మహబూబ్ నగర్: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ వానరం మృతి చెందింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో ఆదివారం చేటు చేసుకుంది. గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం విద్యుత్ తీగలకు ప్రమాదావశాత్తు ఈ వానరం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది.
మృతిచెందిన వానరం చుట్టూ అటుగా వచ్చిన వానరాలు తిరుగుతూ లాక్కెందుకు ప్రయత్నించాయి. ఈ సంఘటన సమాచారం గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని వానరానికి హిందూసంప్రదాయం అంత్యక్రియలు నిర్వహించారు.
(నారాయణపేట)
విద్యుత్షాక్తో వానరం మృతి
Published Sun, May 10 2015 7:39 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement