monkey
-
భారత్లో మంకీపాక్స్ కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు : భారత్లో తాజాగా మరో మంకీ పాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుంచి భారత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.జనవరి 17న బాధితుడు దుబాయ్ నుంచి భారత్లోని కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరానికి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే అతడి శరీరంపై దద్దుర్లు, జ్వరంతో పాటు ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సదరు ఆస్పత్రి వైద్యులు బాధితుడి లక్షణాలపై అనుమానం రావడంతో కర్ణాటక (karnataka) వైద్యఆరోగ్యశాఖకు సమాచారం అందించారు.అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ బాధితుడి రక్త నమోనాలను సేకరించారు. వాటిని పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్లో బాధితుడికి మంకీ పాక్స్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం బాధితుడు, అతని కుటుంబ సభ్యుల్ని ఐసోలేషన్ వార్డ్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మంకీపాక్స్ నమోదు కావడంపై వైద్యులు స్పందించారు. కోవిడ్-19తో పోలిస్తే మంకీపాక్స్ ప్రమాద తీవ్రత చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్టులో మంకీ పాక్స్ సోకిన బాధితుణ్ని ఎవరు ఆలింగనం చేసుకున్నారో.. వారందరిని ఐసోలేషన్ వార్డ్కు తరలించాం. త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. -
నిషాలో తూగడం...ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వ సాధారణం : మత్తుపదార్ధం. కొన్ని పదార్ధాలు పవిత్రమైనవాటివిగా పరిగణింపబడతాయి, కానీ ఎక్కువ సార్లు, మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం.మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమకోడుస్తాయి. తమిళనాడులోని బానేట్ మాకాక్లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవయితే, కరీబియన్ వెర్వేట్ కోతులు క్రమం తప్పక తప్పతాగి తూగుతుంటాయి. ఆ దీవిలో ఏడాది పొడుగునా సెలవల సందడి ఉండడంతో అక్కడ మత్తు పానీయాలకు ఏమి కొదవలేదు.పనికిమాలినట్టుగా అనిపించినా, వెర్వేట్ కోతుల తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం, అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి - అవి త్వర త్వరగా, ఎక్కువ ఎక్కువ, తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి - అవి సరాసరి మద్యాన్ని సోడాగానీ, నీళ్లుగానీ కలపకుండా, క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. కానీ చాలామటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికీ మనకీ పోలికలు ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి, కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి, మరికొన్ని దిగాలుగా, ముభావంగా తయారవుతాయి. కానీ చాలామటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి…. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి.మామూలు నలుపురంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైత ఒళ్లు మర్చిపోయేంతగా విజ్రుoభిస్తాయి. జార్ఖండ్లో ఆశియా ఏనుగులు పాకల లోపల కాగుతున్న మద్యాన్నిగైకొనడానికి పాకలని నాశనం చేస్తాయని విషయం తెలిసినది. కొన్ని ఏళ్ల క్రితం, ఒక మత్తెక్కిన ఏనుగులగుంపు ఊరుమీద విరుచుకుపడి, విద్యత్ స్థంభాలను పాడగొట్టి తిరిగితూ, ఆ ప్రక్రియలో అవే విద్యుత్ షాకు తగిలి కాలిపోయాయి.పశ్చిమ దేశాలలో పిల్లులు పుదీనాలా ఉండే క్యాట్నిప్ అనే మొక్క మత్తులో మునిగిపోతాయి. పిల్లులు ఆ పుదీనా వంటి మొక్క కొమ్మల మీద పడి మూలుగుతూ, చోంగకారుస్తూ, మళ్ళీ మళ్ళీ దొర్లుతాయి. నేను కొంచం ఆ మొక్కను తెచ్చి ఇవ్వగానే, ముందెన్నడూ ఆ మొక్కని చూడని మా నాన్నగారి పిల్లి కూడా మతిపోయినట్టు ప్రవర్తించింది. కానీ కొద్ది నిముషాల తరవాత అది బాగా తేరుకుని మళ్ళీ హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏళ్ల తర్వాత అమెరికా జంతు ప్రదర్శనశాలను సందర్శించే సమయంలో, మేము ఒక కౌగర్ క్యాట్నిప్తో నింపివున్న మేజోడు పట్టుకుని వెర్రివేషాలు వేయడం చూశాము. అన్ని జాతుల పిల్లులూ ఈ క్యాట్నిప్కు ఆకార్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.రాకీ కొండలలో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం, ఒక రకమైన బూజు గోకి తినడానికి, ఎంతో ప్రమాదకరమైన కొండ చరియలుఎక్కుతాయని తెలిసినది. మరి ఈమెన్లో మేకలైతే వారి కాపారులలాగే ఖట్ ఆకుల మత్తుకు బానిసలు.ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి, ఎర్ర టోపీలతో, పైన కాస్త పంచదార చల్లినట్టు ఉండీ, యాక్షినిల కథలలో కనిపించే బొమ్మల్లో అమ్మాయాకంగా కనిపించే పుట్టగొగుల పేరు ఫ్లై ఆగారికస్ పుట్టగొడుగులు. నన్ను తినకండి అని హెచ్చరించే రంగులో ఉన్నాకూడా రెయిన్ డీర్లు వాటిని తిని మత్తులో గెద్దలంత ఎత్తు ఎగురుతాయి. ఎన్నో మత్తు పదార్ధాలను రెయిన్ డీర్ మూత్ర పిండాలు వడగొట్టగలవు కనుక, వాటి మూత్రం పుట్టగొడుగులు తినటం కాంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మారియు ఉత్తర ఆసియాలో గొర్రెకాపరులు చేసేది అదే!ఎన్నో శాంతా క్లాస్ పుట్టుక కథలలో ఒకటైన కథ మనని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక సీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో, ఒక నాటు వైద్యుడు, పోగాకమ్ముకున్న ఒక ముఖం ద్వారoగుండా ఫ్లై ఆగారిక్ నిండిన సంచీని మోస్తూ ఒక యూర్ట్ ( జూలుతో చేయబడ్డ గుండ్రటి డేరా) లోపలకి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ, వారి ముఖము - ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు, ఎర్రగా మారతాయి. శాంతా, అతని ఎర్ర ముక్కు రెయిన్ డీర్ రుడోల్ఫ్, ఆకాశంలో దీనిపై ఎగురుతున్నారన్న అంచనా వేసినందుకు ఏమి బహుమతులు లేవు!శతాబ్దాలా నుంచీ సమాజం ఈ పదార్ధాలను భయంకరమైన చెడుతో కూడిన వాటిగా పరిగణించి బహిష్కరించడానికి ప్రయత్నించింది. అయినా వాటిలో మునిగి తెలడం మన ఆచ్చారాలలో ఎంత బలంగా నాటుకుందో, అది అంతే బలంగా మన జన్యువులో కూడా నాటుకుని ఉండి ఉంటుంది. పిల్లలు కూడా ఆ అనుభూతి పొందడానికి కళ్ళుతిరిగి, కాలపై నిలబడడానికి తడబడేదాకా పదే పదే గుండ్రంగా తిరిగితారు. దెర్విషలు (సన్యాసులు) కూడా మనకుకి అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి ఇటువంటి పద్దతే వాడతారు. పార్స్వ ఆలోచన అనే భావాన్ని పెంపొందించిన ఎడ్వర్డ్ డి బోనో ప్రస్తావన ఇక్కడే వస్తుంది. అతను మత్తుపదార్థాలు మనని పోతపోసిన ఆలోచనా విధానాలనుంచి బయటకులాగి, ఎంతో సృజనత్మాకంగా ఆలోచింపచేయగలదని అతను సూచించాడు. అదే గనక నిజమైతే, మనసుని మార్చేటువంటి ఈ మత్తు అనుభూతులతో, ఖచ్చితంగా ఈ పాటికి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మారియు ప్రయత్నలు చూసుండేవాళ్ళం. రచన : జానకి లెనిన్ ఫోటోలు: సిద్దార్థ్ రావు -
సోషల్ మీడియా స్టార్ ‘రాణి కోతి’: యూట్యూబ్ ద్వారా లక్షలు : వైరల్ వీడియో
కుంచం అంత కూతురుంటే మంచం మీదే కూడు అనేది సామెత. అంటే ఇంట్లో చిన్న ఆడకూతురుంటే చాలు..ఆ ఇంట్లోని అన్ని పనుల్లో ఎంతో చేయూత అని. ఈ విషయంలో నేనేం తక్కువ అంటోంది ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలోని ఖాగీపూర్ సద్వా గ్రామానికి చెందిన కోతి. అవును మీరు చదివింది నిజమే. కోతి ఇంట్లో అన్ని పనులు చకా చకా పెట్టేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన కోతి కథేంటో తెలుసుకోవాలని ఉంది కదా.. పదండి మరి!యూపీలోని రాయ్బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ఇంట్లోని కోతిని చూస్తే ఔరా అనాల్సిందే. అందుకే దీనికి ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు.ఇల్లంతా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసేస్తుంది. గిన్నెలు తోముతుంది. బట్టలు ఉతకడం, మాప్ పెట్టడం, మసాలాలు రుబ్బడం, పొలంలో సహాయం చేయడం ఇలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అంతేనా రాణి గారు శ్రద్ధగా గుండ్రంగా చపాతీలు చేసి ఇస్తుంది. ఇది చాలదన్నట్టు గ్రామంలోని ఇతర ఇళ్లల్లో ఆడవానికి కూడా పనిలో సహాయం చేస్తుంది. అందుకే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి విలేజ్ డార్లింగ్లా మారిపోయింది. పుట్టింది కోతిగా అయినా.. మనిషిలానే చేస్తున్న పనులు, అందరికీ సాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ అభిమానంగా మారింది.యూట్యూబ్ ద్వారా లక్షల ఆదాయం రాణి వంటలు చేస్తున్న వీడియోను యజమాని ఆకాష్ పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రాణి పనులను, చేష్టలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకోవడంతో అశోక్ అదృష్టం మారిపోయింది. యూట్యూబ్లో రాణి వీడియోల ద్వారా 5 లక్షల రూపాయలకు పైగా ఆర్జించామని అశోక్ పేర్కొన్నాడు. కోట్లాదిమంది తమ వీడియోను వీక్షించారని తెలిపాడు. ముంబై, కోల్కతా, వారణాసి ఇలా అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆమెను చూడటానికి వస్తారట. అమెరికా, యూకే సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, ఇరాన్, రష్యా, చైనా , అనేక ఇతర దేశాల వాళ్లు ఫోన్లు చేస్తారన్నాడు. ఎంత స్నేహశీలి అయినా, రాణిగారికి సొంత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆమెకు నచ్చితేనే మనుషుల్ని దగ్గరకు రానిస్తుంది. తనకు నచ్చితే వారి ఒడిలో నిద్రపోతుంది కోపం వస్తే మాత్రం చిన్నగా మణికట్టును కొరుకుతుంది. రాణికి ఇష్టమైన ఆహారం, అరటిపండ్లు. వీటితోపాటు బఠానీలు, రొట్టెలు తినడం కూడా ఆమెకు చాలా ఇష్టం. #WATCH | यूपी के रायबरेली जिले में रानी नाम की बंदरिया का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में बंदरिया रोटी बनाने से लेकर बर्तन धोने समेत घर के काम करते दिख रही है। वीडियो देख हर कोई हैरान है।#Raibareli pic.twitter.com/3UWY4izZ6N— Hindustan (@Live_Hindustan) December 30, 2024 -
శశి థరూర్ ఒడిలో వానరం..ఫొటోలు వైరల్
తన నివాసంలో సేద తీరుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను అనుకోని అధితి రూపంలో ఓ వానరం ఆయన్ను చుట్టుముట్టింది.పేపర్ చదువుతున్న శశి థరూర్ చుట్టూ తిరుగుతూ తెగ అల్లరి చేసింది. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా నెట్వర్క్లలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.ఇంతకి ఏం జరిగిందంటే?శశిథరూర్.. బుధవారం ఉదయం తన ఇంటి ఆవరణంలో పేపర్ చదువుతున్నారు. ఆ సమయంలో ఓ వానరం ఆయన దగ్గరకు వచ్చింది. పేపర్ చదువుతున్న శశి థరూర్ చుట్టూ తిరిగింది. అనంతరం థరూర్లో ఒడిలోకి కూర్చుంది.Had an extraordinary experience today. While i was sitting in the garden, reading my morning newspapers, a monkey wandered in, headed straight for me and parked himself on my lap. He hungrily ate a couple of bananas we offered him, hugged me and proceeded to rest his head on my… pic.twitter.com/MdEk2sGFRn— Shashi Tharoor (@ShashiTharoor) December 4, 2024 -
అయ్యప్ప స్వాములతో భోజనం చేసిన కోతి
-
భక్తుడి ఫోన్ ఎత్తుకుపోయి గుడి ఎక్కిన కోతి..
-
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..
ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల ‘సౌర’భాలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్రిపుల్ ఐటీలో వాకథాన్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఇన్చార్జ్ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్ ఆవరణలోని ఎకో పార్క్లో వాకింగ్ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణదీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భోజనం చేస్తుండగా సడెన్గా కోతి ఎంట్రీ..ఐతే ఆ తర్వాత..!
ఒక్కోసారి జంతువులు మనతో ప్రవర్తించే తీరు భయబ్రాంతులకు, ఆశ్చర్యానికి లోను చేస్తాయి. ఆ క్షణంలో చాలామంది భయంతో హడావిడి చేస్తే..కొందరు మాత్రం చాలా కూల్గా వ్యవహరిస్తారు. నిజానికి ఆ జంతువుల సడెన్ ఎంట్రీ కంటే.. వాటితో కొందరు వ్యక్తులు వ్యవహరించే తీరు అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పైగా ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయానికి గురవ్వుతాం కూడా. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటు చేసుకుంది. మనం ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో భోజనం చేస్తుండగా సడెన్గా ఓ కోతి నేరుగా మనవద్దకు వస్తే ఏం చేస్తాం చెప్పండి. భయంతో వణికిపోతాం. దాన్ని పొమ్మనే ప్రయత్నమే లేక మనమే పక్కకు తప్పుకునే యత్నమో చేస్తాం కదా..!. కానీ ఈ పెద్దాయన మాత్రం అలా చేయలేదు తాను భోజనం చేస్తుండగా వచ్చిన కోతిని చూసి భయపడ లేదు కదా..!. దాన్ని చూసి ఛీత్కరించనూ లేదు. ఆ కోతి తన పళ్లెంలోనే తింటున్న ఏం అనలేదు. పైగా దాన్ని తినమని ప్రోత్సహిస్తూ.. ఆయన కూల్గా భోజనం చేశారూ. అంతేగాదు అక్కడ వడ్డించేవాళ్లు ఆ కోతికి అంతరాయం కలగకుండా చూడటమే కాకుండా..బెదురు లేకుండా తినేలా ఆ కోతికి పెద్దాయన భరోసా ఇవ్వడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న చుట్టుపక్కల వాళ్లు కూడా ఒకింత ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పెద్దాయన చేసిన పనికి మెచ్చుకోవడమే గాక హనుమాన్ జీ మీతో విందుని పంచుకోవాలనుకున్నారు కాబోలు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by shalu Sharma (@shalu_weightlifter) (చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?) -
గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..
నేడు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గాంధీ జీవితంతో ముడిపపడిన పలు కథనాలు మనం వింటుంటాం. వాటిలో ఒకటే గాంధీ చెప్పే ‘మూడు కోతుల కథ’. ఆ మూడు కోతులు చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అనే సందేశాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గాంధీ దగ్గరకు ఈ మూడు కోతులు ఎలా వచ్చాయనే దాని వెనుక ఆసక్తికర ఘట్టం ఉంది.గాంధీ చెప్పే మూడు కోతుల కథ సుమారు 90 ఏళ్ల క్రితం నాటిది. ఈ కోతుల బొమ్మలు జపాన్ నుంచి గాంధీకి బహుమతిగా వచ్చాయి. జపాన్కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి నిచిదత్సు ఫుజీ గాంధీకి ఈ మూడు కోతుల బొమ్మలను బహూకరించారు. జపాన్లోని అసో కాల్డెరా అడవుల్లో జన్మించిన నిచిదత్సు ఫుజీ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారాడు. 1917లో భారత్లో ఆయన తన మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించాడు.1923లో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ సమయంలో నిచిదత్సు ఫుజీ జపాన్కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి భారత్ వచ్చాడు. 1931లో నిచిదత్సు ఫుజీ కలకత్తా చేరుకుని, నగరమంతా పర్యటించాడు. తన భారత పర్యటనలో నిచిదత్సు ఫుజీ మహాత్మా గాంధీని కలవాలనుకుని, వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వచ్చాడు. నిచిదత్సు ఫుజీని చూసి గాంధీ చాలా సంతోషించారు. అతను గాంధీకి మూడు కోతుల బొమ్మలను కానుకగా ఇచ్చాడు. గాంధీకి ఈ కోతి బొమ్మలు ఎంతగా నచ్చాయంటే, ఆయన వాటిని తన టేబుల్పై పెట్టుకున్నారు.గాంధీని కలవడానికి వచ్చిన ప్రతివారూ ఆ టేబుల్పై ఉన్న మూడు కోతులను గమనించి, దానిలోని అంతర్థాన్ని తెలుసుకునేవారు. అనతికాలంలోనే ఈ మూడు కోతుల సందేశం అందరికీ చేరింది. తరువాతి కాలంలో నిచిదత్సు ఫుజీ బీహార్లోని రాజ్గిర్లో శాంతి గోపురాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో జపాన్ దేవాలయం కూడా ఉంది. జపనీస్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అందమైన తెల్లటి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. నిచిదత్సు ఫుజీ 1986 జనవరి 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
గుళికల ప్యాకెట్ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే
-
వయనాడ్ విషాదం : ఇదో కన్నీటి వ్యథ!
కేరళ వయనాడ్ విషాద దృశ్యాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక విషాద కథనాలు, హృదయవిదారక అంశాలు ప్రకృతి సృష్టించిన ప్రకోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. వయనాడులో విధ్వంసం తరువాత.. ఒక తల్లి కోతి తను కన్నపిల్లను కాపాడుతున్న విధానం కంటతడిపెట్టిస్తోంది. ఎంతైనా అమ్మ అమ్మే అంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో రెండు కోతి పిల్లలు బురదలో భయంతో వణుకుతూ బిక్కు బిక్కు మంటూ ఒకదాన్ని ఒకటి పట్టుకుని కూర్చుని ఉండటాన్ని చూడొచ్చు. దీనిని గమనించిన వ్యక్తి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. #KeralaDisaster #WayanadLandslide pic.twitter.com/pILH3hM8pq— Harish R.Menon (@27stories_) August 6, 2024కాగా కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయానికి దాదాపు 400 వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. -
మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!
కాఫీ ఘమఘములుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాగే అలవాటు లేనివారైన సైతం నోరూరించేలా చేస్తుంది. అలాంటి కాఫీ పొద్దుపొద్దునే పడకపోతే రోజు మొదలవ్వుదు చాలమందికి. అటువంటి కాఫీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల కాఫీలు పేర్లు మనకు తెలిసి ఉండే అవకాశమే లేదు. అవి అత్యంత ఖరీదు కూడా. ఈ ఖరీదైన కాపీలలో ఒకటిగా పేరగాంచిందే మంకీ స్పిట్ కాఫీ. ఏంటీ కోతి పేరుతో పిలిచే కాఫీనా అనే కదా..!. దీని తయారీ విధానం కూడా అత్యంత విచిత్రంగా ఉంటుంది. బాబాయ్..! ఎలా తాగుతారురా దీన్ని అనిపిస్తుంది కూడా. అయితే ఈ కాఫీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందట.భారతదేశంలోని చిక్మగళూరు నుంచి అరకు వరకు అరబికా, రోబస్టా బీన్స్తో చేసే కాఫీలు ఫేమస్. ఇవే ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. కానీ వీటికి మించి అత్యత్తుమమైన రుచితో కూడిన ఖరీదైన కాఫీ మరొకటి ఉంది. అదే మంకీ స్పిట్ కాఫీ. భారతదేశంలోని తైవాన్లో లభించే అరుదైన కాఫీ గింజలు ఇవి. ఇవి మంకీల సాయంతో సేకరిస్తారు. వాటి కారణంగానే ఈ కాఫీ గింజలకు అంత రుచి వస్తుందట. ఎలా తయారు చేస్తారంటే..ఈ కాఫీ అరబిక్ కాఫీ పండ్లతోనే తయారు చేస్తారు. అయితే ఇక్కడ ప్రాసెస్ చేసే విధానం కాస్త అసాధారణంగా ఉంటుంది. ముందుగా ఈ కాఫీ గింజలను చిక్మగళూరులోని రీసస్ కోతులు తిని ఉమ్మి వేస్తాయి. ఇవి కాఫీ తోటల చుట్టూ తిరుగుతూ బాగా పండిన రుచికరమైన కాఫీ బెర్రీలను తింటాయట. ది బెస్ట్ కాఫీ గింజలు వాటికే తెలుస్తాయట. అవి కాఫీ గింజల బయట పొర, గుజ్జును తినేసి లోపలి గింజలను ఉమ్మివేస్తాయి. అవి అలా కాఫీ గింజలను ఉమ్మివేయడంతో ఒక రకమైన రసాయన చర్యకు గురవ్వుతాయట. కోతి నోటిలోని అమైలేస్ అనే ఎంజైమ్ ఈ గింజలకు ప్రత్యేక రుచిని ఇస్తాయట. ఇలా కోతులు ఉమ్మివేసిన కాఫీ గింజలను సేకరించి శుభ్రం చేసి గ్రైండ్ చేస్తారట. సాధారణం ఈ కాఫీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దాని పంటి కింద పడి బయటకు ఉమ్మి రూపంలో వచ్చినప్పుడూ బూడిదరంగులో ఉంటాయట. వాటిని ఎండబెట్టి, కాల్చి ప్రాసెస్ చేస్తారట. ఇది ఎంతో తియ్యగా సుగంధభరితంగా ఉంటుందట. చెప్పాలంటే చాక్లెట్ ఫ్లేవర్తో కూడిన చేదుతో ఉంటుందట. అందువల్ల దీన్ని మంకీ కాఫీ లేదా మంకీ పార్చ్మెంట్ కాఫీ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇలా కోతులు కాఫీ తోటల్లో చిందర వందరగా పడేసిన కాఫీ గింజలను వ్యర్థాలుగా భావించేవారు. 2000 ప్రారంభం నుంచి జంతు సహాయక కాఫీ గింజలతో లాభాలు ఆర్జించడం మొదులు పెట్టాక కోతులను పంటల్లోకి వచ్చేలా రైతులే ఆహ్వానించడం ప్రారంభించారు. వాటి సాయంతోనే మంచి కాఫీని తయారు చేయడం ప్రారంభించారు. కోతులు పసిగట్టినట్లుగా మంచి కాఫీ గింజలను సేకరించడం మనుషుల వల్ల కాదని అక్కడి ప్రజలు చెబుతుండటం విశేషం. ఈ కాఫీ సాధారణ కాఫీలన్నింటి కంటే అత్యంత ఖరీదైనది కూడా.(చదవండి: కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!) -
మంకీ ట్రాప్ గురించి విన్నారా..?
