'కు చెందిన 'ఆల్ట్రోజ్' ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చౌకైన డీజిల్ వెహికల్. దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో (Mahindra Bolero)మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'బొలెరో' గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమందికి ఇష్టమైన కారు. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి.. 76 హార్స్ పవర్, 210 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ఎంపికలో లభిస్తుంది. బీఎస్ 4 బొలెరో డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా సోనెట్ (Kia Sonet)కియా సోనెట్ అనేది కూడా 10 లక్షల లోపు ధర వద్ద లభించే బెస్ట్ డీజిల్ కారు. ఇందులోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సోనెట్ డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo)మహీంద్రా బొలెరో నియో 100 హార్స్పవర్ & 210 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుతుంది. ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా XUV 3ఎక్స్ఓXUV 3XO కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ డీజిల్ వెర్షన్. రూ. 9.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు 115 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ లేదా మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: అప్పుడు కల కనింది: ఇప్పుడు కొనేసింది.. వీడియో చూశారా?డీజిల్ కార్లకు తగ్గిన డిమాండ్కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత డీజిల్ కార్లకు డిమాండ్ క్రమంగా తగ్గింది. అంతే కాకుండా కాలుష్య నివారణను దృష్టిలో ఉంచుకుని కూడా ప్రభుత్వం డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే కూడా డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటం కూడా ఈ కార్ల డిమాండ్ తగ్గిపోవడానికి కారణమైంది. -
నెలకు 5,000 వాహన అమ్మకాలు లక్ష్యం
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా(Mahindra) అండ్ మహీంద్రా బీఈ–6, ఎక్స్ఈవీ 9ఈ టాప్ వేరియంట్ల ధరలను ప్రకటించింది. రెండు మోడళ్లూ మూడు వేరియంట్లలో లభిస్తాయి. ఎక్స్షోరూంలో టాప్ వేరియంట్స్ అయిన బీఈ–6 ప్యాక్–3 ధర రూ.26.90 లక్షలు కాగా ఎక్స్ఈవీ 9ఈ ప్యాక్–3 రూ.30.5 లక్షలు ఉంది. 2024 నవంబర్లో కంపెనీ రెండు మోడళ్లను ఆవిష్కరించి ఎలక్ట్రిక్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీల ప్రారంభ ధర రూ.18.9 లక్షలు ఉంటుందని వెల్లడించింది. వేరియంట్నుబట్టి బీఈ–6 గరిష్టంగా ఒకసారి చార్జింగ్ చేస్తే 682 కిలోమీటర్లు, ఎక్స్ఈవీ 9ఈ 656 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాగా, నెలకు 5,000 యూనిట్లు విక్రయించాలని మహీంద్రా లక్ష్యంగా చేసుకుంది. చకన్ ప్లాంటు సామర్థ్యాన్ని నెలకు 90,000 స్థాయికి తీర్చిదిద్దుతోంది. దీనిని 1.2 లక్షల యూనిట్లకు పెంచే అవకాశమూ ఉంది. 2021–27 మధ్య ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం రూ.16,000 కోట్లు పెట్టుబడి చేస్తున్నట్టు మహీంద్రా ఇప్పటికే వెల్లడించింది. ఫిక్స్డ్ డిపాజిట్లకు ఒకే ప్లాట్ఫామ్ఒకే ప్లాట్ఫామ్ ద్వారా రిటైల్(Retail) ఇన్వెస్టర్లు వివిధ బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలలో ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) చేసేందుకు టాటా డిజిటల్ తెరతీసింది. సూపర్యాప్ ‘టాటా న్యూ’ ద్వారా ఇందుకు వీలు కల్పిస్తోంది. కస్టమర్లు పొదుపు ఖాతా లేకుండానే తమ సొమ్మును వివిధ ఫైనాన్షియల్ సంస్థలలో ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించుకోవచ్చునని టాటా డిజిటల్ తెలియజేసింది. గరిష్టంగా 9.1 శాతం వరకూ వడ్డీని ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో సులభంగా, భద్రంగా సొమ్మును ఎంపిక చేసుకున్న ఫైనాన్షియల్ సంస్థలలో దాచుకునేందుకు తమ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని వివరించింది. రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని, బ్యాంకులో పెట్టుబడులకు డీఐసీజీసీ(DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకూ డిపాజిట్ బీమా ఉంటుందని తెలియజేసింది. ఎన్బీఎఫ్సీలలో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ తదితరాలున్నట్లు పేర్కొంది. -
2025లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే (ఫోటోలు)
-
కొత్త ఎలక్ట్రిక్ కారు.. పేరు మార్చేసిన మహీంద్రా: ఎందుకంటే..
మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇండిగో అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా కంపెనీ తన బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు పేరును 'బీఈ 6'గా మారుస్తున్నట్లు వెల్లడించింది. రెండు కంపెనీల మధ్య సంఘర్షణ అవసరం లేదు. కాబట్టే ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే త్వరలో విక్రయానికి రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు 'బీఈ 6'గా రానుంది.6ఈ పేరుతో ఇండిగో సేవలుఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది. అయితే మహీంద్రా కంపెనీ తన కారు పేరును మార్చుకోవడంతో సమస్య సద్దుమణిగినట్లే అని స్పష్టమవుతోంది. -
ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన టాప్ 10 పాపులర్ కార్లు (ఫోటోలు)
-
కోర్టు మెట్లెక్కిన ఇండిగో: మహీంద్రా ఎలక్ట్రిక్పై దావా
దేశీయ వాహన తయారీ దిగ్గజం ఇటీవల 'బీఈ 6ఈ' ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మంగళవారం ఈ కేసు జస్టిస్ 'అమిత్ బన్సల్' ముందుకు వచ్చింది. అయితే ఈయన ఈ కేసు నుంచి తప్పకున్నారు. కాబట్టి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఇండిగోతో సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది.నిజానికి మహీంద్రా ఎలక్ట్రిక్ నవంబర్ 25న 'బీఈ 6ఈ' నమోదు కోసం దరఖాస్తును చేసుకుంది. దీనిని రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్మార్క్ అంగీకరించింది. ద్విచక్ర వాహనాలను మినహాయించి, ఫోర్ వీలర్ వాహనాలకు '6E' హోదాను ఉపయోగించడానికి హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఇండోగో అభ్యంతరం చెబుతోంది. దీనిపై తీర్పు త్వరలోనే వెల్లడవుతుంది. -
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే: ధరలు ఎలా ఉన్నాయంటే..
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఒకటి 'బీఈ 6ఈ', మరొకటి 'ఎక్స్ఈవీ 9ఈ'. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.18.90 లక్షలు, రూ.21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కార్లను 2025 మార్చిలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం.మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. ఎందుకంటే ఈ రెండూ INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమయ్యాయి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా తయారైన వాహనాలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి.XEV 9e ఒక స్పోర్టి కూపే డిజైన్ పొందుతుంది. త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్లైట్లు, విస్తృతమైన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కూపే స్టైల్ రూఫ్లైన్ వంటివి ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ల మధ్యలో.. ప్రకాశవంతమైన మహీంద్రా లోగో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో 12.3 ఇంచెస్ డిస్ప్లేలతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ప్లే, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు.. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్, 16 స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.BE 6e షార్ప్ క్యారెక్టర్ లైన్లు, హుడ్ స్కూప్తో కూడిన పాయింటెడ్ హుడ్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ట్రీమ్లైన్డ్ బంపర్ను కలిగి ఉంది. ఈ కారు ఏరోడైనమిక్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్.. ఇల్యూమినేటెడ్ బీఈ లోగో వంటివి దీనిని కొత్తగా చూపిస్తాయి. ఇందులో ట్విన్-స్క్రీన్ ర్యాప్రౌండ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా 16 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్, పనోరమిక్ సన్రూఫ్, ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ రెండూ.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. 59 kWh బ్యాటరీ 450 నుంచి 500 కిమీ రేంజ్.. 79 kWh బ్యాటరీ 650 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇవి రెండూ ఏసీ ఛార్జర్కు మాత్రమే కాకుండా డీసీ ఫాస్ట్ ఛార్జర్కు సపోర్ట్ చేస్తాయి. -
మూడు కార్లకు 5 స్టార్ రేటింగ్: సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మహీంద్రా కంపెనీకి చెందిన మూడు కార్లు చేరాయి. అవి మహీంద్రా థార్ రోక్స్, ఎక్స్యూవీ400, ఎక్స్యూవీ 3ఎక్స్ఓ. ఇవన్నీ 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (B-NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నాయి.మహీంద్రా థార్ రోక్స్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్ రోక్స్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోర్ సాధించింది.మహీంద్రా థార్ రోక్స్ కారులో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారు ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.మహీంద్రా ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన మరో మహీంద్రా కారు ఎక్స్యూవీ400. ఈ ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 30.37 పాయింట్లు.. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 43 పాయింట్ల స్కోర్ సాధించింది.రూ. 16.74 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్యూవీ400 మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్బ్యాగ్లు, రివర్స్ కెమెరా, ఆల్ డిస్క్ బ్రేక్లు మొదలైనవి ఉన్నాయి.మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓమహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ కారు కూడా భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్లో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్లో 49 పాయింట్లకు 43 పాయింట్లు సాధించింది.మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ కారులో ఆరు ఎయిర్బ్యాగ్లు, త్రీ పాయింట్ సీట్బెల్ట్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు వంటి వాటితో పాటు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
థార్ రాక్స్ 4x4 ధరలు ఇవే
థార్ రాక్స్ 4x4 వేరియంట్ ధరలను మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ SUV ధరలు రూ. 14.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎడిషన్ ఎంఎక్స్5, ఏఎక్స్5 ఎల్, ఏఎక్స్7 ఎల్ అనే మూడు వేరియంట్లలో కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.మహీంద్రా థార్ రాక్స్ 4x4 ఎడిషన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో 330 Nm టార్క్ 150 Bhp పవర్ అందిస్తుంది. అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో 172 Bhp పవర్, 370 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్నో, సాండ్, మడ్ అనే మూడు పవర్ మోడ్స్ పొందుతుంది.ఇదీ చదవండి: పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్థార్ రాక్స్ ఎంఎక్స్5 4x4 ఎడిషన్ 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రివర్స్ కెమెరా, సన్రూఫ్, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఆటో హెడ్లైట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఏఎక్స్5 ఎల్ వేరియంట్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, లెవల్ 2 ఏడీఏఎస్ టెక్ వంటివి పొందుతుంది. ఏఎక్స్7 ఎల్ పనోరమిక్ సన్రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటివి పొందుతాయి. -
దిగ్గజ ఆటో కంపెనీల మధ్య ఒప్పందం?
మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) త్వరలో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. త్వరలో ముంబయిలో ఈ రెండు సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లు సమావేశం కాబోతున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీల ఉత్పత్తులు, తయారీ యూనిట్ల వినియోగం, టెక్నాలజీ, వంటి అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ భారత్లో పుణె, ఔరంగబాద్లోని తయారీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలోని చకన్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేయబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: చాట్జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..? -
మహీంద్రా కొత్త ప్లాంటు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు. చకన్, పుణే, నాసిక్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 8 లక్షల యూనిట్లు. ఎన్ఎఫ్ఏ మోడళ్ల కోసం మరింత సామర్థ్యం అవసరం అవుతుంది. ఎన్ఎఫ్ఏ ఆర్కిటెక్చర్ సుమారు 12 మోడళ్లను తయారు చేసే అవకాశం ఉంది. కొత్త ప్లాట్ఫామ్ ద్వారా తయారైన మోడళ్ల అమ్మకాలు ఏటా 3–5 లక్షల యూనిట్లు ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. కాగా, కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అందుకుంటుంది. మహీంద్రా మార్కెట్ వాటా రెండంకెలకు చేరుకోవచ్చు. 2024–25లో ఎస్యూవీల టర్నోవర్ రూ.75,000 కోట్లు దాటనుంది. 2023–24లో కంపెనీ ఎస్యూవీల తయారీలో పరిమాణం పరంగా భారత్లో రెండవ స్థానంలో, ఆదాయం పరంగా తొలి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమోటివ్ బిజినెస్ కోసం రూ.27,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది. -
1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్
ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం మహీంద్రా గ్రూప్ ఉపకారవేతనాలు అందిస్తుంది. మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని ‘మహీంద్రా సార్థి అభియాన్’ పేరుతో స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను ప్రతిభావంతులైన 1000 మంది విద్యార్థినులకు పైచదువుల కోసం రూ.10 వేలు చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నారు.మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు వినోద్ సహాయ్ మాట్లాడుతూ..‘మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం సాయం చేస్తున్నాం. మహిళాసాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పదో తరగతి పూర్తయి పైచదువులు చదివాలనుకునే ప్రతి ట్రక్ డ్రైవర్ కుమార్తె ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000 ఇవ్వడంతోపాటు గుర్తింపు సర్టిఫికెట్ కూడా అందిస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: విండ్ఫాల్ ట్యాక్స్ రద్దుఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా కావడం విశేషం అని అధికారులు తెలిపారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించిన కంపెనీ ఇప్పటివరకు 10,029 మందికి ఉపకారవేతనాలు అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 75 ట్రాన్స్పోర్ట్ హబ్లను గుర్తించి ఈ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. విద్యార్థినుల మెరిట్, కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రీనింగ్ చేసి స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఇందుకోసం సంస్థ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. -
మహీంద్రా వాణిజ్యవాహనం ‘వీరో’
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ తాజాగా 3.5 టన్నుల లోపు తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్సీవీ) విభాగంలో ’వీరో’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డీజిల్ వెర్షన్ లీటరుకు 18.4 కి.మీ., సీఎన్జీ వేరియంట్ కేజీకి 19.2 కి.మీ. మైలేజీనిస్తుంది.ఎల్సీవీ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన కొత్త అర్బన్ ప్రాస్పర్ ప్లాట్ఫాంపై దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వెర్షన్ను కూడా ప్రవేశపెడతామని వివరించారు. తమకు 3.5 టన్నుల లోపు ఎల్సీవీ సెగ్మెంట్లో 51 శాతం, 2–3.5 టన్నుల సెగ్మెంట్లో 63 శాతం వాటా ఉందని నక్రా చెప్పారు.దీన్ని మరింత పెంచుకునేందుకు వీరో సహాయపడుతుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 2–3.5 టన్నుల విభాగంలో స్వల్పంగా అమ్మకాలు క్షీణించాయని, 2 టన్నుల లోపు సెగ్మెంట్లో 12 శాతం క్షీణత నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పుంజుకోవడం ప్రారంభమైందని, ఈ సానుకూలత చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో కూడా కనిపించవచ్చని నక్రా చెప్పారు. -
ఎస్యూవీల రారాజు ఇదే..
దేశంలో ఎస్యూవీలకు ఆదరణ ఇటీవల బాగా పెరుగుతోంది. భారతీయులు కొంటున్న పాసింజర్ వాహనాల్లో దాదాపుగా సగం ఎస్యూవీలే ఉంటున్నాయి. కస్టమర్లలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా అన్ని ప్రముఖ ఆటోమొబైల్ మేకర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్ ఎస్యూవీలను కస్టమర్లకు పరిచయం చేస్తున్నాయి.దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 14 శాతం వృద్ధితో 2.12 లక్షల వాహనాల అమ్మకాలను సాధించింది. ఇందులో 1.24 లక్షల వాహనాలు ఎస్యూవీలు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. నెలవారీ ఉత్పత్తి 49,000 యూనిట్లను నుంచి ఈ సంవత్సరం చివరి నాటికి 64,000 యూనిట్లకు పెంచుతోంది కంపెనీ.దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీలలో మహీంద్రా అగ్రగామిగా నిలిచింది. మొత్తం ఎస్యూవీ మార్కెట్లో మహీంద్రా ఎస్యూవీల వాటా 21.6 శాతంగా ఉంది. ఇతర విభాగాల్లోనూ మహీంద్రా లీడ్లో ఉంది. 50.9 శాతం మార్కెట్ వాటాతో ఎల్సీవీ (లైట్ కమర్షియల్ వెహికల్), 44.7 శాతం వాటాతో ట్రాక్టర్లు, 43.4 శాతం వాటాతో ఎలక్ట్రిక్ 3-వీలర్లతో సహా అనేక ఇతర విభాగాలలో వాహనాలను అత్యధికంగా విక్రయిస్తోంది. దీంతో కంపెనీ మొత్తం త్రైమాసిక ఆదాయం 10 శాతం పెరిగింది. అయితే నికర లాభం మాత్రం 6 శాతం పడిపోయింది.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థార్ 5-డోర్ వాహనాన్ని ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవిష్కరించడానికి మహీంద్రా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు టీజర్లు, ట్రైలర్లు వచ్చాయి. ఈ వాహనానికి థార్ రోక్స్ అని పేరు పెట్టింది కంపెనీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా. -
ఇకపై ఈ మహీంద్రా కొత్త కారు కనిపించదు!.. ఎందుకంటే?
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు ఉత్తమ అమ్మకాలు పొందిన 'మహీంద్రా మరాజో' ఉత్పత్తిని కంపెనీ త్వరలో నిలిపివేయనున్నట్లు సమాచారం. 2018లో మారుతి ఎర్టిగా, ఎక్స్ఎల్6, కియా కారెన్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా దేశీయ విఫణిలో అడుగుపెట్టిన మరాజో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఈ ఎమ్పీవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.90 లక్షల మధ్య ఉండేది.ప్రారంభంలో ఉత్తమ అమ్మకాలు పొందినప్పటికీ.. క్రమంగా ఇది ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందలేకపోయింది. గత ఐదు నెలలో ఈ కారు కేవలం 34 యూనిట్ల అమ్మకాలను మాత్రమే సాధించింది. ప్రస్తుతం ప్యాసింజర్ ఎమ్పీవీ మార్కెట్లో టయోటా, మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో కంపెనీ మరాజో కారును నిలిపివేయడానికి సంకల్పించింది.ప్రారంభం నుంచి జూన్ 2024 వరకు మహీంద్రా మరాజో సేల్స్ మొత్తం 44793 యూనిట్లు మాత్రమే. నెలకు సగటున కేవలం 640 యూనిట్ల మరాజో కార్లు మాత్రమే అమ్ముడైనట్లు కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలు తగ్గడమే కాకుండా.. బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అవ్వలేదు. ఇది కూడా కంపెనీ మార్కెట్లో విజయం పొందకపోవడానికి కారణమనే తెలుస్తోంది. -
అరుదైన సేల్స్ రికార్డ్.. అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా!
మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి. 2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.2013 ఆర్థిక సంవత్సరంలో 50168 యూనిట్లు, 2014వ ఆర్థిక సంవత్సరంలో 50,949 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇలా ప్రతి ఏటా మహీంద్రా స్కార్పియో అమ్మకాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ప్రారంభం నుంచి గత నెల వరకు కంపెనీ 10 లక్షల కంటే ఎక్కువ కార్లను విక్రయించి.. విక్రయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. ప్రారంభంలో కంపెనీ స్కార్పియో కార్లను మాత్రమే విక్రయించింది. 2022లో కంపెనీ స్కార్పియో ఎన్ లాంచ్ చేసింది. ఈ మోడల్ కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది.మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇవి మల్టిపుల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పనితీరుపరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ అందించాయి. ఇవన్నీ ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో సహాయపడ్డాయి. -
మహీంద్రా ఫైనాన్స్ సీఆర్ఓగా 'మహేష్ రాజారామన్'
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ మంగళవారం కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా 'మహేష్ రాజారామన్'ను నియమించినట్లు ప్రకటించింది. మల్లికా మిట్టల్ తన పదవికి రాజీనామాను చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.సీఆర్ఓగా 5 సంవత్సరాల కాలానికి నియమితులైన రాజారామన్, బ్యాంకింగ్ రంగంలో 29 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. టీమ్ను ముందుకు నడిపించడంలో అనుభవం ఉందని.. సంస్థ ఈయన సారథ్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది.రాజారామన్ యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రైండ్లేస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈయన 2024 ఆగష్టు 1నుంచి చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో రాబోయే 6 సంవత్సరాల్లో ఏకంగా 16 కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2030 నాటికి 9 ఫ్యూయెల్ కార్లు, 7 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని సంస్థ యోచిస్తోంది.కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడంతో పాటు తన వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి యోచిస్తోంది. దీనికోసం మహీంద్రా రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. కంపెనీ ప్యాసింజర్ వాహనాలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలను విడుదల చేస్తూ దేశీయ విఫణిలో, గ్లోబల్ మార్కెట్లో కూడా దూసుకెళ్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL)లో కంపెనీ ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించనుంది.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ 10000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంఖ్య FY2026 నాటికి 18000 చేరే అవకాశం ఉంది. కాగా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి FY2025 చివరి త్రైమాసికం నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. -
రూ.12000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన మహీంద్రా: ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ విభాగంలో భారీ పెట్టుబడులను పెట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ తరుణంలో దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఏకంగా రూ. 12000 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పెట్టుబడిన పెట్టింది. 2027 నాటికి మహీంద్రా ఆరు బ్యాటరీతో నడిచే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్దికి వేలకోట్ల పెట్టుబడి పెట్టడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ భారీగా పెరిగాయి.UK ఆధారిత కంపెనీ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (BII) 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, Temasek మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL) లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అంగీకరించిన కాలక్రమం ప్రకారం మిగిలిన రూ.900 కోట్లను టెమాసెక్ పెట్టుబడి పెడుతుందని కంపెనీ తెలిపింది. -
బుకింగ్స్లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం
గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024 -
మహీంద్రా ఫైనాన్స్లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్కి అనుగుణంగా కొత్త మోడల్స్పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
ఆటోమొబైల్ రంగంలో మరో కీలక పరిణామం
వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్వ్యాగన్ గ్రూప్, భారత్కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా భవిష్యత్తులో తేబోయే ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన విడిభాగాలను ఫోక్స్వ్యాగన్ సరఫరా చేయనుంది. ఫోక్స్వ్యాగన్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ సెల్ కాన్సెప్ట్ను మహీంద్రా తన ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ అయిన ఇంగ్లో కోసం వినియోగించనుంది. ఇంగ్లో ప్లాట్ఫామ్పై అయిదు పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీలను మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. తొలి మోడల్ 2024 డిసెంబర్లో అడుగు పెట్టనుంది. -
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ400 ప్రో రేంజ్ను మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ఇటీవల విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్యూవీ400కి అప్డేటెడ్ వెర్షన్గా తీసుకొచ్చిన దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి ఈసీ ప్రో (EC Pro), రెండు ఈఎల్ ప్రో (EL Pro) వర్షన్లు. మార్పుల విషయానికొస్తే, కొత్త వెర్షన్ల క్యాబిన్ రీడిజైన్ చేసిన డాష్బోర్డ్తో కొత్త బ్లాక్ అండ్ గ్రే ట్రీట్మెంట్తో వస్తోంది. కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఈఎల్ ప్రో వేరియంట్లో ఫ్లోటింగ్ 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్కాన్ ప్యానెల్, రియర్ టైప్-సీ USB ఉన్నాయి. పోర్ట్, వెనుక మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 34.5kWh బ్యాటరీ ప్యాక్ ఒక్క సారి చార్జ్ చేస్తే 375 కిమీల డ్రైవింగ్ రేంజ్ను ఇస్తుందని, 39.4kWh యూనిట్ 456కిమీల డ్రైవింగ్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 నుంచి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది. -
ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు.. ఇవే!
2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్లిఫ్ట్ 2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఫేస్లిఫ్ట్ భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఎక్స్యువీ300 ఫేస్లిఫ్ట్ మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్యువీ300 కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్లిఫ్ట్ జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరను పొందిన 'మహీంద్రా థార్' (MahindraThar) 5 డోర్ వేరియంట్ రూపంలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కారు పేరుని మార్చున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ SUV కొత్త పేరు కోసం ట్రేడ్మార్క్ దాఖలు చేసింది. ఇందులో 'సెంచూరియన్, కల్ట్, గ్లాడియస్, రెక్స్, రోక్స్, సవన్నా, ఆర్మడ' అనే ఏడు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 'ఆర్మడ' అనేది మహీంద్రా కంపెనీకి చెందిన 1993 నుంచి 2001 మధ్య అమ్ముడైన కారు అని తెలుస్తోంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ దాని 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ పరంగా 3 డోర్ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. థార్ 5 డోర్ SUV టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్రూఫ్, రియర్ పార్కింగ్ కెమెరా, పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ వంటి వాటితో పాటు ADAS వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇంజిన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2024లో లాంచ్ అవుతుందని సమాచారం, అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. ధరలు, బుకింగ్స్ వంటి వివరాలతో పాటు డెలివరీలకు సంబంధించిన విషయాలు కూడా లాంచ్ సమయంలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్రాండ్ డీలర్షిప్ ఎలా ఉందో చూసారా.. (వీడియో)
Mahindra Dealership In Austrelia: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' కుమార్తె 'గ్రేస్ హేడెన్' ఇండియన్ బ్రాండ్ కారుని ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసింది. కారు డెలివరీకి సంబంధించిన వీడియోను 'మహీంద్రా ఆస్ట్రేలియా' తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇందులో మహీంద్రా డీలర్షిప్ ఆస్ట్రేలియాలో ఎలా ఉందనేది స్పష్టంగా చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా సంస్థ కార్లు, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అక్కడ ఇండియన్ బ్రాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉన్న కారణంగానే ఈ ఎగుమతులు జరుగుతాయి. ఇటీవల గ్రేస్ భారతదేశానికి వచ్చినప్పుడు మహీంద్రా తయారీ కర్మాగారాన్ని సందర్శించే అవకాశం లభించిందని, అక్కడే మహీంద్రా కార్లు ఎలా తయారవుతాయనేది చూసినట్లు ఆమె వెల్లడించింది. ఆ తరువాత తాను మహీంద్రా XUV700 కారుని కొనుగోలు చేయాలనుకుని.. ఆస్ట్రేలియాలోని కంపెనీ డీలర్షిప్ వద్ద డెలివరీ తీసుకుంది. యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోలో గ్రేస్ డీలర్షిప్ సందర్శించడం, అక్కడ తనకు నచ్చిన మిడ్నైట్ బ్లాక్ షేడ్లోని XUV700 డెలివరీ తీసుకోవడం వంటివి చూడవచ్చు. ఈ డీలర్షిప్ లోపల ఇతర కార్లు కూడా ఉండటం చూడవచ్చు. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం చూస్తుంటే ఓ కొత్త ఎనర్జీ వస్తుందని ట్వీట్ చేశారు. ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. వేలమంది వీక్షించిన వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Very few things in business more energizing than seeing your brand expand globally… pic.twitter.com/3S5rijDbvS — anand mahindra (@anandmahindra) December 10, 2023 -
ఫిక్కీ అధ్యక్షుడిగా అనిష్ షా
ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అధ్యక్షుడిగా మహీంద్రా గ్రూప్ సీఈవో, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిష్ షా బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 96వ వార్షికోత్సవంలో ప్రస్తుత అధ్యక్షుడు సుభ్రకాంత్ పాండా నుంచి 2023-2024 సంవత్సరానికి గానూ అనిష్ షా బాధ్యతలు చేపట్టారు. ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్గా ఉన్న అనిష్ షా యూకే ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ సభ్యుడిగానూ ఉన్నారు. దీంతోపాటు ఆటోమోటివ్ గవర్నర్స్ కౌన్సిల్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) అధ్యక్షుడిగా, ఇండియా అలయన్స్ ఆఫ్ సీఈవోస్ ఫర్ క్లైమేట్ చేంజ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్), ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో కౌన్సిల్లకు అనిష్ షా సహ అధ్యక్షుడిగా ఉన్నట్లు ఫిక్కీ ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా గ్రూప్ కంటే ముందు అనిష్ షా 2009-14 వరకు జీఈ క్యాపిటల్ ఇండియాకు ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేశారు. ఇక్కడ 14 సంవత్సరాలు పనిచేసిన ఆయన జీఈ క్యాపిటల్ యూఎస్, గ్లోబల్ యూనిట్లలో అనేక నాయకత్వ స్థానాలను నిర్వహించారు. అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్ డెబిట్ ఉత్పత్తుల వ్యాపారానికి నాయకత్వం వహించారు. ఇక బోస్టన్, ముంబైలోని సిటీ బ్యాంక్లో బైన్ అండ్ కంపెనీతో కలిసి పనిచేశారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన అనిష్ షా.. కార్నెగీ మెల్లన్స్ టెప్పర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. -
సామర్థ్యం పెంచుకోనున్న మహీంద్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2.86 లక్షల యూనిట్ల ఆర్డర్ బుక్. 2024లో రానున్న కొత్త మోడళ్లు. వెరశి సామర్థ్యం పెంచుకోవడంపై వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దృష్టిసారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలకు 55,000 యూనిట్ల స్థాయికి తయారీని చేర్చే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన పెట్టుబడి ప్రణాళికను 3–6 నెలల్లో మహీంద్రా ప్రకటించనుంది. ప్రధానంగా ఈవీ విభాగంలో ఈ పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మహీంద్రా ఇప్పటికే 2021–22 నుంచి 2023–24 మధ్య రూ.10,000 కోట్లు వెచి్చస్తోంది. 2024 మార్చి నాటికి నెలకు అన్ని విభాగాల్లో కలిపి 49,000 యూనిట్ల తయారీ సామర్థ్యానికి చేరుకోవాలి సంస్థ ఇప్పటికే లక్ష్యం విధించుకుంది. అయిదు డోర్ల థార్, కొత్త ఈవీ మోడళ్లు రానుండడంతో 49,000 యూనిట్ల స్థాయికి మించి తయారీ సామర్థ్యం ఉండాలన్నది కంపెనీ భావన. థార్, ఎక్స్యూవీ 700, స్కారి్పయో మోడళ్లకు బలమైన డిమాండ్తో గడిచిన అయిదేళ్లలో దాదాపు రెండింతలకుపైగా సామర్థ్యం పెంచుకుంది. రెండవ స్థానంలో మహీంద్రా.. ఇక వచ్చే 12 నెలల్లో ఎక్స్యూవీ 400, ఎక్స్యూవీ 300 ఫేస్లిఫ్ట్ మోడళ్లు సైతం రానున్నాయి. బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా కొన్ని మాసాలుగా సగటున నెలకు 51,000 యూనిట్ల స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. నవంబర్ 1 నాటికి ఉన్న ఆర్డర్ బుక్ ప్రకారం ఎక్స్యూవీ 300, ఎక్స్యూవీ 400 మోడళ్లకు 10,000 యూనిట్లు, ఎక్స్యూవీ 700 కోసం 70,000, థార్ 76,000, బొలెరో 11,000, క్లాసిక్ వేరియంట్తో కలిపి స్కారి్పయో–ఎన్ 1,19,000 యూనిట్లు కస్టమర్లకు చేరాల్సి ఉంది. 2023 జూలై–సెపె్టంబర్ మధ్య దేశవ్యాప్తంగా మహీంద్రా ఎస్యూవీలు 1,14,742 యూనిట్లు రోడ్డెక్కాయి. పరిమాణం పరంగా అయిదు త్రైమాసికాలుగా ఎస్యూవీల అమ్మకాల్లో మహీంద్రా రెండవ స్థానంలో నిలిచింది. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
మహీంద్రా బోర్డు డైరెక్టర్ పదవికి సీపీ గుర్నానీ రాజీనామా!
