vidyut shock
-
విద్యుత్ షాక్తో రైతు మృతి
కణేకల్లు: విద్యుత్ షాక్కు గురై ఓ రైతు దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని దిగువ వీధికి చెందిన గంగవరం ఖలీల్ (55), గురువారం ఉదయం వరి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకెళ్లాడు. అక్కడ స్టార్టర్ బటన్ నొక్కే సమయంలో విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పక్క పొలంలో పనిచేస్తున్న కూలీలు ఈ విషయాన్ని గమనించి, వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఖలీల్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఖలీల్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కరెంట్షాక్తో కౌలు రైతు
కణేకల్లు: కణేకల్లుకు చెందిన కౌలురైతు ఆంజనేయులు (50) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... ఆంజనేయులు ఆలూరు వద్ద 5ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పొలంలో వరిసాగు చేసేందుకు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టి మాగాణికి దమ్ము చేయించాలనుకున్నాడు. స్టార్టర్ ఆన్ చేయగానే విద్యుత్షాక్కు గురై సృహ కోల్పోయాడు. పక్కనే ఉన్న రైతులు గమనించి వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందాడు. భార్య అనంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. -
ఇంటి పైకప్పు మరమ్మతు చేస్తుండగా..
బత్తలపల్లి: ముష్టూరు గ్రామానికి చెందిన కుమ్మర కాటమయ్య (68) ఇంట్లోనే చిల్లరకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు రంధ్రం పడింది. కాటమయ్య శుక్రవారం మరమ్మతు చేయడానికి ఇంటిపైకెక్కాడు. విద్యుత్ ప్రసరిస్తున్న సర్వీస్వైరు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆయన్ని కిందకు తీసుకొచ్చి సపర్యలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందాడు. ఎస్ఐ హారున్బాషాకు సమాచారం అందించారు. మృతునికి భార్య అంజినమ్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
కన్నీరే మిగిలింది
కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంటలకు నీరందించేందుకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతానికి గురవుతున్నారు. బోర్లు మొరాయించడంతో ఫ్యూజులు సరిచేయడం, వైర్లు మరమ్మతులు చేసేక్రమంలో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరెంటు కాటుకు బాధిత రైతు కుటుంబాలు దిక్కులేనివవుతున్నాయి. బొమ్మనహాళ్: కొలగానహాళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మైలాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి (46) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... మైలాపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఏడు ఎకరాల పొలం ఉంది. మూడేళ్లుగా పంట చేతికందకపోవడంతో పెట్టుబడులు సైతం తిరిగి రాలేదు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో వరి నాట్లు వేశాడు. మరో రెండు ఎకరాల్లో వరినాట్లకు సిద్ధమయ్యాడు. మిగతా మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే పొలానికెళ్లాడు. రాత్రి వేసిన మోటార్ను పరిశీలించి ఫ్యూజ్క్యారియర్ తొలగించడానికి అటుగా ముందుకు కదిలాడు. అయితే అప్పటికే ఆ ప్రదేశం తేమగా ఉండటంతో అర్త్వైరు తగిలి నారాయణరెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదించారు. రైతు నారాయణరెడ్డి ఉద్దేహాళ్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.2లక్షలు, గ్రామంలో పలువురు రైతుల వద్ద రూ.3 లక్షల దాకా అప్పులు చేశాడు. మృతుడి భార్య లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమేదార్ లక్ష్మీనారాయణ తెలిపారు. -
కర్షకులను కాటేసిన కరెంట్
కనగానపల్లి: మండలంలోని చంద్రాశ్చర్లలో రైతు సాకే రామచంద్ర (45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రామచంద్రకు గ్రామ సమీపంలోని ఆరు ఎకరాల పొలం ఉంది. అందులో టమాట సాగుచేశాడు. మంగళవారం తెల్లవారుజామున పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ మోటరు ఆడకపోవడంతో స్టార్టర్ పెట్టెలో ఉన్న ఫ్యూజులను పరిశీలించేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఆయన అక్కడే ప్రాణం వదిలాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు విగత జీవిగా పడిగున్న రామచంద్రను చూసి హతాశులయ్యారు. పోలీసులు, విద్యుత్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
విద్యుత్ మోటారు ఆడటం లేదని స్తంభమెక్కి మరమ్మతులు చేస్తున్న యువ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. తమ తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియని చిన్నారులు బిత్తరచూపులు చూస్తూ ఉండటం అందరి హృదయాలనూ కలచివేసింది. అమడగూరు మండలం బావాచిగాని కొత్తపల్లి (బి.కొత్తపల్లి)లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. అమడగూరు: బి.