మంకీ ట్రాప్ ఏంటీ అనుకోకండి. ఎందుకుంటే తెలియకుండానే మన అందరం ఈ ట్రాప్లో పడిపోతున్నాం. చేజేతులారా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. నిజానికి మన పెద్దవాళ్లు కొన్నింటిని వదిలేసేందుకు ఇష్టపడితేనే హాయిగా ఉండగలం అని చెబుతుంటారు. కానీ మనం వదలం. పట్టుకుని కూర్చొంటాం. జరగాల్సిన నష్టం జరిగేటప్పటికే మనం ఉండం. ఇలా ఈ భూమ్మీద ఎందరో ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. అసలు ఏంటీ ట్రాప్..? అంతలా మనం ఆ ట్రాప్లో ఎలా పడతామంటే..రెండు రోజుల క్రితం పేపర్లో వచ్చిన వార్త పరిశీలిస్తే..భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి సంచిలో అక్షరాల మొత్తం 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం". ఇక్కడ... విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం.మంకీ ట్రాప్ అంటే..దీన్నే "మంకీ ట్రాప్" అంటారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని ఒక తెగ వారు ఉపయోగిస్తారు. వాళ్లు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.నిజంగా మనకు ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతే..? అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం ఉన్నట్లే.. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దాచిపెట్టుకొని ..ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు రాక.. తనువు చాలించిన వారు చాలా మందే సమాజంలో ఉన్నారు. డబ్బు నిజంగా మనిషిని అంతగా కట్టి పడేస్తుందా?? అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్ లో ఉన్నామనే విషయం గ్రహించకపోవడం విశేషం. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేం? ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఉన్నారు. అందుకే చిన్న మోతాదులో కానీ, పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నామేమో? చెక్ చేసుకోవాలి.అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. ఉదాహారణకు..మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...నో చెప్పలేని మోహమాటలు...తిరిగి అడగలేని అప్పులు...దండిచలేని ప్రేమలు...ఊపిరి సలపనివ్వని పనులు...ఒత్తిడి పెంచే కోరికలు....ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...పేరు కోసం తీసే పరుగులు....అన్నీ మంకీ ట్రాప్ లే!!అందుకే కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం...... మరింత మనశ్శాంతిగా...ప్రశాంతముగా" ఉండేందుకు ప్రయత్నించండి అని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. (చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
డ్యూటీలో ఉండగానే.. నర్సులు చేసిన పని చూస్తే షాక్ అవుతారు
-
భలే రుచిగా ఉందే..
కూడేరు: మండల కేంద్రం కూడేరులో ప్రసిద్ధిగాంచిన శివపార్వతుల జోడు లింగాల ఆలయం వద్ద శనివారం ఓ రెండు వానరాలు గోడపైకి చేరాయి. అక్కడ ఆడుకునేందుకు వచ్చిన పిల్లల్లో ఒక చిన్నారి చేతిలో ఉన్న కూల్డ్రింక్ బాటిల్ను ఓ వానరం లాక్కుంది. అందులో ఏముందోనని వాసన చూసింది. వెంటనే మరొక వానరం ఆ బాటిల్ వైపు ఆశతో చూడసాగింది. దీంతో మొదటి వానరం కూల్డ్రింక్ కాస్త తాగగానే రుచిగా అనిపించడంతో గుటగుటా లాగించేసింది. తర్వాత ఖాళీ బాటిల్ చూపగా.. పక్కనున్న వానరం నిరాశతో పక్కకు వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. -
కోతి... కొబ్బరి కాయ!
కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా? అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా! కానీ మీరోసారి థాయ్లాండ్, మరీ ముఖ్యంగా... దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి... మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!! విషయం ఏమిటంటే... థాయ్ల్యాండ్లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం. థాయ్ల్యాండ్ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి. నాణేనికి మరోవైపు... కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్లాండ్ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ. పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతులకు పెట్టింది పేరు... థాయ్లాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్లాండ్ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా? -
ఫండే: 'వానర జలక్రీడ'! మీరు విన్నది నిజమే!!
వానరాలు(కోతులు) చెట్లపైనుంచి దూకడం, గంతులేయడం, కీచుమంటూ అరవడంలాంటివి మనం ఎన్నో చూసుంటాం. అవి చేసే తమాషా చేష్టలకి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ వానరాలు ఎప్పుడైనా ఈత కొట్టడం చూశారా! చెరువులో కాదు, బావిలో కాదు, ఏకంగా సముద్రంలో.. నమ్మలేకున్నారు కదూ..! అయితే ఈ దృశ్యం చూడండి.. వానరాలు ఈతకొడుతూ కనిపించడం చాలా అరుదు. మకాక్ జాతికి చెందిన ఈ మగ వానరం సముద్రంలో హాయిగా మునకీత కొడుతున్న అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. థాయ్లాండ్లోని ఫై ఫై దీవి తీరం వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని కువైట్కు చెందిన ఫొటోగ్రాఫర్ సులేమాన్ అలాతికి తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో ఇటీవల ‘అండర్ వాటర్ ఫొటోగ్రఫీ–2024’ పోటీలో బహుమతి దక్కించుకుంది. ఇవి చదవండి: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా! -
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా
వేములవాడ రూరల్: వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణా మిడ్మానేరు ముంపు గ్రామం కావడంతో ఇక్కడ పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ మహిళా కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో చందుర్తి మండలం మర్రిగడ్డకు వరినాట్ల పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి వద్ద ఆటోకు ఎదురుగా కోతి వచ్చింది. డ్రైవర్ కోతిని తప్పించబోగా ఆటోకింద ఇరుక్కోవడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో జాతరకొండ మల్లవ్వ (51) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ కుర్ర బాలవ్వ (65) కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మిగతా 11 మంది కూలీలు వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేములవాడ రూరల్ ఎస్సై మారుతి కేసు నమోదుచేసి, మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది?
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తెగ అలరిస్తుంటాయి. ఇలాంటి కొన్ని వీడియోలు మనకు ఒకపట్టాన నమ్మశక్యం కాదు. తాజాగా ఇటువంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన తర్వాత ‘ఇదేందిది’ అనకుండా ఉండలేరు. అలాగే నవ్వకుండానూ ఉండలేరు. మరి.. అంత వినోదం ఉంది ఈ వీడియోలో.. మనం కోతులకు సంబంధించిన వీడియోలను చూసేవుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో ఈ కోతి చేష్టలు తారాస్థాయికి చేరాయనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. కోతులకు నిజంగా ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో ముందుగా పులులు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే అక్కడే చెట్టుపై నుంచి వేలాడున్న ఒక కోతి కిందినున్న పులిని తెగ ఆటపట్టిస్తుంటుంది. ఆ కోతి ఒకసారి పులి తోకను , మరోమారు దాని చెవిని పట్టుకుని లాగుతుంది. ఈ చేష్టలను పులి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా ఫలితం లేకపోతుంది. ఈ కోతి చేష్టలు ఆ పులిని తెగ చికాకు పెడతాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ కోతి నిజంగానే పులితో ఒక ఆట ఆడుకున్నదని, ఇకపై ఆ పులులు కోతికి దూరంగా ఉంటాయంటూ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ Gibbons like to live dangerously pic.twitter.com/kNHbYI0TDd — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 16, 2023 -
ఎజెండాలో కపిరాజు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. కానీ పల్లె, పట్నం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అ న్నిచోట్లా ఇబ్బందులకు కారణమవుతున్న కోతుల సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఏపార్టీ కూడా ఈ సమస్యపై ఇప్పటివరకు మాట్లాడలేదు. జనావాసాలపై దాడులు.. అడవుల్లో ఉండాల్సిన కోతులు అక్కడ ఆహారం దొరక్క 20 ఏళ్లుగా ఊర్ల బాట పట్టాయి. మొదట్లో అడవుల గుండా వెళ్లే హైవేల పక్కన అడ్డా ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చి పోయేవారు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూశాయి. ఇక అక్కడి నుంచి ఊర్లలోకి వచ్చిన తర్వాత పంట పొలాలు మొద లు ఇంట్లోని కిచెన్ వరకు ప్రతీ చోట కోతుల దాడి పెరిగింది. కోతులు అడవులకు వెళ్లాలి తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. ‘వనాలు పెరగాలి – కోతులు అడవులకు పోవాలి’ అనేది హరితహారం నినాదం. పదేళ్లు గడిచే సరికి తెలంగాణలో స్థూలంగా అడవుల విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ హరితహారం నినాదానికి తగ్గట్టుగా కోతులు అడవులకు పోలే దు సరికదా మరింతగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులకు పంట నష్టం జరుగుతోంది. కనిపించని ఫుడ్కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో కోతుల కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్ కోర్టులంటూ పండ్ల మొక్కలను ఎంపిక చేసిన స్థలాల్లో నాటారు. కానీ సరైన ఆలనాపాలన లేకపోవడంతో ఇవి నామరూపాల్లేకుండా పోయాయి. అసెంబ్లీలో సైతం చర్చ తెలంగాణ తొలి శాసనసభలో సీఎం కేసీఆర్ స్వయంగా కోతుల కారణంగా గ్రామాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కోతుల కారణంగా కూరగాయల సాగుకు రైతులు దూరమయ్యారని చెప్పారు. కోతులు బాధ భయంకరంగా మారిందన్నారు. అడవుల్లో ఫలాలు ఇచ్చే వృక్షాలను పెంచడం తప్ప మరో మార్గం లేదన్నారు. పరిహారం మాటేమిటి? కోతుల కారణంగా జరుగుతున్న పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ 2017లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నాటి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు డిమాండ్ చేశారు. అప్పటి అటవీశాఖ మంత్రి జోగురామన్న కోతుల వల్ల ఇబ్బందులేమీ లేవని చెప్పే ప్రయత్నం చేయగా వరంగల్కు చెందిన ఎర్రబెల్లి దయాకర్రావు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కోతుల సమస్య తీవ్రంగా ఉందంటూ చర్చలో తమ అభిప్రాయాలు తెలిపారు. ఆఖరికి కోతులను బెదరగొట్టేందుకు కొండెంగలు (కొండముచ్చులు) అద్దెకు తీసుకురావాలని అప్పటి శాసన సభ్యులు కోరారు. కోతుల నియంత్రణ కోసం రూ. 2.2 కోట్లతో నిర్మల్లో ప్రత్యేక సెంటర్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఆచరణ అంతంతగానే ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకుని కోతులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. -
పురాతన ఆలయం కోతులకు ఆవాసం!
రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గల్తాజీ’ పీఠం మర్కట మందిరంగా పేరుమోసింది. ప్రతిరోజూ ఇక్కడ మనుషుల కంటే మర్కటాలే ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ కొండలు, ఆ కొండల నుంచి జలధారలు, ఆ జలధారలతో ఏర్పడిన జలకుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ఆరావళి పర్వతాల నడుమ వెలసిన విలక్షణ ఆలయం ఇది. ఆరావళి కొండల నుంచి వెలువడే జలధారలతో ఏర్పడిన నీటికుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. విశిష్టాద్వైత స్థాపకుడైన రామానుజాచార్యుల పరంపరకు చెందిన గల్తాజీ ఇక్కడ పదిహేనో శతాబ్దిలో రామానుజ సంప్రదాయం ప్రకారం వైష్ణవ పీఠాన్ని నెలకొల్పారు. ఉత్తర భారతదేశంలో రామానుజ సంప్రదాయంలో ఏర్పడిన తొలి పీఠం ఇదే! ప్రధాన ఆలయంలో సీతారాములు కొలువుదీరగా, ఈ ప్రాంగణంలోనే సూర్యాలయం కూడా ఉంది. ఇక్కడ కనిపించే మర్కట సమూహాలు ఆనాటి వానర సేనల వారసులేనని భక్తులు నమ్ముతారు. (చదవండి: తల్లి ప్రేమకు సరిహద్దులు లేవు) -
పంది కిడ్నీతో కోతికి రెండేళ్ల ఆయుష్షు.. మరో మెట్టెక్కిన ఆధునిక వైద్యం!
మానవులకు జంతు అవయవ మార్పిడి చికిత్సలో వైద్యశాస్త్రం మరోముందడుగు వేసింది. జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది కిడ్నీని అమర్చిన ఒక కోతి మరో రెండు సంవత్సరాల ఆయుష్షు పోసుకుంది. మానవులకు జంతు అవయవ మార్పిడి విషయంలో జరుగుతున్న ప్రయోగ పరిశోధనలలో ఇదొక మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించిన వివరాల ప్రకారం పరిశోధకులు పందులలో జన్యు సవరణపై సాగిస్తున్న ప్రయోగాలలో మరింత పురోగతి సాధించారు. జంతువులలో జన్యుమార్పిడి చేసిన అవయవాలను అమర్చినప్పుడు, ఆ అవయవాలు నిద్రాణమైన వైరస్లను కలిగి ఉండవని, మార్పిడి అనంతరం ఆ నూతన అవయవాలు అంతర్గత దాడికి గురికావని శాస్త్రవేత్తలు గమనించారు. మానవేతర జీవులలో అవయవ మార్పిడి జరిగినప్పుడు ఆ మార్పిడి అవయవం సురక్షితంగా ఉందని, ఆ జీవికి లైఫ్ సపోర్ట్ అందిస్తుందని నూతన ప్రయోగ ఫలితాలలో తేలిందని యూఎస్ బయోటెక్ సంస్థ ఇజెనెసిస్లోని మాలిక్యులర్ బయాలజిస్ట్ వెన్నింగ్ క్విన్ తెలిపారు. జినోట్రాన్స్ప్లాంటేషన్ అనేది వివిధ జాతుల మధ్య ఒక అవయవాన్ని మార్పిడి చేసే విధానం. దీని ద్వారా బాధితులకు అవయవదానంతో ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే లక్షకు పైగా బాధితులు అవయవదానం కోసం ఎదురుచూస్తున్నవారి జాబితాలో ఉన్నారు. అవయవదానం కోసం ఎదురుచూస్తూ, ఫలితం లేకపోవడంతో ప్రతిరోజూ 17 మంది మృతి చెందుతున్నారు. అవయవ మార్పిడి చికిత్సల పరిశోధనల్లో సైన్స్ మరింతగా అభివృద్ధి చెందుతోంది. గత ఏడాది వైద్యులు జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. అయితే ఆ పంది గుండె గ్రహీత చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత మరణించాడు. ఇదేవిధంగా గత నెలలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తికి కూడా పంది గుండెను అమర్చారు. బ్రెయిన్ డెడ్ స్థితికి చేరిన మనుషులలో అవయవమార్పిడి చేసేందుకు జెనోట్రాన్స్ప్లాంట్ సహరిస్తుంది. తాజా పరిశోధనలో జెనోట్రాన్స్ప్లాంట్ చేసిన అవయవాల మార్పిడి కారణంగా కోతుల జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. మొత్తం 69 జన్యువులను పరిశోధకులు పరిశీలించగా, వాటిలో ఎక్కువశాతం గ్రహీత రోగనిరోధక వ్యవస్థ అవయవంపై దాడి చేయవని వెల్లడయ్యింది. ఇందుకోసం పంది జన్యువులో నిద్రాణమైన వైరస్లను సవరించారు. అవి కోతుల రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఉండేందుకు ఔషధ చికిత్స చేశారు. అలాగే పంది అవయవాలలో మానవ జన్యువులను ప్రవేశపెట్టారు. మానవ జన్యువులు ప్రవేశపెట్టని మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు ఆ కోతులు చికిత్స అనంతరం సగటున 24 రోజులు మాత్రమే జీవించాయి. మొత్తం 21 కోతులపై ఈ ప్రయోగాలు జరిగాయి. అయితే మానవ జన్యువులను ప్రవేశపెట్టిన మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు అవి సగటున అధికంగా 176 రోజులు జీవించాయని తేలింది. అలాగే ఈ ప్రయోగాలలో వినియోగించిన ఐదు కోతులు ఒక సంవత్సరానికి మించి జీవించాయని, ఒకకోతి ఏకంగా రెండేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా జీవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో జెనోట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగాలకు సాధారణ పందులను ఉపయోగించినప్పటికీ, నూతన పరిశోధనల్లో మినీయేచర్ పిగ్లను ఉపయోగించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన జెనోట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ముహమ్మద్ మొహియుద్దీన్ మాట్లాడుతూ మనుషులలో జంతు అవయవ మార్పిడి చికిత్స విజయవంతం అయ్యేందుకు, ఆ అవయవాల జన్యువును మరింత సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవ దానం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఈ ప్రయోగాలు వరం లాంటివని పేర్కొన్నారు. అయితే ఇది సాకారం అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు -
కోతి పిల్లకు పిల్లి ఆసరా.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..!