సీపీ గుర్నానీ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్ర తెలిపింది. గుర్నానీ రాజీనామాను కంపెనీ బోర్డు సమావేశంలో చర్చలు జరిగినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఈ సందర్భంగా డిసెంబర్ 20, 2023 నుంచి టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా పదవీ విరమణ చేస్తున్నాను. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డు డైరెక్టర్ పదవి నుంచి వైదొలుగుతున్నాను' అని గుర్నానీ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘నేను ఈ బోర్డులో మూడేళ్లకు పైగా పనిచేశాను. ఈ సమయంలో నా తోటి బోర్డు సభ్యులు, ఎం అండ్ ఎం మేనేజ్ మెంట్ టీమ్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని గుర్నానీ తన లేఖలో చెప్పారు. ఉచితంగా స్పెక్ట్రమ్ ప్రైవేట్ 5జీ నెట్వర్క్ ఏర్పాటుకు టెక్నాలజీ కంపెనీలకు ఉచిత స్పెక్ట్రమ్ కేటాయించాలని, ఇది దేశ ఆత్మనిర్భరతను పెంచుతుందని, ప్రపంచ రంగంలో భారత పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని గుర్నానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
మహీంద్రా నుంచి ‘జీతో స్ట్రాంగ్’ వాహనం.. ధర ఎంతంటే?
బెంగళూరు: మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎంఎల్ఎంఎంఎల్) కొత్తగా సరకు రవాణా కోసం ’జీతో స్ట్రాంగ్’ వాహనాన్ని ప్రవేశపెట్టింది. జీతో ప్లస్ వాహనానికి కొనసాగింపుగా మరింత ఎక్కువ పేలోడ్ సామర్థ్యం, మరిన్ని ఫీచర్లతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు. వెర్షన్ను బట్టి (డీజిల్, సీఎన్జీ) దీని ధర రూ. 5.28 లక్షల నుంచి రూ. 5.55 లక్షల వరకు (పుణె ఎక్స్–షోరూం) ఉంటుంది. డీజిల్ వెర్షన్లో పేలోడ్ సామర్థ్యం 815 కేజీలుగాను, లీటరుకు 32 కి.మీ. మైలేజీ ఉంటుంది. సీఎన్జీ వెర్షన్ పేలోడ్ సామర్థ్యం 750 కేజీలుగా, మైలేజీ 35 కి.మీ.గా ఉంటుంది. మూడేళ్లు లేదా 72,000 కి.మీ. వారంటీ, అలా గే డ్రైవరుకు ఉచితంగా రూ. 10 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
మహీంద్రా కార్ల అమ్మకాల జోరు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ వాహన విక్రయాల్లో వృద్దిని నమోదు చేసింది. అక్టోబర్ నెలలో మహీంద్రా మొత్తం 43,708 ఎస్యూవీ వెహికల్స్ను అమ్మింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35శాతం వృద్దిని సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 32,298 యూనిట్లను విక్రయించింది. 1,854 యూనిట్ల ఎస్యూవీలను ఎగుమతి చేయగా.. 25,715 యూనిట్ల వాణిజ్య వాహనాలను అమ్మనిట్లు తెలిపింది ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. ‘అక్టోబర్లో 32 శాతం వృద్ధితో 679,32 వాహనాలతో అత్యధిక అమ్మకాలు జరిపాం. వరుసగా మూడో నెలలో ఎస్యూవీలు 43,708, సీవీలు 25,715 వాహనాలతో హై వాల్యూమ్లు సాధించాయి.’అని అన్నారు. కాగా, మహీంద్రా 2026 నాటికి ఐదు డోర్ల ఎలక్ట్రిక్ ఎస్యూవీని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈవీ ఎస్యూవీలో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో రానుంది. -
గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా
దేశీయ ఐఐటీ గ్రాడ్యుయేట్లు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీలను లీడ్ చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణకు నాంది పలుకు తున్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు మెకానికల్ ఇంజనీరింగ్, డిజైనింగ్ రంగాల్లో సత్తా చాటుతున్నారు. కొత్త మహీంద్రా థార్ను డిజైన్ చేసిన మహిళ, BITS పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ రామ్కృపా అనంతన్ విశేషంగా నిలుస్తున్నారు. ఆటోమోటివ్ పరిశ్రమలో రామ్కృపా అనంతన్ పేరు తెలియని వారు లేరు అతిశయోక్తి కాదు.ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్లో డిజైన్ హెడ్గా స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తున్నారు. అంతేకాదు సొంత డిజైన్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్న రామ్ కృపా అనంతన్ గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్ర అండ్ లేటెస్ట్ వాహనాల్లో థార్ SUVకున్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి అంతటి ప్రజాదరణ ఉన్న థార్ 2వ తరం థార్ ఆవిష్కారం వెనుక చీఫ్ డిజైనర్ రామ్ కృపా. పాపులర్ బొలెరో, మహీంద్రా SUV విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఆమెదే. థార్, XUV700, స్కార్పియోలాంటి మహీంద్రా ఉత్పత్తులకు చీఫ్ డిజైనర్ గా తన సత్తా చాటుకున్నారు. ఎవరీ రామ్ కృపా అనంతన్ బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ , ఐఐటీ బాంబే నుంచి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో మహీంద్రా అండ్ మహీంద్రాలో ఇంటీరియర్ డిజైనర్గా కరియర్ను మొదలు పెట్టారు. 2005లో డిజైన్ హెడ్గా మహీంద్రా XUV 500 SUVని డిజైన్ చేసిన క్రెడిట్ దక్కించుకున్నారు.అలాగే XUV 700, స్కార్పియో ఐకానిక్ డిజైన్లను రూపకల్పన చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, రామ్కృపా అనంతన్ చీఫ్ డిజైనర్ పాత్రకు పదోన్నతి పొందారు. క్రక్స్ స్టూడియో, మైక్రో ఈవీ కాన్సెప్ట్ రెండేళ్ల తరువాత ప్రస్తుతం ఆమె సొంతంగా KRUX డిజైన్ స్టూడియో స్థాపించారు. 20 శాతం అప్సైకిల్ భాగాలను ఉపయోగించి Two 2 అనే మైక్రో-మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. చిన్న బ్యాటరీతో కూడా ఎక్కువ పరిధినిస్తుంది. 'ఓలా ఎలక్ట్రిక్'లో కృపా అనంతన్ దేశీయ ఈవీ మేకర్ బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఎలక్ట్రిక్ కారు ‘ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ను విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 నుండి రూ. 25 లక్షల శ్రేణిలో ఉంటుందని అంచనా. గత ఏడాది ఆగస్టులో రామకృపా అనంతన్ ఓలా ఎలక్ట్రిక్స్లో డిజైన్ హెడ్గా చేరారు. ద్విచక్ర వాహనం , రాబోయే నాలుగు-చక్రాల విభాగాలకు ఆమె లీడ్గా ఉన్నారు. -
ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు: కంపెనీ క్లారిటీ ఇది
తన కుమారుడికి మరణానికి కారణమంటూ ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలైన కేసుపై సంస్థ స్పందించింది. మృతుడు నడిపిన స్కార్పియో వాహనంలోని ఎయిర్బ్యాగ్స్లో ఎలాంటి లోపం లేదంటూ ఆరోపణలను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 23, 2023న దాఖలైన ఎఫ్ఐఆర్కు సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ప్రకటన జారీ చేసింది. దాదాపు రూ. 20 లక్షల ఖరీదు చేసే కారులో భద్రతా ఫీచర్లపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. సంబంధిత కారులో ఎయిర్బ్యాగులు ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే వాహనం బోల్తా పడిన కారణంగా కారులో ఎయిర్బ్యాగ్లు ఓపెన్ కాలేదని తెలిపింది.అంతేకాదు ఈ కేసు 18 నెలలకు పైగా పాతది ఈ సంఘటన జనవరి 2022లో జరిగిందని తెలిపింది. 2020లో తయారైన స్కార్పియో S9 వేరియంట్లో ఎయిర్బ్యాగ్లు ఉన్నాయని ధృవీకరింకరించింది. తమ పరిశీలనలో ఎయిర్బ్యాగ్ల లోపం లేదని తేలిందని వాహనం బోల్తా పడినపుడు ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కావని తెలిపింది. దీనిపై గత ఏడాది అక్టోబర్లో తమ టీం వివరణాత్మక సాంకేతిక పరిశోధన నిర్వహించినట్టు కూడా తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది, విచారణకు తాము పూర్తి సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. కాగా ఉత్తరప్రదేశ్కి చెందిన రాజేష్ మిశ్రా ఫిర్యాదు మేరకు మిశ్రా తన కుమారుడు అపూర్వ్కు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్లాక్ స్కార్పియో కారును బహుమతిగా ఇచ్చారు. 2022 జనవరి 14న అపూర్వ్ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లనే తనకు తీరని నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదు చేశారు.కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్ మహీంద్రాతో పాటు, ఇతర కీలక ఉద్యోగులపై చీటింగ్ కేసు, 506 (నేరపూరిత బెదిరింపు), 102-B (నేరపూరిత బెదిరింపు)కేసులుపెట్టిన సంగతితెలిసిందే. -
India-canada Row: కెనడాకు మరో భారీ ఎదురు దెబ్బ?
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దౌత్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెనడాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కెనడా తీరును తప్పుబడుతూ కెనడాలో భారత్కు చెందిన కంపెనీలు తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కెనడాలో తన అనుబంధ సంస్థ రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ను షట్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, మహీంద్రా దారిలో భారత్లోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్ ఉక్కు తయారీ సంస్థగా పేరొందిన జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ సంస్థ కెనడాకు చెందిన ఉక్కు కంపెనీతో కొనసాగిస్తున్న వ్యాపార సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎస్డబ్ల్యూ స్టీల్ - టెస్క్ రిసోర్సెస్ ఢీల్కు బ్రేకులు ఉక్కు తయారీ సంస్థ జేఎస్డబ్ల్యూ స్టీల్ కెనడాకు చెందిన మైనింగ్ కంపెనీ టెస్క్ రిసోర్సెస్ (Teck Resources)కు చెందిన స్టీల్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఎల్క్ వ్యాలీ రిసోర్సెస్ లిమిటెడ్లో 20 శాతం నుంచి 40 శాతం వాటాను కొనుగోలు చేయాలని గత నెలలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ భావించారు. ఆ కొనుగోలు విలువ సుమారు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ క్రమంలో కెనడా తీరును తప్పుబడుతూ టెస్క్ కంపెనీలోని వాటాను కొనుగోలు చేసే అంశంపై జేఎస్డబ్ల్యూ వెనక్కి తగ్గినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. దీంతో కెనడాకు వాణిజ్య పరంగా మరింత ఆర్ధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కెనడా ఆర్ధిక వ్యవస్థగా అండగా భారత్ విద్యార్ధులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కెనడాలో మొత్తం విదేశీయులు 3,21,00,340 మంది ఉన్నారు. వారిలో భారతీయ పౌరులు 5.26 శాతం మంది నివసిస్తున్నారు. పైగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువ భాగం అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులపై ఆధారపడి ఉంది. పలు నివేదికల ప్రకారం.. ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ విద్యార్థులు భారీ ఎత్తున ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారు. ఆ ఫీజుల రూపంలో కెనడియన్ ఆర్థిక వ్యవస్థకు 30 బిలియన్లు అందిస్తున్నారు. ఇందులో భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజుల వాటా ఎక్కువగా ఉంది. అందువల్ల, భారతీయ విద్యార్థులు అక్కడికి వెళ్లడం మానేస్తే కెనడా మరో రూపంలో ఇబ్బందులు పడనుంది. కెనడా పౌరులకు ఇబ్బందే దానికి తోడు కెనడాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ టెక్ కంపెనీలతో మొత్తం 30 సంస్థలు కెనడాలో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ కంపెనీల వల్ల కెనడాలోని పౌరులకు ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బ తినే అవకాశం ఉందని ఆయా పరిశ్రమ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి : పాపం టెక్కీ, 2 నిమిషాలు హిందీలో మాట్లాడితే ఉద్యోగం పోయింది! -
ఎంఅండ్ఎం అనుబంధ కెనడియన్ సంస్థ మూసివేత
న్యూఢిల్లీ: కెనడాలోని తమ అనుబంధ సంస్థ రెసాన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ మూతబడిందని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వెల్లడించింది. రెసాన్ స్వచ్ఛందంగా మూసివేతకు దరఖాస్తు చేసుకోగా కార్పొరేషన్స్ కెనడా నుంచి అనుమతులు లభించినట్లు తెలిపింది. కంపెనీ లిక్విడేషన్తో అందులో తమకున్న 11.18 శాతం వాటా ప్రకారం 4.7 మిలియన్ కెనడియన్ డాలర్లు (సుమారు రూ. 28.7 కోట్లు) లభించగలవని ఎంఅండ్ఎం తెలిపింది. -
మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే!
మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈయన చేసిన మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ ఈవీ డే సందర్భంగా ఆనంద్ మహీంద్రా బిజిలీ (BIJLEE) అనే త్రీ వీలర్ వెహికల్ ఫోటోను X (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇందులో ఇది నన్ను గతంలోకి నడిపించింది. తన పదవి విరమణకు ముందు కంపెనీలో అనుభవజ్ఞుడైన నాగర్కర్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ రూపొందించాడని చెప్పుకొచ్చాడు. నిజానికి మహీంద్రా కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ 'బిజిలీ' (BIJLEE). 1999లో నాగర్కర్ రిటైర్మెంట్కి ముందు ఆయన మాకు అందించిన బహుమతి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలమంది లైక్ చేయగా, కొందరు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! బిజిలీ ఈవీ మార్కెట్లో విక్రయానికి రానప్పటికీ.. ప్రస్తుతం మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ఈ విభాగంలో తిరుగులేని అమ్మకాలను పొందుతూ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. కాగా కంపెనీ థార్ SUVని కూడా త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Today is #WorldEVDay And it has propelled me back into the past. 1999 to be precise, when a stalwart of @MahindraRise Mr. Nagarkar, created our first ever EV—the 3 wheeler BIJLEE. It was his gift to us before retirement. I’ll never forget his words then: He wanted to do something… pic.twitter.com/f9KIXr1lkp — anand mahindra (@anandmahindra) September 9, 2023 -
డిస్నీ స్టార్లో క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్గా మహీంద్రా
న్యూఢిల్లీ: డిస్నీప్లస్ హాట్స్టార్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ల ప్రసారానికి అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్లు ఆటోమేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఒక ప్రకటనలో తెలిపింది. కీలక టార్గెట్ మార్కెట్లలోని వినియోగదారుల దృష్టిలో పడేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ వివరించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ కోసం మహీంద్రా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎస్యూవీలు, ట్రాక్టర్ బ్రాండ్లకు..భారతీయ క్రికెట్ స్ఫూర్తికి మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని సంస్థ ఈడీ రాజేశ్ జెజూరికర్ చెప్పారు. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. -
క్రికెట్ వరల్డ్ కప్ స్పాన్సర్గా మహీంద్రా
దేశీయ కార్పొరేట్ దిగ్గజం మహీంద్రా క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. త్వరలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్కప్-2023 కోసం స్టార్ స్పోర్ట్స్తో కలిసి అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్కు కో పవర్డ్ స్పాన్సర్గా పని చేయనుంది. క్రికెట్తో తమకున్న అనుబంధాన్ని విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా సంస్థ వెల్లడించింది. కాగా, మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ మరియు ఫార్మింగ్ సెక్టార్లలో అగ్రగామిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్కప్-2023 ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్కప్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో క్రికెట్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అంతకుముందే భారత్.. చెన్నైలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది (అక్టోబర్ 8న). ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్, 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంక, నవంబర్ 5న సౌతాఫ్రికా, 12న నెదర్లాండ్స్తో తలపడనుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్తో వరల్డ్కప్ ముగియనుంది. -
ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్
ఫిడే వరల్డ్ కప్లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్కు ముప్పు తిప్పలు పెట్టిన భారత గ్రాండ్ మాస్టర్ 18 ఏళ్ల ప్రజ్ఞానంద్ తల్లి దండ్రులకు తీపి కబురు అందించారు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర. సాధారణంగా క్రీడల్లొ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన స్పెషల్ ఎడిషన్ కార్లను ఇవ్వడం ఆయనకు అలవాటు. తాజాగా ప్రజ్ఞానంద విషయంలో మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఒక యూజర్ సలహాకు స్పందిస్తూ చాలా మంది, ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని కోరుతున్నారు. కానీ బుర్రలో మరో ఆలోచన ఉంది అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు పనిలో పనిగా తల్లిదండ్రులు ఒక చక్కటి సలహా కూడా ఇచ్చాడు. వీడియో గేమ్లకు బదులుగా మేథస్సును పెంచే తమ పిల్లలకు చెస్ ఆటను నేర్పించాలనే సలహా ఇచ్చారు.ఈ నేపథ్యంలో తమ కుమారుడిని చిన్నప్నటినుంచి చదరంగం క్రీడలో ప్రోత్సహించి, ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా, ప్రోత్సాహకంగా ప్రజ్ఞానంద పేరేంట్స్కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. (రిలయన్స్ ఏజీఎం: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా) అలా వారి ప్రోత్సాహంతో ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి రమేష్బాబు గౌరవించనున్నారు. ఈ దంపతులకు మహీంద్ర XUV4OO EVని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి పరి శీలించాల్సిందిగా కంపెనీకి చెందిన రాజేష్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో తక్షణమే స్పందించిన రాజేష్ త్వరలోనే ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400 ప్రత్యేక ఎడిషన్ అందించనున్నట్టు వెల్లడించారు. దీంతో నెటిజన్లు అమేజింగ్ సార్ అంటూ ఆనంద్ మహీంద్రను ప్రశంసించారు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని, ఫైనల్లో పోరాడిన ఓడి ప్రజ్ఞానందను అభినందించారు. కాగా తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్బాబు ప్రజ్ఞానంద చిన్న వయసు నుంచి చెస్లో రాణిస్తూ చెస్ సంచలనంగా మారి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. (గోల్డెన్ బోయ్ నీరజ్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా? ) Congratulations @rpragchess for your spectacular achievement.Thanks @anandmahindra for the idea of recognising PARENTS of @rpragchess Shrimati Nagalakshmi & Shri Rameshbabu.The All Electric SUV XUV400 would be perfect-our team will connect for a special edition and delivery — Rajesh Jejurikar (@rajesh664) August 28, 2023 -
‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ఎక్స్యూవీ 400 కారును దాని యజమాని గార్బేజ్ బాక్స్ (చెత్త డబ్బా)గా మార్చాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా.. ప్రస్తుతం, ఈ అంశం చర్చాంశనీయంగా మారింది. మహీంద్రా సంస్థ ఈ ఏడాది జనవరిలో తొలి ఎలక్ట్రిక్ వెహికల్ మహీంద్రా ఎక్స్యూవీ 400ని విడుదల చేసింది. ఆ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తికి మహీంద్రా సంస్థ అన్నా, ఆ కంపెనీ అమ్మే కార్లన్నా మహా ఇష్టం. అందుకే ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ కారు విడుదలైందో లేదో వెంటనే కొనేశాడు. అయితే, తాను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన కారు విషయంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. మహీంద్రా కంపెనీ కారు రేంజ్ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తూ ఎక్స్యూవీ 400ను ఘజియాబాద్ మహీంద్రా కారు షోరూం ఎదుట కారుకు ఓ ఫ్లెక్సీ కట్టి చెత్తడబ్బాగా మార్చాడు. ఈ సందర్భంగా, ‘ఎలక్ట్రిక్ XUV400ను కొనుగోలు చేయడం మీ సొంత ఇంటిని మీరు తగటబెట్టుకున్నట్లే. ఇంట్లో కారుకి ఛార్జింగ్ పెట్టాలంటే కస్టమర్ల ఇంట్లో 10 kW కనెక్షన్ అవసరం. ఆసక్తి ఉన్నవారు బయట ఛార్జ్ పెట్టుకోవాలంటే రూ. 1,000 ఖర్చవుతుంది. ఈ ధర వేరియంట్లో కారు రేంజ్ కేవలం 150 కిలోమీటర్లే. కంపెనీ మాత్రం కారు రేంజ్ 300 నుండి 350 కిలోమీటర్ల ఉంటుందని ప్రచారం చేసుకుంటుంది. మహీంద్రా కారు డీలర్ సంస్థ శివ మహీంద్రా సిగ్గుపడాలి’ అంటూ పోస్టర్పై రాశారు. అంతేకాదు దేశీయ మార్కెట్లో సత్తా చాటుతున్న ఈ కారును కొనుగోలు చేయొద్దని వాహనదారుల్ని కోరుతున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు సైతం ఎక్స్యూవీ400కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. సదరు వాహన యజమాని మంచి పనిచేస్తున్నారని మద్దతు పలుకుతుంటే.. మరికొందరు మాత్రం కారును సరైన పద్దతిలో వినియోగించాలని సూచిస్తున్నారు. చదవండి👉 మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి? -
మహీంద్రా కీలక నిర్ణయం..ఎక్స్యూవీ 700 కార్లను వెనక్కి ఇచ్చేయండి
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్యూవీ 700 కార్ల ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్లో లోపాల్ని గుర్తించింది. వెంటనే ఈ సమస్య ఉన్న కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, 2021 జూన్ 8 నుంచి 2023 జూన్ 28 మధ్య తయారైన మొత్తం 1,08,306 కార్లలో ఈ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్యూవీ 700తో పాటు, ఎక్స్యూవీ 400 ఎస్యూవీలను సైతం రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్ 5 మధ్య తయారైన 3,560 కార్లలో బ్రేక్ పొటెన్షియోమీటర్లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్లో లోపాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కార్లను సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కార్లలో సమస్యల్ని గుర్తించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా బాగు చేసి కస్టమర్లకు అందిస్తామని స్పష్టం చేసింది. -
మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి?
ఆనంద్ మహీంద్రా! పరిచయం అక్కర్లేని పేరు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా..స్ఫూర్తిదాయక కథనాలతో పాటు సమకాలీన సంఘటనలపై నిత్యం స్పందిస్తుంటారు. యూజర్లు వేసే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలో..ఆయన ఛైర్మన్గా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ గురించి ఓ ఆసక్తిర విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలకుల్ని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. అదే ఏడాది జూన్ 3న భారత్ - పాక్లు వేరయ్యాయి. దీంతో కలిసి ఉన్నప్పుడు స్థాపించిన అనేక సంస్థలు విడిపోయాయి. అలాంటి వాటిల్లో మహీంద్రా అండ్ మహమ్మద్ కంపెనీ ఒకటి. ఇప్పుడు ఆ సంస్థే మహీంద్రా అండ్ మహీంద్రాగా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటీష్ ఇండియాలో 1945లో పంజాబ్లోని లూథియానాలో మహీంద్రా - ముహమ్మద్ సంస్థగా ప్రారంభమైంది. ఆనంద్ మహీంద్రా తాతా కైలాష్ చంద్ర మహీంద్రా, అతని సోదరుడు జగదీష్ చంద్ర మహీంద్రా.. మాలిక్ గులాం ముహమ్మద్తో కలిసి స్టీల్ ట్రేడింగ్ కంపెనీని స్థాపించారు. కంపెనీ బొంబాయిలో విల్లీస్ జీపులను తయారు చేసేది. మాలిక్ గులాం మహమ్మద్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారు. రెండేళ్ల తర్వాత విభజన జరగడం, మహమ్మద్ ఎం అండ్ ఎంలో తన వాటాను తీసుకొని పాకిస్తాన్కు వలస వెళ్ళాడు. రాజకీయ నాయకుడిగా పాక్ తొలి ఆర్థిక మంత్రిగా పనిచేయకముందు, మహీంద్రా అండ్ మహ్మద్ స్థాపించకముందే మహ్మద్ మాలిక్ గులాం రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. భోపాల్ రాష్ట్ర నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ నిజాంకు సలహాదారుగా పనిచేశాడు. యుద్ధ సమయంలో అతని సేవలను బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించింది. ఒక అకౌంటెంట్, బ్యూరోక్రాట్, పారిశ్రామికవేత్తగా కంటే, ముహమ్మద్ తన రాజకీయ చాతుర్యానికి ప్రసిద్ధి చెందాడు. అతను రాజ్యాన్ని, దాని సంస్థలను నాశనం చేయడానికి, సైన్యాన్ని ప్రోత్సహించడానికి బాధ్యత వహించిన పాకిస్తాన్లోని ప్రారంభ నాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అయినప్పటికీ అతను ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా మొదటి పంచవర్ష ప్రణాళికతో ఘనత పొందాడు. విభజనకు ముందు బ్రిటీష్ ఇండియాలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాలిక్ గులాం ముహమ్మద్ ఖాన్తో క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారు. అలా మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ పాక్ దేశానికి తొలి ఆర్ధిక మంత్రిని అందించడం విశేషం. -
అదిరిపోయే లుక్లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్
Mahindra Thar.e మహీంద్రా అండ్ మహీంద్ర పాపులర్ ఎస్యూవీ థార్ ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ ఫ్యాన్స్కు విపరీతంగా నచ్చేస్తోంది. 'థార్-ఇ' పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్ను దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్స్కేప్ ఈవెంట్లో మహీంద్ర రివీల్ చేసింది. అదిరిపోయే మిలిటరీ-గ్రేడ్ లుక్, ఫీచర్స్తో సరికొత్తగా భారీ క్రేజ్ సంపాదిస్తోంది. దీని ఫీచర్స్ స్పెషాలిటీస్, లుక్ మాత్రం ప్రస్తుత థార్కి భిన్నంగా బాక్సీ లుక్లో చాలా స్టయిలిష్గా ఉంది. 'థార్-ఇ' ఆకట్టుకంటోంది. ఈ వెహికల్లో 400 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్ని అమర్చనుంది. INGLO ప్లాట్ఫారమ్ ఎలక్ట్రిక్ రేంజ్ పరంగా చాలా అనుకూలంగా ఉండనుదని భావిస్తున్నారు. హార్డ్కోర్ ఆఫ్-రోడర్ కి అనుకూలంగా ఆల్ వీల్ డ్రైవ్, డబుల్ మోటార్ లేఅవుట్తో వస్తుంది.కొత్త LED లైటింగ్ ఎలిమెంట్స్, గ్రిల్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రియర్ ప్రొఫైల్లు గ్రే-కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇచ్చింది. ఇంటీరియర్ ఫీచర్లను పరిశీలిస్తే.. అద్భుతమైన టచ్స్క్రీన్ కోసం రెండు స్క్రీన్లను అందిస్తోంది. థార్-ఇ ఉత్పత్తిని 2026లో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇక ధర విషయానికి వస్తే 20-25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. -
2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి.. మహీంద్రా అండ్ మహీంద్రా లక్ష్యం
కేప్టౌన్ (దక్షిణాఫ్రికా): మహారాష్ట్రలోని చకాన్లో నెలకొల్పుతున్న ప్లాంటు నుంచి వార్షికంగా 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని సాధించాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నిర్దేశించుకుంది. 2027–29 మధ్య కాలంలో దీన్ని సాధించగలమని సంస్థ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) వీజే నక్రా తెలిపారు. 2030 నాటికల్లా తమ మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. బీఈ శ్రేణిలో తొలి వాహనాన్ని వచ్చే ఏడాది ఆఖర్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతకన్నా 4–5 నెలల ముందు నుంచే చకాన్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కాగలదని నక్రా వివరించారు. చకాన్లో రూ. 10,000 కోట్లతో విద్యుత్ వాహనాల ప్లాంటును నెలకొల్పేందుకు కంపెనీకి ఈ ఏడాది జనవరిలో అనుమతులు లభించాయి. బార్న్ ఎలక్ట్రిక్ (బీఈ) మోడల్స్ తయారీ కోసం ఈ ప్లాంటుపై వచ్చే 7–8 ఏళ్లలో కంపెనీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎక్స్యూవీ, కేవలం విద్యుత్ వాహనాల కోసమే ఉద్దేశించిన బీఈ బ్రాండ్ల కింద మొత్తం అయిదు ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్స్ను ప్రవేశపెట్టడంపై కంపెనీ కసరత్తు చేస్తోంది. -
ఫ్యాన్స్కు గుడ్న్యూస్: మహీంద్ర థార్పై బంపర్ ఆఫర్
భారత్ మార్కెట్లో మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్ ఎస్యూవీ కున్న ఆదరణ, క్రేజే వేరు. మరోవైపు హీంద్రా థార్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఆవిష్కరణకు ముందు మహీంద్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. థార్ వెహికల్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మహీంద్రా థార్ ఈవీ ఆవిష్కరణకు ముందు, 3-డోర్ల మహీంద్రా థార్ గరిష్టంగా రూ. 20,000 ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని మహీంద్రా షోరూమ్లు కొత్త థార్పై రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నాయి.పెట్రోల్, డీజిల్ మహీంద్రా థార్ 4x4 వేరియంట్లపై ఆఫర్ లభిస్తోంది. థార్ 4x4 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ,2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో ఉంది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్కు బంపర్ ఆఫర్) కాగా మహీంద్రా థార్ ధరలను కంపెనీ ఇటీవల భారతదేశంలో రూ. 1.05 లక్షల వరకు పెంచేసింది. ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ 4WD వెర్షన్ ఇప్పుడు రూ. 13.49 లక్షల నుండి రూ. 16.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD మహీంద్రా థార్ చౌకైన వేరియంట్ ఇప్పుడు రూ. 55,000 ఎక్కువ. LX డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు పెరిగింది. ఆగస్ట్ 15న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో థార్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ను వెల్లడించేందుకు మహీంద్రా సిద్ధంగా ఉంది. (అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో) -
జాక్పాట్ కొట్టిన ఆనంద్ మహీంద్రా.. ఒక్కరోజే రూ.7,672 కోట్లతో
ముంబై: ఫార్మా, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ లాభపడ్డాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ మార్కెట్ భారీ ర్యాలీకి ప్రతిబంధకంగా మారింది. ఈ వారంలో ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, అమెరికా ద్రవ్యోల్బోణ డేటాతో సహా పలు దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య కదలాడుతూ ఊగిసలాట వైఖరిని ప్రదర్శించాయి. సెన్సెక్స్ ఉదయం 90 పాయింట్లు పెరిగి 65,811 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 65,748 వద్ద కనిష్టాన్ని, 66,068 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 232 పాయింట్లు పెరిగి 65,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 19,577 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,525 – 19,620 పరిధిలో కదలాడింది. ఆఖరికి 80 పాయింట్లు పెరిగి 19,597 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీతో పాటు ఇంధన, రియల్టీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు అరశాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, మెటల్, మీడియా, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,893 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,081 కోట్ల షేర్లను కొన్నారు. సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.22 లక్షల కోట్లు పెరిగి రూ.305.38 లక్షల కోట్లకు చేరింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, యూరోజోన్ స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరచడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అధిక భాగం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ►జూన్ క్వార్టర్లో నికర లాభం 56.04% వృద్ధి చెందడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4% లాభపడి రూ.1,527 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో నాలుగున్నర శాతం దూసుకెళ్లి రూ.1,531 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ విలువ ఒక్క రోజులో రూ.7,673 కోట్లు పెరిగి రూ.1.90 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. ►యధార్థ్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ షేరు లిస్టింగ్ రోజు 11% ర్యాలీ చేసింది. ఈక్విటీ మార్కెట్లలోని అస్థిరత పరిస్థితుల దృష్ట్యా బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.300)తో పోలిస్తే 2% స్వల్ప ప్రీమియంతో రూ.306 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 14% ఎగసి రూ.343 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% లాభంతో రూ.334 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 15.16 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. కంపెనీ విలువ రూ.2,854 కోట్లుగా నమోదైంది. ► తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో బ్రిటానియా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఎన్ఎస్ఈలో రెండున్నర శాతానికి పైగా నష్టపోయి రూ.4,670 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో నాలుగుశాతం క్షీణించి రూ.4618 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని దిగివచ్చింది. నిఫ్టీ–50 సూచీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే కావడం గమనార్హం. -
వాళ్లని జాగ్రత్తగా చూసుకోండి.. వైరల్గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్
భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇండియన్ ఆర్మీ ఇటీవల 1850 మహీంద్రా కార్లను ఆర్డర్ చేసింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ఇటీవల మహీంద్రా కొత్త స్కార్పియో కార్లను ఆర్డర్ చేసింది. గత జనవరిలో ఆర్మీ 1470 యూనిట్ల కార్లను డెలివరీ చేసుకుంది. మొదట్లో డెలివరీ చేసుకున్న కార్లు కంపెనీ పాత లోగో కలిగి ఉన్నాయి, కావున రెండవ లాట్ కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మహీంద్రా స్కార్పియో కొనుగోలు చేసిన ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి జిప్సీ స్థానంలో వినియోగించనున్నట్లు సమాచారం. గతంలో భారతీయ సైన్యం జిప్సీతో పాటు టాటా జెనాన్ పిక్-అప్లు, ప్రత్యేకంగా తయారు చేసిన టాటా సఫారీ స్టోర్మ్ (GS800)ని కూడా కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మా దళాలను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ ఇప్పటికే వేలలో లైక్స్ పొందింది, చాలామంది కామెంట్స్ కూడా తమకు తోచిన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. Take good care of our troops, Scorpio. Because they take care of us… https://t.co/RzghhqgbGJ — anand mahindra (@anandmahindra) July 13, 2023 -
మళ్ళీ జలపాతం కిందికి మహీంద్రా కారు - ఈ సారి ఏమైందంటే?
Clarity About Mahindra Scorpio N Sunroof Leak: భారతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత సురక్షితమైన కార్లలో మహీంద్రా స్కార్పియో ఎన్ ఒకటి. గత కొంతకాలం కింద ఒక వ్యక్తి తన కారు సన్రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసి హల్ చల్ చేసాడు. అయితే ఈ సమస్యకు కంపెనీ పరిస్కారం అందించింది. కాగా తాజాగా మరో సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం యష్9డబ్ల్యు (Yash9w) అనే యూట్యూబర్, మహీంద్రా స్కార్పియో ఎన్ కారుని జలపాతం కిందికి తీసుకెళ్లి సన్రూఫ్ లీక్పై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగానే కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడు. జలపాతం నీరు కారుపై పడినా లోపలికి ఏ మాత్రమే రాలేదని స్పష్టం చేసాడు. అయితే మరో సారి కూడా కారుని జలపాతం కింది తీసుకెళతాడు. అప్పుడు చిన్న నీటి బిందువులను గమనించినట్లు వెల్లడించాడు. చిన్న నీటి బిందువులే కానీ అది అసలు చెప్పుకోదగ్గ సమస్య కాదని కూడా వీడియో ద్వారా వ్యక్తం చేసాడు. కారుని జలపాతం కిందికి తీసుకెళ్లాడనికి ముందు సన్రూఫ్ పూర్తిగా క్లోజ్ చేస్తాడు. సన్రూఫ్ మూసివేయడంతో ఏ చిన్న తప్పు జరిగినా వేగంగా వచ్చే నీరు లోపలి వస్తుంది. అయితే యూట్యూబర్ స్కార్పియో ఎన్ కారు చాలా పటిష్టమైందని, ఎలాంటి లీక్ లేదని స్పష్టంగా వెల్లడించాడు. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) సాధారణంగా వాహన తయారీ సంస్థలు కార్లను చాలా పటిష్టంగా తయారు చేస్తాయి. అయితే వాహన వినియోగదారుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే కారులో ఏదైనా సమస్య ఉందని గమనిస్తే.. కంపెనీ తప్పకుండా దానికి తగిన పరిష్కారం అందిస్తుంది. అంతే కాకుండా సన్రూఫ్ అనేది వర్షపు నీటి బిందువులు లోపలికి రాకుండా కాపాడటానికి, కారులోకి కావలసినంత వెలుతురు రావడానికి ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: బన్నీ మంచి బిజినెస్మెన్ కూడా! ఈ కంపెనీలన్నీ తనవే..) జలపాతాల కిందికి కారుని తీసుకెళ్లి సన్రూఫ్ టెస్ట్ చేయడమనేది సమంజసం కాదు. జలపాతం నుంచి కిందికి పడే నీరు చాలా వేగంతి పడుతుంది. అలాంటి సమయంలో ఏదైనా ఊహించని ప్రమాదం జరగవచ్చు. కావున ఇలాంటి సాహసాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచింది. మొత్తం మీద మహీంద్రా స్కార్పియో ఎన్ సన్రూఫ్ పటిష్టంగా ఉందని మరోసారి ఋజువైంది. ఇది మహీంద్రా ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. -
ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపనున్న థార్ 5 డోర్ - లాంచ్ ఎప్పుడంటే?
Mahindra Thar 5 Door: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) మార్కెట్లో కొత్త 'థార్ 5 డోర్' కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలియసిందే. అయితే రానున్న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగష్టు 15న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించడానికి మూహూర్తం ఖరారు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. థార్ 5 డోర్ నివేదికల ప్రకారం.. మహీంద్రా 5 డోర్ థార్ ఆఫ్-రోడర్ దక్షిణాఫ్రికాలో జరగనున్న ఒక ఈవెంట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. కాగా వచ్చే ఏడాది నాటికి ఇది భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహీంద్రా తన ఎక్స్యువి300, ఎక్స్యువి700, స్కార్పియో ఎన్ వంటి ఆధునిక ఉత్పత్తులను దక్షిణాఫ్రికా మార్కెట్లో విక్రయిస్తోంది. త్వరలో మహీంద్రా థార్ 5 డోర్ కూడా ఈ విభాగంలో చేరనుంది. త్వరలో విడుదలకానున్న కొత్త మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ రెండు ఇంజిన్ ఎంపికలతో విడుదలయ్యే అవకాశం ఉంది. అవి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ & 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది దాని ప్రత్యర్థి 5 డోర్ జిమ్నీ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇప్పటికే థార్ అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించింది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇది 3 డోర్ థార్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది, కావున పనితీరు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. (ఇదీ చదవండి: మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడంటే?) ఇండియా లాంచ్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ (ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ గతంలో ధృవీకరించినట్లుగా, మహీంద్రా 5-డోర్ థార్ 2024లో భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ SUV కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతాయి. -
ఇండియన్ ఆర్మీ మరింత పటిష్టం - రంగంలోకి మహీంద్రా ఆర్మడో
భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రియులకు ఇష్టమైన కార్లలో మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు చెప్పుకోదగ్గవి. కేవలం రోజు వారి వినియోగానికి, ఆఫ్ రోడింగ్ చేయడానికి మాత్రమే కాకుండా భారత సైన్యం కోసం కూడా కంపెనీ వాహనాలను సిద్ధం చేసి డెలివరీలను ప్రారంభించింది. మహీంద్రా సాయుధ వాహనాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా యాజమాన్యంలో ఉన్న మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ (MDS) భారత సాయుధ దళాలకు ఆర్మడో వాహనాల డెలివరీలను ప్రారంభించింది. ఆర్మడో అనేది ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్ (ALSV). ఇవి పూర్తి భారతదేశంలోనే రూపుదిద్దుకున్నాయి. కావున పటిష్టమైన భద్రత లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అధిక తీవ్రత ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్, స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. సరిహద్దు భూభాగాల్లో, ఎడారి ప్రాంతాల్లో దాడులకు ఉపయోగించడానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఇంజిన్ మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్ ఆర్మడో వాహనాలు 3.2 లీటర్, టర్బోచార్జ్డ్, డైరెక్ట్-ఇంజెక్షన్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 215 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ వెహికల్స్ కేవలం 12 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగవంతమవుతాయి. గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. పేలోడ్ కెపాసిటీ 1000 కేజీలు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?) ఆర్మడో వెహికల్ బిల్స్టెయిన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ కలిగి 318/80 ఆర్17 టైర్లను పొందుతుంది. టైర్లలో గాలి లేకుండా పోయినా 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంటాయి. ఇందులో పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఉంటుంది, కావున లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ లేదా రైట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగర్ చేయవచ్చు. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!) ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డ్రైవర్తో సహా ఆరుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది, అవసరమైతే ఎనిమిది మంది కూర్చునేలా సీట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. ఇది పబ్లిక్ అడ్రస్ (PA) సిస్టమ్, జీపీఎస్ (GPS), ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్, ఎలక్ట్రిక్ వించ్, HF/UHF/VHF రేడియోతో పాటు సెల్ఫ్-క్లీనింగ్-టైప్ ఎగ్జాస్ట్ స్కావెంజింగ్ వంటి వాటిని పొందుతుంది. మహీంద్రా వాహనాల డెలివరీకి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా కూడా షేర్ చేశారు. My gratitude to Sukhvinder Hayer & his entire team who made this project a reality through their patience, persistence & passion… 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/wYttXVMKKq — anand mahindra (@anandmahindra) June 17, 2023 -
రెండు ఇంధనాలతో మహీంద్రా వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహన విభాగంలోకి ప్రవేశించింది. సుప్రో సీఎన్జీ డువో పేరుతో మోడల్ను విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్షోరూంలో రూ.6.32 లక్షలు. ఈ తేలికపాటి వాణిజ్య వాహనం సీఎన్జీ, పెట్రోల్తో నడుస్తుంది. 750 కిలోల బరువు మోయగలదు. 75 లీటర్ల సీఎన్జీ ట్యాంక్, 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో 325 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మైలేజీ కిలోకు 23.35 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ‘సీఎన్జీ వాహనాల డిమాండ్ నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. సీఎన్జీ అవసరాన్ని ఇది సూచిస్తుంది. దేశవ్యాప్తంగా 2 టన్నులలోపు సామర్థ్యం గల తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు నెలకు 16,000 యూనిట్లు. ఇందులో సీఎన్జీ వాటా సుమారు 5,000 యూనిట్లు’ అని మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ బానేశ్వర్ బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. సుప్రో సీఎన్జీ డువో రాకతో నెలవారీ అమ్మకాలు రెండింతలు అవుతాయని సంస్థ భావిస్తోంది. 1.5తోపాటు 2 టన్నుల విభాగంలోనూ రెండు రకాల ఇంధనాలతో నడిచే మోడళ్లను తేనున్నట్టు వెల్లడించింది. -
ఆస్ట్రేలియాలో విడుదలకానున్న ఇండియన్ బ్రాండ్ కారు ఇదే
Mahindra XUV700 Australia Launch: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra and Mahindra) కంపెనీకి చెందిన XUV700 త్వరలో ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ SUV ఆస్ట్రేలియన్ మార్కెట్లో కూడా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. మహీంద్రా కంపెనీ తన ఎక్స్యువి700 ఎస్యువిని జూన్ 15 న అధికారికంగా విడుదలచేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ కారు ఆస్ట్రేలియాలో మిత్సుబిషి అవుట్ ల్యాండర్, హోండా సిఆర్-వి, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. (ఇదీ చదవండి: పాకిస్థాన్లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?) ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదయ్యే మోడల్ 7 సీటర్ మాత్రమే అని నివేదికల ద్వారా తెలుస్తోంది. కావున ఎక్స్యువి700 5 సీటర్ రూపంలో విడుదలయ్యే అవకాశం లేదనిపిస్తోంది. డిజైన్, ఫీచర్స్ దాదాపు ఇండియన్ మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇంజిన్ ఎంపికలు కూడా ఇవే ఉంటాయని తెలుస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక సమాచారం జాన్ 15న లాంచ్ సమయంలో వెల్లడవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. Its Official! The ALL-NEW Mahindra XUV700 is launching in Australia on the 15th of June!#HELLOXUV700 Make sure you are registered to be first to receive the Price & Specification announcement on the 15th June via this link> https://t.co/EGmTvHuE3h pic.twitter.com/bpIQ4IPSbp — Mahindra Australia (@MahindraAus) June 1, 2023 -
మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో
Mahindra Scorpio N: దేశీయ మార్కెట్లో ఎస్యువిలకు డిమాండ్ విపరీతంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే ఎక్కువ మంది ప్రజలు మహీంద్రా, టాటా కంపెనీ మొదలైన కంపెనీ ఎస్యువిలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి కేవలం రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటాయి. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన 'స్కార్పియో ఎన్' మెట్లెక్కే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యూట్యూబ్లో విడుదలైన వీడియోలో లేటెస్ట్ మహీంద్రా స్కార్పియో ఎన్ సులభంగా మెట్లు ఎక్కడం చూడవచ్చు. అంతే కాకూండా ఈ వైట్ కలర్ స్కార్పియో సులభంగా మెట్లు దిగటం కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మహీంద్రా స్కార్పియో ఎన్ కెపాసిటీ తప్పకుండా అర్థమవుతుంది. కార్లతో ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కానీ ఈ వీడియోలో గమనించినట్లయితే ఆ ప్రాంతం మొత్తమ్ నిర్మానుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహీంద్రా కంపెనీ విడుదల చేసిన ఆధునిక కార్లలో స్కార్పియో ఎన్ ఒకటి. ఇది మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే ఇది కొనుగోలుదారులను ఎంతగా ఆకర్షించిందనే విషయం ఇట్టే అర్థమవుతుంది. చూడగానే ఆకర్షించే డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు) మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ & 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 198 bhp పవర్ 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 173 bhp పవర్ 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. (ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..) భారతదేశంలో మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధరలు ఇప్పుడు రూ. 13.06 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 24.51 లక్షల వరకు ఉంటాయి. ఈ SUV దేశీయ మార్కెట్లో మల్టిపుల్ వేరియంట్లలో & మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
‘స్వరాజ్’ నుంచి తేలికపాటి ట్రాక్టర్లు
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ తేలికపాటి ట్రాక్టర్లు రెండింటిని ఆవిష్కరించింది. టార్గెట్ 630, టార్గెట్ 625 పేరుతో వీటిని మార్కెట్లో విక్రయించనున్నట్టు తెలిపింది. ‘టార్గెట్’ శ్రేణిలో 20–30 హెచ్పీ విభాగంలో వీటిని తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇందులో టార్గెట్ 630 ముందుగా మహారాష్ట్ర, కర్ణాటకలో రూ.5.35 లక్షల ఎక్స్షోరూమ్ ధరపై అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇక టార్గెట్ 625 మోడల్ ట్రాక్టర్ను స్వల్ప వ్యవధిలోపు తీసుకొస్తామని తెలిపింది. తక్కువ బరువుతో సౌకర్యంగా ఉండే (కాంపాక్ట్ లైట్ వెయిట్) ట్రాక్టర్ల కోసం రూ.200 కోట్ల తో ప్రత్యేక ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసినట్టు స్వరాజ్ ట్రాక్టర్స్ ప్రకటించింది. ఈ ప్లాట్ఫామ్ నుంచే ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించడం గమనార్హం. ఇక ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. కాంపాక్ట్ లైట్ వెయిట్ విభాగంలో 27–30 శాతం వాటా సొంతం చేసుకోవాలన్న ప్రణాళికతో సంస్థ ఉంది. -
దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోండి.. ఎక్స్యువి700 కస్టమర్ కంప్లైంట్!
Mahindra XUV700: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' మార్కెట్లో థార్, ఎక్స్యువి700 వంటి కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందిన మహీంద్రా ఎక్స్యువి700 SUV మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో వెలుగులోకి వచ్చిన సన్రూఫ్ లీక్ ఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన మహీంద్రా ఎక్స్యువి700 సన్రూఫ్ లీక్ ఘటన మళ్ళీ వెలుగులోకి రావడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. రాఫ్తార్ 7811 యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో పైకప్పు నుంచి క్యాబిన్లోకి నీరు లీక్ అవుతుండటం చూడవచ్చు. వీడియోలో మీరు గమనించినట్లతే కారు వర్షంలో వెళుతున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో వర్షం నీరు మెల్ల మెల్లగా లోపలి రావడం గమనించవచ్చు. సన్రూఫ్ ఏ మాత్రం ఓపెన్ చేయలేదు, కానీ నీరు లోపలి వస్తోంది. దీని పైన కంపెనీ వెంటనే చర్యలు తీసుకోవాలని కస్టమర్ కోరాడు, ప్రస్తుతానికి సంస్థ ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. వీడియోలో కనిపించే మహీంద్రా ఎక్స్యువి700 ఎన్ని రోజులు నుంచి ఉపయోగిస్తున్నారనే సమాచారం స్పష్టంగా తెలియదు, అంతే కాకుండా సన్రూఫ్ లీక్ కావడానికి ప్రధాన కారణం తెలియాల్సి ఉంది. బహుశా సన్రూఫ్ గ్లాస్ అంచులలో ఏమైనా ఆకులు లేదా దుమ్ము చేరుకోవడం వల్ల లీక్ జరిగి ఉండవచ్చని కొంత మంది ఊహిస్తున్నారు. సన్రూఫ్ అంచులలో ఏమైనా చేరి ఉంటే నీరు లోపలి వచ్చే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ సింపుల్గా చెక్ చేసుకోవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!) గతంలోనూ ఇలా.. గతంలో వెల్లడైన ఒక వీడియోలో ఎక్స్యువి700 వినియోగదారుడు కారుని నేరుగా జలపాతం కిందికి తీసుకెళ్లాడు, ఆ సమయంలో నీరు లోపలి వచ్చిన సంఘటనకు సంబందించిన వీడియోలు వైరల్ అయ్యాయి, ఆ సమస్యను కంపెనీ పరిష్కరించింది. అయితే ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చిన సమస్యను మహీంద్రా అండ్ మహీంద్రా ఎలా పరిష్కరించబోతోందో వేచి చూడాలి. (ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) ఖరీదైన కార్లు ఇలాంటి సమస్యలకు లోనైతే కస్టమర్లు తప్పకుండా ఇబ్బంది పడతారు. గతంలో ఇలాంటి కంప్లైంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. మహీంద్రా ఎక్స్యువి700 ధర భారతీయ మార్కెట్లో 1రూ. 4.01 లక్షల నుంచి రూ. 26.18 లక్షల మధ్య ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
మహీంద్రా సూపర్.. రూ. 2,637 కోట్ల లాభం
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,637 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ4లో నమోదైన రూ. 2,237 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. ఆదాయం రూ. 25,934 కోట్ల నుంచి రూ. 32,366 కోట్లకు చేరింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 6,577 కోట్ల నుంచి 56 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో రూ. 10,282 కోట్లకు చేరిందని సంస్థ తెలిపింది. ఆదాయం రూ. 90,171 కోట్ల నుంచి 34 శాతం పెరిగి రూ. 1,21,269 కోట్లకు చేరింది. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 16.25 (325 శాతం) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,282 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ -
మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ
న్యూఢిల్లీ: మహీంద్రా పాపులర్ వాహనం ఎక్స్యూవీ 700 అగ్ని ప్రమాదం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. జైపూర్ జాతీయ రహదారిపై ఎక్స్యూవీ 700 మంటలు చెలరేగిన ఘటనపై స్పందించిన మహీంద్ర, ప్రమాద కారణాలపై వివరణ ఇచ్చింది. ఎక్స్యూవీ 700 కార్ ఓనర్ కులదీప్ సింగ్ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మే 21న, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. దీనిపై మహీంద్రా ఆటోమోటివ్ దర్యాప్తు నిర్వహించి, వైర్ ట్యాంపరింగ్ వల్లే ఎక్స్యూవీ 700 అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) జైపూర్ జాతీయ రహదారిపై తన కుటుంబంతో కలిసి డ్రైవింగ్ చేస్తుండగా సడెన్గా మంటలు వ్యాపించినట్టు కులదీప్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. కారు వేడెక్కుతోంది అనే ముందస్తుహెచ్చరిక లేకుండానే, పొగలు వ్యాపించి మంటల్లో చిక్కుకుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదని, అసలు తన కారు చాలా కొత్తదని కూడా చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు వ్యాపించి వాహనం దగ్ధమయ్యేలోపే ప్రయాణికులంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహీంద్రా ఆటోమోటివ్ ప్రకటన అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొన్నామని,వాహనం అసలు సర్క్యూట్ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆఫ్టర్మార్కెట్ ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు , నాలుగు యాంబియంట్ లైటింగ్ మాడ్యూల్స్ వల్ల ఇది సంభవించిందని మరో ప్రకటన విడుదల చేసింది. ఎడిషనల్ వైరింగ్ కనెక్షన్ ఒరిజనల్ది కాదని , నకిలీ వైరింగ్ జీనును అమర్చినట్టు పేర్కొంది. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమాచారాన్ని కారు ఓనర్కు ఈమెయిల్ ద్వారా అందించినట్టు కూడా తెలిపింది. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 చాలామంది తమ వాహనాలను ఎడిషనల్ ల్యాంప్స్ లేదా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో అప్డేట్ చేయాలనుకుంటారు అయితే, వైరింగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే, అది షార్ట్ సర్క్యూట్కు దారితీస్తుంది. దీంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్ వేడెక్కే ప్రమాదం ఉందని, ఇంజిన్ సరిగ్గా పనిచేసినప్పటికీ, మంటలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే ఆఫ్టర్-మార్కెట్ పార్ట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు విశ్వసనీయ డీలర్లు, మెకానిక్లపై మాత్రమే ఆధారపడటం చాలా కీలకమని సూచించింది. Here is an update to our official statement with reference to the incident in Jaipur involving the XUV700. Our customers' safety is always our top most priority. pic.twitter.com/HYSQDEBFIu — Mahindra Automotive (@Mahindra_Auto) May 24, 2023 -
ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో
Mahindra XUV700 Catches Fire: దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో విడుదల చేసిన XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. ఆధునిక డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఈ కారు అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇటీవల ఈ కారు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కులదీప్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జైపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా అతని ఎక్స్యూవీ 700లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు రావడానికి ముందు పొగలు రావడంతో కారులోని వారందరూ కిందికి దిగేసారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని ప్రాధమిక పరిశోధనలో వెల్లడైంది. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కానీ కారు కాలిపోయినప్పటికీ ఎక్స్యూవీ 700 ఓనర్ మాత్రం మహీంద్రా సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 మంటల్లో కాలిపోయిన కారు కొనుగోలు చేసి కేవలం ఆరు నెలలు మాత్రమే అయినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపైనా మహీంద్రా కంపెనీ స్పందిస్తూ మా కస్టమర్ల సేఫ్టీ ప్రధమ లక్ష్యమని చెబుతూ ప్రమాదానికి కారణం ఫ్యూయెల్ లీక్ లేదా ఇంజిన్లో ఏర్పడిన ఒత్తిడి అయి ఉండవచ్చని వెల్లడించింది. అయితే ఆ కారు ఓనర్కి మళ్ళీ కొత్త కారు ఇస్తుందా? లేదా? అనేదానిపై ఎటువంటి అధికారిక ప్రకటన ప్రస్తుతానికి వెలువడలేదు. Our customers' safety is always our top most priority. Here is our official statement with reference to an incident on Jaipur National Highway involving the XUV700. pic.twitter.com/hOHEQWhVyC — Mahindra Automotive (@Mahindra_Auto) May 22, 2023 సేఫ్టీ ఫీచర్స్.. మహీంద్రా ఎక్స్యూవీ 700 విషయానికి వస్తే, మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఇందులో 7 ఎయిర్బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హెడ్లైట్ బూస్టర్ వంటి సేఫ్టీ ఫీచర్స్తో పాటు ADAS టెక్నాలజీ కూడా ఉంది. ఇవన్నీ ప్రయాణికుల భద్రతను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. (ఇదీ చదవండి: ఈ ఎలక్ట్రిక్ కారు నాకొద్దు.. మీరే తీసుకోండి - వైరల్ అవుతున్న పోస్ట్!) మహీంద్రా ఎక్స్యూవీ 700 మల్టిపుల్ వేరియంట్స్లో లభిస్తుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 14.01 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 26.18 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మంటల్లో కాలిన కారు ఏ వేరియంట్ అనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. ఇల్లన్తి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
మరుగున పడిన అద్భుతమైన మహీంద్రా వాహనాలు (ఫోటోలు)
-
ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!