కొత్తపల్లికి చెందిన లేట్ కదిరిరెడ్డి, ప్రభావతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మంజునాథరెడ్డి (32)కి ఏడేళ్ల క్రితం చిత్తూరు జిల్లా బిళ్లూరోళ్లపల్లికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మంజునాథరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో టమాట, ఎకరం విస్తీర్ణంలో సజ్జ సాగు చేశాడు. వారం రోజులుగా వ్యవసాయ బోరు మోటార్ పనిచేయడం లేదు. దీంతో మంజునాథరెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ బోరు దగ్గరకెళ్లి సర్వీస్ వైరును పరిశీలించాడు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేయబోయాడు. కొద్దిసేపటికే కరెంట్ రావడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. గంటసేపటి తర్వాత పశువుల కాపరులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చి సమీపంలోని బాగేపల్లి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాయకుల పరామర్శ గత ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన ప్రభావతమ్మ కొడుకు ధనుంజయరెడ్డి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీఈసీ సభ్యుడు కడపల మోహన్రెడ్డి, నాయకులు దుద్దుకుంట సుధాకర్రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ముత్యాలప్ప (36) దారిలో తెగిపడిన విద్యుత్ తీగను పక్కకు తొలగించే క్రమంలో విద్యుత్షాక్కు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే దారి మధ్యలోనే ముత్యాలప్ప చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సరస్వతి , ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ధర్మవరం: ఉతికిన దుస్తులను ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన యంకమ్మ (40) మంగళవారం ఉదయం ఇంటి ముందు ఉతికిన దుస్తులను విద్యుత్ స్తంభానికి కట్టిన తాడుపై ఆరేయబోయింది. వర్షానికి తడిసిన తాడుకు విద్యుత్ ప్రసరిస్తుండటంతో అది తెలీని యంకమ్మ విద్యుదాఘాతానికి గురైంది. హుటాహుటిన ఆమెను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త రామయ్య, నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నట్లు వారు తెలిపారు. -
విద్యుదాఘాతంతో నెమలి మృత్యువాత
పుట్టపర్తి అర్బన్ : దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఓ నెమలి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. అటవీ ప్రాంతం నుంచి ఓ నెమలి తాగునీటి కోసం ఆదివారం ఇరగరాజుపల్లి గ్రామ పొలాల్లోకి వచ్చింది. పైకి ఎగిరే సమయంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగల్లో చిక్కుకుని షాక్తో మృతి చెందింది. సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి నెమలిని కిందకు దించారు. -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
నార్పల : వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి వెళ్లి స్టాటర్ బాక్స్ తెరుస్తుడంగా విద్యుదాఘాతానికి గురై యువ రైతు మృతి చెందిన సంఘటన నార్పల మండలం పూలసలనూతల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. నార్పల మండలంలోని పులసలనూతల గ్రామానికి చెందిన కురుబ గడ్డం చిన్న వెంకట్రాముడు కు ఇద్దరు కుమారులు. వారిలో సాయి(20) పెద్ద కుమారుడు, ఇంటర్ వరకూ చదువుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉన్నారు. వీరికి మూడు ఎకరాలు పొలం ఉంది. బోరు కింద వేరుశనగ పంటను సాగు చేశారు. వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి తండ్రి, కొడుకు సాయంత్రం ఐదు గంటలకు తోట వద్దకు వెళ్లారు. ఆరు గంటల సమయంలో త్రీ ఫేస్ కరెంట్ రావడంతో మోటారు ఆన్చేయడానికీ స్టాటర్ బాక్స్ వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే స్టాటర్కు విద్యుత్ ప్రసరించడంతో సాయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడే ఉన్న తండ్రి చిన్న వెంకట్రాముడు టవాల్తో కొడుకును లాగడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విద్యుదాఘాతంతో అక్కడక్కడే మృతి చెందాడు. కన్న కొడుకును కళ్లారా చంపుకున్నానని తండ్రి చిన్న వెంకట్రాముడు, కుటుంబ సభ్యులు బోరును విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కనగానపల్లి(రాప్తాడు) : మండలంలోని తూంచర్ల గ్రామంలో శనివారం విద్యుదాఘాతానికి గురై రైతు వన్నూరప్ప (42) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. రైతు వన్నూరప్ప తన ఇంటి ముందు ఉన్న ఇనుప రేకులను పక్కకు సర్దుబాటు చేస్తుండగా, పైన ఉన్న విద్యుత్ తీగలు వాటికి తగిలాయి. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి.. కాపాడేలోపు అతడు మృత్యువాత పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మధ్యనే పొలంలో రెండు బోర్లు వేసి పంటలు సాగుచేశామని, అలాగే కూతురు పెళ్లి, కుటుంబ అవసరాల కోసం రూ.నాలుగు లక్షల దాకా అప్పు చేసినట్లు అతడి భార్య ముత్యాలమ్మ కన్నీటి పర్యతమైంది. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
యాడికి (తాడిపత్రి రూరల్) : యాడికి మండలంలోని నగరూర్ గ్రామానికి చెందిన రైతు రవిచంద్ర చౌదరి(42) విద్యుత్ షాక్కు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. నగరూరుకు చెందిన రవిచంద్రచౌదరి మంగళవారం దానిమ్మ తోటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ మోటార్ వేస్తుండగా షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మృతుని భార్య గౌతమి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి ముగ్గురు సంతానం. -
విద్యుదాఘాతానికి వివాహిత బలి