ఏ జంతువైనా తమ బిడ్డలను తప్పా ఇంకే జంతువు పిల్లలను దగ్గరికి తీసుకోవు. అంతేకాదు.. పొరబడి వచ్చినా.. తమ పిల్లలు కాదని గుర్తించి దాడి చేస్తాయి. అందునా వేరే జాతి జంతువు పిల్లలనయితే.. అసలే దగ్గరికి రానియ్యవు. కానీ మీరు చూడబోయే ఈ వీడియోలో ఓ కోతి పిల్లను అక్కున చేర్చుకుంటుంది పిల్లి. వేరే జాతి జంతువు పిల్లను ఓ పిల్లి దగ్గరికి తీసుకుని పోషించడం గ్రేట్ కదా..? వీడియో ప్రకారం.. ఓ కోతి పిల్ల తన తల్లి నుంచి దూరమవుతుంది. దీంతో ఓ పిల్లి కోతి పిల్లను దగ్గరికి తీసుకుంటుంది. తన సొంత తల్లిపై ఎక్కినట్లు పిల్లి బొజ్జకు హత్తుకుని కూర్చుంటుంది కోతి పిల్ల. ఇక.. ఆ కోతి పిల్లని బరువని భావించక.. తనతో పాటే మోసుకుపోతుంది పిల్లి. This lost baby monkey was adopted by this cat. ❤️pic.twitter.com/goRlTYyZJ6 — Figen (@TheFigen_) July 13, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్గా మారింది. తెలివి ఉన్న మనుషులే ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే ఈ రోజుల్లో ఈ పిల్లి అందరికీ ఆదర్శం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇస్తోందంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
మంకీ హెయిస్ట్.. డబ్బుల బ్యాగ్ను భలేగా కొట్టేసింది
-
ఒక్క దెబ్బకి ఆ కోతి లక్షాధికారి అయ్యింది!
Monkey Stole Money Viral రాత్రికి రాత్రే నసీబ్ మార్చుకుని కోటీశ్వరులైన మనుషుల కథల్ని విని ఉంటాం. కానీ, ఓ కోతి పట్టపగలే.. అదీ అడ్డదారిలో కొన్ని గంటలపాటు లక్షాధికారిగా మారిపోయిందట. ఇది సోషల్ మీడియాలో పేలుతున్న జోక్ మాత్రమే. ఉత్తర ప్రదేశ్ షాహాబాద్లో జరిగిన ఓ సరదా ఘటన.. ఓ వ్యక్తిని కాసేపు ఆగమాగం చేసింది. ఓ కోతి లక్షా యాభై వేల నగదు ఉన్న సంచిని ఓ మోటర్ సైకిల్ నుంచి ఎత్తుకెళ్లింది. షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి సేల్ డీడ్ కోసం నగదుతో రిజిస్ట్రీ ఆఫీస్ వచ్చాడు. ఆ సమయంలో ఓ కోతి అక్కడికి వచ్చింది. పార్కింగ్లో ఉన్న ఒక్కో బ్యాగ్ను వెతుక్కుంటూ ముందుకెళ్లింది. అయితే.. దాని కన్ను డబ్బులున్న షరాఫత్ బ్యాగ్ మీదే పడింది. అంతే.. నైస్గా దానిని ఎత్తుకెళ్లింది. కాసేపటికి బండి దగ్గరకు వచ్చిన ఆయన డబ్బు లేకపోయేసరికి దొంగతనం జరిగిందేమో అనుకుని లబోదిబోమన్నాడు. ఈలోపు కొందరు బ్యాగ్ కోతి ఎత్తుకెళ్లిందని చెప్పడంతో దాని కోసం వెతికారు. అది కాస్త దగ్గర్లోని ఓచెట్టుపై నిమ్మలంగా కూర్చుని ఉంది. చాలాసేపు ప్రయత్నించాకే.. అది ఆ బ్యాగ్ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో షరాఫత్ ఊపిరి పీల్చుకున్నాడు. -
బైక్కు అడ్డొచ్చిన కోతి.. భార్య కోమాలోకి.. భర్త పరిస్థితి విషమం
వరంగల్ : దంపతులు బైక్పై వెళ్తుండగా మర్గమధ్యలో వానరం అడ్డువచ్చింది. దీంతో సడన్ బ్రేక్ వేయగా.. భార్య బైక్ నుంచి పడి తీవ్రగాయాలపాలై కో మాలోకి వెళ్లి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గార్ల మండలం కొత్తపోచారం గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యురాలు తిప్పారపు రూతమ్మ భర్త హనుమంతరావుతో కలిసి బైక్పై శుక్రవారం గార్ల కు వచ్చారు. అనంతరం స్వగ్రామం వెళ్తుండగా గో పాలపురం సమీపంలో బైక్కు కోతి అడ్డొచ్చింది. దీంతో హనుమంతరావు సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న రూతమ్మ రో డ్డుపై పడింది. తల వెనుక భాగంలో తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కో మాలోకి వెళ్లింది. క్షతగా త్రురాలిని హుటాహుటినా 108 ద్వారా ఖమ్మం తరలిచారు. ప్రస్తుతం ఆ మె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, తమది నిరుపేద కుటుంబమని, కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బు లేదని, దాతలు స్పందించి తన భార్యకు ప్రాణభిక్ష పెట్టాలని హనుమంతరావు వేడుకుంటున్నాడు. దాతలు 9573073641 నంబర్కు ఫోన్ పే చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
4 గంటలు ముప్పుతిప్పలు.. రూ.21,000 రివార్డ్ ఉన్న మోస్ట్ వాంటెడ్ కోతిని..
భోపాల్: రెండు వారాల భయాందోళనల తర్వాత సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని ఎట్టకేలకు అధికారులు నిర్బంధించారు. అధికారులు, రెస్క్యూటీం, స్థానికులు నాలుగు గంటలు పాటు శ్రమించి చివరికి దాని బోనులో పెట్టగలిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఒక కోతి జనసంచారంలో సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా ప్రజలపైకి దాడి చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు ఆ కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేశారు. ప్రజలపై దాడి చేస్తున్న ఆ కోతిని పట్టుకోవడానికి అనేకసార్లు చేసిన ప్రయత్నించి విఫలం కావడంతో చివరికి స్థానిక అధికారులు.. కోతిని పట్టుకున్నవారికి ₹ 21,000 నగదు బహుమతిని ప్రకటించారు. చివరికి జిల్లా కలెక్టర్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఎలా పట్టుకున్నారంటే! జిల్లా కలెక్టర్ ప్రమేయంతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్గఢ్కు చేరుకున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు ఇందుకు సహాయం చేశారు. ఇంతమంది సహకారంతో చివరికి.. ఆ కోతిని పట్టుకోవడానికి 4 గంటల సమయం పట్టుకోగలిగారు. డ్రోన్ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. దాన్ని పట్టుకుని బోనులో బంధించారు. కోతిని పట్టుకున్నందుకు దానిపై ఉన్న ఉన్న 21,000 నగదు బహుమతిని జంతు రక్షక బృందానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే! -
నైట్క్లబ్లో కోతికి గొలుసు కట్టి..వీడియో వైరల్..నెటిజన్ల ఆగ్రహం
కలకత్తా:కలకత్తాలోని ఓ నైట్క్లబ్లో గొలుసుతో కట్టిన కోతి కనిపించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామిక్ కాలనీ ప్రాంతంలోని ఓ నైట్క్లబ్ టాయ్ రూమ్లో కోతి కనిపించడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్ నిర్వహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 16న సర్కస్ థీమ్తో కూడిన పార్టీని టాయ్ రూమ్లో నిర్వహించదలచారు. ఈ క్రమంలో ఓ కోతిని గొలుసుతో కట్టడం ద్వారా జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) కోతికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా కనిపించడంతో బెంగాళీ యాక్టర్ శ్వాస్తికా ముఖర్జీ స్పందించారు. వీడియోలను షేర్ చేస్తూ కోతిని గొలుసుతో బంధించడాన్ని ఆక్షేపించారు. మనుషులు ఇలా క్రూరంగా ఎలా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి వెళ్లిన వ్యక్తులు కూడా ఆ దృశ్యాలను చూస్తూ ఆపకుండా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ఆ వీడియోలను ట్యాగ్ చేశారు. So #ToyRoomKolkata brought in this tiny monkey for its circus-themed night. Nothing, absolutely nothing can be more inhumane than this. @PetaIndia @Manekagandhibjp @AnushkaSharma @swastika24 @KolkataPolice @MamataOfficial @ParveenKaswan @ToyRoomLondon @PTI_News @ttindia pic.twitter.com/g57qZv12Q9 — Deblina Halder (@StoriesbyD) June 17, 2023 గొలుసుతో కోతి కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో టాయ్ రూమ్ నిర్వహకులు వెంటనే స్పందించారు. నైట్ క్లబ్లోకి ఎలాంటి కోతులను అనుమతించలేదని స్పష్టం చేశారు. క్లబ్లోకి రాదలచిన మదారీ(కోతులను ఆడించే వ్యక్తులు)లకు అనుమతి నిరాకరించిన తర్వాత వారు రెస్టారెంట్ ప్రాంగణంలో కనిపించారని చెప్పారు. మదారీలు గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్లి వారి జీవన పోషణను చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో కోతులకు ఎలాంటి హానీ జరగలేదని యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.. క్షమాపణలు కోరుతున్నట్లు ఓ పోస్టును విడుదల చేసింది. View this post on Instagram A post shared by Toyroom kolkata (@toyroomkolkata) ఇదీ చదవండి:వడగాల్పుల దెబ్బకు 54 మంది మృతి.. ఆస్పత్రుల్లో స్ట్రెచర్లు లేక భుజాలపైనే.. -
Adipurush: థియేటర్ కి వచ్చి ఆదిపురుష్ మూవీ చూసిన వానరుడు
-
కోతి చేసిన పనికి 20 గ్రామాలకు పవర్ సప్లై కట్!