పరిచయం అవసరం లేని పేర్లలో 'ఆనంద్ మహీంద్రా' ఒకటి. భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తల జాబితాలో ఒకరుగా నిలిచి, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఉండే ఆనంద్ మహీంద్రా గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే ఈ రోజు ఆనంద్ మహీంద్రా జన్మదినం సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. 1955 మే 1న ముంబైలో హరీష్ మహీంద్రా, ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. పారిశ్రామిక నేపథ్యం ఉన్న కుటుంభంలో జన్మించినప్పటికీ ఎప్పుడూ అతని కుటుంభ సభ్యులు వ్యాపార రంగానికి రావాలని బలవంతం చేయలేదు. కాబట్టి చిన్న తనంలో సినిమా ప్రొడ్యూసర్ కావాలని కలలు కనేవాడని చెబుతారు. పాఠశాల విద్యను లారెన్స్ స్కూల్లో, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సులను హార్వర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో MBA పూర్తి చేశారు 1981లో ఇండియాకి తిరిగి వచ్చారు. చదువు పూర్తయిన తరువాత ఆనంద్ మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (ముస్కో)లో ఫైనాన్స్ డైరెక్టర్కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా చేరి వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో 1991లో సమ్మెలతో అట్టుడికిపోతున్న కండివాలీ ఫ్యాక్టరీ బాధ్యతలను చేప్పట్టవలసి వచ్చింది. కండివాలీ ఫ్యాక్టరీలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో కూడా ఎంతో నేర్పుగా ప్రవర్తించి ఆనంద్ మహీంద్రా ఆ సమస్యలను దూరం చేసి కార్మికులను శాంతింపజేశారు. ఇది ఆయన సాధించిన విజయాల్లో ప్రధానమైనదని చెప్పాలి. అప్పట్లో ఆటోమొబైల్ రంగంలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న భారతీయ కంపెనీలు వాహనాల తయారీకి ఎక్కువగా విదేశీ కంపెనీల మీద ఆధారపడవలసి వచ్చేది. కానీ ఆ సమయంలో ఫోర్డ్ కంపెనీతో కలిసి ఎస్కార్ట్ కారుని మార్కెట్లోకి పరిచయం చేశారు. కానీ ఇది ఆనంద్ మహీంద్రాకు ఆశించిన విజయాన్ని తీసుకురాలేకపోయింది. అయినా వెనుకడుగేయకుండా 300 మంది ఇంజినీర్లు, ఇతర సభ్యులతో ఒక టీమ్ తయారు చేసి ఒక ప్యాసింజర్ వెహికల్ తయారు చేయడానికి పూనుకున్నారు. ఆనంద్ మహీంద్రా తయారు చేసిన ఈ టీమ్ అహర్నిశలు కస్టపడి మహీంద్రా స్కార్పియో కారుని భారతదేశంలో విడుదల చేసి గొప్ప విజయాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఆటోమొబైల్ రంగంపై ఆనంద్ మహీంద్రా మంచి పట్టుని సంపాదించాడు. మహీంద్రా స్కార్పియో కారు కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది. మహీంద్రా స్కార్పియోతో ఆశించిన స్థాయికంటే గొప్ప సక్సెస్ రుచి చూసిన ఆనంద్ మహీంద్రా స్వరాజ్ ట్రాక్టర్స్, పంజాబ్ ట్రాక్టర్స్ వంటి వాటిని కొనుగోలు చేసి మహీంద్రా గ్రూపుని ఎంతగానో విస్తరించాడు. ఇప్పుడు మహీంద్రా ట్రాక్టర్లు ప్రపంచంలో అత్యధిక ప్రహజాదరణ పొంది అమ్మకాల పరంగా ముందంజలో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?) ఆనంద్ మహీంద్రా ప్రముఖ పాత్రికేయరాలైన అనురాధను వివాహం చేసుకున్నారు. ఈమె 'వెర్వ్' అండ్ 'మ్యాన్స్ వరల్డ్' పత్రికలకు సంపాదకురాలు. అంతేకాకుండా ఆమె 'ది ఇండియన్ క్వార్టర్లీ' మ్యాగజైన్ పబ్లిషర్గా కూడా పనిచేశారు. వీరికి దివ్య మహీంద్రా, అలిక మహీంద్రా అనే ఇద్డు కుమార్తెలున్నారు. వ్యారరంగంలో మాత్రమే కాకుండా గొప్ప సేవాదృక్పథం ఉన్న ఆనంద్ మహీంద్రా 1996లో భారతదేశంలోని నిరుపేద బాలికల విద్యకు మద్దతు ఇచ్చే నాన్హి కాళీ ఛారిటబుల్ ట్రస్ట్ను స్థాపించాడు. 2017 వరకు ఈ ట్రస్ట్ సుమారు 1,30,000 మంది బాలికల విద్యకు దోహదపడింది. అంతే కాకూండా భారతదేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేసే ట్రస్ట్ నాంది ఫౌండేషన్ డైరెక్టర్ బోర్డులలో ఒకరుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..) 2016లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ మహీంద్రాని ఎన్నో అవార్డులు సైతం వరించాయి. భారత ప్రభుత్వం 2020లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందించింది. అంతకంటే ముందు 2012లో యుఎస్ బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును, 2016లో బ్లూమ్బెర్గ్ టీవీ ఇండియా ద్వారా డిస్ట్రప్టర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను అందుకున్నాడు. (ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..) పారిశ్రామిక రంగానికి వన్నె తెచ్చిన ఆనంద్ మహీంద్రాకు కార్లంటే ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఈయన గ్యారేజిలో ఇప్పటికే మహీంద్రా బొలెరో ఇన్వాడర్, టియువి300, టియువి300 ప్లస్, మహీంద్రా స్కార్పియో, ఆల్టురాస్ జి4, స్కార్పియో ఎన్ మొదలైన కార్లు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
పికప్ వాహన విభాగంలో ఎంఅండ్ఎం 2 కొత్త మోడళ్లు
హైదరాబాద్: సరకు రవాణాకు సంబంధించిన (పికప్) వాహన విభాగంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. రూ.7.85 లక్షల నుంచి రూ.10.33 లక్షల శ్రేణిలో ధరలు ఉన్న ఈ బొలెరో మ్యాక్స్ సామర్థ్యం 2 టన్నుల వరకూ ఉందని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. రూ.24,999 చెల్లించి వీటిని బుక్ చేసుకోవచ్చని కూడా ప్రకటన వెల్లడించింది. 1.3 నుంచి 2 టన్నుల వరకూ పేలోడ్ సామర్థ్యంతో ఈ కొత్త శ్రేణి వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు ప్రకటన వివరించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పరిజ్ఞానం, సదుపాయాలతో ఈ వాహన శ్రేణి ఉత్పత్తి జరిగినట్లు వివరించింది. హెచ్డీ సిరీస్ (హెచ్డీ 2.0, హెచ్డీ 1.7, హెచ్డీ 1.3 లీటర్లు) , సిటీ సిరీస్ (సిటీ 1.3, 1.4 సీఎస్జీ) సిరీస్లలో వాహనాలు లభ్యం కానున్నట్లు తెలిపింది. -
Bitcoin: అదే జరిగితే మహీంద్రా కంపెనీ చరిత్రకెక్కుతుంది
భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు మంచి పేరుంది. ఇప్పటికే మహీంద్రా XUV300, స్కార్పియో, బోలెరో, థార్ వంటి కార్లను విక్రయిస్తూ అత్యధిక ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇటీవల ఒక ట్విట్టర్ యూజర్ బిట్కాయిన్తో మహీంద్రా కార్లను కొనవచ్చా అంటూ ప్రశ్నించారు. దీనికి స్వయంగా ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం ఏంటి? భవిష్యత్తులో బిట్కాయిన్ ద్వారా కంపెనీ కార్లను కొనొచ్చా.. లేదా? అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా అప్పుడప్పుడు ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేయడమే కాకుండా, కొంత మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక వ్యక్తి బిట్కాయిన్తో మహీంద్రా కార్లు కొనొచ్చా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి అవకాశం లేదు, కానీ భవిష్యత్తులో కొనొచ్చు అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ChatGPT: ప్రపంచ దేశాలు పొగిడేస్తున్నాయ్.. స్టూడెంట్స్తో పోటీపడలేకపోతోంది) ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానంతో రాబోయే రోజుల్లో మహీంద్రా కార్లను కొనేయొచ్చని తెలుస్తోంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ అనేది చాలా పవర్ ఫుల్. ప్రపంచంలోని చాలా దేశాలు వీటి ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఈ క్రిప్టో కరెన్సీ అనేది లీగల్ కాదు. Not yet. But maybe bit by bit in the future.. https://t.co/pQS0ZQ52Qf — anand mahindra (@anandmahindra) April 20, 2023 భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని లీగల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మహీంద్రా కంపెనీ బిట్కాయిన్తో లావాదేవీలకు అనుమతిస్తే దేశంలో బిట్కాయిన్ ద్వారా కార్లు విక్రయించిన మొదటి కంపెనీగా చరిత్రకెక్కుతుంది. బిట్కాయిన్తో కార్లను విక్రయించడం మొదలుపెడితే ఎంతమంది ఈ పద్దతి ద్వారా కొనుగోలు చేస్తారనేది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. -
మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన థార్ కొనుగోలుదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ఆఫ్ రోడర్ కొనుగోలు చేసేవారు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం డిమాండ్ తగ్గకుండా గొప్ప అమ్మకాలతో ముందుకు సాగుతున్న థార్ ఎంతోమంది ఆఫ్ రోడర్లకు ఇష్టమైన వాహనం. ఇప్పటికి కూడా ఈ SUV కోసం చాలా రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో కంపెనీ థార్ కొనుగోలు మీద రూ. 65,000 తగ్గింపుని అందించనుంది. నివేదికల ప్రకారం, కొన్ని ఎంపిక చేసిన డీలర్షిప్లలో మాత్రమే మహీంద్రా థార్పై రూ. 65,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 40వేలు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎంచుకున్న వేరియంట్పై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల మహీంద్రా థార్ ధరలు రూ. 1.05 లక్షల వరకు పెరిగాయి. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD వేరియంట్ ధర ఇప్పుడు మునుపటికంటే రూ. 55,000 ఎక్కువ. దేశీయ మార్కెట్లో మహీంద్రా థార్ 4WD వెర్షన్ ధర రూ. 13.49 లక్షల నుంచి రూ. 16.77 లక్షల మధ్య ఉంది. -
మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ చైర్మన్ కేషుబ్ మహీంద్రా (99)బుధవారం కన్నుమూశారు. ఇన్స్పేస్ చైర్మన్ పవన్ కె గోయెంకా తన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. పారిశ్రామిక ప్రపంచం నేడు అత్యంత ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, సామాజిక విషయాల్లో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అంటూ సంతాపాన్ని ప్రకటించారు. 1947లో మహీంద్రా గ్రూప్లో చేరిన కేషుబ్ 48 సంవత్సరాల పాటు కంపెనీకి చైర్మన్గా నాయకత్వం వహించారు. ప్రస్తుత ఎంఅండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీద్రకి మేనమామ కేషుబ్. తనతండ్రి స్థాపించిన మహీంద్రా గ్రూపులో 1963 నుండి 2012 వరకు ఛైర్మన్గా విశేష సేవలందించారు. ఆయన పదవీ విమరణ తరువాత, వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రాను గ్రూపు చైర్మన్గా ఎంపికయ్యారు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) The industrial world has lost one of the tallest personalities today. Shri Keshub Mahindra had no match; the nicest person I had the privilege of knowing. I always looked forward to mtgs with him and inspired by how he connected business, economics and social matters. Om Shanti. — Pawan K Goenka (@GoenkaPk) April 12, 2023 -
ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?
ఆసియా లేటెస్ట్ బిలియనీర్ ఎవరంటే రిలయన్స్ ముఖేశ్ అంబానీ అని ఠక్కున చెప్పేస్తాం. ఫోర్బ్స్ తన 2023 ప్రకారం 99 ఏళ్ల వయసులో బిలియనీర్ అయిన కేషుబ్ మహీంద్రాను గురించి తెలుసా? రూ. 9వేల కోట్లకు పైగా నికర విలువతో అత్యంత వృద్ధ బిలియనీర్గా నిలిచిన కేషుబ్ మహీంద్రా తెలుసుకుందాం. ఫోర్బ్స్ తన 2023 సంపన్నుల జాబితాలో భారతదేశంలో అత్యంత ధనవంతుడు ము్ఖేశ్ అంబానీ నిలిచారు. ఈ జాబితాలో భారత్ కొత్తగా 16 మంది బిలియనీర్లు చేరగా అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే 99 ఏళ్ల కేశబ్ మహీంద్రా భారతదేశంలో అత్యంత వృద్ధ బిలియనీర్గా నిలిచారు. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ కేషుబ్ మహీంద్రా. దిగ్గజ పారిశ్రామికవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్రకు మేనమామ. కేశబ్ మహీంద్రా 5 దశాబ్దాల పాటు మహీంద్ర గ్రూప్నకు నాయకత్వం వహించి కంపెనీనీ విజయతీరాలకు చేర్చారు. మహీంద్ర గ్రూపు ప్రస్థానంలో కీలక ప్రాత పోషించిన ఆయన 2012 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాను 1945లో కేషుబ్ తండ్రి జేసీ మహీంద్రా స్థాపించారు. (IPL 2023: షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు) 1923, అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించిన కేషుబ్ మహీంద్రా ఈ ఏడాది చివర్లో 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. వార్టన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ చేసి అనంతరం, అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కేషుబ్ తన తండ్రికి చెందిన కంపెనీలో 1947లో చేరారు. 1963లో కంపెనీకి ఛైర్మన్ అయ్యారు. మంచి కార్పొరేట్ గవర్నెన్స్, నైతికతకు ప్రసిద్ధి చెందిన కేషుబ్ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక కమిటీలలో ఆయన ప్రాతినిధ్యం ఉంది. 2007లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఫిలాంత్రపీలో కూడా కేషుబ్ అగ్రగణ్యుడే. అసోచామ్ అపెక్స్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు కూడా. 1987లో, ఫ్రెంచ్ ప్రభుత్వ చెవాలియర్ డి ఎల్'ఆర్డ్రే నేషనల్ డి లా లెజియన్ డి'హోన్నూర్ అవార్డును అందుకున్నారు. 2004 నుండి 2010 వరకు న్యూ ఢిల్లీలోని వాణిజ్యం పరిశ్రమల ప్రధాన మంత్రి మండలిలో సభ్యుడుగాపనిచేశారు. తొలుత మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో విల్లీసీప్లను అసెంబ్లింగ్ చేసేది. మహీంద్రా అండ్ మహీంద్రాను అసెంబ్లర్ నుండి భారీ సమ్మేళనంగా తీర్చిదిద్దడంలో కేషుబ్ పాత్ర కీలకం. ఆధ్వర్యంలోని కంపెనీ సాఫ్ట్వేర్ సేవలు, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో విజయవంతంగా ప్రవేశించింది. ప్రస్తుతం టాప్ఎస్యూవీల అతిపెద్ద తయారీదారుగా పాపులర్ అయింది.మహీంద్రా థార్, మహీంద్రా టీయూవీ 300,మహీంద్రా ఎక్స్యూవీ 700, మహీంద్రా బొలెరో నియో మొదలైన వాటితో సహా దాని పోర్ట్ఫోలియోలో అనేక విజయవంతమైన కార్లు ఉన్నాయి. -
ఓజా బ్రాండ్ కింద 40 ట్రాక్టర్లు
న్యూఢిల్లీ: ఓజా బ్రాండ్ కింద కొత్తగా 40 ట్రాక్టర్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఓజా ట్రాక్టర్లు దేశీ మార్కెట్తోపాటు అమెరికా, జపాన్, ఆగ్నేయ ఆసియా మార్కెట్లపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. సబ్ కాంపాక్ట్, కాంపాక్ట్, స్మాల్ యుటిలిటీ, లార్జ్ యుటిలిటీ పేరుతో నాలుగు విభాగాల్లో 40 ఓజా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చరల్ మెషినరీ (జపాన్), భారత్లోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఆర్అండ్డీ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. ఓజా శ్రేణి ట్రాక్టర్లను తెలంగాణలోని జహీరాబాద్ ట్రాక్టర్ల ప్లాంట్లో తయారు చేయనుంది. -
ఇవి కదా డిస్కౌంట్స్ అంటే! మహీంద్రా కార్లపై భారీ తగ్గింపు..
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' తమ ఉత్పత్తుల కొనుగోలు మీద ఈ నెలలో (ఏప్రిల్ 2023) భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్స్, బెనిఫీట్స్ అన్నీ మహీంద్రా మొరాజో, బొలెరో, బొలెరో నియో, థార్ 4RD, XUV300 కొనుగోలుపై పొందవచ్చు. మహీంద్రా మొరాజో: మహీంద్రా కంపెనీ ఇప్పుడు మొరాజో కొనుగోలుపైన ఏకంగా రూ. 72,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ తగ్గింపు టాప్ స్పెక్ M6 వేరియంట్పై లభిస్తుంది. అయితే బేస్ వేరియంట్ M2, మిడ్-స్పెక్ వేరియంట్ M4+ మీద వరుసగా రూ. 58,000, రూ. 34,000 తగ్గింపుని పొందవచ్చు. మహీంద్రా బొలెరో: మహీంద్రా బొలెరో కొనుగోలుపైన ఇప్పుడు రూ. 66,000 డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇందులో టాప్ స్పెక్ వేరియంట్ మీద రూ. 51,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. ఇక మిడ్-స్పెక్ B6 వేరియంట్ మీద రూ. 24000, ఎంట్రీ-లెవల్ B4 వేరియంట్ మీద రూ. 37000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా XUV300: XUV300 కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు రూ. 52,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కూడా W8 డీజిల్ వేరియంట్ కొనుగోలుపై రూ. 42,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. అదే సమయంలో W8(O), W6 డీజిల్ వేరియంట్ల మీద వరుసగా రూ. 22000, రూ. 10000 తగ్గింపు & పెట్రోల్ వేరియంట్స్ అయిన డబ్ల్యూ8(ఓ), డబ్ల్యూ8, డబ్ల్యూ6 వేరియంట్లపై వరుసగా రూ. 25000, రూ. 20000, రూ. 20000 తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా బొలెరో నియో: బొలెరో నియో టాప్ స్పెక్ వేరియంట్స్ N10, N10 (O) మీద రూ. 48,000 డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 36,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 12,000 విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. మిడ్ స్పెక్ వేరియంట్, ఎంట్రీ లెవెల్ మోడల్ మీద రూ. 30000, రూ. 22,000 డిస్కౌంట్ లభిస్తుంది. మహీంద్రా థార్ 4X4: దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ కొనుగోలుపై కూడా ఇప్పుడు రూ. 40,000 వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. ఇది కేవలం థార్ 4WD వేరియంట్ మీద మాత్రమే లభిస్తాయి. ఇందులో కూడా AX(O), LX అనే రెండు ట్రిమ్ల మీద తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా కంపెనీ అందించే డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు ఏప్రిల్ నెలలో మాత్రమే డిస్కౌంట్స్ వర్తిస్తాయి. -
New Mahindra Thar: థార్ కొత్త వేరియంట్.. మారుతి జిమ్నీకి గట్టి షాక్!
భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి అత్యధిక అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'మహీంద్రా థార్' (Mahindra Thar) త్వరలో మరో కొత్త వేరియంట్లో విడుదలకానుంది. ఇది థార్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ అని సమాచారం. ఇది భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనున్న మారుతీ సుజుకీ జిమ్నీకి ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశం ఉంటుంది. మహీంద్రా కంపెనీ 2020లో థార్ SUVని లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారీ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరిస్తూనే ఉంది. అయితే కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా తన థార్ ఎస్యువిలో నిరంతరం అప్డేట్స్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే థార్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ కూడా విడుదలైంది. ఇప్పటికి వెల్లడైన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవెల్ 4X4 థార్ వేరియంట్ను కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది. ఇది బేస్ లెవెల్ ఏఎక్స్ మోడల్ మాదిరిగా ఉండే అవకాశం ఉంది. కావున ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందనుంది. అయితే ఈ ఇంజిన్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి మాత్రమే పరిమితమవుతాయి. (ఇదీ చదవండి: ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..) మహీంద్రా విడుదల చేయనున్న థార్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఎక్కువ ఫీచర్స్ పొందే అవకాశం లేదు. కావున ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 13.59 లక్షల కంటే తక్కువ ఉండవచ్చు. మహీంద్రా థార్ SUV మారుతీ జిమ్నీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. మార్కెట్లో ఆఫ్ రోడ్ కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా వాటి అమ్మకాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే అమ్మకాల పరంగా జిమ్నీకి మహీంద్రా థార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. మారుతి సుజుకి తన జిమ్నీ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 9.5 లక్షల కంటే తక్కువ ఉండవచ్చు. -
హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా పాపులర్ వెహికల్ మహీంద్రా థార్ దూసుకుపోతోంది. తన ఐకానిక్ ఆఫ్-రోడర్ 100,000 యూనిట్ల గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు మహీంద్రా తాజాగా ప్రకటించింది. సరికొత్త థార్ లాంచ్ చేసిన కేవలం రెండున్నర ఏళ్లలోనే ఈ మైలురాయిని సాధించిందని పేర్కొంది. దేశంలో థార్కు లభిస్తున్న ప్రజాదరణ, సక్సెస్కి ఇది నిదర్శనమని మహీంద్రా తెలిపింది. అసాధారణ పనితీరు, డిజైన్కు గాను ఇప్పటికే పలు అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది. థార్ ఉత్పత్తిలో 100,000 యూనిట్ల కీలక మైలురాయిని చేరుకోవడం చాలా గర్వంగా ఏందని వీజయ్ నక్రా, (ప్రెసిడెంట్ - ఆటోమోటివ్ డివిజన్, ఎం అండ్ లిమిటెడ్) సంతోషాన్ని ప్రకటించారు. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) మహీంద్రా థార్ అద్భుతమైన డిజైన్, ఫీచర్లు, కెపాసిటీతో బాగా ఆకట్టుకుంటోంది. ఆల్-టెరైన్ సామర్థ్యాలతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తుంది. థార్ ఇప్పుడు 4x4, ఆర్డబ్ల్యూడీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పాత థార్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వీటిలో 2.0-లీటర్, 4-సిలిండర్ mStallion పెట్రోల్ ఇంజీన్ 150 BHP , 320 గరిష్ట్ టార్క్ను, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజీన్ 130 బీహెచ్పీ పవర్ను, 320గరిష్ట టార్క్ను అందిస్తాయి. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అందుబాటులో ఉన్నాయి. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) ఇక బలమైన డ్రైవ్ట్రెయిన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ , మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, షిఫ్ట్-ఆన్-ది-ఫ్లై ట్రాన్స్ఫర్ కేస్ వంటి అధునాతన ఫీచర్లతో 4x4 వేరియంట్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు సరిజోడి లాంటిది. అలాగే RWD వేరియంట్ థార్ నగరం ,హైవే వినియోగానికి వీలుగా విలక్షణమైన డిజైన్ , ఖరీదైన రైడ్ కోసం చూసే వినియోగదారులకు అనువైనది. -
ఒకే రోజు 400 కార్లు డెలివరీ చేసిన మహీంద్రా.. బుక్ చేసుకున్న వారికి పండగే!
భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు తన XUV400 ఎలక్ట్రిక్ డెలివరీలు ప్రారంభించింది. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజే ఏకంగా 400 యూనిట్లను డెలివరీ చేసి డెలివరీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. వేరియంట్స్ & ధరలు: 2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త ఎలక్ట్రిక్ SUV ఎక్స్యూవీ400 మొత్తం EC (3.2kw), EC (7.2kw), EL (7.2kw) అనే మూడు వేరియంట్లలో విడుదలైంది. వీటి ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు, రూ. 16.49 లక్షలు, రూ. 18.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం జనవరిలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కలర్ ఆప్సన్స్: ఎక్స్యూవీ400 ఐదు కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. అవి ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్ రూఫ్తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్లు ఉన్నాయి. డిజైన్: మహీంద్రా ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ కారు కావున కొత్త డిజైన్ పొందుతుంది. దీని ముందు భాగంలోని ఫేక్ ఫ్రంట్ గ్రిల్పై కాపర్-కలర్ ఎలక్ట్రిఫైడ్ ట్విన్ పీక్ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది, అంతే కాకుండా కాపర్ కలర్ ఎలిమెంట్స్ ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో, ఇంటీరియర్లో అక్కడక్కడా కనిపిస్తాయి. ఫీచర్స్: మహీంద్రా ఎక్స్యూవీ400 అడ్రినోఎక్స్ సాఫ్ట్వేర్తో కూడిన 7.0 ఇంచెస్ టచ్స్క్రీన్, సింగిల్ పేన్ సన్రూఫ్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఏసీ కంట్రోల్స్ వంటి వాటితోపాటు ఇతర ఆధునిక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. Great start to the new year with 400 Deliveries Of XUV400. Wishing you all a very #HappyGudiPadwa#MahindraXUV400 #AllElectric #XUV400 pic.twitter.com/uRdVLnBSGk — MahindraXUV400 (@Mahindra_XUV400) March 22, 2023 బ్యాటరీ ప్యాక్ & రేంజ్: ఎక్స్యూవీ400 రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. అవి ఒకటి 34.5kWh బ్యాటరీ కాగా, మరొకటి 39.4kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండూ 150 హెచ్పి, 310 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిమీ. ఈ ఎలక్ట్రిక్ కారులోని 34.5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో 375 కిమీ రేంజ్, 39.4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో 456 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ ఆప్షన్స్: మహీంద్రా ఎక్స్యూవీ400 ఫాస్ట్ ఛార్జర్ (50kW DC) ద్వారా 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది, అదే సమయంలో 7.2kW ఛార్జర్ ద్వారా 6 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఇక చివరగా 3.3kW AC ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 13 గంటల సమయం పడుతుంది. -
మహీంద్రా చేతికి స్ప్రేయర్ల తయారీ కంపెనీ.. నెక్స్ట్ ప్లాన్ అదేనా?
న్యూఢిల్లీ: స్ప్రేయర్ల తయారీ కంపెనీ మిత్రా ఆగ్రో ఎక్విప్మెంట్స్లో వాటాను 100 శాతానికి పెంచుకున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు మహీంద్రాకు ఈ కంపెనీలో 47.33 శాతం వాటా ఉంది. ఓమ్నివోర్ పూర్తి వాటాను మహీంద్రా చేజిక్కించుకుంది. తాజా వాటాలను ఎంతకు దక్కించుకున్నదీ కంపెనీ వెల్లడించలేదు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల వ్యాపారంలో అయిదేళ్లలో 10 రెట్లు వృద్ధి చెందాలన్నది మహీంద్రా లక్ష్యం. వాటా కొనుగోలు సంస్థ వృద్ధికి దోహదం చేయడంతోపాటు పెరుగుతున్న ఉద్యాన పంటల రంగంలో విస్తరణకు ఆస్కారం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా ఫామ్ ఎక్విప్మెంట్ విభాగం ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు. (ఇదీ చదవండి: భారత్లో 2023 టయోట ఇన్నోవా క్రిస్టా లాంచ్ - ధర ఎంతో తెలుసా?) పండ్ల తోటల్లో వాడే స్ప్రేయర్ల తయారీలో ఉన్న మిత్రా ఆగ్రో 2012లో ప్రారంభమయింది. ఇందులో 200 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2017 - 2018తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ మూడింతల ఆదాయాన్ని ఆర్జించింది. ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. నూతన ఉత్పత్తుల తయారీతోపాటు భారత్ సహా విదేశీ మార్కెట్లలో విస్తరణకు యోచిస్తోంది. -
మహీంద్రా థార్ లవర్స్కు గుడ్న్యూస్: కొత్త ఆప్షన్స్తో పండగే!
సాక్షి,ముంబై: మహీంద్రాకు చెందిన పాపులర్ కారు థార్ ఎస్యూవీని సొంతం చేసుకోవాలనే కస్టమర్లకు తీపి కబురు. పాపులర్ థార్ ఇపుడు కొత్త రంగుల్లో వినియోగ దారులకు అలరించనుంది. ఇప్పటి వరకు థార్ (4X2 RWD)వెర్షన్లకు మాత్రమే పరిమితమైన ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ ఆప్షన్స్ ఇపుడిక 4x4 వేరియంట్లలో కూడా లభించనున్నాయి. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఇలా రెండు ఇంజన్ ఆప్షన్స్లో లభిస్తున్న మహీంద్రా థార్కు (4X2 ) డిమాండ్ భారీగానే ఉంది. అయితే థార్ 4x4 వేరియంట్లో కొత్త కలర్ ఆప్షన్స్ లభిస్తాయని కంపెనీ ప్రకటించింది. దీంతో మొత్తం 6 రంగుల్లో (ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్, ఆక్వా మెరైన్, రెడ్ రేజ్, నాపోలి బ్లాక్ , గెలాక్సీ గ్రే) మహీంద్రా థార్ లభించనుంది. సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్తో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్స్టైల్ ఎస్యేవీలలో ఒకటి థార్. మరోవైపు మహీంద్రా కొత్త 5-డోర్ల థార్ను రాబోయే నెలల్లో దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117 బిహెచ్పి ,300 ఎన్ఎమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడింది.అలాగే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో జోడించగా, ఇది 150 బీహెచ్పీని, 320 Nm టార్క్ను అందిస్తుంది. ఎంట్రీ-లెవల్ ధరతో మహీంద్రా థార్ ధర రూ. 9.99 లక్షలతో ప్రారంభం (ఎక్స్-షోరూమ్, ఇండియా). -
మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్జి మోటార్: సేల్స్లో టాటా స్థానం ఎంతంటే?