ధర్మవరం రూరల్ : మండలలోని ధర్మపురిలో చంద్రశేఖర్రాజు భార్య లావణ్య(30) అనే వివాహిత విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉదయమే బాత్రూంలో లైటు వేయడానికి వెళ్లగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసారమై షాక్ కొట్టడంతో కిందపడిపోయినట్లు వివరించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి జీవన్, రేవతి, రావణ్ అనే పిల్లలు ఉన్నారు. -
కరెంట్ కాటుకు ఒకరి బలి
బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం నరసాపురంలో కరెంట్ కాటుకు హనుమంతరాయుడు(45) అనే వ్యక్తి బలయ్యారు. ఏఎస్ఐ విజయనాయక్ కథనం మేరకు.. కొత్తగా కడుతున్న ఇంటికి మోటార్ సాయంతో నీరు పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై, స్పృహతప్పి పడిపోయినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కార్మికుడ్ని కాటేసిన కరెంట్
గుంతకల్లు టౌన్ : గుంతకల్లు హనుమాన్ సర్కిల్లోని లక్ష్మీగణేశ్ సా మిల్లో పని చేసే రామిరెడ్డి కాలనీకి చెందిన దూదేకుల ఆకుల షబ్బీర్ బాషా (27) అనే కార్మికుడు విద్యుదాఘాతానికి గురై ఆదివారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. సా మిల్ను షబ్బీర్ సోదరుడు సత్తార్ అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. అందులోనే షబ్బీర్ కూడా పని చేస్తున్నాడన్నారు. రంపపు మిషన్లో మొద్దును కోస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు తెలిపారు. తోటి కార్మికులు వెంటనే అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. కాగా మృతుడికి భార్య ఆరీఫా, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. -
కాటేసిన కరెంట్
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ నరసింహులు(40) అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే బాత్రూంలోకి వెళ్లిన ఆయన ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై కిందపడిపోయాడన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వివరించారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 43-ఉడేగోళంలో మేస్త్రీ.. కణేకల్లు : మండలంలోని 43-ఉడేగోళంలో ఎర్రగుంటలోని కెనిగుంటకు చెందిన వడ్డే హనుమంతరాయుడు(26) అనే మేస్త్రీ బుధవారం విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. ఎర్రిస్వామి అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య రోజా, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
రైతును కాటేసిన కరెంట్
నల్లమాడ (పుట్టపర్తి) : నల్లమాడ మండలం కొత్తపల్లి తండాకు చెందిన డి.ఛత్రేనాయక్(56) అనే రైతు విద్యుదాఘాతానికి గురై శుక్రవారం మరణించినట్లు ఎస్ఐ గోపీ తెలిపారు. తండా సమీపంలోని వ్యవసాయ బోరుబావి కింద నాయక్ సజ్జ పంట సాగు చేశారు. పంటకు నీరు పెట్టేందుకు ఉదయమే బోరుబావి వద్దకు వెళ్లారు. విద్యుత్ మోటారుకు సపోర్టుగా అమర్చిన జీఏ(ఇనుప) వైరుపై గురువారం రాత్రి గాలి, వానకు స్టార్టర్లోని విద్యుత్ వైరు తెగిపడింది. ఇది గమనించని నాయక్ ప్రమాదవశాత్తు జీఏ వైరును తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేఉ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య తిరుపాలీబాయి, కుమారులు విక్రం, సుమన్ ఉన్నారు. -
చీకట్లు నింపిన విద్యుత్
కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లులోని కొత్త కొట్టాలలో ఆదివారం సాయంత్రం విద్యుదాఘతానికి గురై దాసరి గొల్ల ఎర్రిస్వామి(39) మృతి చెందినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. కొత్త నిర్మిస్తున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేశారు. సాయంత్రం కాగానే ఇంట్లో లైట్ వెలిగించేందుకు వైర్ను బోర్డులో అమర్చుతుండగా ఒక్కసారిగా షాక్కు గురయ్యాడన్నారు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అతన్ని కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధరించారన్నారు. మృతుడి భార్య నాగవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
మడకశిర రూరల్ : మండలంలోని కె.గుండుమలకు చెందిన వెంకటశివప్ప(52) అనే రైతు విద్యుదాఘాతానికి గురై శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పాపసానిపల్లిలో మల్బరీ షెడ్ను కూలీలతో కలసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడని వివరించారు. వెంటనే మడకశిర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆస్పత్రికి చేరుకుని వెంకటశివప్ప మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఘటనపై పోలీసులు ఆరా తీశారు. -
బాలింతను కాటేసిన విద్యుదాఘాతం
చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామంలో విద్యుదాఘాతానికి కళావతి(23) మృతి చెందినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల బాలింత. గ్రామానికి చెందిన కళావతి, ఈశ్వర్ దంపతులు మగ్గం నేస్తూ జీవనం సాగించే వారు. కళావతి శుక్రవారం ఉదయం తడి దుస్తులను ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న ఇనుప తీగపై ఆరేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు వివరించారు. భర్త, ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే ఆమెను చెన్నేకొత్తపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శించేందుకు వస్తూ... కళావతి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలియగానే న్యామద్దల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెన్నేకొత్తపల్లి పీహెచ్సీకి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి, మృతురాలి భర్తను ఓదార్చారు. వారిలో జయకృష్ణ అనే గ్రామస్తుడు కూడా ఉన్నాడు. అతను పరామర్శ అనంతరం స్వగ్రామానికి బైక్లో వెళ్లూ మార్గమధ్యంలో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అదే పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
నార్పల : పొలం వద్ద విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని నడిమిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు... నడిమిపల్లి గ్రామానికి చెందిన జి.రాజరాజన్న(37) శనివారం వేకువజామున పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ అక్కడున్న విద్యుత్ తీగలు తగులుకోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య నాగవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాటేసిన విద్యుత్ తీగలు
తనకల్లు (కదిరి) : పంట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి సోమశేఖర్రెడ్డి (35) అనే వ్యవసాయ కూలీ బుధవారం మృతి చెందిన సంఘటన తనకల్లు మండలం తురకవాండ్లపల్లి వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాజశేఖర్బాబు అనే రైతుకు చెందిన పొలంలో సోమశేఖర్రెడ్డి కూలీగా పని చేస్తున్నాడు. పొలంలో సాగు చేసిన బెండ పంటకు క్రిమిసంహారక మందు కొట్టేందుకు వెళ్లాడు. అంతకు ముందే అడవిపందుల బారినుండి పంటను కాపాడేందుకు పొలం చూట్టూ కంచె వేసి విద్యుత్ సరఫరా పెట్టారు. అయితే ప్రమాదవశాత్తు సొమశేఖర్ విద్యుత్ తీగలకు తగలడంతో కిందపడిపోయాడు. గమనించిన గ్రామస్తులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణాలు తీసిన చోరీ
పావగడ : విద్యుత్ రాగి తీగలను చోరీ చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అవే తీగలకు బలయ్యాడు. తాలూకాలోని జే.అచ్చంపల్లి గ్రామంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి సమీపంలోని రొప్పం గ్రామానికి చెందిన ఇమామ్ ఖాన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి జే.అచ్చంపల్లి గ్రామానికి విద్యుత్ రాగి తీగల దొంగతనానికి వెళ్లాడు. విద్యుత్ స్తంభాన్ని ఎక్కి తీగల్ని పట్టుకున్నాడు. అయితే విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలపై కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ అబ్దుల్ నబీ తెలిపారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
నార్పల : మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ రోడ్డులో ఉన్న ఐష్ ఫ్యాక్టరీ నిర్వాహకురాలు శ్యామల(39) విద్యుదాఘాతంతో మృతి చెందారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామానికి చెందిన శ్యామల కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం నార్పలకు వలస వచ్చి జీవనోపాధికి ఐష్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. శుక్రవారం శివర్రాతి కావడంతో ఆమె భర్త నారాయణరెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల కొండకు వెళ్లారు. ఆయన లేకపోవడంతో అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్యామల ఐష్ ఫ్యాక్టరీలో ప్లగ్ వేయబోయి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలో పడిపోయారు. ఫ్యాక్టరీ వద్ద ఉన్నవారు అది గమనిఽంచి ఆమెను హూటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్లు మృతిరాలి కుటుంబ సభ్యులు తెలిపారు. శ్యామల భర్త నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు మండల పరిధిలోని వేల్పమడుగు గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి కుమారుడు శివారెడ్డి (25) శనివారం రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు శివారెడ్డి పొలంలో నీళ్లు కట్టేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. బోరు ఆన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ గురై తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనున్న పొలంలో రైతులు గుర్తించి శివారెడ్డిని బళ్లారి ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మార్గంమధ్యలో మృతి చెందాడు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కళ్యాణదుర్గం : కొత్తూరు గ్రామానికి చెందిన గొల్ల హనుమంతరాయుడు (25) శుక్రవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు... మేకలను మేత కోసం గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ తోట వద్దకు తీసుకెళ్లాడు. చెట్టు ఎక్కి కొడవలితో లేత ఆకు కొమ్మలను నరికేందుకు ఉపక్రమించాడు. ఆ చెట్టుపై 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్లింది. దీన్ని గమనించకుండా కొడవలిని పైకి ఎత్తిన సమయంలో వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి తొమ్మిది నెలల కిందటే వివాహమైంది. ప్రస్తుతం భార్య నాలుగు నెలల గర్భిణి. ప్రమాద విషయం తెలియడంతో భార్య, తండ్రి, సోదరుడు, సోదరి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
నార్పల (శింగనమల) : నార్పల మండలం బి.పప్పూరుకు చెందిన ఎరికల శివయ్య (26) విద్యుదాఘాతంతో శుక్రవారం ఉదయం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్ను మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని కాపాడబోయిన తల్లిదండ్రులు లక్ష్మినారాయణమ్మ, రాజన్న, భార్య అశ్వని స్వల్పంగా గాయపడ్డారు. విద్యుదాఘాతానికి గురైన శివయ్యను హూటాహుటిన 108లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాంప్రసాద్ కేసు నమోదు చేశారు. -
కాంట్రాక్ట్ కార్మికుడికి కరెంట్ షాక్
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం సమీపంలోని విద్యుత్ లైన్ మరమ్మతు చేస్తుండగా కాంట్రాక్ట్ కార్మికుడు వెంకటరమణనాయక్ విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే ఆటోలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక ఫీడర్లో ఎల్సీ తీసుకుని మరో ఫీడర్లో పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని ట్రాన్స్కో ఏఈ షాజహాన్ తెలిపారు. -
విద్యుత్ తీగలు తగిలి 23 గొర్రెలు మృతి
ధర్మవరం రూరల్ : మండలంలోని బలిజమడి తండా సమీపంలో ఆదివారం విద్యుత్ తీగలు తెగిపడి 23 గొర్రెలు మృతి చెందాయని బాధితులు కేశవయ్య, మ«ధునాయక్, సోమ్లానాయక్ తెలిపారు. మేత కోసం గ్రామ సమీపంలోని దొడ్డిలోకి గొర్రెలు తోలగా, ఉదయం 8 గంటలకు ఒక్కసారిగా విద్యుత్ స్తంభానికున్న తీగలు తెగి గొర్రెల మందపై పడ్డాయన్నారు. దీంతో మందలోని గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. -
కాటేసిన కరెంట్
పెనుకొండ రూరల్ : పరిగి మండలం కాలువల్లిలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై బీరప్ప(22) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పైనున్న గవాచి మూయడానికి వెళ్లిన సమయంలో విద్యుత్ తీగలు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలినట్లు వివరించారు. -
విద్యుదాఘాతంతో 12 గొర్రెలు మృతి
హిందూపురం రూరల్ : మండలంలోని కొటిపి గ్రామం కెంచనపల్లి వద్ద పొలంలో విద్యుదాఘాతానికి గురై 12 గొర్రెలు మంగళవారం మత్యువాత పడ్డాయి. నాలుగు రోజుల క్రితం త్రీ ఫేజ్ విద్యుత్ తీగలు కిందకు పడ్డాయి. అవి ఆరోజు నుంచి తొలగించలేదు. ఆ తీగలు గొర్రెలకు తగిలి మతి చెందాయని గొర్రెల కాపరులు చలపతి, గంగాధరప్ప, శ్రీనివాసులు జెవీ వెంకటస్వామి తెలిపారు. సుమారు రూ.లక్ష ఆర్థికనష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
కంబదూరు : మండలంలోని నూతిమడుగు గ్రామానికి చెందిన ఈడిగ రాజు (24) ఆదివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు... తనకున్న ఐదెకరాల పొలంలో మూడు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ స్టార్టర్లో ఫీజ్ పోవడంతో ఫీజ్ వేయడానికి పొలానికి వెళ్లాడు. ఫీజ్ వేస్తుడంగా ప్రమాదశావత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రమైనా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రామాంజినేయులు, మాహదేవి చుట్టు పక్కల వెదికారు. ఎక్కడా కనపడక పోవడంతో పొలంలోకి వెళ్లి చూడగా స్టార్టర్ పెట్టె వద్ద శవమై కనిపించాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇలా అయిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
విద్యుదాఘాతానికి విద్యార్థి బలి
కలిపి (రొద్దం) : మండలంలోని కలిపి గ్రామంలో ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి బలయ్యాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. కలిపికి చెందిన సునందమ్మ కుమారుడు నరేష్ (14) పెద్దమంతూరు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంటివద్ద కొళాయికి తాగునీరు సక్రమంగా రాకపోవడంతో ఆదివారం పైప్లైన్కు సింగిల్ ఫేజ్ మోటర్ ఏర్పాటుచేసి నీళ్లు పట్టబోయాడు. ఉన్నపళంగా మోటర్కు విద్యుత్ ప్రసరించడంతో నరేష్ షాక్కు గురై అక్కడిక్కడే మతి చెందాడు. పదేళ్ల కిందటే భర్త రంగనాథప్ప మతి చెందడంతో సునందమ్మ కూలిపనులు చేసుకుంటూ తన కుమారుడిని చదివించుకుంటోంది. ఇప్పుడు ఆ ఒక్కగానొక్క కొడుకు కూడా హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేకపోయింది. ఎస్ఐ మునీర్హమ్మద్, విద్యుత్శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు నారాయణస్వామి, నరసింహులు, మదన్మోహన్, బుజ్జప్ప తదితరులు విద్యార్థి తల్లిని పరామర్శించి దహన సంస్కారాలకు రూ .1000 నగదు అందజేశారు. -
విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి
ధర్మవరం అర్బన్ : విద్యుదాఘాతంతో జూనియర్ లైన్మెన్ మృతి చెందిన ఘటన పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. స్థానిక ట్రాన్స్కో కార్యాలయంలో జూనియర్ లైన్మెన్గా వెంకటరమణ (35) కాయగూరల మార్కెట్ వీధిలో ఉన్న భక్త మార్కెండేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న విద్యు™Œ స్తంభం ఎక్కి విధులు నిర్వర్తిస్తున్నారు. ఉన్నట్టుండి స్తంభంపైన విద్యుత్ తీగల నుంచి విద్యుత్ ప్రసరించడంతో షాక్కు గురై కిందపడ్డాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మెయిన్లైన్పై విద్యుత్ ప్రసార ం నిలిపి వేసిన ఇళ్లలో ఉండే ఇన్వర్టర్ల కారణంగా విద్యుత్ షాకు తగిలి ఉంటుందని విద్యుత్ ఉద్యోగులు చెప్తున్నారు. మృతుడికి భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడీ వెంకట రమేష్ మృతుడి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని తెలిపారు. -
రైతుకు సాయం చేయబోయి..
ధర్మవరం రూరల్ : తోటి రైతుకు సాయం చేయబోయిన యువకుడికి విద్యుత్తీగలే యమపాశాలుగా మారాయి. విద్యుత్ వైరు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ వైరు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ధర్మవరం రూరల్ పరిధిలోని మల్లేనిపల్లిలో మంగళవారం జరిగిన ఈఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మల్లేనిపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్ర తన పొలానికి విద్యుత్ వైరును లాగడానికి అదేగ్రామానికి చెందిన రమేష్ (24), రంగా, నాగేంద్ర, తిరుపాలును సాయంగా పిలుచుకువెళ్లాడు. వైరు లాగుతున్న సమయంలో పైన ఉన్న హైటెన్షన్ వైర్లను వీరు లాగుతున్న వైరు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా రమేష్ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన నలుగురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న రమేష్ తల్లిదండ్రులు కాటమయ్య, రమణమ్మ, బంధువులు ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి బలి
ఎస్కేయూ: అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన వరికూటి సూరి(45) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై సోమవారం మరణించినట్లు ఇటుకలపల్లి ఎస్ఐ అబ్దుల్ కరీం తెలిపారు. ఇటుకలపల్లి సమీపంలోని ద్రాక్ష తోటలో కటింగ్ చేస్తుండగా, పందిరికి విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. ఘటనలో మరో ముగ్గురు షాక్కు గురయ్యారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య సహా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
విద్యుదాఘాతంతో కాడెద్దుల మృతి
– ఇద్దరికి గాయాలు – రూ.1.80లక్షల నష్టం గోరంట్ల : విద్యుదాఘాతంతో కాడెద్దులు మతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకొంది. బాధితులు, స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు పట్టణంలోని పులేరు రోడ్డులో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి గహా నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణ సామగ్రిని నిల్వ చేసుకునేందుకు ఓ బంకు(ఐరన్షీట్) నాగరాజు అనే ఎద్దుల బండిని కిరాయికి తీసుకున్నారు. బంకును తరలించే క్రమంలో కూరగాయల సంత సమీపంలో 11 కేవీ విద్యుత్ వైర్లు బంకుకు తగిలి విద్యుత్ ప్రవహించడంతో బండి యజమాని చాకలి నాగరాజు, విశ్వేశ్వరరెడ్డిలు ఒక్కసారిగా కిందికి దూకేశారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బండిని లాగుతున్న ఎద్దుల మాత్రం విద్యుత్ షాక్తో విలవిలలాడుతూ అక్కడిక్కడే మతి చెందాయి. ఎద్దులను చాకలి నాగరాజు రూ. 1.80 వేల ఖరీదుతో కొనుగోలు చేశాడని, వ్యవసాయ పనుల ఉన్నప్పుడు వ్యవసాయం తర్వాత బాడుగలకు వెళ్లుతూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబసభ్యులు విలపించిన తీరు అందరిని కలిచి వేసింది. రెవెన్యూ, విద్యుత్, పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘటనస్థలాన్ని పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారి డాక్టర్.కిషోర్ మతి చెందిన ఎద్దులకు పోస్టుమార్టం నిర్వహించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
బొబ్బిలి (విజయనగరం): ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న యువకుడు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగొడ్డువలసలో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. బల్జిపాడు మండలం బర్లి గ్రామానికి చెందిన బి. కృష్ణారావు (18) ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం నాడు దిబ్బగొడ్డువలస లెవల్ కేవీ వద్ద మెంయిటెనెన్స్ పని చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కేతేపల్లి (మహబూబ్నగర్ జిల్లా): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఓ రైతు విద్యుత్ షాక్తో మృతిచెందిన సంఘటన గురువారం పాన్గల్ మండలం కేతేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు,కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ బాలయ్య(45) అనే రైతు తన పంట పొలంలో సాగుచేసిన వరి పంటకు నీరు పారపెట్టేందుకు వెళ్ళాడు. బోరు మోటర్ను ఆన్ చేయగా పనిచేయకపోవడంతో మోకానిక్ను తీసుకొని మోటర్ దగ్గరకు వెళ్ళారు. రిపేరు చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతిచెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఏబీ స్విచ్లు సక్రమంగా లేక రైతుకు షాక్ తగిలి మృతిచెందాడని గ్రామస్తులు,కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతునికి భార్య నీలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ముండ్లమూరు: ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. శ్రీనివాస్రెడ్డి (18) అనే యువకుడు పొలంలో మోటార్ వైర్ ఊడిపోతే విద్యుత్ ప్రసారం ఆగిపోయిన సమయంలో దాన్ని బాగు చేయబోయాడు. ఊడిన వైర్ను బిగిస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో షాక్కు గురై పొలంలోనే సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని పాతగయక్షేత్రం వద్ద కరెంటు తీగలు తగిలి సత్తిబాబు (33) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. చెత్తను అనధికారికంగా డంపింగ్ చేస్తుండగా పైన ఉన్న కరెంటు తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్తిబాబు స్వగ్రామం మల్లాం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో రైతుకు తీవ్ర గాయాలు
ఆత్మకూరు: నల్లగొండ జిల్లా ఆత్మకూరు.ఎం మండలం రాఘవాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు జానీమియా శుక్రవారం సాయంత్రం పొలానికి నీరు పెడుతున్న సమయంలో విద్యుత్ ప్రసారం నిలిచిపోయింది. దగ్గరలోని ట్రాన్స్ఫారం దగ్గరకు వెళ్లి చూడగా ఫీజు పోయినట్టు కనిపించింది. దీంతో విద్యుత్ సిబ్బంది వచ్చే సరికి ఆలస్యం అవుతుందన్న భావనతో జానీమియా ఫీజు వేసేందుకు ప్రయత్నించాడు. షాక్ తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడ్ని కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
కౌతాల: వినోదం కోసం టెలివిజన్ ఆన్ చేస్తుండగా ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కౌతాల మండలం మొగడదగడ్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. జెల్లపల్లి శంకర్ (26) భోజనం చేసే ముందు టీవీ ఆన్ చేయబోగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుత్ షాక్ తో రైతుకు తీవ్రగాయాలు
పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలు.. ప్రసాద్ అనే రైతు ట్రాన్స్ఫారం నుంచి తన పొలానికి లైన్ల మరమ్మతుల కోసం విద్యుత్ ప్రసారం నిలిపివేసేందుకు అధికారుల అనుమతి తీసుకున్నాడు. మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి రైతులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సబ్స్టేషన్ వద్దకు చేరుకుని సిబ్బంది తీరుపై మండిపడ్డారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరి పరిస్థితి విషమం
సదాశివనగర్: ట్రాన్స్ ఫార్మర్ దగ్గర బుష్ వైర్లు వేస్తూ.. ప్రమాదవశాత్తు ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిద్ద గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని ఒక ట్రాన్స్ ఫార్మర్ దగ్గర బుష్లు వేసేందుకు సంతోష్, శ్రీనివాస్ వెళ్లారు. వీరితో పాటు సబ్స్టేషన్కు చెందిన లైన్మన్ కూడా ఉన్నాడు. లైన్మన్ సబ్ స్టేషన్కు ఫోన్ చేసి ఎల్సీ ఇవ్వాలని కోరడంతో సబ్స్టేషన్లో విధుల్లో ఉన్న వ్యక్తి సరేనన్నాడు. దీంతో రైతులు ట్రాన్స్ ఫార్మర్కు బుష్ వైర్లు వేసేందుకు ప్రయత్నించారు. కాగా, అదే సమయంలో విద్యుత్ రావడంతో ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఇద్దరిని వెంటనే నిజామాబాద్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉందనీ, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో దంపతుల మృతి
గిద్దలూరు (ప్రకాశం జిల్లా): ఉతికిన బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఎంపాలెంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన లక్ష్మయ్య (35), రాణి (30) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున పనులకు వెళ్లే తొందరలో ఉతికిన బట్టలను ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు రాణి విద్యుదాఘాతానికి గురైంది. అప్పుడే నిద్రలేచిన భర్త ఇది గమనించి భార్యను రక్షించాలనే తొందరలో వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. దీంతో భార్యభర్తలిద్దరూ విద్యుదాఘాతానికి బలయ్యారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతి చెందిన దంపతులకు ఆరేళ్ల కుమారుడున్నట్లు సమాచారం. -
విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి
బిజినేపల్లి: పాఠశాలకు సున్నం వేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి కొప్పరి మహబూబ్ (14) అనే బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బిజినే పల్లి మండలం పాలెం గ్రామంలోని శాంతినికేతన్ పాఠశాలలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. పాలెం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహబూబ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఏడో తరగతి వరకు శాంతినికేతన్ పాఠశాలలో చదివాడు. ఆదివారం సెలవు కావడంతో డబ్బులొస్తాయని తన స్నేహితులు రాంబాబు, సురేష్లతో కలిసి శాంతినికేతన్ స్కూల్కు సున్నం వేసే పనికి వెళ్లారు. సున్నం వేస్తుండగా స్కూల్ భవనం పైన ఉన్న ఇనుప రాడ్ను ముట్టుకొనే సరికి కరెంటు షాక్ తగిలింది. కరెంటు షాక్ తగిలిన మహబూబ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు స్కూల్ కరెస్పాండెంట్ నాగరాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుణ్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో విద్యార్థులకు గాయాలు
విశాఖపట్నం: ఇంటి పై ఆడుకుంటున్న పిల్లలు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైన సంఘటన విశాఖపట్టణం జిల్లా మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఐదో తరగతి చదువుతున్న హర్ష(9), విష్ణు(10), రమ్య(9), గణేష్(10) అనే నలుగురు విద్యార్థులు ట్యూషన్ నిమిత్తం గ్రామానికి చెందిన మౌనిక టీచర్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో టీచర్ లేకపోవడంతో ఆలోపు ఆడుకోవడానికి ఇంటిపైకి ఎక్కారు. రాత్రి వర్షం వచ్చిఉండటంతో ఇంటిపై నిల్వ ఉన్న నీటిలో ఆడుకుంటున్నారు. ఈక్రమంలో అక్కడ పడి ఉన్న ఇనుపకడ్డీ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
విద్యుత్ షాక్తో దంపతుల మృతి
వైఎస్సార్ జిల్లా: టేబుల్ ఫ్యాన్ పక్కకు జరుపుతూ ప్రమాదవ శాత్తూ విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వైఎస్సార్జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామంలోని మల్లినేనిపట్నం కాలనీలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన కె. నరసింహులు (50), ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పడుకునే సమయంలో టేబుల్ ఫ్యాన్ను పక్కకు జరుపుతుండగా.. సుబ్బలక్ష్మమ్మకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో నరసింహులుకు కూడా షాక్ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం స్థానికులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
విద్యుత్ తీగలకు విద్యార్థి బలి
అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలో విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తగిలి నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం 85నెట్టూరు గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కృష్ణవంశీ అనే విద్యార్థి రోజులాగే బడికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మరణించాడు. ట్రాన్స్ కో, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ట్రాన్స్కో ఏఈ భీమలింగప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అయితే ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు ఏఈపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
కరెంట్ షాక్తో ఉపాధి కూలీ మృతి
కొండాపూర్ (మెదక్): కరెంటు షాక్తో ఓ ఉపాధి కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలో శనివారం జరిగింది. మండలంలోని తొగర్పల్లి గ్రామానికి చెందిన సందగల్ల దయానంద్ (38) ఉపాధి పనిలో భాగంగా విద్యుత్ స్తంభం పక్కన గుంత తవ్వుతుండగా షాక్ తగిలింది. దీంతో తోటి కూలీలు దయానంద్ను ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. కాగా.. మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఏడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
విద్యుత్షాక్తో వ్యక్తి మృతి
మహబూబ్నగర్: విద్యుత్ షాక్ కు మరో వ్యక్తి బలయ్యాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధరపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గట్టుపల్లి అంజయ్య మోటరు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం తోటలో మోటారు రిపేరి చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రాఘవేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్షాక్తో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి
నిజామాబాద్: ప్రమాదవశాత్తూ ట్రాన్ఫార్మర్పై ఎక్కిమరమ్మతులు చేస్తున్న గంగాధర్(38) అనే వ్యక్తి కరెంటు షాక్ తగిలి మృతిచెందాడు. ఈ ఘటన వేల్పూరు మండలం పచ్చలనడికుడలో చోటుచేసుకుంది. గంగాధర్ స్థానికంగా ఎలక్ట్రిషియన్ పనులు చేస్తుంటాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గంగాధర్ మృతిచెందాడని కుటుంబసభ్యులు, తోటి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. (వేల్పూర్) -
కరెంటు షాక్తో వ్యక్తి మృతి
వైఎస్సార్ జిల్లా: కరెంటు షాక్తో బొమ్మి శివయ్య(30) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లి మండలం కమ్మతల్లి హరిజనవాడలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామంలో శివయ్య అనే వ్యక్తి తాగునీటి మోటారు రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలింది. దీంతో శివయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. శివయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. (ఓబులవారిపల్లి) -
విద్యుత్షాక్తో వానరం మృతి
మహబూబ్ నగర్: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ వానరం మృతి చెందింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో ఆదివారం చేటు చేసుకుంది. గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం విద్యుత్ తీగలకు ప్రమాదావశాత్తు ఈ వానరం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతిచెందిన వానరం చుట్టూ అటుగా వచ్చిన వానరాలు తిరుగుతూ లాక్కెందుకు ప్రయత్నించాయి. ఈ సంఘటన సమాచారం గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని వానరానికి హిందూసంప్రదాయం అంత్యక్రియలు నిర్వహించారు. (నారాయణపేట) -
కరెంట్ షాక్ తో రైతు బలి
రంగారెడ్డి జిల్లా: పొలానికి నీరందించే బోరు మోటారుకు కరెంటు సరఫరా కావడం లేదని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన రైతు షాక్తో నిలువునా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డిజిల్లా బొంరాస్పేట మండలం నాగిరెడ్డిపల్లి శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలి కిష్టయ్య(46) శుక్రవారం ఉదయం తన బోరు మోటారుకు విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. దానిని మరమ్మతు చేసేందుకు ప్రయత్నించటంతో ప్రమాదవశాత్తు షాక్కు గురై స్పృహ కోల్పోయాడు. సమీప పొలాల్లో ఉన్న రైతులు కిష్టయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతనికి భార్య అంజిలమ్మ, కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు. (బొంరాస్పేట) -
కరెంట్షాక్తో రైతు మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలో ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన దుగ్గపురం రామచంద్రయ్య (50) తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లాడు. అయితే, పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీగలపై మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు పైగా వెళ్తున్న విద్యుత్ తీగ పడింది. అది తెలియని రామచంద్రయ్య ఫెన్సింగ్ తీగను తాకటంతో షాక్నకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రామచంద్రయ్యకు భార్య అలివేలుతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. (తలకొండపల్లి) -
విద్యుదాఘాతానికి దంపతుల మృతి
-
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామంలో విద్యుదాఘాతంతో ఒక మహిళ మృతిచెంది, మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడిన సంగతి చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లిన బుచ్చమ్మ (35) కు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన రవి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (హుస్నాబాద్) -
సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం
అనంతపురం జిల్లా: సెల్ఫోన్ చార్జీంగ్ పెట్టి తీస్తుండగా ఒక యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఉమేష్ (20) తన సెల్ఫోన్కీ చార్జింగ్ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఉమేష్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఆదివారం అదే గ్రామంలో పలు ఇళ్లలో కొంత మందికి కరెంట్ షాక్ కొట్టినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, విద్యుదాఘూతానికి గత కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. (రాయదుర్గం) -
విద్యుదాఘాతానికి దంపతుల మృతి
వరంగల్ జిల్లా: ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తెగిపడి విద్యుదాఘూతానికి గురై దంపతులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వరంగల్ జిల్లా కరీమాబాద్లో జరిగింది. వివరాలు.. కరీమాబాద్కు చెందిన అంకాటి రమేష్ (45), రాజమ్మ (40) దంపతులు విద్యుదాఘూతానికి బలయ్యారు. ఆదివారం ఉదయం గాలులతో కురిసిన అకాల వర్షాలకు తన ఇంటిపై ఉన్న కరెంట్ తీగలు తెగి దుస్తులు ఆరేసే తీగపై పడ్డాయి. అయితే ఈ విషయం తెలియని దంపతులు దుస్తులు ఆరేస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కరీమాబాద్) -
విద్యుదాఘాతానికి విద్యార్థి బలి
వైఎస్సార్ జిల్లా: ఇంట్లో కరెంటు షాక్ తగిలి మూడె మహేంద్ర(21) అనే డిగ్రీ విద్యార్థి శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా కలశపాడు మండలం తంబళ్లపల్లిలో చోటుచేసుకుంది. వైర్కు ఉన్న ఇన్సులేషన్ పోవడంతో లోపల ఉన్న కాపర్ తీగలు బయటకు వచ్చాయి. ఈ విషయం గమనించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మహేంద్ర పోరుమామిళ్లలోని ఓ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. (కలశపాడు)