సాక్షి, వరంగల్: కోతి తన చేష్టలతో కరెంటోళ్ళకే షాక్ ఇచ్చింది. 20 గ్రామాలకు కరెంటు సప్లై లేకుండా చేసింది. కోతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విద్యుత్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టి, లక్షా రూపాయల వరకు నష్టం కలుగజేసింది. జనగామ జిల్లా వడ్లకొండ 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ స్తంభాలపై ఎగిరిన కోతి, ట్రాన్స్ ఫార్మర్ను పట్టుకుంది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో పాటు కోతికి తీవ్ర గాయాలయ్యాయి. వడ్లకొండ 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి లింగాలఘనపురం, జనగామ, అడవికేశ్వాపూర్, గానుగుపహాడ్, పసరమడ్ల 33/11 కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ సంబంధించి ఎప్పటికప్పుడు రీడింగ్ నమోదు చేసేలా అక్కడే ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ను కోతి పట్టుకోవడంతో పేలిపోవడంతో పాటు జంపర్లు పూర్తిగా తెగిపడ్డాయి. ఫలితంగా 20 గ్రామాలకు మూడుగంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్లో చిక్కుకున్న కోతిని కిందికి దింపి, మరమ్మతులు నిర్వహించి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. కోతి కారణంగా సంస్థకు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. -
కట కటా... మర్కటా!
ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ కోతి వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనగా....ఒకాయన ఏదో ఆలోచిస్తూ ఆలయం మెట్లు ఎక్కుతూ వస్తుంటాడు. ఆ మెట్ల పక్కన గద్దెపై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్లద్దాలను లాగేసుకుంది. ఇతడు బిత్తరపోతూ ఉండగానే ‘ఈ అద్దాలు నాకు సెట్ అవుతాయా’ అన్నట్లుగా ట్రయల్స్ స్టార్ట్ చేసింది కోతి. ఈలోపు అక్కడికి వచ్చిన ఒక మహిళ కొన్ని పండ్లను కోతి ముందు పెట్టింది. అంతే...ఆ అద్దాలను పక్కన పెట్టి పండ్ల పని పట్టింది కోతి. ఈ వీడియోను చూస్తూ బిగ్గరగా నవ్వుతున్న వాళ్లతో పాటు ‘అయ్యో..ఈ వనజీవులు ఎంత ఆకలితో అల్లడుతున్నాయో కదా!’ అని బాధపడుతున్న వారూ ఎందరో ఉన్నారు. -
రీల్స్ చూస్తూ స్నాక్స్ తింటూ.. ఈ కోతిచేష్టలు మామూలుగా లేవు
-
ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి చిరుత వేట
-
మెట్రో రైలులో షికారుకెళ్లిన కోతి
-
పెళ్లి మండపంలోకి హఠాత్తుగా చొరబడ్డ కోతి..వధువరులపై దాడి చేసి..
పెళ్లి అనేది ఎవరికైనా జీవితంలో మర్చిపోలేని ఒక మధురాను ఘట్టం. అలాంటి వాటిల్లో ఏదైన్న అనుకోనిది జరిగితే ఎవరికైనా కాస్త బాధగానే ఉంటుంది. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మానవుని ఊహకు కూడా అందని విధంగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే ఈ పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఓ పెళ్లి వేడుకలో వధువరులు ఆనందంగా పెళ్లి చేసుకుటున్నారు. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా నిరాటంకంగా జరుగుతోంది. సరిగ్గా ఆ జంట తలంబ్రాలు వేసుకుంటూ ఉల్లాసంగా ఉన్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి నేరుగా మండంపంలోకి వచ్చేసింది. అంతే ఒక్కసారిగా అక్కడున్న వరుడు తలపై అటాక్ చేసి కొన్ని అక్షంతలు తీసుకుంది. దీన్ని చూసి వధువు షాక్తో ఉండిపోయింది. క్షణాల్లో ఆమె నెత్తిపై కూడా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్నవారందరూ కంగుతిన్నారు. అయితే ఆ కోతి వారిని ఆశీర్వదించేందుకు వారిపైకి అలా దూకిందేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by ⓉⒺⓁⓊⒼⓊ.ⒷⒺⒶⓉⓈ_①_④_③//50k🔵 (@telugu.beats_1_4_3) (చదవండి: హాట్ టబ్లో సేద తీరుతున్న జంటపై సడెన్గా మౌంటైన్ లయన్ దాడి..ఆ తర్వాత..) -
కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి.. వీడియో వైరల్
-
ఫ్లెక్సీపెట్టి.. అన్నదానం చేసి
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కన్నుమూస్తే సంతాప సూచకంగా వారి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి కూడళ్లలో ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఖమ్మంలో మృతిచెందిన ఓ కోతికి సైతం ఫ్లెక్సీ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తిరుగుతూ, నిత్యం హమాలీల మధ్య ఉంటూ.. వారు పెట్టే భోజనం తింటూ గడిపే ఓ కోతి ఇటీవల మృతి చెందింది. దీంతో హమాలీలు ఆ వానరానికి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా శుక్రవారం అన్నదానం సైతం నిర్వహించారు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ కోతి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి మార్కెట్ ప్రధాన గేటుకు పెట్టగా పలువురు ఆసక్తిగా పరిశీలించారు. చదవండి: మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది -
అట్లుంటది మన యాక్టింగ్.. పోలా అదిరిపోలా!