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ఇటీవల గత నెల కార్ల విక్రయాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం వాహన అమ్మకాలు మునుపటికంటే కొంత పురోగతిని కనపరిచినట్లు తెలుస్తోంది. టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి మొదటి స్థానంలో నిలిచింది, చివరి స్థానంలో ఎంజి మోటార్స్ చోటు సంపాదించింది. 2023 ఫిబ్రవరిలో 2,82,799 యూనిట్ల వాహనాలను విక్రయించి మునుపటి ఏడాది ఫిబ్రవరి (2,58,736 యూనిట్లు) నెలకంటే 13.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ జాబితాలో 1,18,892 యూనిట్ల కార్లను విక్రయించిన మారుతి మొదటి స్థానంలో నిలిచి, అమ్మకాల పరంగా 2022 ఫిబ్రవరి కంటే 8.47 శాతం వృద్ధిని పొందింది. రెండవ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ ఫిబ్రవరి 2022 కంటే 1.08 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కంపెనీ అమ్మకాలు గత నెలలో 39,106 యూనిట్లు. టాటా మోటార్స్ 38,965 యూనిట్లు విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది. (ఇదీ చదవండి: నయా కారు విడుదలకు సిద్దమవుతున్న కియా మోటార్స్.. ఒక్క ఛార్జ్తో 450 కి.మీ రేంజ్!) దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరి కంటే 11,092 యూనిట్లను ఎక్కువ విక్రయించి నాలుగవ స్థానంలో నిలిచింది. గత నెలలో కంపెనీ అమ్మకాలు 29,356 యూనిట్లు. కియా మోటార్స్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి, మునుపటి ఏడాది ఫిబ్రవరి కంటే 43.54 శాతం పెరుగుదలను పొందింది. ఇక తరువాత స్థానాల్లో టయోట, స్కోడా, హోండా, రెనాల్ట్, ఎంజి మోటార్స్, నిస్సాన్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద కార్ల అమ్మకాలు 2022 ఫిబ్రవరి కంటే కూడా ఉత్తమంగా ఉన్నట్లు ఫాడా నివేదికలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని సంబంధిత వారాగాలు ఆశిస్తున్నాయి. -
నిజం నిరూపించిన మహీంద్రా.. వాటర్ లీక్ వీడియోకి గట్టి రిప్లే
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ప్రజలు ఎక్కువ నమ్మే బ్రాండ్. అయితే ఇటీవల వెలువడిన ఒక వీడియోలో మహీంద్రా స్కార్పియో-ఎన్ సన్రూఫ్ నుంచి జలపాతం నీరు రావడం పెద్ద వైరల్ అయింది. దీనికి సమాధానంగా కంపెనీ మరో వీడియో విడుదల చేసింది. గతంలో వెలువడిన వీడియోలో అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ తన మహీంద్రా స్కార్పియో-ఎన్ కారుని జలపాతం కిందకి తీసుకెళ్లినప్పుడు, నీరు సన్రూఫ్ నుంచి లోపలికి వచ్చాయని, దానికి సంబంధించిన వీడియో విడుదల చేసాడు. ఇది అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మహీంద్రా కంపెనీ అదే జలపాతం కిందికి మరో స్కార్పియో-ఎన్ తీసుకెళ్లి టెస్ట్ చేసింది. అయితే జలపాతం నీరు ఏమాత్రం లోపలికి రాలేదు. ఈ వీడియోను మొదటి వీడియోకి రీప్లేగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో జలపాతం నీరు ఏ మాత్రం లోపలికి రాకుండా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి మహీంద్రా తమ వాహనాలను పటిష్టంగా తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తుంది. అయితే కష్టమర్ కారు నుంచి ఎందుకు నీరు లోపలికి వచ్చింది అనేదానికి ఖచ్చితమైన సమాధానం తెలియదు. బాధితుడి కారులో ఏదైనా సమస్య ఉందా.. లేకుంటే పబ్లిసిటీ కోసం ఇలాంటిది ఏమైనా చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. కంపెనీ ఉత్పత్తులలో ఏదైనా సమస్య తలెత్తితే తప్పకుండా దానికి పరిష్కారం పొందవచ్చు. అది మాత్రమే కాకుండా కంపెనీ అటువంటి సమస్యను గుర్తిస్తే రీకాల్ ప్రకటిస్తుంది. అలా కాకుండా వీడియోలు సోషల్ మీడియాలో వెల్లడైతే కస్టమర్లకు బ్రాండ్ మీద ఉన్న నమ్మకం పోతుంది. జలపాతం కింద డ్రైవింగ్ చేయడం అనేది చాలా ప్రమాదం, ఇది అనుకోని ప్రమాదాలకు దారి తీస్తుంది. జలపాతం కింది నుంచి డ్రైవింగ్ చేస్తే కారు బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉండవచ్చు, లేదంటే పైనుంచి ఏదైనా కిందికి పడినప్పుడు కారులో ఉన్న ప్రయాణికులు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. వాహన వినియోగదారులు తప్పకుండా ఇలాంటివి గుర్తుంచుకోవాలి. Just another day in the life of the All-New Scorpio-N. pic.twitter.com/MMDq4tqVSS — Mahindra Scorpio (@MahindraScorpio) March 4, 2023 -
మహీంద్రా స్కార్పియో ఎన్ సన్రూఫ్ లీక్? షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా పాపులర్ ఎస్యూవీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చూస్తోంది. గత ఏడాది లాంచ్ చేసిన స్కార్పియో ఎన్ సన్రూఫ్ కారులో వాటర్ లీక్ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో 1 రోజు క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో 4.7 మిలియన్ల వ్యూస్ని సంపాదించింది. యూట్యూబర్ అరుణ్ పన్వార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన మహీంద్రా స్కార్పియో ఎన్ సన్రూఫ్ కారులో నీరు ఎలా లీక్ అయ్యిందో చూపించే వీడియోను షేర్ చేశారు. కొండల్లో ప్రయాణిస్తుండగా ఓ జలపాతం తనకు ఈ అనుభవం ఎదురైందని వీడియోలో చెప్పాడు. తన కారును జలపాతం కింద కడగాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కారును పార్క్ చేసే ముందు డ్రైవర్ సన్రూఫ్ను మూసివేసినా కూడా సన్రూఫ్, స్పీకర్ల ద్వారా కారులోకి నీరు లీక్ అయిందని, కారు లోపల పాడైపోయిందని పేర్కొన్నాడు. వీడియోలో, రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు, క్యాబిన్ ల్యాంప్ ద్వారా క్యాబిన్ లోపల నీరు పారుతూ ఉండగా, సన్రూఫ్ మూసి ఉందా లేదా అని రెండు సార్లు నిర్ధారించుకున్నట్టు కనిపిస్తోంది ఈవీడియోలో. (ఆర్ఆర్ఆర్ మేనియా: రామ్ చరణ్పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నా జీప్ మెరిడియన్ని చాలాసార్లు ఇలా కడిగాను కానీ ఇలా ఎపుడూ కాలేదని ఒకరు కమెంట్ చేయగా, అలాంటిదేమీ లేదు.. ఉద్దేశపూర్వకంగా అతగాడు సన్రూఫ్ను కొద్దిగా తెరిచి ఉంచాడని భావిస్తున్నానంటూ మరొకరు కామెంట్ చేయడం గమనార్హం. (బిజినెస్ క్లాస్ ప్యాసింజర్కి షాక్, ట్వీట్ వైరల్: ఎయిరిండియా స్పందన) అయితే కంటెంట్ కోసం అతను నిజంగానే అలా చేశాడా? అసలు ఏమైంది? సన్రూఫ్ ఎందుకు లీక్ అయ్యింది, సన్రూఫ్ లీక్ ప్రూఫ్గా ఉండే రబ్బరు సీల్ ఉందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలపై మహీంద్ర అధికారికంగా స్పందించాల్సి ఉంది. (గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం ) View this post on Instagram A post shared by Arun Panwar (@arunpanwarx) -
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి అడ్డాగా తెలంగాణ.. 1000 కోట్లతో మహీంద్రా EV ప్లాంట్
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతదేశంలో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణాలో రూ. 1000 కోట్లతో ఒక ఈవీ ప్లాంట్ ఏర్పాటుకి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ జహీరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 1,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ తరువాత జరిగిన చర్చల్లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణా అడ్డాగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'రాజేశ్ జేజురికర్' మాట్లాడుతూ, తెలంగాణాలో ఏర్పాటు కానున్న ఈవీ ప్లాంట్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కూడా ఉత్పత్తవుతాయి. తాజా పెట్టుబడులు ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ తయారీకి పెద్ద పీట వేయనున్నారు, ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా తయారవుతాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకున్న డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దీనివైపు అడుగులువేస్తున్నాయి. మహీంద్రా కంపెనీ ఏర్పాటు చేయనున్న కొత్త ఈవీ ప్లాంట్ మరో 3-5 సంవత్సరాలలో పూర్తయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
మహీంద్ర ఎక్స్యూవీ 400స్పెషల్ ఎడిషన్ రూ. 1.75 కోట్లా! ఎందుకలా
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఎక్స్ యూవీ400 భారీ ధర పలికింది. వన్-ఆఫ్-వన్ ఎడిషన్ను వేలం సందర్భంగా ఈ ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ. 1.75కోట్లకు అమ్ముడుపోయింది.హైదరాబాద్కు చెందిన రుణాకర్ కుందావరమ్ ఈ ఎక్స్క్లూజివ్ ఎడిషన్ను సొంతం చేసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఈ కారును ఆయనకు అందించారు. మహీంద్రా ఎక్స్యూవీ400 ఎక్స్ షోరూం ధర రూ. 16.99లక్షలు-రూ. 18.99లక్షలుగా ఉంది. దీనిప్రకారం ప్రారంభ ధర కన్నా.. ఎక్స్యూవీ400 ఎక్స్క్లూజివ్ ఎడిషన్ను రూ. 1.58 కోట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. ఈ నిధులను సామాజిక సేవ కోసం వినియోగించనున్నట్టు సంస్థ పేర్కొంది. సాధారణ మహీంద్రా ఎక్స్యూవీ400 ఈవీతో పోలిస్తే పెద్దగా మార్పులు లేనప్పటికీ ప్రత్యేకత ఏంటంటే.. మహీంద్రా XUV400 వన్-ఆఫ్-వన్ ఎడిషన్ను ఫ్యాషన్ డిజైనర్ రిమ్జిమ్ దాదు సహకారంతో మహీంద్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ రూపొందించారు. ప్రత్యేక ఎడిషన్ కారును 'రిమ్జిమ్ దాదు X బోస్' బ్యాడ్జ్ , ఆర్కిటిక్ బ్లూ థీమ్తో తీసుకొచ్చింది. స్టాండర్డ్ మహీంద్రా XUV 400 eSUV రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనికి సంబంధించి జనవరి 26 న ప్రారంభం కాగా మోడల్ ఇప్పటివరకు 15,000 బుకింగ్లను పొందింది. ఈ బుకింగ్ల డెలివరీలు దాదాపు ఏడు నెలల్లో పూర్తవుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. -
నగరానికి దక్కిన ‘భాగ్యం’
సాక్షి క్రీడా విభాగం: అక్టోబర్ 7, 2022... హైదరాబాద్లో ఫార్ములా ‘ఇ’ రేస్ నిర్వహించబోతున్నట్లు తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన రోజు... ఇప్పుడు సరిగ్గా నాలుగు నెలల తర్వాత వచ్చిన స్పందనను చూస్తే ఈ రేసింగ్ ఈవెంట్ ఎంతగా సక్సెస్ అయ్యిందో అర్థమవుతుంది. ఫార్ములా ‘ఇ’ పోటీలను నిర్వహించే అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) కూడా హైదరాబాద్ పోటీలపై తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఫార్ములా ‘ఇ’ చరిత్రలో అత్యుత్తమ రేస్లలో ఒకటిగా ప్రకటించింది. హైదరాబాద్లో ‘ఇ’ రేసు జరుగుతుందని ప్రకటించిన సమయంలో ఇది సఫలం కావడంపై అనేక సందేహాలు కనిపించాయి. నగరం నడిబొడ్డున ‘స్ట్రీట్ సర్క్యూట్’ ట్రాక్ను సిద్ధం చేయడం అన్నింటికంటే పెద్ద సవాల్గా నిలిచింది. అత్యంత వేగంగా ఈ పనులు పూర్తి చేసిన అధికారులు హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్, ఐమ్యాక్స్ పరిసరాలను రేసింగ్ కార్లకు అనుగుణంగా మార్చారు. అయితే గత నవంబర్లో దీనికి సన్నాహకంగా నిర్వహించిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ఆశించిన స్థాయిలో సఫలం కాలేదు. దానికి స్పందన గొప్పగా లేకపోగా, ఏర్పాట్లలో సాగిన లోపాలు, ట్రాక్పై డ్రైవర్ల అసంతృప్తి, రేస్ల వాయిదాలు వెరసి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో ఫార్ములా ‘ఇ’ నిర్వహణపై కూడా కొంత అపనమ్మకం వచ్చింది. అయితే ఎఫ్ఐఏ నేరుగా ట్రాక్ ఏర్పాటు అంశంలో భాగస్వామిగా మారి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయించగలిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కీలకంగా ఉన్న, ఫార్ములా ‘ఇ’ రేసింగ్లో జట్టు ఉన్న ‘మహీంద్రా’ కూడా సహభాగస్వామిగా భారత్లో తొలి రేసును విజయవంతం చేయడంలో చురుగ్గా పాల్గొంది. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు, వాటిలో వచ్చిన ఇక్కట్లతో సామాన్యుల్లో తీవ్ర అసహనం కనిపించింది. శుక్రవారం ట్రాక్లోకి సాధారణ వాహనాలు దూసుకురావడం కూడా కొంత ఆందోళన రేపిన అంశం. అయితే సరైన సమయంలో స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల అసంతృప్తిని సాధ్యమైనంతగా తగ్గించే ప్రయత్నం చేశారు. చివరకు అభిమానులు కూడా ఆసక్తిగా పెద్ద ఎత్తున హాజరు కావడం, తమ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ ఈవెంట్గా దానికి తగిన విలువ ఇవ్వడంతో ఇది సక్సెస్గా నిలవగలిగింది. భారత్లో ఢిల్లీ, ముంబైలాంటి నగరాలను కాదని హైదరాబాద్లో జరిగిన ‘ఇ’ రేసింగ్కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కావడం కూడా దీనికి గల స్థాయిని చూపించింది. మొత్తంగా ఎఫ్ఐఏ కూడా సౌకర్యాలు, ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం ఫార్ములా ‘ఇ’ రేసింగ్కు సంబంధించి పెద్ద సానుకూలాంశం. తాజా సీజన్లో ప్రపంచవ్యాప్తంగా మరో 12 రేస్లు మిగిలి ఉన్నాయి. వచ్చే ఏడాది వేదికపై ఇంకా స్పష్టత లేకున్నా... వచ్చే సీజన్లో కూడా హైదరాబాద్ మళ్లీ ఆతిథ్యం ఇవ్వడం పాటు శాశ్వత వేదికగా కూడా మారే అవకాశం ఉంది. -
మహీంద్రా నుంచి రానున్న నయా ఎలక్ట్రిక్ ఎస్యూవీలు ఇవే..
దేశీ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా బార్న్ ఎలక్ట్రిక్ విభాగంలో మొదటి కార్లను పరిచయం చేసింది. వీటి చిత్రాలను గతేడాదే విడుదల చేసినప్పటికీ తాజాగా వీటిని జనం ముందుకు తీసుకువచ్చింది. సరికొత్త రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టాలని చూస్తున్న మహీంద్రా బీఈ.05(BE.05), బీఈ.05 రాల్-ఈ(BE.05 RALL E), ఎక్స్యూవీ.ఈ9 (XUV.e9)లను ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ ఎస్యూవీల తయారీలో ప్రముఖమైన మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది ఆగస్ట్లో రెండు ఈవీ మోడళ్లను పరిచయం చేసింది. స్కార్పియో-ఎన్, అప్గ్రేడెడ్ థార్, ఎస్యూవీ700, అప్గ్రేడెడ్ బొలెరో వాహనాలు విజయవంతం కావడంతో మంచి ఊపు మీద ఉంది. ఎక్స్యూవీ.ఈ9, బీఈ.05లను భవిష్యత్ ఎలక్ట్రిక్ ఎస్యూవీల్లో కీలకమైనవిగా కంపెనీ భావిస్తోంది. ఎక్స్యూవీ.ఈ9 సిరీస్లో రెండు వర్షన్లు ఉంటాయి. అలాగే మూడు ఎక్స్యూవీ బీఈ మోడళ్లలో బీఈ.05 ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇన్గ్లో ఫ్లాట్ఫాం ఈ కార్లకు ఫౌండేషన్గా వ్యవహరిస్తుంది. వీటి ఉత్పత్తి 2024 డిసెంబర్లో ప్రారంభమై 2025లో మార్కెట్లోకి వస్తాయని మహీంద్రా సంస్థ తెలిపింది. చదవండి: మారుతీ సుజుకీ టూర్–ఎస్.. అత్యధిక మైలేజీ ఇచ్చే సెడాన్ ఇదే.. From race to road to off-road. Meet BE-Rall.e. #ExploreBeyondBoundaries#ExploreTheImpossible #MahindraEVFashionFestival pic.twitter.com/iync6HOGZ5 — Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2023 Meet XUV.e9. #MahindraEVFashionFestival pic.twitter.com/xIMuhb1Jpe — Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2023 Welcome to a reimagined world. Say hello to BE.05 #BEV #MahindraEVFashionFestival #GrandHomecoming pic.twitter.com/xklpvl4xYh — Mahindra Automotive (@Mahindra_Auto) February 10, 2023 -
ఎంఅండ్ఎం లాభం రూ. 1,528 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) రూ. 1,528 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 1,335 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 14 శాతం అధికం. ఇక క్యూ3లో ఆదాయం రూ. 15,349 కోట్ల నుంచి సుమారు 41 శాతం వృద్ధి చెంది రూ. 21,654 కోట్లకు చేరింది. ఆటో విభాగం, ఫార్మ్ విభాగాలు మెరుగైన పనితీరు కొనసాగిస్తున్నాయని శుక్రవారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎంఅండ్ఎం ఎండీ అనీష్ షా చెప్పారు. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మహీంద్రా గ్రూప్ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 2,677 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 23,594 కోట్ల నుంచి రూ. 30,620 కోట్లకు ఎగిసింది. కాగా, జహీరాబాద్ ప్లాంటులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రానికి సంబంధించిన పనులు వచ్చే రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతాయని జెజూరికర్ తెలిపారు. సుమారు రెండేళ్లలో యూనిట్ పూర్తిగా అందుబాటులోకి రాగలదన్నారు. -
Formula E: నెక్లెస్రోడ్డుపై స్ట్రీట్ సర్య్కూట్.. ఫార్ములా- ఇ రేస్ వివరాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫార్ములా–ఇ రేసింగ్కు భాగ్యనగరం సిద్ధమైంది. రెండు రోజుల ఈ ఈవెంట్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తొలి ఫ్రీ ప్రాక్టీస్ జరుగుతుంది. పోటీల్లో పాల్గొంటున్న 11 జట్ల రేసర్లు ట్రాక్తో పాటు తమ కార్లను, వాటి పనితీరును పరీక్షించుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ ప్రాక్టీస్ను వాడుకుంటారు. అసలైన రేస్ ఎప్పుడు, ఎలా? ఇక శనివారం కూడా రెండో ఫ్రీ ప్రాక్టీస్తో పాటు ఉ.10.40నుంచి క్వాలిఫయింగ్ పోరు జరుగుతుంది. అనంతరం మ.గం. 3 గంటలకు అసలైన రేస్ ప్రారంభమవుతుంది. దాదాపు గంటన్నర పాటు సాగే ఈ రేస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో నెక్లెస్రోడ్పై ఏర్పాటు చేసిన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ 2.83 కిలోమీటర్లు పొడవు ఉంది. ఇందులో మొత్తం 18 మలుపులు ఉన్నాయి. భారత రేసర్లు లేకపోయినా భారత్కు చెందిన రేసర్లు ఎవరూ లేకపోయినా మహీంద్ర టీమ్తో పాటు టాటా స్పాన్సర్గా ఉన్న జాగ్వార్ టీమ్పై రేసింగ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. మహీంద్రా టీమ్లో రిజర్వ్ డ్రైవర్గా జెహాన్ దారువాలా ఉన్నాడు. గరిష్టంగా 322 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తి ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ‘బుక్ మై షో’లో ఈ రేసు కోసం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. చదవండి: IND vs AUS: ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!! Dasun Shanaka: అతడిని కొనేంత డబ్బు లేదు! నేనేమీ బాధపడటం లేదు! ఇండియాలో.. -
రూ. వెయ్యి కోట్లతో మహీంద్రా ఈవీ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: దేశీయ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ తెలంగాణలో విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జహీరాబాద్లో ఉన్న సంస్థ ప్లాంట్కు అనుబంధంగా ఈ నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం మహీంద్రా అండ్ మహీంద్రా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. లాస్ట్మైల్ మొబిలిటీ వ్యాపారంలో భాగంగా 3, 4 చక్రాల విద్యుత్ వాహనాలను తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ‘తెలంగాణ మొబిలిటీ వ్యాలీ’ ప్రకటన తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్లో ఉన్న తయారీ ప్లాంట్ విస్తరణకు ఈ ఎంవోయూ ఉపకరించనుంది. సుమారు రూ. 1,000 కోట్లతో చేపట్టనున్న ఈ విస్తరణ ద్వారా 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. సస్టెయినబుల్ మొబిలిటీ రంగం అభివృద్ధికి కృషి: కేటీఆర్ దేశంలో సస్టైనబుల్ మొబిలిటీ రంగాన్ని మరింతగా వృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. టీఎంవీ లక్ష్యాలకు అనుగుణంగా మహీంద్రా అండ్ మహీంద్రాతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగు మెగా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటని తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూపై మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్లోని తయారీ ప్లాంట్ విస్తరణ ద్వారా త్రీ వీలర్ కేటగిరీలో మరిన్ని వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
దిగ్గజ కంపెనీల మధ్య అమ్మకాల పోటీ, భారీగా తగ్గిన టాటా ఎలక్ట్రిక్ కారు ధర
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో దిగ్గజ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో ఒక సంస్థతో మరో సంస్థ పోటీపడుతున్నాయి. ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్ర ఈవీ ఎస్యూవీ 400ను విడుదల చేసింది. ఆ కారు విడుదలైన మరుసటి రోజే ఈవీ మార్కెట్లో కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న నెక్సాన్ ఈవీ కారు ధరల్ని తగ్గిస్తూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. నెక్సాన్ వేరియంట్కు పోటీగా ఎక్స్యూవీ 400 మార్కెట్లో విడుదలైంది. దాని ధర రూ.18.99 లక్షలుగా ఉంది. ఇప్పుడు దానికి గట్టిపోటీ ఇచ్చేలా నెక్సా ఈవీ ధరల్ని తగ్గించడం గమనార్హం. నెక్సాన్ ఈవీ కారు ఇంతకుముందు రూ.14.99 లక్షలు ఉండగా.. ధర తగ్గించడంతో ఇప్పుడు అదే కారును రూ.14.49 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. నెక్సాన్ వేరియంట్లో లేటెస్ట్గా విడుదలైన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ. 16.49లక్షలుగా ఉంది. వ్యూహాత్మకంగా ఈ సందర్భంగా టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..మేం పక్కా స్ట్రాటజీతో టియాగో నుంచి నెక్సాన్ ఈవీ కార్ల వరకు కస్టమర్లను ఆకట్టుకునేలా తయారు చేస్తున్నాం. స్మార్ట్ ఇంజనీరింగ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మా లక్ష్యాలను చేరుకునేందుకు దోహదం చేస్తున్నాయి. కొనుగోలు దారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను అందియ్యగలుగుతున్నామని అన్నారు. టాటా మోటార్స్ ఫోర్ట్ పోలియోలో మూడు ఈవీ కార్లు టాటా మోటార్స్ ఫోర్ట్ ఫోలియోలో టియాగో, టైగోర్,నెక్సాన్ ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.18.99లక్షల మధ్యలో ఉన్నాయి. ఇక ఎంట్రీ లెవల్ టిగాయో యూవీ మార్కెట్ ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79లక్ష మధ్యలో ఉండగా టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ.12.49లక్షల నుంచి రూ.13.75లక్షల మధ్య ధరతో సొంతం చేసుకోవచ్చు. -
మహీంద్రా ఎక్స్యూవీ400 టార్గెట్ 20,000 యూనిట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్లో కంపెనీ ఈ మోడల్ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు! -
మహీంద్ర ఎక్స్యూవీ400 ధర ఎంతంటే? తొలి 5వేల బుకింగ్లకే!
సాక్షి,ముంబై: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహీంద్రా ఎక్స్యూవీ 400 భారత మార్కెట్లోకి వచ్చేసింది. మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎక్స్యూవీగా చెబుతున్న ఈ కారును గత ఏడాది సెప్టెంబర్ (2022)లో అధికారికంగా లాంచ్ చేయగా ధరలను మాత్రం తాజాగా ప్రకటించింది. ధరలు మహీంద్రా ఎక్స్యూవీ 400 ధరలు రూ. 15.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఒక వేరియంట్ ధర 16.49 లక్షలు. టాప్ లైన్ XUV400 EL వేరియంట్ ధర రూ. 18.99 లక్షలు. అయితే ఇవి ప్రారంభ ఆఫర్ ధరలనీ, మొదటి 5,000 బుకింగ్లకు మాత్రమే ఈ రేట్లు చెల్లుతాయని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ కంపెనీ డీలర్షిప్లలోకి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. బుకింగ్స్ జనవరి 26న ప్రారంభం. ఎక్స్యువీ 400 ఈఎల్ డెలివరీలు మార్చి 2023 నుంచి ప్రారంభమైతే, దీపావళి సీజన్లో ఎక్స్యువీ 400 ఈసీ డెలివరీలు ప్రారంభంకానున్నాయి. మొదటి దశలో 34 నగరాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ఎస్యువీ ప్రయాణంలో మరుపురాని క్షణం ఎక్స్యువీ 400 ఆవిష్కరణ అని మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ వీజె నక్రా తెలిపారు. అత్యున్నత పనితీరు, డిజైన్, స్పేస్,టెక్నాలజీని ఆకర్షణీయమైన ధరలో ఎక్స్యువీ 400 అందిస్తుందన్నారు. మహీంద్రా కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUV EC, EL అనే రెండు వేరియంట్లలో లభ్యం. EC వేరియంట్లోని 34.5 kWh లిథియం ఇయాన్బ్యాటరీ , 375 కిమీ పరిధిని, EL వేరియంట్ 39.4 kWh బ్యాటరీ ప్యాక్ను 456 కిమీ పరిధిని అందిస్తుంది. ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, ఇన్ఫినిటీ బ్లూ, నాపోలి బ్లాక్, గెలాక్సీ గ్రే యొక్క ఐదు రంగుల్లో లభ్యం. అయితే EL వేరియంట్లో ఎగువన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో అందిస్తోంది. -
మహీంద్రా థార్ కొత్త శ్రేణి
వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ థార్ మోడల్లో రేర్ వీల్ డ్రైవ్ ట్రిమ్స్ను ప్రవేశపెట్టింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో వీటిని రూపొందించింది. ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభం. వీటిలో డీజిల్లో రెండు మాన్యువల్, పెట్రోల్తో ఆటోమేటిక్ వేరియంట్ ఉంది. కస్టమర్ల నుంచి వచ్చిన సూచనల మేరకు నూతన శ్రేణిని పరిచయం చేసినట్టు కంపెనీ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. ఔత్సాహిక కస్టమర్లకు థార్ మరింత చేరువ అవుతుందని చెప్పారు. ఇక 4 వీల్ డ్రైవ్ శ్రేణి ఇప్పుడు ఆధునిక ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ సిస్టమ్తో తయారైందని కంపెనీ తెలిపింది. -
మంచు కొండల్లో మహీంద్రా కారు బీభత్సం.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్!
మహీంద్రా కార్లుకు భారతీయ మార్కెట్లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ వాహనాలు లాంచ్ చేస్తే రికార్డ్ బుకింగ్స్ అవుతుండడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మహీంద్రా తన XUV400 ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఈ కారు ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇంతలోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి అందరి కళ్లు తన వైపు తిప్పుకుంది. మహీంద్రా కారా మజాకా మార్కెట్లో ఇంకా అఫిషియల్గా లాంచ్ కాక ముందే అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 24 గంటల్లో 751 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా పేరు సంపాదించింది. హిమాచల్ ప్రదేశ్లోని కైలాంగ్, లాహౌల్ స్పితి నుంచి డ్రైవ్ ప్రారంభించి 24 గంటల్లో 751 కి.మీ ప్రయాణించింది. సబ్-జీరో భూభాగంలోని నిటారుగా ఉన్న వాలులలో కూడా XUV400 సజావుగా దూసుకెళ్లింది. ఎత్తైన ప్రదేశాల్లోని వంపుల్లో కారు నడపడం కష్టతరం, అయినప్పటికీ XUV400 24 గంటల్లో 751 కిమీ ప్రయాణించి తన పనితీరుని నిరూపించుకుని ఈ అరుదైన రికార్డ్ను తన పేరిట నమోదు చేసుకుంది. ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం XUV400 112 Ah కెపాసిటీ రేటింగ్తో 39.4 kWh బ్యాటరీ ప్యాక్తో రానుంది. బ్యాటరీ ప్యాక్లో NMC (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) ఎలక్ట్రో-కెమికల్ కూర్పు ఉంది. ఈ వాహనం బరువు 1,960 కిలోలు, ఇందులో బ్యాటరీ ప్యాక్ 309 కిలోల బరువు ఉంటుంది. అధికారికంగా, XUV400 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది లగ్జరీయేతర సెగ్మెంట్ను మినహాయించి దేశంలో తయారైన అత్యంత వేగవంతమైన ప్రయాణీకుల వాహనంగా నిలిచింది. ఈ కారు అత్యధికంగా 150 kmph స్పీడ్ను అందుకోగలదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి, XUV400 తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా బ్యాటరీ తయారీలపై ఫోకస్ పెట్టింది. అందుకే మహీంద్రా సహకారంతో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. అయితే, బ్యాటరీ కంట్రోలర్, ఎలక్ట్రిక్ మోటార్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ. 17 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఉండచ్చని తెలుస్తోంది. మరో వైపు ప్రత్యేర్థి టాటా నెక్సన్ ఈవీ కంటే.. ఫీచర్లు, ప్రత్యేకతలు, బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
ఈవీలపై రూ. 10,000 కోట్లు పెట్టుబడి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి కోసం వచ్చే 7–8 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వెల్లడించింది. మహారాష్ట్ర విద్యుత్ వాహనాల ప్రోత్సాహక పథకం కింద తమ ప్రణాళికకు ఆమోదం లభించినట్లు పేర్కొంది. ‘మహారాష్ట్రలోని పుణేలో మా బార్న్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (బీఈవీ) కోసం తయారీ, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుపై అనుబంధ సంస్థ ద్వారా వచ్చే 7–8 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. ఎంఅండ్ఎం ఆగస్టులో 5 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఆవిష్కరించింది. వీటిలో నాలుగు వాహనాలు 2024–26 మధ్యలో మార్కెట్లోకి రానున్నాయి. ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి రానుంది. చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
మహీంద్రా లాజిస్టిక్స్ వేర్హౌస్ షురూ
హైదరాబాద్: దేశీయంగా సమీకృత లాజిస్టిక్స్ సర్వీసులందించే మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్(ఎంఎల్ఎల్) స్థానికంగా నెట్ జీరో సౌకర్యానికి తెరతీసింది. బహుళ ఖాతాదారుల సామర్థ్యాలు, పునరుత్పాదక ఇంధనం, వనరుల పరిరక్షణసహా పర్యావరణ అనుకూల(గ్రీన్ కవర్) వేర్హౌసింగ్ ఆర్కిటెక్చర్తో దీనిని ఏర్పాటు చేసింది. ఈ అత్యాధునిక వేర్హౌస్ సిద్దిపేట జిల్లా ములుగు మండలం, బండమైలారం గ్రామంలోని అరుణ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద నెలకొంది. కంపెనీకిగల దేశవ్యాప్త మల్టీ యూజర్ సోలార్ విద్యుత్ సౌకర్యాలలో భాగమైన ఈ కేంద్రం కస్టమర్ల తయారీ, ఫుల్ఫిల్మెంట్ ఇన్బౌండ్ కార్యక్రమాలకు వీలు కల్పించనుంది. ఈ-కామర్స్ కస్టమర్లకు మద్దతివ్వనుంది. (లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!) ఈ నూతన కేంద్రం 100శాతం సౌర, బ్యాటరీ స్టోర్డ్ శక్తితో పనిచేస్తుంది. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రిడ్కు అందజేస్తుంది. ఎలక్ట్రిక్ కార్గో వాహనాలకు చార్జింగ్ సౌకర్యాలనూ కల్పించనుంది. ఎంఎల్ఎల్ 350 మందికి పైగా ఇక్కడ ఉపాధి అవకాశాలను కల్పించింది. అధిక డిమాండ్ సమయంలో థర్డ్ పార్టీ అసోసియేట్లు ఈ సంఖ్యకు మూడింతలు అధికంగా ఉపాధి కల్పించే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది.(పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే! ) -
స్కార్పియో-ఎన్ను అలా వాడేసిన కేటుగాళ్లు: వైరల్ వీడియో
కోలకతా: కొట్టేసిన సొమ్మును అక్రమ రవాణాకోసం కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలతో పోలీసులను బురిడీ కొట్టించాలని చూసి భంగ పడుతూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మహీంద్రా స్కార్పియో-ఎన్లో అక్రమ డబ్బును రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులను పశ్చిమ బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనంలో 98 లక్షల రూపాయల విలువైన దోపిడీ డబ్బును అక్రమంగా తరలించాలని పోలీసులకు చిక్కారు. నల్లటి పాలిథిన్ ప్యాకెట్లలో డబ్బును ప్యాక్ చేసి స్టెఫినీ టైర్లో దాచిన వైనాన్ని పోలీసులు చేధించారు. చెక్పోస్టు తనిఖీల్లో భాగంగా స్కార్పియో-ఎన్లో నగదు పట్టు బడింది. నమోదైన యూజర్తో పాటు ఎస్యూవీలో ఉన్న వారిపై నల్లధనం అక్రమ రవాణా, దోపిడీ కేసు నమోదు చేశారు. బ్లాక్ కలర్ స్కార్పియో-ఎన్ వాహనంలోని స్టెఫినీ టైర్లో దాచిన నగదు అంటూ ఒక యూ ట్యూబ్ (Raftaar 7811) వైరల్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు, టాప్లో ఆ రెండు
ముంబై: ప్యాసింజర్ వాహనాలు ఈ నెలలో జోరుగా విక్రయాలను నమోదు చేస్తాయని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. క్రితం ఏడాది నవంబర్తో పోలిస్తే 30 శాతం అధిక నమ్మకాలు నమోదవుతాయని పేర్కొంది. ఆర్డర్ బుక్ బలంగా ఉండడం, పెరిగిన తయారీని ప్రస్తావించింది. వాణిజ్య వాహనాలు రెండంకెల వృద్ధిని చూపిస్తాయని పేర్కొంది. డీలర్ల స్థాయిలో నిల్వలు ఉన్నందున ట్రాక్టర్ల విక్రయాలు వృద్ధిని చూపించకపోవచ్చని అంచనా వేసింది. అక్టోబర్తో పోలిస్తే (పండుగల సీజన్) నంబర్లో వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్లు తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఎంకే గ్లోబల్ వివరించింది. ఈ నెల గణాంకాలను వాహన తయారీ సంస్థలు డిసెంబర్ 1న ప్రకటించనుండడం గమనార్హం. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ టాప్ ప్యాసింజర్ వాహనాల ఆర్డర్లు బలంగా ఉన్నాయని, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహన అమ్మకాల పరంగా సానుకూల గణాంకాలు నమోదవుతాయని ఎంకే గ్లోబల్ తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ విక్రయాల పరంగా 64 శాతం వరకు వృద్ధిని చూపించొచ్చని, టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 51 శాతం పెరగొచ్చని పేర్కొంది. మారుతి సుజుకీ 18 శాతం అధిక అమ్మకాలు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్యాసింజర్, కార్గో విభాగాల నుంచి డిమాండ్ బలంగా ఉండడంతో వాణిజ్య వాహన అమ్మకాలు 15 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. అశోక్ లేలాండ్ సంస్థ వాణిజ్య వాహన అమ్మకాలు 41 శాతం పెరగొచ్చని.. ఐచర్ మోటార్-వోల్వో ఐచర్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 36 శాతం మేర వృద్ధి ఉంటుందని పేర్కొంది. ద్విచక్ర వాహన అమ్మకాలు 10 శాతం మేర పెరుగుతాయని తెలిపింది. -
కొనుగోలుదారులకు భారీ షాక్, మహీంద్రా కార్లలో లోపాలు..రీకాల్కు పిలుపు
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసిన కార్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కార్లలో వేడిని నిరోధించేందుకు సింథటిక్ ఎలాస్టోమర్ నుంచి తయారు చేసిన రబ్బర్ బెలో’లో లోపాలు తలెత్తుతున్నట్లు తేలింది. దీంతో మహీంద్రా యాజమాన్యం ఈ ఏడాది జులై 1 నుంచి నవంబర్ 11 వరకు మ్యానిఫ్యాక్చరింగ్ చేసిన 6618 స్కార్పియో - ఎన్ కార్లను, ఎక్సయూవీ - 700 వేరియంట్కు చెందిన 12,566 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. కార్లలోని తలెత్తుతున్న లోపాలపై మహీంద్రా యాజమాన్యం స్పందించింది. కార్లలో ఉండే బెల్ హౌసింగ్ లోపల రబ్బరు బెలో’ ఏం సంస్థ తయారు చేసింది. ఏయే తేదీలలో వాటిని తయారు చేశారో గుర్తించి, క్రమబద్దీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం వాహనాదారులకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత డీలర్ షిప్ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలని కోరింది. నాణ్యతలో రాజీపడం అంతేకాదు సంస్థ తయారు చేసే కార్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడమని, అలాగే ప్రస్తుతం కార్లలోని లోపాల్ని గుర్తించడంతో పాటు భవిష్యత్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. బుకింగ్స్లో సరికొత్త రికార్డులు మహీంద్రా సంస్థ తెలిపిన వివరాల మేరకు..మహీంద్రా ఎక్స్యూవీ 700, స్కార్పియో - ఎన్లు కార్లు వాహనదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఒక్క ఆగస్ట్ నెలలో ఈ రెండు కార్లు సుమారు 2.40 లక్షలు ఓపెన్ బుకింగ్స్ అయ్యాయని..ఆ బుకింగ్స్ చేసుకున్న కార్లు కొనుగులో దారులకు చేరాలంటే 20 నుంచి 24 నెలల సమయం పడుతుందన్నారు. అందుకు మార్కెట్లో ఈ కార్లు ఉన్న డిమాండేనని చెప్పారు. ఇక ఇదే ఏడాది జులై నెలలో స్కార్పియో ఎన్ వేరియంట్ లక్ష కార్లను వాహనదారులు బుక్ చేసుకోగా.. ట్రాప్ - ఎండ్ ట్రిమ్ కార్ల కోసం 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉంది. మిగిలిన వేరియంట్ కార్లను కొనుగులో చేసిన కస్టమర్ల దగ్గరికి చేరుకునేందుకు 20-24 నెలల సమయం పట్టనున్నట్లు స్పష్టం చేశారు. చదవండి👉 ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
ఎస్యూవీల జోరు.. లాభాల్లో మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 44% జంప్చేసి రూ. 2,773 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ.1,929 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,470 కోట్ల నుంచి రూ.29,870 కోట్లకు ఎగసింది. ఆటోమోటివ్ విభాగం టర్నోవర్ రూ.8,245 కోట్ల నుంచి రూ.15,231 కోట్లకు దూసుకెళ్లగా.. వ్యవసాయ పరికరాల బిజినెస్ రూ. 6,723 కోట్ల నుంచి రూ.7,506 కోట్లకు బలపడింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.2,974 కోట్లకు చేరింది. ఎస్యూవీల జోరు: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎం అండ్ ఎం స్టాండెలోన్ నికర లాభం 46% జంప్చేసి రూ. 2,090 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 57% వృద్ధితో రూ. 20,839 కోట్లకు చేరింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 75% దూసుకెళ్లి 1,74,098 యూనిట్లను తాకగా, ట్రాక్టర్ల అమ్మకాలు 5% బలపడి 92,590కు చేరాయి. ఎక్స్యూవీ 700, స్కార్పియో–ఎన్ వాహనాలకు భారీ డిమాండ్ వలకల వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు కంపెనీ ఈడీ రాజేష్ జెజూరికర్ చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఎస్యూవీ తయారీ సామ ర్థ్యాన్ని నెలకు 39,000 యూనిట్లకు, తదుపరి వచ్చే ఏడాది చివరికల్లా 49,000 యూనిట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 2.6 లక్షల యూనిట్లకు బుకింగ్స్ ఉన్నట్లు తెలియజేశారు. 2027కల్లా ఎస్యూవీల అమ్మకాలలో 20–30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఆక్రమించవచ్చని అంచనా వేశారు. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు 0.8% నీరసించి రూ. 1,287 వద్ద ముగిసింది. -
చార్జింగ్ స్టేషన్లు: ఎంఅండ్ఎం, చార్జ్ప్లస్జోన్ జట్టు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ప్రవేశపెట్టబోతున్న మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తమ వాహనాలకు చార్జింగ్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ మౌలిక సదుపాయాల సంస్థ చార్జ్+జోన్తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం కింద వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల కోసం వేగవంతమైన డీసీ చార్జర్ల ఏర్పాటు, నిర్వహణ అవకాశాలను ఇరు సంస్థలు పరిశీలించనున్నాయి. మహీంద్రా అనుబంధ సంస్థలు, గ్రూప్ సంస్థలకు చెందిన సొంత స్థలాలు, అద్దె స్థలాలు, కార్యాలయాలు, లేక ఇతరత్రా మహీంద్రా ఎంపిక చేసుకున్న స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎంఅండ్ఎం యూజర్లతో పాటు ఇతరత్రా వాహనదారులు కూడా ఉపయోగించుకునేలా ఉంటాయి. ఎంఅండ్ఎం కొత్తగా అయిదు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఈ-ఎస్యూవీ) ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2024-2026 మధ్య తొలి నాలుగు మార్కెట్లోకి రానున్నాయి. చార్జ్+జోన్ దేశవ్యాప్తంగా 1,450 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది. రోజూ సుమారు 5,000 ఈవీలకు సర్వీసులు అందిస్తోంది. ఈ-ఎస్యూవీల కోసం దేశవ్యాప్తంగా ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్ను అందుబాటులోకి తేవడంతో పాటు దేశీయంగా విద్యుత్ వాహనాల వ్యవస్థ మరింతగా వృద్ధి చెందేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని చార్జ్+జోన్ వ్యవస్థాపకుడు, సీఈవో కార్తికేయ్ హరియాణి తెలిపారు. తమ కంపెనీ కస్టమర్లందరికీ భారీ స్థాయిలో ఈవీ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) విజయ్ నాక్రా పేర్కొన్నారు. -
మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కిస్బీ’ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ బైక్ లవర్స్ను ఆకర్షించేలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ప్యుగోట్ కిస్బీ’ ని త్వరలోనే దేశీయంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లను పలకరించే అవకాశం అంచనా. కిస్బీ ధర రూ. 1 లక్షగా ఉంటుందని భావిస్తున్నారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న మహీంద్ర ఈ-స్కూటర్ కిస్బీ...ఎథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 1.6 కేడబ్ల్యూహెచ్ 48వీ సామర్థ్యం గల లిథియం అయాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తున్న కిస్బీ గంటలకు 45 కి.మీ. గరిష్ట వేగంతో 42 కి.మీ. మైలేజే ఇవ్వనుందిట. లాంచింగ్ ముందు ఇండియాలో ప్రత్యేకంగా తీసుకురానున్న కిస్బీ మోడల్ ఈవీ టెస్ట్ రన్ కూడా నిర్వహించింది. కిస్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు ఏథర్ 450ఎక్స్ ఈవీ తరహాలో హైటెక్ ఫీచర్లను జోడించినట్టు తెలుస్తోందికలిగి ఉంది. స్కూటర్లో ట్యూబులర్ స్టీల్ చట్రం,టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్, 14 ఇంచ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్, వెనక డ్రమ్ బ్రేక్స్ కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
వెహికల్ లోన్ కోసం చూస్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే!
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ (Mahindra Finance) సర్వీస్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో (IPPB) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇకపై మహీంద్రా కస్టమర్లకు లోన్లు ఈజీగా అందుబాటులో రానున్నాయి. వీరివురు భాగస్వామ్యంతో ఇకపై.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్, ట్రాక్టర్ , వ్యాపార వాహనాల లోన్ కేటగిరీల కోసం మహీంద్రా ఫైనాన్స్కు లీడ్ రిఫరల్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్లకు పోస్టాఫీసులలో నగదు ఈఎంఐ( EMI )డిపాజిట్ సౌకర్యాన్ని కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను మొదటగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్లలో అందించనున్నారు. రాబోయే నాలుగు-ఆరు నెలల్లో ఇతర రాష్ట్రాలలో విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో, పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది. చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే! -
ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 లాంచ్ చేసిన నిమిషాల్లోనే రికార్డు బుకింగ్స్ సొంతం చేసుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం ట్రెండ్కి అనుగుణంగా మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తోంది. ఈ సంస్థ నుంచి మార్కెట్లోకి విడుదలయ్యే కార్ల క్రేజ్ గురించి కూడా చెప్పక్కర్లేదు. అందుకే అధిక కస్టమర్లు మహీంద్రా వాహనాల వైపే మొగ్గు చూపుతుంటారు. నేపథ్యంలో స్కార్పియో, XUV700 వంటి కొన్ని మోడళ్లపై 24 నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడింది. అయినా వీటికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదట. కాగా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన కొత్త కొత్త మోడళ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఇటీవల విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో N దాని ప్రీమియం, ఫీచర్-రిచ్ ప్యాకేజీతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. SUVలోని Z8, Z6 వేరియంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎంతలా అంటే కస్టమర్లు ఈ వాహనం కావాలంటే 24 నెలల వరకు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు Z8L దాదాపు 20 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇతర వేరియంట్లు మార్కెట్లో తక్కువ వెయిటింగ్ పీరియడ్ను కలిగి ఉన్నాయి. మహీంద్రా XUV700 మహీంద్రా XUV700కి కూడా మార్కెట్లో డిమాండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతోంది. ఈ SUV మీద ప్రస్తుతం కస్టమర్లు ఎంచుకునే వేరియంట్పై ఆధారపడి 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉంది. అయితే పెట్రోల్ వెర్షన్లతో పోల్చినప్పుడు డీజిల్ మోడల్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. స్కార్పియో, ఎక్స్యూవీ 700 వంటి మోడళ్లకు ఏకంగా 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ రెండు కార్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోవాలి. చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్కార్ట్ బంపరాఫర్! -
మహీంద్రా ఈ–ఎస్యూవీలకు జియో–బీపీ చార్జింగ్ నెట్వర్క్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రిక్ ఎస్యూవీల కోసం చార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ వెల్లడించింది. ముందుగా 16 నగరాల్లో ఎంఅండ్ఎం డీలర్షిప్ నెట్వర్క్లు, వర్క్షాప్లలో డీసీ ఫాస్ట్ చార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలిపింది. ఎంఅండ్ఎం ఇటీవలే తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ – ఎక్స్యూవీ400ను ఆవిష్కరించింది. త్వరలో మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టనుంది. దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్–బ్రిటన్కు చెందిన బీపీ కలిసి ఇంధనాల రిటైలింగ్ కోసం జాయింట్ వెంచర్గా జియో–బీపీని ఏర్పాటు చేశాయి. -
మహీంద్రా ఎక్స్యూవీ 300 టర్బో స్టోర్ట్ : ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి
సాక్షి,ముంబై: మహీంద్రా కొత్త టర్బో స్పోర్ట్ ఎక్స్యూవీ 300ని లాంచ్ చేసింది. సాధారణ మోడల్తో విభిన్నంగా ఉండేలా స్పోర్టీ ఎక్స్టీరియర్ ఎలిమెంట్ష్తో మూడు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఎక్స్యూవీ ప్రారంభ ధర రూ.10.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). లభిస్తుంది. W6, W8 W8(O) వేరియంట్లలో బ్లేజింగ్ బ్రాంజ్ విత్ బ్లాక్ రూఫ్ టాప్, నాపోలీ బ్లాక్ విత్ వైట్ రూఫ్ టాప్, పెర్ల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ టాప్ , బ్లేజింగ్ బ్రాంజ్ మోనోటోన్ కలర్స్లో ఇది లభ్యం. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఇవ్వలేదు. కేవలం 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే టర్బో స్పోర్ట్ ఎక్స్యూవీ 300 లభిస్తుంది. ఇంజీన్, ఫీచర్లు 1.2-లీటర్ mStallion TGDi టర్బో పెట్రోల్ ఇంజన్ ఇందులో అందించింది. ఈ ఇంజీన్ 5000 RPM వద్ద 130 PS, 1500-3750 RPM వద్ద 230 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 5 సెకన్లలో 0-60 km/hr వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. పియానో బ్లాక్ ఫినిషింగ్లో రెడ్ గ్రిల్ ఇన్సర్ట్లు, ఆల్-బ్లాక్ ORVMలు, ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్, లెథెరెట్ సీట్లు, క్రోమ్-ఫినిష్ పెడల్స్ , డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్స్ వంటి స్పోర్టీ డిజైన్ యాక్సెంట్స్తో వచ్చింది. డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు & ఆటో హెడ్ల్యాంప్లు, అడాప్టివ్ గైడ్లైన్స్తో వెనుక పార్కింగ్ కెమెరా, 17.78 సెం.మీ ఇన్ఫోటైన్మెంట్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, బ్లూసెన్స్ కనెక్ట్, ఎలక్ట్రికల్గా అడ్జస్టబుల్అండ్ ఫోల్డబుల్ ORVMలు, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, స్టీరింగ్ లాంటి ఫీచర్లు దీని సొంతం. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే 4 డిస్క్ బ్రేక్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్బ్యాగ్లు, ESP విత్ హిల్ స్టార్ట్ అసిస్ట్, ABS, ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్ డీయాక్టివేషన్ స్విచ్, ISOFIX సీట్లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. -
’థర్డ్ పార్టీ’ జప్తులు నిలిపివేశాం
న్యూఢిల్లీ: వాహన రుణాల రికవరీలకు సంబంధించి థర్డ్–పార్టీ ఏజంట్ల ద్వారా జప్తులు చేయడాన్ని నిలిపివేసినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఎంఎఫ్ఎస్ఎల్) వెల్లడించింది. ఇటీవలి విషాద ఘటన నేపథ్యంలో థర్డ్ పార్టీ ఏజంట్లను ఎలా వినియోగించుకోవచ్చనే అంశాన్ని అధ్యయనం చేయనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ రమేష్ అయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్టర్ రుణ రికవరీ కోసం వచ్చిన ఎంఎంఎఫ్ఎస్ఎల్ థర్డ్ పార్టీ ఏజంటు .. ఆ వాహనాన్ని మీద నుంచి పోనివ్వడంతో గత వారం 27 ఏళ్ల గర్భిణీ మృతి చెందిన ఘటన గత వారం జార్ఖండ్లోని హజారీబాగ్లో చోటు చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణాల రికవరీల కోసం ఎంఎంఎఫ్ఎస్ఎల్.. థర్డ్ పార్టీ ఏజంట్లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. రికవరీ, జప్తుల కోసం సొంత ఉద్యోగులను మాత్రమే ఉపయోగించుకోవాలని ఆదేశించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
మహీంద్రా స్వరాజ్ 20 లక్షల మార్క్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా గ్రూప్లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ సరికొత్త రికార్డును సాధించింది. 20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసి నూతన మైలు రాయిని అధిగమించింది. ఈసందర్బంగా స్వరాజ్ బ్రాండ్పై కస్టమర్ల విశ్వాసానికి, విశ్వాసానికి నిదర్శనమని కంపెనీ పేర్కొంది. స్వరాజ్ డివిజన్, ఎం అండ్ ఎం లిమిటెడ్ సీఈవో హరీష్ చవాన్ ఉద్యోగులు హాజరైన ప్రత్యేక కార్యక్రమంలో 20 లక్షల మార్క్నుటచ్ చేసిన ట్రాక్టర్ను విడుదల చేశారు. 1974లో స్వరాజ్ ట్రాక్టర్ల ఉత్పత్తి ప్రా రంభం అయింది. 10 లక్షల యూనిట్ల తయారీ మార్క్ను కంపెనీ 2013లో నమోదు చేసింది. పంజాబ్లోని రెండు ప్లాంట్లలో 15–65 హెచ్పీ సామర్థ్యం గల ట్రాక్టర్లను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. స్వరాజ్ ట్రాక్టర్ల కోసం మూడవ ప్లాంటును ఇదే రాష్ట్రంలో నెలకొల్పుతోంది. -
‘ఇదే నా టాలెంట్, ప్లీజ్ సార్ జాబ్ ఇవ్వండి’.. ఆనంద్ మహీంద్రా రిప్లై ఇదే!
ట్రెండ్ మారింది గురూ! అసలే మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైంది. కోరుకున్న జాబ్ దొరకాలంటే కొన్ని ఫార్మాలిటీస్ను పక్కన పెట్టాల్సిందే. కొత్తగా ఆలోచించాల్సిందే. అలా చేస్తేనే జాబ్స్ వస్తున్నాయ్ మరీ. లేదంటే కాళ్లరిగేలా ఆఫీస్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలా అనే ఓ యువకుడు ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా కళ్లలో పడ్డాడు. ఆనంద్ మహీంద్రా సైతం ఆ కుర్రాడి టాలెంట్కు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా? గౌతమ్ అనే యువకుడు జాబ్ కోసం ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అందులో ఏముందంటే.. తాను రూపొందించిన జీప్ ప్రత్యేకంగా కనిపించాలనుకున్నాడు గౌతమ్. ఆందుకే ముందు వెనుక చక్రాలను వేర్వేరుగా కంట్రోల్ చేసేలా ఆ జీప్ను తయారు చేశాడు. ఆ వాహనం ఎలా పని చేస్తుందో చూపించడంతో పాటు ఓ రైడ్ కూడా చేశాడు. ఇదంతా వీడియో తీసి ట్విటర్లో ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ.. ‘ఇందుకే ఈవీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని నమ్ముతున్నా. వినూత్న ప్రయోగాల వల్లే ఆటోమొబైల్లో అమెరికా ఆధిపత్యాన్ని చాటింది. గౌతమ్తో పాటు అలాంటి వ్యక్తులు మరింత ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు బదులిచ్చారు. అలాగే ఈ వీడియోని వేలు మహీంద్రాకు ట్యాగ్ చేసి గౌతమ్ని కలవాలని సూచించారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. మీరు గ్రేట్ సార్, టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. This is why I’m convinced India will be a leader in EVs. I believe America gained dominance in autos because of people’s passion for cars & technology & their innovation through garage ‘tinkering.’ May Gowtham & his ‘tribe’ flourish. @Velu_Mahindra please do reach out to him. https://t.co/xkFg3SX509 — anand mahindra (@anandmahindra) August 20, 2022 చదవండి: ప్రమాదంలో గూగుల్ క్రోమ్ యూజర్లు..కేంద్రం హెచ్చరిక, వెంటనే ఇలా చేస్తే మేలు! -
మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల అభిమానులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ ప్రారంభించే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ ఈ విషయాలు తెలిపారు. ఈవీలను ప్రస్తుత ప్లాంట్లలోనే తయారు చేస్తారా లేక ప్రత్యేకంగా కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘మేం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం వివిధ రాష్ట్రాలు ఎంత మేర సబ్సిడీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించుకుని, తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే, ప్లాంటు ఏర్పాటుకు సబ్సిడీ మాత్రమే ప్రాతిపదిక కాబోదని, వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు తదితర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని జెజూరికర్ తెలిపారు. ‘అసలు ఆటోమోటివ్ వ్యవస్థ అనేదే లేని ప్రాంతానికి వెళ్లాము. అది ఆటోమోటివ్ హబ్ అయి ఉండాలి. వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు ఉండి, ఈవీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెడుతున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. మేము మూడు–నాలుగు అవకాశాలను మదింపు చేసి, తగు నిర్ణయం తీసుకుంటాము’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) ఎగుమతులపై స్పందిస్తూ.. ఇంకా ఏయే మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నది నిర్ణయం తీసుకోలేదని రాజేశ్ చెప్పారు. ఎంఅండ్ఎం ఇటీవలే ఎక్స్యూవీ, బీఈ బ్రాండ్ కింద అయిదు ఎలక్ట్రిక్ వాహనాల మోడల్స్ను ప్రదర్శించింది. 2024–2026 మధ్యలో నాలుగు వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సంప్రదాయ ఇంధనాలతో పనిచేసే వాహనాల తయారీ ప్లాంట్లు ఉన్నాయి. -
టాటా నెక్సాన్కు పోటీ:మహీంద్ర ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 400 లాంచింగ్ డేట్ ఇదే!
సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నమహీంద్రా ఎక్స్యూవీ 400 లాంచింగ్డేట్ రివీల్అయింది. ఇండిపెండెన్స్ డే నాటి స్పెషల్ ఈవెంట్లో ఎక్స్యూవీతోపాటు 5 ఎలక్ట్రిక్ కార్ల (E8, XUV.E9, BE.05, BE.07 BE.09)ను పరిచయం చేసిన మహీంద్రా తాజాగా ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 400 సెప్టెంబర్ 6న విడుదల చేయాలని యోచిస్తోందట. టాటా నెక్సాన్ EVకి ప్రత్యర్థిగా మార్కెట్లోకి అడుగుపెట్టపోతున్న ఈ కారు డెలివరీలు అక్టోబరు నుంచి మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెద్దగా ఆకట్టుకోని REVAi, e2o ,eVerito తరువాత మహీంద్రా తీసుకొస్తున్న తొలి ఈవీ ఇది. ఈ వెహికల్లో 150హెచ్పీ శక్తిని అందించే ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్, రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు. ఎక్స్యూవీ 700 మాదిరిగా క్యాబిన్ లోపల, Adreno X ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ADAS, తదితర ఫీచర్లతో రాబోతుందని అంచనా. -
మహీంద్రా నుంచి కమర్షియల్ వెహికల్ విడుదల..ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తేలికపాటి వాణిజ్య వాహనం కొత్త బొలెరో మ్యాక్స్ పికప్ను విడుదల చేసింది. ధర ఎక్స్షోరూంలో రూ.7.68 లక్షల నుంచి ప్రారంభం. 1,300 కిలోల సరుకును మోయగలదు. వారంటీ మూడేళ్లు లేదా ఒక లక్ష కిలోమీటర్లు. మెరుగైన రవాణా కోసం ఆర్15 టైర్లను వినియోగించారు. 20,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. 2–3.5 టన్నుల తేలికపాటి వాణిజ్య వాహన విభాగంలో కంపెనీకి దక్షిణాదిన 43 శాతం వాటా ఉందని మహీంద్రా ఎస్వీపీ వెంకట్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ భారత్లో 2–3.5 టన్నుల విభాగం మార్కెట్ ఏటా 8,000 యూనిట్లు ఉంది. -
ఎలక్ట్రిక్ ఎస్యూవీ: కొత్త అధ్యాయానికి మహీంద్ర, టీజర్ అదిరింది
సాక్షి,ముంబై: ఆటో మేజర్ మహీంద్ర అండ్ మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో వేగంగా దూసుకొవస్తోంది. ఈ క్రమంలో దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త చరితను లిఖించేందుకు సిద్దపడుతోంది. దీనికి వరుస టీజర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరో టీజర్ను మహీంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బోర్న్ ఎలక్ట్రిక్ విజన్ కింద ఐదు విభిన్న ఆల్ ఎలక్ట్రిక్ -ఎస్యూవీ కాన్సెప్ట్లను ఆవిష్కరింనుంది మహీంద్ర. వీటిని ఆగస్ట్ 15, ప్రపంచ ప్రీమియర్ వేడుకలో ఘనంగా పరిచయం చేయనుంది. ఈ ఎస్యూవీలకు సంబంధించిన ఇప్పటికే తన కార్ల డిజైన్లను హైలైట్ చేస్తూ కొన్ని టీజర్లు వదిలిన సంగతి తెలిసిందే. మహీంద్రా తాజా టీజర్లో ఇన్-కార్ కనెక్టివిటీ ఫీచర్లను సూచనప్రాయంగా వెల్లడించింది. డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మ్యూజిక్, యాంబియంట్ లైటింగ్ వాటిపై కూడా హింట్ ఇచ్చింది. ఐదు ఎలక్ట్రిక్ ఎస్యూవీలలో డిజిటల్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కామన్గా అందింస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే వీటి ఫీచర్లను పెద్దగా వెల్లడించకపోయినప్పటికీ మునుపటి టీజర్ల ప్రకారం కొత్త మోడళ్లలో కూపే, కాంపాక్ట్ SUVలు, మిడ్-సైజ్, ఫాస్ట్బ్యాక్గా ఉండనున్నాయి. అలాగే రానున్న అయిదేళ్లలో ఈ ఐదింటినీ రిలీజ్ చేయనుందని ఒక అంచనా. ఈ ప్యూర్-ఎలక్ట్రిక్ ఎస్యూవీలు మాత్రమే కాదు, మహీంద్రా ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్ని కూడా విడుదల చేయనుంది. టాటా నెక్సాన్ EV మ్యాక్స్, MG ZS EV వంటి నేటి తరం ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రడీ అవుతోంది. ఇప్పటీకే రోడ్లపై పరీక్షిస్తున్న ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్ ఎస్యూవీని 2022 చివరలో లాంచ్ చేయనుంది. -
మహీంద్రా బుకింగ్స్ బీభత్సం.. నిమిషాల్లో రూ.18వేల కోట్ల బిజినెస్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కార్ల బుకింగ్స్లో సరికొత్త రికార్డ్లు సృష్టించింది. ఆ సంస్థకు చెందిన (Scorpio N) స్కార్పియో-ఎన్ మోడల్ కారు బుకింగ్స్ బీభత్సం సృష్టించింది. దీంతో కేవలం నిమిషాల వ్యవధిలో వేల కోట్ల బిజినెస్ జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మహింద్రా కొత్త స్కార్పియో-ఎన్(Mahindra Scorpio N) అధికారిక బుకింగ్స్ (శనివారం) జూలై 30 ప్రారంభమైంది. అలా విడుదల అయ్యిందో లేదో ప్రారంభమైన నిమిషంలోనే 25 వేలు, అరగంటలో లక్ష బుక్సింగ్స్ నమోదయ్యాయి. ఈ విలువ రూ.18వేల కోట్లపైనే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా. కొత్త మహింద్రా స్కార్పియో-ఎన్ ధర ఎక్స్-షోరూంలో పెట్రోల్ వెర్షన్లకు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల మద్యలో ఉండనుంది. అలాగే డీజిల్ వెర్షన్ల ధర రూ.12.5 లక్షల నుంచి రూ.19.5 లక్షల మధ్యలో ఉంది. అయితే కంపెనీ ప్రకటించిన ప్రారంభ ధర కేవలం తొలి 25 వేల బుకింగ్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ సమయంలో ఏ ధర ఉంటుందో దాన్నే కస్టమర్లు కట్టాల్సి ఉంటుంది. మహీంద్రా ఈ కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ప్రక్రియను సెప్టంబర్ 26 నుంచి ప్రారంభించబోతుంది. డిసెంబర్ 2022 నాటికి 20 వేల యూనిట్లకు పైగా స్కార్పియో-ఎన్ వెహికిల్ డెలివరీ చేపట్టాలని సన్నాహాలు కూడా చేస్తోంది. కాగా మహీంద్రాలోని థార్, ఎక్స్యూవీ700 మోడల్స్ కోసం కూడా కస్టమర్లు వేచి చూస్తున్నారు. మరి ఈ బుకింగ్స్ ఏ రికార్డు క్రియేట్ చేస్తోందో వేచి చూడాలి. చదవండి: ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! -
మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్యూవీ700 కార్లను మరోసారి రీకాల్ చేసింది. ఏడబ్యుడీ వేరియంట్లలో ఈసారి రీకాల్ ప్రధాన భాగం భర్తీ కోసంవాహనాలను వెనక్కి తీసుకుంటోంది. నెలరోజుల్లోలనే వాహనాలను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ప్రొపెల్లర్ షాఫ్ట్ సమస్య కారణంగా మహీంద్ర ఎక్స్ యూవీ 700 కార్లను ఇటీవల రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. రియర్ వీల్ కాయిల్ స్ప్రింగ్ల ప్రస్తుత ప్లేస్మెంట్లో ఉన్న సమస్యల కారణంగా మహీంద్ర ఈ రీకాల్ చేసినట్లు తెలుస్తోంది. XUV700 AWDలోని వెనుక చక్రాల కాయిల్ స్ప్రింగ్లు ప్రతి స్ప్రింగ్లో 9 రౌండ్ కాయిల్స్ ఉండేలా మార్పులు చేసింది. అయితే 9 కి బదులుగా 8 రౌండ్ కాయిల్స్ ఉంటే, ఆ కార్లను కొత్త స్ప్రింగ్లతో భర్తీ చేసేందుకు సమీపంలోని సర్వీస్ సెంటర్లో సంప్రదించాలని మహీంద్ర కోరినట్టు తెలుస్తోంది. అయితే ప్రభావిత వాహనాల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. కాగా మహీంద్రా ఎక్స్యూవీ700 2021లో లాంచ్ అయిన పాపులన్ మోడల్. కొన్ని వేరియంట్ల నిరీక్షణ సమయం ఒక సంవత్సరం అంటే దీన్ని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 70వేల ఎక్స్యూవీ700 కార్ల డెలివరీలు పెండింగ్లో ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజుకర్ ఇటీవల వెల్లడించారు. 5 సీట్లు , 7 సీట్ల ఎంపికలతో లభిస్తున్న ఈ కారు ధర 13.18 లక్షలు,(ఎక్స్-షోరూమ్) ప్రారంభం. ఇది కూడా చదవండి: ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్: ధరలు ఎలా ఉన్నాయంటే..!
Mahindra Scorpio N Price, సాక్షి,ముంబై: మహీంద్ర లేటెస్ట్ మిడ్ సైజ్ వెహికల్ 2022 మహీంద్రా స్కార్పియో-N ధరలను కంపెనీ ప్రకటించింది. లాంచ్ అయిన నెల తరువాత ఆల్-న్యూ మహీంద్రా స్కార్పియో-N ఆటోమేటిక్ వేరియంట్లు, టాప్-స్పెక్ 4X4 ట్రిమ్ వేరియంట్ల ధరలు తాజాగా బహిర్గత మైనాయి. వేరియంట్ వారీగా ఈ కారు ధరలు రూ. 11.99 లక్షల నుండి రూ. 23.90 లక్షల (ఎక్స్-షోరూం) వరకు ఉండనున్నాయి. బుకింగ్లు ఆన్లైన్లో, ఏకకాలంలో మహీంద్రా డీలర్షిప్లలో జూలై 30, ఉదయం 11 గంటల నుండి ప్రారంభం. బుకింగ్లు 'ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన, కస్టమర్ ఎంచుకున్న వేరియంట్ను బట్టి డెలివరీ తేదీ ఆధారపడి ఉంటుంది.సెప్టెంబరు 26న ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 15 అర్ధరాత్రి వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే బుకింగ్ ఎడిట్ చేసుకునే చాన్స్ ఉంటుంది. మాన్యువల్ ట్రిమ్ తో పోలిస్తే Z4 నుండి Z8 L వరకు ప్రతి ఆటోమేటిక్ ట్రిమ్ ధర 1.96 లక్షలు అదనం. అంతేకాదు ప్రారంభ ధరలు మొదటి 25,000 బుకింగ్లకు మాత్రమే వర్తిస్తాయని మహీంద్రా తెలియజేసింది. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా స్కార్పియో-ఎన్ గత నెలలో ఇండియాలో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద ప్రారంభించగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 23.90 లక్షలుగా ఉంటుంది. ఐదు ట్రిమ్స్లో లభ్యం. Z2, Z4, Z6, Z8 & Z8 L, అనే వేరియంట్లలో పెట్రోలు, డీజిల్ వెర్షన్లో అందుబాటులో ఉన్నాయి. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్) Z2 రూ.11.99 లక్షలు నుంచి రూ.12.49 లక్షలు Z4 ధరలు: రూ.13.49 లక్షలు, రూ.15.45 లక్షలు, రూ.13.99 లక్షలు, రూ.16.44 లక్షలు రూ.15.95 లక్షలు, రూ.18.40 లక్షలు Z6 ధరల: రూ.14.99 లక్షలు , రూ.16.95 లక్షలు Z8 ధరలు: రూ.16.99 లక్షలు, 18.95 లక్షలు, 17.49 లక్షలు, 19.94 లక్షలు, రూ19.45 లక్షలు రూ.21.90 లక్షలు Z8 L ధర : రూ.18.99 లక్షలు, రూ.20.95 లక్షలు, రూ.19.49 లక్షలు, రూ.21.94 లక్షలు రూ.21.45 లక్షలు, రూ. 23.90 లక్షలు -
టాటా కార్లపై ఆనంద్ మహీంద్రా స్పందన
Anand Mahindra Tweet on Tata Motors: దేశంలో టాటా మోటార్స్, మహీంద్రా వాహనాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. అదే సమయంలో మార్కెట్లో ఆ రెండింటి మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. అయితే ప్రత్యర్థి కంపెనీ గురించి ఎదురైన ఓ ప్రశ్నకు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చారు. ఆ సమాధానం నెటిజన్ల మనసును దోచుకుంటోంది ఇప్పుడు. ఓ ట్విటర్ యూజర్.. మహీంద్రా ఎక్స్యూవీ700 గురించి పొగడ్తలు గుప్పిస్తూ శనివారం నాడు ఓ ట్వీట్ చేశాడు. దానికి ఆనంద్ మహీంద్రా బదులు కూడా ఇచ్చారు. అయితే.. ఆ సంభాషణకు కొనసాగింపుగా మరో యూజర్.. ‘సర్.. టాటా కార్ల మీద మీ ఫీలింగ్ ఏంటి?’ అని ప్రశ్నించాడు. దానికి ఆయన అంతే పాజిటివ్గా స్పందించారు. టాటా మోటార్స్ వంటి బలమైన పోటీదారులు ఉండడం ఎంతో ప్రత్యేకం. వారు తమను తాము(టాటా మోటార్స్) పునర్నిర్మించుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ల ప్రయత్నం మరింత మెరుగ్గా పని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది… పోటీతత్వం అనేది ఎప్పుడూ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది అని చాలా చాలా సానుకూలంగా స్పందించారు ఆనంద్ మహీంద్రా. It’s a privilege to have strong competitors like @TataMotors They keep reinventing themselves and that inspires us to do even better… Competition spurs Innovation.. https://t.co/MwpBYsMOWZ — anand mahindra (@anandmahindra) July 11, 2022 ఎప్పుడూ కూల్గా సమాధానమిచ్చే ఆనంద్ మహీంద్రా.. ఈసారి పోటీ కంపెనీపై ట్వీట్తో ఎంతో మంది మనసులను దోచుకున్నారు కూడా. -
ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీల్లో బీఐఐ పెట్టుబడులు
ముంబై: బ్రిటన్కు చెందిన ఆర్థిక సంస్థ బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ) తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) గ్రూప్లోని ఎలక్ట్రిక్ ఎస్యూవీల తయారీ వ్యాపార విభాగంలో రూ. 1,925 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయనుంది. ఎంఅండ్ఎం కూడా అదే స్థాయిలో రూ. 1,925 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనుంది. ఎస్యూవీల కోసం ఈవీ కంపెనీ పేరిట ఎంఅండ్ఎం అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2024–2027 మధ్య కాలంలో ఈ సంస్థకు దాదాపు రూ. 8,000 కోట్ల వరకూ పెట్టుబడులు సమకూర్చే ప్రతిపాదనలు ఉన్నాయి. సెప్టెంబర్లో తమ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఎక్స్యూవీ 400 వాహనాలను సెప్టెంబర్లో ఆవిష్కరించే అవకాశం ఉందని, 2023 జనవరి–మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కావచ్చని కంపెనీ ఈడీ (ఆటో, ఫార్మ్ సెక్టార్) రాజేశ్ జేజూరికర్ వివరించారు. -
ఎం అండ్ ఎం దూకుడు: వచ్చే సెప్టెంబరులోనే
సాక్షి, ముంబై: దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెక్టార్లో దూసుకుపోనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో తమ ఈవీ ఎక్స్యూఏవీ 400ని ఆవిష్కరించ నున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ గురువారం అర్థరాత్రి రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతలతో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీని లాంచ్ చేస్తామన్నారు. అంతేకాదు 2027 నాటికి తమ ఎస్యూవీలలో 20 శాతం నుండి 30 శాతం వరకు ఎలక్ట్రిక్గా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రిక్ ఎస్యూవీ రంగంలో అగ్రగామిగా ఉండేందుకు మహీంద్రా భారీ కసరత్తే చేస్తోంది. 2022, ఆగస్ట్ 15 న జరిగే యూకే ఈవెంట్లో తమ విజన్ను ప్రకటిస్తామని ఆటో అండ్ అగ్రి విభాగానికి చెందిన రాజేష్ జెజురికర్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రగామిగా ఉన్న తాము భవిష్యత్తులో 4వీల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో కూడా టాప్లో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈవో అనిష్ షా తెలిపారు. తాజాగా ఎంఅండ్ఎం యూకే డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ) తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కొత్త ఫోర్-వీలర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థను తీసుకురానుంది. ఇందులో రూ. 1,925 కోట్ల పెట్టుబడి ఒప్పందాన్ని చేసుకుంది. ఈ సంస్థలో బీఐఐ వాటా 2.75 శాతంగా, ఎం అండ్ ఎం వాటా 4.76 శాతంగా ఉంటుంది. తొలుత ఇరు కంపెనీలు రూ. 1,925 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తాయి. రెండు విడతలుగా, రూ. 70,070 కోట్ల విలువైన మూలధన సమకూర నుందని అంచనా. ఈ డీల్ ప్రకటించిన తర్వాత ఎంఅండ్ఎం షేర్లు ట్రేడింగ్ ఆరంభంలో ఆల్-టైమ్ హైని నమోదు చేశాయి. -
తస్సాదియ్యా: సెమీ కండెక్టర్ల కొరతున్నా కార్ల కొనుగోలు జోరు తగ్గలేదు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీ వాహన విక్రయాలు మేలో జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్తో అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా మహీంద్రా, కియా, టయోటా, హోండా కార్స్, స్కోడా సానుకూల అమ్మకాలను సాధించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ద్వి చక్ర వాహన, ట్రాక్టర్స్ విభాగాల్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ‘‘గత ఏడాది ఇదే సమయంలో కోవిడ్ రెండో దశ కారణంగా కార్ల తయారీ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోవడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అయితే, ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ రికవరీ దశలో ఉంది. ఉత్పత్తి పెరుగుదలతో కార్ల కంపెనీల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది’’ అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ మేనెల మొత్తం అమ్మకాలు 1,61,413 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే మేలో విక్రయించిన 46,555 యూనిట్లతో పోలిస్తే 224 % అధికంగా ఉంది. టాటా మోటార్స్ రికార్డు స్థాయిలో 43,341 యూనిట్ల అమ్మకాలతో 185% వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఏకంగా 626% వృద్ధితో 3,454 ఈవీలను విక్రయించింది. -
మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ వెహికల్, విడుదల ఎప్పుడంటే!
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎక్స్యూవీ 300 ఎస్యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. విద్యుత్ వాహనాలకు సంబంధించి ’బార్న్ ఎలక్ట్రిక్ విజన్’ పేరిట వ్యాపార వ్యూహాన్ని ఈ ఏడాది ఆగస్టులో బ్రిటన్లో ఆవిష్కరించనుంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ ఈ విషయాలు తెలిపారు. ఎక్స్యూవీ 300కి ఎలక్ట్రిక్ వెర్షన్ అయినప్పటికీ కొత్త వాహనం పొడవు 4 మీటర్ల లోపు కాకుండా 4.2 మీటర్ల స్థాయిలో ఉంటుందన్నారు. విద్యుత్ కార్ల తయారీలో ఉపయోగించే మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ మ్యాట్రిక్స్ (ఎంఈబీ) పరికరాల కోసం ఎంఅండ్ఎం ఇటీవలే ఫోక్స్వ్యాగన్తో జట్టు కట్టింది. చదవండి👉ఈ కార్ని ఇప్పుడు బుక్ చేసుకుంటే..డెలివరీ అయ్యేది రెండేళ్ల తర్వాతే! -
మహీంద్రా అండ్ మహీంద్రా, సంస్థ చరిత్రలోనే తొలిసారే ఇలా!
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం భారీగా పెరిగి రూ.1,192 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.245 కోట్లుగానే ఉండడం గమనార్హం. ఆదాయం 28 శాతం పెరిగి రూ.17,124 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.13,356 కోట్లుగా ఉంది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్టాండలోన్ లాభం రూ.4,935 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.984 కోట్లుగానే ఉంది. ఇక ఆదాయం రూ.55,300 కోట్లుగా నమోదైంది. సంస్థ చరిత్రలో ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక స్టాండలోన్ లాభం ఇదేనని ఎంఅండ్ఎం ప్రకటించింది. అలాగే, కంపెనీ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో (ఒక త్రైమాసికానికి) యుటిలిటీ వాహనాలను మార్చి త్రైమాసికంలో విక్రయించినట్టు తెలిపింది. సాగు పరికరాలు, ట్రాక్టర్ల విభాగంలో (ఎఫ్ఈఎస్) కంపెనీ మార్కెట్ వాటా 40 శాతంగా ఉంది. ఎగుమతుల్లో సంస్థ 77 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021–22లో 17,500 ట్రాక్టర్లను సంస్థ ఎగుమతి చేసింది. ఇది కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రికార్డు గరిష్టం కావడం గమనార్హం. క్యూ4లో ఎస్యూవీ ఆదాయం పరంగా చూస్తే నంబర్1 స్థానంలో ఉంది. ‘‘క్యూ4లో పనితీరు మా వ్యాపార బలానికి నిదర్శనం. కరోనా, కమోడిటీ ధరలు, సెమీ కండక్టర్ల కొరత, ఉక్రెయిన్ సంక్షోభం తదితర రూపాల్లో సవాళ్లు ఉన్నప్పటికీ బలమైన ఫలితాలను నమోదు చేశాం. వృద్ధి అవకాశాలను అందుకునేందుకు గ్రూపు కంపెనీలు అన్నీ మంచి స్థితిలో ఉన్నాయి’’ అని ఎంఅండ్ఎం ఎండీ, సీఈవో అనీష్షా తెలిపారు. -
‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్వ్యాగన్లు
ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఫోక్స్ వ్యాగన్ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో మహీంద్రా గ్రూపు తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను ఫోక్స్ వ్యాగన్ సమకూరుస్తుంది. మోటార్, ఇతర ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ను ఎంఈబీ సంస్థ అందిస్తుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. -
మహీంద్రా: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్! ధర ఎంతంటే?!
Mahindra Atom EV: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొనుగోలు దారులు శుభవార్త చెప్పింది. సామాన్యులకు సైతం బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ వెహికల్స్ను వినియోగదారులకు అందిస్తున్నట్లు ప్రకటించింది. మహీంద్రా ఆటమ్ పేరుతో కే1, కే 2,కే3. కే4 అనే నాలుగు వేరియంట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ను మహీంద్రా సంస్థ మార్కెట్కు పరిచయం చేసింది. మొదటి రెండు కే1, కే3 వేరియంట్లు 7.4 కేడ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో, మిగిలిన కే2, కే4లు 11.1కే డ్ల్యూహెచ్ ప్యాక్తో రానున్నాయని తెలిపింది. ఇక ఈ వెహికల్స్ పీక్ పవర్ అవుట్ పుట్ 11పీఎస్గా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఆటమ్ కే1,కే3 వేరియంట్స్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్తో వస్తుండగా..కే2, కే4 వేరియంట్స్లో ఎయిర్ కండిషనర్ సదుపాయం లేదు. 4జీ కనెక్టివిటీతో మొబైల్ డాకింగ్ స్టేషన్ ఫీచర్లు ఉన్నాయి.ఇక ఈ వెహికల్ 2,728 ఎంఎం, 1452 ఎంఎం వైడ్, 1576ఎంఎం పొడవు,1885వీల్ బేస్, 832 కిలోల నుంచి 903 కిలోల బరువుతో కేబిన్లో నలుగురు ప్రయాణికులు, బ్యాక్ సీట్లో 3 ప్రయాణికులు కూర్చునే సదుపాయం ఉంది. ధర ఎంతంటే! మహీంద్రా ఆటమ్ డిజైన్, ఫీచర్ల పరంగా పైసా వసూల్ కారుగా చెప్పవచ్చు. దీని ధర దాదాపు రూ.3 లక్షలుగా ఉండొచ్చనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. మహీంద్రా ఆటమ్ గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా ఉంటుంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ. వరకు నడుస్తుంది. -
వాహన దారులకు మహీంద్రా షాక్! భారీగా పెరిగిన కార్ల ధరలు!
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన దారులకు భారీ షాకిచ్చింది. మహీంద్రా సంస్థకు చెందిన ఎక్స్యూవీ 700 కారు ధరల్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఎక్స్ యూవీ కార్ ధర రూ.13.18 లక్షల నుండి రూ.24.58 లక్షల వరకు పెరిగింది. దేశంలో స్టీల్,అల్యూమినియంతో పాటు ఇతర ముడి ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లే మహీంద్రా సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పెరిగిన ధరలు ఏప్రిల్ 14 నుండి అమల్లోకి వచ్చాయి. హాట్ కేకుల్లా అమ్మకాలు మార్చి 2022లో 6,040 కంటే ఎక్కువ ఎక్స్యూవీ 700లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య మార్చి నెలలో అమ్మిన మొత్తం 4,138 యూనిట్ల కంటే 46 శాతం పెరిగింది. వెహికల్స్ ధరలు పెరుగుతూనే ఉన్నాయ్! మహీంద్రా ఎక్స్ యూవీ 700 పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.71,000, డీజిల్ వెర్షన్ ధర రూ.78,000 వరకు పెరిగాయి. తాజా ధరల జాబితాలో మహీంద్రా ఎక్స్యూవీ700 ఎంటీ పెట్రోల్ ఎంఎక్స్ ట్రిమ్ ధర రూ.12.96 లక్షల నుండి రూ. 13.18 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది. ఈ ఏడాది జనవరిలో రూ.18.63 లక్షలు ఉన్న ఎంటీ పెట్రోల్ ఏఎక్స్ 7 మోడల్ ధర ఇప్పుడు రూ.19.21 లక్షలు పెరిగింది. మహీంద్రా ఎక్స్యూవీ700 పెట్రోల్ ఏటీ ఏఎక్స్ 3ట్రిమ్ ధర రూ.16.57 లక్షల నుండి రూ.16.84 లక్షల వరకు పెరిగింది. అయితే టాప్ ఎండ్ ఏఎక్స్ 7ఎల్ ధర రూ.22.04 లక్షల నుండి రూ.22.75 లక్షల వరకు పెంచుతూ ఈ దేశీయ ఆటోమొబైల్ సంస్థ నిర్ణయం తీసుకుంది. అన్ని మహీంద్రా ఎక్స్యూవీ 700 డీజిల్ మోడల్ ధర పెరుగుదల తర్వాత ఎంటీఎంక్స్ ట్రిమ్ ధర రూ.17.58 లక్షల వరకు పెరగ్గా..ఈ కారు ధర జనవరిలో రూ.17.29 వద్ద ఉంది. ఏఎక్స్7ఎల్ ధర రూ.21.01 లక్షల నుండి రూ.21.66 లక్షలకు, మహీంద్రా ఎక్స్యూవీ 700 ఏఎక్స్3 డీజిల్ ఏటీ మోడల్ కాగా,ఏఎక్స్ 7ఎల్ ఏడబ్ల్యూడీ ధర రూ.24.50 లక్షలుగా ఉంది. మహీంద్రా ఎక్స్యూవీ700తో పాటు థార్,బొలెరో,స్కార్పియో,ఎక్స్యూవీ 300 మోడళ్ల ధరల్ని పెంచింది. -
ఈసారి మహీంద్రా వంతు?
గడిచిన ఆరు నెలలుగా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక్కో కంపెనీ ధరలు పెంచుతూ పోతుంది. తాజాగా ఈ జాబితాలో మహీంద్రా గ్రూపు చేరింది. వాహనాల తయారీలో ఉపయోగించే ముడి వస్తువుల ధరలు పెరిగాయంటూ ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. సగటున 2.5 శాతం ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. మహీంద్రా గ్రూపు నుంచి థార్, ఎక్స్యూవీ సిరీస్, బొలేరో వంటి వెహికల్స్కి మార్కెట్లో మంచి వాటా ఉంది. తాజాగా పెంపుతో వివిధ మోడళ్లు, వేరియంట్లను బట్టి కనిష్టంగా రూ.10,000ల నుంచి గరిష్టంగా రూ.63,000ల వరకు కొనుగోలుదారులపై భారం పడనుంది. కార్ల తయారీలో ఉపయోగించే స్టీల్, పల్లాడియం, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధర పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ మహీంద్రా గ్రూపు వివరణ ఇచ్చింది. ధరల పెంపుకు రెండు రోజుల ముందు మహీంద్రా పోర్ట్ఫోలియోలో పెద్దగా డిమాండ్ లేని కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత రన్నింగ్ మోడళ్లపై ధరను పెంచింది. చదవండి: పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన మహీంద్రా...! -
ఎలక్ట్రిక్ కారు కొనేవారికి మహీంద్రా తీపికబురు.. ఈ ఏడాదిలోనే!
మీరు కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. మహీంద్రా అండ్ మహీంద్రా 2020 ఆటో షో ఎక్స్పోలో ప్రదర్శించిన ఈకెయువీ 100 ఎలక్ట్రిక్ కారుని ఈ ఏడాదిలో లాంచ్ చేయలని చూస్తున్నట్లు సమాచారం. అయితే, గత ఆటో షో ఎక్స్పోలో ఈకేయూవీ100ని ప్రదర్శించిన సమయంలో పేర్కొన్న ధరకు లాంచ్ చేయడానికి కంపెనీ ఒత్తిడిలో ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 2020 ఆటో షో ఎక్స్పోలో ఫేమ్ ప్రోత్సాహకాలతో కలిపి ఈకేయూవీని రూ.8.25 లక్షల(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 300ని 2023 ప్రారంభంలో తీసుకొని రావడానికి ప్లాన్ చేస్తుంది. అయితే, ఈకేయూవీ100 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ చివరి దశలో ఉందని, 2022 చివరి నాటికి మార్కెట్లోకి వస్తుందని మార్కెట్ వర్గాల సమాచారం. మహీంద్రా గతంలో విడుదల చేసిన ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈకేయూవీ100పై ఎక్కువ మీద అంచనాలు పెరిగాయి. కనీసం 250 కిలోమీటర్ల గరిష్ట రేంజ్, రూ.10 లక్షల లోపు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా తీసుకొని రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో ట్రియో, ఈఅల్ఫా వంటి ఉత్పత్తులతో ఇప్పుడిప్పుడే తన మార్కెట్ విస్తరిస్తుంది. వ్యక్తిగత విభాగంలో ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్ఫోలియోతో ప్రత్యర్థి టాటా మోటార్స్ ఇటీవలి కాలంలో 70% కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో ముందుకు సాగింది. అంతకుముందు మార్చి 2021లో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్(ఎంఈఎంఎల్) అనే అనుబంధ సంస్థను కంపెనీలోకి ఏకీకృతం చేసింది. ఈ రంగంలో కంపెనీ 3000 కోట్ల రూపాయలను మూలధన పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. (చదవండి: ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.30 వేల యాపిల్ ఐఫోన్ రూ.15 వేలకే..!) -
క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తాజాగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. హోళీ సందర్భంగా పలు కార్లపై మహీంద్రా భారీ తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా ఆయా మోడల్స్పై ఏకంగా రూ.3.02 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడల్స్పై మహీంద్రా అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! మహీంద్రా KUV100 NXT మహీంద్రా కాంపాక్ట్ ఎస్యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 20,000 వరకు కొనుగోలుదారులకు లభించనుంది. మహీంద్రా XUV300 మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 వరకు విలువైన ఉచిత యాక్సెసరీలను అందిస్తోంది. ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మహీంద్రా స్కార్పియో మహీంద్రా స్కార్పియో కారు కొనుగోలుపై ఎటువంటి నగదు తగ్గింపును అందించడం లేదు. అయితే కొనుగోలుదారులు రూ. 15,000 పైగా విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చు. ఈ కారు కొనుగోలుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000 కూడా అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా అల్టురాస్ మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై ఏకంగా రూ. 2.2 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది .దాంతో పాటుగా రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది.అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చును. మహీంద్రా మరాజ్జో మహీంద్రా మరాజో ఎస్యూవీ బేస్ M2 ట్రిమ్పై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, ఇతర ట్రిమ్ వేరియంట్స్పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు..! -
సూపర్ ఐడియా మహీంద్రా.. సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు క్యారవాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. భారత్లో క్యాంపర్స్ వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం కారవాన్ల తయారీ కంపెనీ క్యాంపర్వాన్ ఫ్యాక్టరీతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పలు మోడళ్లలో అందుబాటు ధరలో కారవాన్లను కంపెనీ రానున్న రోజుల్లో భారత్లో పరిచయం చేస్తుంది. ఐఐటీ మద్రాస్ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లీన్ వాటర్, సెయింట్ గోబెయిన్ రీసెర్చ్ సెంటర్ సైతం ఈ వాహనాల అభివృద్ధిలో మహీంద్రాకు సాయం చేస్తాయి. కారవాన్ విభాగంలో ఇటువంటి ఒప్పందం భారత వాహన తయారీ రంగంలో ఇదే తొలిసారి అని మహీంద్రా వెల్లడించింది. ఐఐటీ మద్రాస్లో క్యాంపర్వాన్ ప్రాణం పోసుకుంది. డబుల్ క్యాబ్ బొలెరో క్యాంపర్ గోల్డ్ ప్లాట్ఫామ్పై క్యాంపర్స్ రూపుదిద్దుకుంటాయి. కుటుంబం, స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్లేవారికి కారవాన్ వాహనాలు సౌకర్యంగా ఉంటాయి. నలుగురు కూర్చుని భోజనం చేయడానికి, పడుకోవడానికి కారవాన్లో ఏర్పాట్లు ఉంటాయి. బయో టాయిలెట్తో కూడిన రెస్ట్ రూమ్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, ఏసీ, టీవీ వంటివి పొందుపరుస్తారు. చదవండి: Toyota Tocozilla: ఇది ట్రక్కు కాదు నడిచే ఇల్లు.. అచ్చంగా హీరోల తరహాలో -
పుంజుకున్న వాహన విక్రయాలు
ముంబై: సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం వెంటాడినా.., దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరిలో వృద్ధి బాటపట్టాయి. మూడో దశ లాక్డౌన్ ఆంక్షల సడలింపు ప్యాసింజర్ వాహన విక్రయాలకు కలిసొచ్చింది. గత నెలలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఎంజీ మోటార్స్ విక్రయాలు పెరిగాయి. అయితే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టయోటా, హోండా కార్ల అమ్మకాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. మరోవైపు ద్విచక్ర వాహనాలు విక్రయాలు డీలాపడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సంపద్రాయ టూ వీలర్స్ అమ్మకాలపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తోంది. హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు వరుసగా 29% 6%, 15% చొప్పున క్షీణించాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. బేస్ ఎఫెక్ట్ కారణంగా ట్రాకర్ల అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ‘‘దేశంలో గత మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత లీటరు ఇంధన ధరలు రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం మార్చి వాహన విక్రయాలపై ప్రతికూలతను చూపొచ్చు’’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న థార్, మహీంద్రా ఎక్స్యూవీ 700
దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరిలో మొత్తం 54,455 వాహనాలను విక్రయించినట్లు సంస్థ నేడు(మార్చి 1) తెలిపింది. యుటిలిటీ వేహికల్స్ సెగ్మెంట్'లో మహీంద్రా 27,551 వాహనాలను విక్రయించింది. అలాగే, ప్యాసింజర్ వేహికల్స్ సెగ్మెంట్'లో 27,663 వాహనాలను విక్రయించింది. ముంబైకి చెందిన ఈ ఆటో మేజర్ గత నెల 2,814 వాహనాలను ఎగుమతి చేసింది. గత నెలలో థార్, ఎక్స్యూవీ 700 సిరీస్ వంటి వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సంస్థ పేర్కొంది. కేవలం ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాల విక్రయాలు 79 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కమర్షియల్ వేహికల్స్ సెగ్మెంట్'లో మహీంద్రా ఫిబ్రవరి 2022లో 119% వృద్ధిని నమోదు చేసింది. భారీ వాణిజ్య వాహనాల అన్ని లైట్ కమర్షియల్ వాహనాలు కూడా మంచి వృద్దిని కనబరిచాయి. ఎమ్ అండ్ ఎమ్ లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. "మొత్తం మీద 54,455 వాహనాల అమ్మకాలతో ఫిబ్రవరి 2022లో 89 శాతం వృద్ధిని సాధించాం. అన్ని విభాగాలు ఎస్యూవీలతో సహా ఇతర వాహనాలు మంచి వృద్దిని కనబరిచాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో డిమాండ్ పేరిగిందని మేము భావిస్తున్నాము. సెమీ కండక్టర్ కొరత ఉన్న కూడా ఆ విధంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాము" అని అన్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!) -
మహీంద్రా కార్లపై బంపరాఫర్, ఏకంగా రూ.80వేల వరకు డిస్కౌంట్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఫిబ్రవరి నెల వరకు పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్యూవీ300, స్కార్పియో, అల్ట్రాస్ జీ4, బొలెరో, మరాజో మోడళ్లపై డిస్కౌంట్లలో సొంతం చేసుకోవచ్చు. ►బొలెరో నియోపై ఆఫర్లు లేనప్పటికీ, బొలెరో ఎస్యూవీపై రూ.3వేల కార్పొరేట్ తగ్గింపు, రూ.15వేల వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.6వేల వరకు డిస్కౌంట్కే లభిస్తుంది. ►మరాజో మూడు వేరియంట్లలో ఆఫర్లో కొనుగోలు చేయోచ్చు. ఇందులో ఎం2,ఎం4 ప్లస్, ఎం6 ప్లస్ వేరియంట్లపై రూ.20,000 వరకు డిస్కౌంట్,రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్,రూ.5,200 కార్పొరేట్ ప్రయోజనాల్ని అందిస్తుంది. ►మహీంద్రా ఎక్స్యూవీ 300 కాంపాక్ట్ ఎస్యూవీ ఈ నెలలో రూ.30,003వరకు డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.4,000 వరకు కార్పొరేట్ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. రూ.10వేల వరకు ఇతర ఆఫర్లకే అందిస్తుంది. ►మహీంద్రా ఆల్ట్రాస్ జీ4పై భారీ డిస్కౌంట్కే అందిస్తుంది. ఎక్ఛేంజ్ బోనస్ రూ.50,000, రూ.11,500 వరకు కార్పొరేట్ తగ్గింపు, రూ.20,000 వరకు ఇతర అదనపు ఆఫర్లు ఉన్నాయి. ►ఇది కాకుండా స్కార్పియో రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.4,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు, రూ.15,000 వరకు ఇతర తగ్గింపులతో అందిస్తుంది. -
మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు!!
మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల కొనుగోలు దారులకు భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన పలు మోడళ్లపై రూ.80000 వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా తగ్గించే కార్లలో అత్యంత ఖరీదైన కారుగా ఆల్ట్రాస్ జీ4 ఎస్యూవీ నిలించింది. ఈ కారుపై రూ.81,500వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. కాగా ఆల్ట్రాస్ జీ4 ఎస్యూవీ దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్ కార్లకు ప్రత్యర్ధిగా నిలిచిన విషయం తెలిసిందే. మహీంద్రా ఆల్టురాస్ జీ4 రూ.50,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లు అదనంగా రూ.31,500 వరకు పొందవచ్చు. మహీంద్రా సబ్కాం పాక్ట్ ఎస్యూవీ ఎక్స్యూవీ 300 కారుపై మహీంద్రా రూ.69,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ కారు రూ.30వేల తగ్గింపుతో పాటు మహీంద్రా ఎక్స్యూవీ 300ని ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.25,000, కార్పొరేట్ తగ్గింపు రూ.4,000, రూ.10,000 విలువైన ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. మహీంద్రా మనదేశంలో ఎక్స్యూవీ 300 ఎస్యూవీని 16 వేరియంట్లలో అందిస్తోంది. బేస్ 1.2-లీటర్ పెట్రోల్ డ్ల్యూ4 వేరియంట్ ధర రూ.8.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఎస్యూవీ కేయూవీ 100నెక్ట్స్ రూ.60,000 కంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఎస్యూవీకి ఇతర ప్రయోజనాలతో పాటు రూ38,000 విలువైన నగదు తగ్గింపును అందిస్తోంది. మొత్తం రూ.61,000వరకు ఉంటుంది. ఈ మూడు ఎస్యూవీలతో పాటు, మహీంద్రా ఈ నెలలో స్కార్పియోకు రూ.34,000, బొలెరో ఎస్యూవీలకు రూ.24,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. -
అదిరిపోయిన మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల టీజర్..!
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఆలస్యంగానైనా అదిరిపోయే రీతిలో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతుంది. గత ఏడాది తన ప్రతిష్టాత్మక బోర్న్ ఎలక్ట్రిక్ వేహికల్ ఫ్లాట్ ఫారాన్ని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లాట్ ఫారం వేదికగా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్దం అవుతుంది. ఈ ఏడాది జూలైలో 'బోర్న్ ఎలక్ట్రిక్ విజన్'ను ఆవిష్కరించనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా ప్రకటించింది. బోర్న్ ఈవీ ప్లాట్ ఫామ్ కింద కంపెనీ త్వరలో తీసుకొని రాబోయే ఎలక్ట్రిక్ కార్లను టీజర్ రూపంలో విడుదల చేసింది. ఈ వీడియోలో మూడు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్యువీలను చూపించింది. ఈ ఎలక్ట్రిక్ కార్లను రాబోయే ఎక్స్యువీ 300, ఎక్స్యువీ 700, ఎక్స్యువీ 900 ఆధారంగా తయారు చేయవచ్చు అని సమాచారం. ఈ రాబోయే ఈవీలను యుకెలోని గ్లోబల్ డిజైన్ సెంటర్ మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరోప్(మేడ్) రూపొందించినట్లు టీజర్ వెల్లడించింది. గత సంవత్సరం, ఎం అండ్ ఎం తన రాబోయే ప్యాసింజర్ కార్ల కోసం ఒక రోడ్ మ్యాప్ విడుదల చేసింది. వీటిని మొదట 2025, 2026 మధ్య ప్రారంభించాల్సి ఉంది. అయితే, కంపెనీ అతి త్వరలో బయటకు తీసుకువస్తారని ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాల ఆధారంగా త్వరలో మరికొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తుంది. Welcome to a reimagined world of Born Electric vehicles. Electrifying presence & exhilarating performance brought to you by our team of global designers, engineers and experts. Starting today, we reveal our Born Electric Vision. Coming soon | July 2022#BornElectricVision pic.twitter.com/yiNqRmHEur — Mahindra Born Electric (@born_electric) February 11, 2022 (చదవండి: మరోసారి టాటా సన్స్ ఛైర్మన్గా చంద్రశేఖరన్ నియామకం..!) -
ఎంఅండ్ఎం లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం రెండున్నర రెట్లు ఎగసి రూ. 1,353 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 531 కోట్లు ఆర్జించింది. శాంగ్యాంగ్ మోటార్ దివాలా కారణంగా రూ. 1,210 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టడం గతేడాది క్యూ3పై ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదా యం 8% వృద్ధితో రూ. 15,239 కోట్లకు చేరింది. ట్రాక్టర్ అమ్మకాలు డీలా... ప్రస్తుత సమీక్షా కాలంలో ఎంఅండ్ఎం 2 శాతం తక్కువగా 1,18,174 వాహనాలను విక్రయించింది. ట్రాక్టర్ల అమ్మకాలు 9% క్షీణించి 91,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. కాగా.. ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం రూ. 1,268 కోట్ల నుంచి రూ. 1,987 కోట్లకు జంప్చేయగా.. మొత్తం ఆదాయం రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,594 కోట్లకు పుంజుకుంది. ఈవీ విభాగంలో ఇప్పటికే త్రిచక్ర వాహనాలతో పట్టు సాధించగా.. ఫోర్వీలర్ మార్కెట్లోనూ నాయకత్వ స్థాయికి ఎదిగే వీలున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిష్ షా పేర్కొన్నారు. క్యూ3లో సెమీకండక్టర్ కొరతతో 20,000 యూనిట్ల ఉత్పత్తి నష్టం ఏర్పడినట్లు కంపెనీ ఆటో విభాగం సీఈవో వీజే నక్రా వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు 1.5 శాతం నీరసించి రూ. 853 వద్ద ముగిసింది. -
టాటా నెక్సన్ ఈవీకి పోటీగా అదరగొడుతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ కారు..!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా టాటా నెక్సన్ ఈవీకి పోటీగా అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతుంది. మహీంద్రా కంపెనీ నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్యువి కారును రోడ్ మీద టెస్టింగ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎస్యువి కారు పెట్రోల్, డీజిల్ కారు ప్రస్తుత ఎక్స్యువి 300 మోడల్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకు ఎక్స్యువి 400 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు గనుక మార్కెట్లోకి వస్తే టాటా మోటార్స్ నెక్సన్ ఈవీతో పోటీ పడనుంది. ఈ మహీంద్రా ఈ- ఎక్స్యువి400 కారు 350 నుంచి 380 వోల్ట్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్ సహాయంతో రానుంది. ఒకవేళ మహీంద్రా ఈ సైజు బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే, అదే విధమైన బ్యాటరీ ప్యాక్ ఉన్న నెక్సన్ ఈవికి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా ఉంటుంది. ముంబైకి చెందిన ఈ సంస్థ 2027 నాటికి ఎనిమిది ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు, మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ కారు బయటకు రాలేదు. ఈ ఏడాది చివరి నాటికి ఎక్స్యువి400 కారు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కారుకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు. (చదవండి: పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం అమెరికా..!) -
మారుతికి షాకిచ్చిన మహీంద్రా, టాటాలు
Auto Sales In January 2022: దేశీయ ఆటో తయారీ కంపెనీల జనవరి వాహన విక్రయ గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఈ 2022 ఏడాది తొలి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ వాహన అమ్మకాలు క్షీణించాయి. అయితే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే జనవరిలో ద్విచక్ర వాహన కంపెనీలైన బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ అమ్మకాల్లో రెండెంకల క్షీణత నమోదైంది. మూడోదశ లాక్డౌన్ ప్రభావంతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ అమ్మకాలు తగ్గాయి. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతో వాహన ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరగలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. - మారుతీ సుజుకి ఇండియా జనవరిలో మొత్తం అమ్మకాలు 3.96 శాతం పడిపోయి 1,54,379 యూనిట్లకు చేరింది. గతేడాది 2021 జనవరిలో కంపెనీ 1,60,752 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. - ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో ఈ సంస్థ 59,866 కార్లను అమ్మగా.. ఈ 2022 జనవరిలో 76,210 యూనిట్లను అమ్మింది. - ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ అమ్మకాలు 15 శాతం క్షీణించాయి. గతేడాది జనవరిలో 4.25 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ ఏడాది తొలి నెలలో 3.63 లక్షల యూనిట్లకు పరిమితమైంది. చదవండి: ప్రభుత్వం చేయలేనిది.. టాటా గ్రూపు చేసి చూపింది -
మహీంద్రా షోరూంలో అవమానం.. ఇంటికే బొలెరో డోర్ డెలివరీ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహీంద్రా ఆటోమొబైల్స్, కర్నాటక రైతు కెంపెగౌడల మధ్య వివాదం ఇప్పుడు సుఖాంతమైంది. మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానంపై ఆ కంపెనీ యాజమాన్యం స్పందించింది. కంపెనీ వాగ్దానం చేసినట్లుగా నేరుగా ఆయన ఇంటికే బొలెరో పికప్ ట్రక్కును తీసుకెళ్లి అధికారులు అందించారు. షోరూంలో పని చేసే సిబ్బంది, అధికారులు ఆయనకు క్షమాపణలు చెప్పారు. రైతుకు, ఆయన స్నేహితులకు జరిగిన అవమానం పట్ల తాము చింతిస్తున్నామని, ఇచ్చిన మాటకు కట్టుబడి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. తమ వాహనాన్ని స్వీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా.. "మహీంద్రా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఇతర సిబ్బంది నా ఇంటికి వచ్చి షోరూంలో జరిగిన దానికి క్షమాపణ లు చెప్పారు. వారు ఇచ్చిన మాటకు కట్టుబడి వాహనాన్ని సాయంత్రం నాటికి నాకు డెలివరీ చేశారు" అని పేర్కొన్నారు. వెల్కమ్ టూ మహీంద్రా 2022 జనవరి 21న కెంపెగౌడకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తాజాగా ప్రకటించింది మహీంద్రా రైజ్. జరిగిన ఘటనపై తగు చర్యలు తీసుకున్నామని, సమస్య సమసిపోయిందని తెలిపింది. మహీంద్రా వాహనం కొనుగోలు చేయాలనుకున్నందుకు కెంపెగౌడకు కృతజ్ఞతలు తెలిపింది. వివాదం సమసిపోయినందున మహీంద్రా వాహనం కొనాలంటూ కెంపెగౌడని కోరుతూ ట్వీట్ చేసింది. దీన్ని రీట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. మహీంద్రా ఫ్యామిలీలో చేరాలంటూ కెంపెగౌడకి వెల్కమ్ చెప్పారు. అయితే ఇంతటి వివాదానికి కారణమైన సేల్స్మన్పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే అంశాలను మహీంద్రా గ్రూపు స్పష్టంగా ప్రకటించలేదు. And let me add my welcome to Mr. Kempegowda…🙏🏽 https://t.co/BuKnTNov42 — anand mahindra (@anandmahindra) January 28, 2022 అసలు వివాదం కెంపెగౌడ అనే రైతు కారు కొనేందుకు కర్నాటకలోనిన తుముకూరులో ఉన్న మహీంద్రా షోరూమ్కి వెళ్లగా.. నీకు కారు కొనే స్థోమత లేదంటూ సేల్స్మాన్ అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో గంట వ్యవధిలోనే రూ.10 లక్షలతో వచ్చిన సదరు రైతు ఇప్పటికిప్పుడు వాహానం డెలివరీ చేస్తారా? అంటూ సవాల్ విసిరాడు. డెలివరీ చేయలేమంటూ షోరూం సిబ్బంది చెప్పారు. మహీంద్రా వాహనం కొనాలని ఇక్కడకు వచ్చానని, కానీ తనకు జరిగిన అవమానంతో వేరే కంపెనీ వాహనం కొంటాను అంటూ వెళ్లిపోయాడు కెంపెగౌడ. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. (చదవండి: దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్.. ఎక్కడో తెలుసా?) -
మహీంద్రాపై కర్నాటక రైతు ప్రతీకారం.. వివాదంలో మరో మలుపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహీంద్రా ఆటోమొబైల్స్, కర్నాటక రైతు కెంపెగౌడల మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. సేల్స్మన్ అనుచిత ప్రవర్తనతో అవమానికి గురైన రైతుకి ఏకంగా మహీంద్రా గ్రూపు సీఈవో నుంచి ఆహ్వానం అందింది. డ్యామేజ్ కంట్రోల్ రైతును అవమానించిన ఘటనతో మహీంద్రా గ్రూపుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. వెంటనే మహీంద్రా రైస్ గ్రూపుతో పాటు ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇది మా పాలసీ కాదంటూ స్పందించారు. ఈ చర్యకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయంటూ ప్రకటించారు. ఐపన్పటికీ ఈ వివాదం సోషల్ మీడియాలో రగులుతూనే ఉంది. మహీంద్రాపై ట్రోల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు చేపట్టింది మహీంద్రా రైజ్. వెల్కమ్ టూ మహీంద్రా 2022 జనవరి 21న కెంపెగౌడకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తాజాగా ప్రకటించింది మహీంద్రా రైజ్. జరిగిన ఘటనపై తగు చర్యలు తీసుకున్నామని, సమస్య సమసిపోయిందని తెలిపింది. మహీంద్రా వాహనం కొనుగోలు చేయాలనుకున్నందుకు కెంపెగౌడకు కృతజ్ఞతలు తెలిపింది. వివాదం సమసిపోయినందున మహీంద్రా వాహనం కొనాలంటూ కెంపెగౌడని కోరుతూ ట్వీట్ చేసింది. దీన్ని రీట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. మహీంద్రా ఫ్యామిలీలో చేరాలంటూ కెంపెగౌడకి వెల్కమ్ చెప్పారు. అయితే ఇంతటి వివాదానికి కారణమైన సేల్స్మన్పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే అంశాలను మహీంద్రా గ్రూపు స్పష్టంగా ప్రకటించలేదు. ఇదీ వివాదం కెంపెగౌడ అనే రైతు కారు కొనేందుకు కర్నాటకలోనిన తుముకూరులో ఉన్న మహీంద్రా షోరూమ్కి వెళ్లగా.. నీకు కారు కొనే స్థోమత లేదంటూ సేల్స్మాన్ అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో గంట వ్యవధిలోనే రూ.10 లక్షలతో వచ్చిన సదరు రైతు ఇప్పటికిప్పుడు వాహానం డెలివరీ చేస్తారా? అంటూ సవాల్ విసిరాడు. డెలివరీ చేయలేమంటూ షోరూం సిబ్బంది చెప్పారు. మహీంద్రా వాహనం కొనాలని ఇక్కడకు వచ్చానని, కానీ తనకు జరిగిన అవమానంతో వేరే కంపెనీ వాహనం కొంటాను అంటూ వెళ్లిపోయాడు కెంపెగౌడ. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చదవండి: Mahindra Showroom: రైతు ప్రతీకారం అదిరింది.. సినిమాలోని ట్విస్ట్ మాదిరిగా ఉంది -
పెట్రోల్ డీజిల్ కష్టాలకు చెక్! మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ ఆటో
Mahindra launches electric three-wheeler: పెరుగుతున్న ఫ్యూయల్ రేట్లు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతుంటూ ఆటోలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి ఆదాయానికి గండి పెడుతున్నాయి. ఫ్యూయల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న ప్రముఖ కంపెనీల నుంచి వాహనాలు రావడం లేదనే లోటు ఉండేది. తాజాగా మహీంద్రా గ్రూపు ఈ లోటును భర్తీ చేసింది. ఈ ఆల్ఫా కార్గో పేరుతో త్రీ వీలర్ ఈవీ సెగ్మెంట్లోకి మహీంద్రా గ్రూపు అడుగు పెట్టింది. 2022 జనవరి 18న ఈ ఆల్ఫా కార్గో ను ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఢిల్లీ ఎక్స్షోరూం ధర 1.44 లక్షలుగా ఉంది. ఒక్కసారి ఈ వాహనాన్ని ఛార్జ్ చేస్తే 310 కిలోల లోడుతో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్లు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నంత తేలిగా ఈ ఆల్ఫాను ఛార్జ్ చేయోచ్చని మహీంద్రా చెబుతోంది. ఫ్యూయల్ రేట్లు పెంచిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో కార్గో సేవలు అందించే ఆటోడ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. కార్గో సేవల్లో వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం ఫ్యూయల్కే పోతుంది. ఇ ఆల్ఫాతో ఈ సమస్య తీరిపోతుందని మహీంద్రా చెబుతుంది. ప్యాసింజర్ విభాగంలో ఈ ఆల్ఫా మినీ కూడా మహీంద్ర పోర్ట్ఫోలియోలో ఉంది. -
సంచలన ఆఫర్.. అధిక మైలేజీ గ్యారెంటీ.. లేదంటే బండి వాపస్!
దేశీ ఆటోమొబైల్ కంపెనీల్లో మహీంద్రాకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఎస్యూవీ కేటరిగిలో ఇప్పటికే పాతుకుపోయిన మహీంద్రా తాజాగా హెవీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ మార్కెట్పై కన్నేసింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సంచలన ఆఫర్ ప్రకటించింది. మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ట్రక్ బస్ (ఎంటీబీ) ఇటీవల ప్రకటించిన ఆఫర్ ఆటోమొబైల్ సెక్టార్లో సంచలనంగా మారింది. ఎంబీటీ నుంచి వచ్చే కమర్షియల్ వెహికల్స్లో 3.50 టన్నుల నుంచి 55 టన్నుల లోడు వరకు ఉండే లైట్, మీడియం, హెవీవెహికల్స్ మైలేజీపై ఛాలెంజ్ విసిరింది. బీఎస్ 6 టెక్నాలజీతో వస్తున్న ఈ వాహనాలు అధిక మైలేజీని అందిస్తాయని హామీ ఇస్తోంది. ఎవరైన మైలేజీపై అసంతృప్తి చెందితే వాహనాన్ని వెనక్కి తీసుకుంటామంటూ ప్రకటించింది. ఎంబీటీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో హెచ్సీవీ బ్లాజో ఎక్స్, ఐవీసీ ఫురియో, ఎస్సీవీ ఫురియో 7 , జయో రేంజ్ వాహనాలు ఉన్నాయి. అధిక మైలేజీ వచ్చేందుకు వీలుగా ఈ వాహనాల్లో 7.2ఎల్ ఎం పవర్ ఇంజన్, ఎండీఐ టెక్ ఇంజన్, ఫ్యూయల్ స్మార్ట్ టెక్నాలజీ, కటిండ్ ఎడ్జ్ ఐమాక్స్ టెలిమాటిక్ సొల్యూషన్ తదితర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. కమర్షియల్ వాహనాలకు సంబంధించి 60 శాతం ఖర్చు ఫ్యూయల్కే అవుతుంది. తాజాగా పెరిగిన ధరలు మరింత ఇబ్బందిగా మారాయి. దీంతో అధిక మైలేజీకి మహీంద్రా ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో గెట్ మోర్ మైలేజ్ ఆర్ గీవ్ బ్యాక్ ట్రక్ పాలసీని హెచ్సీవీ బ్లాజో ట్రక్ విషయంలో మహీంద్రా ప్రకటించింది. 2016లో ఈ ఆఫర్ తేగా ఒక్క వాహనం కూడా వెనక్కి రాలేదు. దీంతో ఇప్పుడు కమర్షియల్ సెగ్మెంట్లో బీఎస్ 6 ఇంజన్లు అన్నింటికీ దీన్ని వర్తింప చేయాలని మహీంద్రా నిర్ణయం తీసుకుంది. -
ఈవీ డిమాండ్ పెరగడంతో జతకట్టిన హీరో-మహీంద్రా..!
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో వాహనాల కొరతను అధిగమించేందుకు భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలలో ఒకటైన హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా & మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒప్పందాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రా గ్రూప్కి చెందిన పితంపూర్ ప్లాంట్లో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా, ఎన్ వైఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నారు. ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొరతను అధిగమించే అవకాశం ఉంది. హీరో ప్రస్తుతం తనకున్న లూధియానా ప్లాంట్ విస్తరణతో 2022 నాటికి ఏడాదికి 1 మిలియన్ ఈవీలను తయారు చేయాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలదు. ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రకు చెందిన ప్యుగోట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ తయారు చేసే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం వల్ల కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీలను తయారు చేయడానికి ఆర్ అండ్ డి బృందాల మధ్య ఎటువంటి ఆటంకం లేకుండా నాలెడ్జ్ షేరింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం భవిష్యత్లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొరత ఏర్పడకుండా చూసేందుకు అవకాశం ఉంటుంది రెండు కంపెనీలు తెలిపాయి. హీరో ఎలక్ట్రిక్ ఇప్పటివరకు 12 మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడంతో పాటు దేశవ్యాప్తంగా 4 లక్షల కస్టమర్లను సంపాధించుకుంది. అలాగే, ఇండియా మొత్తం ఇప్పటి వరకు 2 వేల ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసింది. (చదవండి: బేర్ దెబ్బకు 18 వేల పాయింట్స్ కిందకు పడిపోయిన నిఫ్టీ..!) -
కొత్త స్కీం: మైలేజ్ ఇవ్వని వాహనాలు వాపస్ ఇచ్చేయండి!
ఏ కంపెనీ అయినా ఇలాంటి ప్రకటన ఇస్తుందా? అనే అనుమానం రావొచ్చు. కానీ, మహీంద్రా గ్రూపు ఈ ఆసక్తికర స్కీంతో వాహనదారుల్ని ఆకట్టుకుంటోంది. అధిక మైలేజీ ఇవ్వని వాహనాలను వెనక్కి ఇచ్చేయొచ్చంటూ వాహనదారులకు ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు మహీంద్రా ట్రక్ అండ్ బస్ (ఎంటీబీ) చేసిన ప్రకటన ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎంటీబీ రూపొందించే బీఎస్6 ట్రక్కుల శ్రేణిలో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని పేర్కొంది మహీంద్రా కంపెనీ. బీఎస్6 శ్రేణిలో భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాలు ఉపయోగించేవాళ్లకు ఈ స్కీం వర్తిస్తుందని ప్రకటించుకుంది. ‘పోటీ కంపెనీ వాహనాల కంటే మా వాహనాలు మైలేజీ తక్కువ గనుక ఇస్తే.. వాహనదారులు నిరభ్యరంతంగా మా వాహనాల్ని వెనక్కి ఇచ్చేయొచ్చ’ని స్కీం గురించి వివరించింది కంపెనీ. ఈ మేరకు ‘బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ, ఫ్యూరియో ఐసీవీ, ఫ్యూరియో 7, జేయో’ మోడల్ వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎంటీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే.. ఎండీఐ టెక్ ఇంజిన్లు, ఫ్యూయల్ స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎంటీబీ ఈ రవాణా వాహనాల్ని తయారు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదారుల పరంగా చూస్తే ఇది సరైన పథకం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో వీజయ్ నక్రా చెబుతున్నారు. ‘మహీంద్రా సంస్థ సాంకేతిక సామర్థ్యంపై వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచాలనుకుంటున్నాం. తద్వారా రవాణా వాహన శ్రేణిలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో నిబద్ధత కనబరుస్తున్నాం’ అని నక్రా ప్రకటించుకున్నారు. అయితే సరుకు రవాణా వాహన విభాగంలో పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇలా సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తేం కాదు.. ‘‘మైలేజీ రాకపోతే వాహనాల్ని వెనక్కి ఇవ్వండి’’ అనే ప్రకటన మహీంద్రాకు కొత్తేం కాదు. 2016లో బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ ట్రక్కుల విషయంలో ఇలాంటి స్కీమ్ అమలు చేసింది. అయితే ఆ టైంలో 33 వేల బ్లేజో ట్రక్కులు అమ్ముడుపోగా.. ఒక్క వాహనం కూడా వెనక్కి రాలేని ఎంటీబీ ప్రకటించుకుంది. చదవండి: ఐఫోన్ అమ్మకాలతో యాపిల్ ఉక్కిరిబిక్కిరి,భారత్లో దూసుకెళ్తున్న సేల్స్!! -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
ప్రముఖ దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారీ షాకిచ్చింది. ఎంపిక చేసిన మహీంద్రా కార్ల ధరల్ని భారీగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది అక్టోబర్లో ఎక్స్ యూవీ 700ని మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైన రెండు రోజుల్లో 50వేల బుకింగ్స్తో మహీంద్రా ఆటోమొబైల్ సంస్థ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే పెరిగిపోతున్న బుకింగ్ల నేపథ్యంలో కస్టమర్లకు ఈ కార్లను అందించేందుకు సమయం ఉంది.అదే సమయంలో మహీంద్రాతో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. తయారీ (ముడి పదార్థాలు మొదలైనవి),రవాణా ఖర్చులు పెరగడంతో మహీంద్రా అండ్ మహీంద్రాతో పాటు ఇతర కార్ల సంస్థలు కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్ యూవీ 700 వెహికల్ ధరని రూ.80వేల వరకు పెంచింది. ఎక్స్ యూవీ 700 వెహికల్స్ ఫీచర్లు మహీంద్రా న్యూ లోగోతో రిలీజ్ అవుతున్న మొదటి వెహికల్ ఎక్స్యూవీ700. ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ లెస్ కారు తెస్తామంటూ టెస్లా అంటోంది. ఆ స్థాయిలో కాకపోయినా ఇండియా వరకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ను అధికంగా ఉపయోగిన్న ఆకారుగా మహీంద్రా ఎక్స్యూవీ 700ని పేర్కొనవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ని పొందు పరిచారు. దీనిలో ఫార్వర్డ్ కొల్యూజన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేక్స్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, అడాప్టిక్ క్రూజ్ కంట్రోల్, ‘డ్రైవర్ డ్రౌజీనెస్ మానిటర్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నేషన్, హై బీమ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి చదవండి: ఇదెక్కడి విచిత్రం..! అలవోకగా కారును నడిపేస్తోన్న చేప..!