ఈ కోతికి కొంచెం యాక్టింగ్ పిచ్చి.. ఎప్పటికైనా సినిమాల్లో స్టార్ అయిపోవాలని కలలుగంటోంది..పైగా.. చావు సీన్లలో యాక్ట్ చేయడంలో స్పెషలైజేషన్ కూడా ఉంది. ఎంతలా అంటే యాక్టింగా.. లేక నిజంగానే చచ్చిందా అన్నది సాటి కోతులు కూడా కనిపెట్టలేవు. ఫొటోగ్రాఫర్ ఫెడ్రికా(ఇటలీ) కూడా చనిపోయిందనే అనుకున్నారు. ఇంతలో ఎవరు కట్ అన్నారో తెలియదుగానీ.. చటుక్కున లేచి కూర్చుందట. కామెడీ వైల్డ్ లైఫ్ అవార్డ్స్ జ్యూరీ మెచ్చిన చిత్రమిది. ఇట్స్ ఏ గోల్.. ఈ గద్ద.. మెస్సీ ఫ్యాన్ అట. ఈ మధ్యే ఫిఫా వరల్డ్ కప్ చూసొచ్చింది. అప్పటి నుంచీ ఇదే వరుస. గోల్ మీద గోల్ కొట్టేస్తోంది. ఏమో.. ఎప్పుడైనా తమ గద్దల్లోనూ ఫుట్ బాల్ పోటీపెడితే.. పనికివస్తుందని ఇప్పటి నుంచే తెగ ప్రాక్టీస్ చేస్తోంది. జియా చెన్ తీసిన ఈ చిత్రం కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో అమేజింగ్ ఇంటర్నెట్ పోర్ట్ఫోలియో పురస్కారాన్ని గెలుచుకుంది. సాక్షి సెంట్రల్డెస్క్ -
Monkey Food Court: కోతుల కోసం మూడు ఎకరాల్లో పండ్ల మొక్కలు
సాక్షి, దుబ్బాక(సిద్ధిపేట): కోతుల బెడదతతో ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. అడవుల్లో ఉండాల్సిన కోతులు గుంపులు గుంపులుగా గ్రామాలకు చేరాయి. అక్కడ వాటికి సరిపడా ఆహారం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. ఏకంగా ఇళ్లలోకి చోరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లుతున్నాయి. ఇండ్ల పైకప్పులను ధ్వంసం చేస్తున్నాయి. రైతులు పండించి కూరగాయలను, ఇతర ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రస్థాయిలో నష్ట పోతున్నారు. కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకోవడానికి వాయిస్ అలారం ఏర్పాటు చేశారు. కొంత మంది రైతులు డప్పు చప్పుడు, టపాసులు కాల్చుతున్నారు. కోతులను బెదర కొట్టేందుకు కొన్ని గ్రామాల రైతులు ఇతర జిల్లాల నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టి కొండెంగలను కొనుగోలు చేసి తిప్పుతున్నారు. వాటి సంరక్షులకు ప్రతీ నెల జీతం ఇస్తున్నారు. పద్మనాభునిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం కోతుల బెడదను తప్పించడానికి అవి ఊర్లలోకి రాకుండా, పంట పొలాలను నష్టం చేయకుండా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలోని గ్రామ శివారులో ప్రత్యేకించి ‘మంకీ ఫుడ్కోర్టు’ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మూడు ఎకరాలను చదును చేసి అందులో పలు రకాల పండ్ల మొక్కలు నాటారు. అవి నాటి మూడు సంవత్సరాలైంది. మామిడి, జామ, దానిమ్మ, సపోట, సీతాఫలం, రేగుపండ్లు, బొప్పాయి, సంత్ర, అరటి, బత్తాయి, అల్లనేరేడు, వెలగ పండ్లు, ఖర్బూజ, దోస పండ్ల మొక్కలను పెంచుతున్నారు. రాజక్కపేటలో కొండెంగలను తిప్పుతున్న గ్రామస్తులు -
Viral Video: యువకుడ్ని సావకోట్టిన కోతి
-
Viral Video: పిల్ల కోతి కోసం తల్లడిల్లిన తల్లి కోతి
-
ప్రకాశం: పసికందును బలిగొన్న వానరం
సాక్షి, ప్రకాశం: జిల్లాలో శుక్రవారం ఘోరం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రపోతున్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి కిందపడేసింది వానరం. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర-సుమతీ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. రెండు నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది సుమతీ. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. పసికందును ఆరుబయట మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి.. పసికందును మంచం మీద నుంచి ఈడ్చుకెళ్లింది. గట్టిగా కిందపడేయడం.. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యవసాయ సామాగ్రి ఆ పసికందుపై పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలికిడికి అక్కడికి వచ్చిన తల్లి.. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. పసికందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వైరల్ వీడియో: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
-
Viral Video: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
లక్నో: ఎవరైనా పిచ్చిగా ప్రవర్తిస్తే ‘కల్లు తాగిన కోతి లెక్క చేస్తున్నవ్’ అంటారు. కానీ, నిజానికి కోతి కల్లు తాగటం చూసినవారు చాలా తక్కువ. అలాంటిది లిక్కర్కు బానిసైన వానరాలూ ఉన్నాయంటే నమ్ముతారా? కానీ, ఓ కోతి ఏకంగా వైన్స్ షాప్లోకి దూరి చోరీ చేస్తోంది. మద్యం మత్తులో తూలుతూ జల్సా చేస్తోంది. బీరు బాటిల్ ఎత్తి తాగుతున్న ఓ కోతి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలో లిక్కర్కు అలవాటు పడిన ఓ కోతి షాపుల్లో దూరి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోందంటూ స్థానిక వైన్స్ షాపుల విక్రయదారులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓ కోతి మద్యం తాగుతూ ఎవరైనా కనిపిస్తే వారి దగ్గర నుంచి బాటిళ్లు లాక్కుని పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. అడ్డుకోవడానికి చూస్తే మీద పడి కరిచేందుకు సైతం ఎనకాడటం లేదటా. దీంతో వైన్స్ షాపులకు వచ్చి మందు కొనాలంటేనే భయపడుతున్నారటా మద్యం ప్రియులు. మొత్తానికి ఈ తాగుబోతి వానరం అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. రాయ్బరేలీ జిల్లాలోని గడాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్గంజ్ ప్రాంతంలో ఓ కోతి బీరు తాగుతున్న వీడియో తెగ వైరల్గా మారింది. ఫిర్యాదులు పెరిగిపోతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులతో కలిసి కోతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: కేబుల్ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా? -
కోతులతో కష్టాలు కనుమా.. కొండెంగలను తెచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ఇంతకు ముందు పంట పొలాలకు రక్షణ కోసం కంచెలు వేయడం చూశాం. వివిధ రకాల పశువులు, పక్షులు, అడవి జాతి జంతువులతో పంట నష్టపోకుండా పొలం చుట్టూ రకరకాల బొమ్మలు, వైర్లు, టపాకాయలు, దిష్టి బొమ్మలు, సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేయడం చూశాం. కానీ ఇంటిపై కప్పులపై బొమ్మలు, కరెంట్ తీగలు, కంచె వేయడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు అనేక గ్రామాల్లో ఇంటి పైకప్పులపై కంచెలు కనిపిస్తున్నాయి. కేవలం కోతుల కోసమే ఇలాంటి జాగత్త్రలు, రక్షణ చర్యలు తీసుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యం అనిపించినా.. అక్షరాలా నిజమే. ఒకప్పుడు కేవలం అటవీ పరిసర ప్రాంతాలు, పల్లెల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఊళ్ళల్లోనే కాదు పట్టణాల్లోనూ వానరాల సంచారం తీవ్రమైంది. కొండెంగలను తెచ్చినా.. కోతుల కట్టడి కోసం చాలా ఊళ్ళల్లో, కాలనీల్లో స్థానికులు తలాకొంత వేసుకుని వాటి రక్షణకు కొండెంగలను తెచ్చి పెట్టుకున్నారు. కానీ ఒక దిక్కున కొండెంగలను ఏర్పాటు చేస్తే మరో దిక్కున కోతులు చొరబడుతున్నాయి.. అన్ని చోట్లా పెట్టేందుకు ఎక్కువగా కొండెంగలు కావాల్సి ఉన్నా వాటి కొరత నేపథ్యంలో గ్రామస్తులకు విసుగొచ్చి చివరికి తీసుకువచ్చిన కొండెంగలను కూడా అడవిలో వదిలేశారంటే వానర సైన్యం సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు, కోతులు పట్టితెచ్చిన వారికి 2 రూ.వేల నుంచి పదివేలు ముట్టజెప్పినా... ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ కోతుల బెడద తప్పడంలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి కోతులు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం కానరావడం లేదు. ఈ మధ్య మా ఊళ్లో ఓ ఇంట్లోకి కోతి వెళ్లింది. పొరపాటున ఇంటి డోర్లాక్ పడటంతో వందలాది కోతులు ఇంటిని చుట్టుముట్టి నానారభస చేసి. పైకప్పును పూర్తిగా పాడు చేశాయి. ఆ సమయంలో ఇంట్లో మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏమిటి? – గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ–2, ముస్తాబాద్ -
గుండెల్ని కదిలించేలా.. ఈపాటి విశ్వాసం మనిషికెక్కడిది?
మనిషికి విశ్వాసం ఏమాత్రం?.. మూగజీవాలతో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువే!!. ఇది నిరూపించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది. ఆప్యాయంగా ఆయన్ని చూస్తూ.. హత్తుకుని.. కాసేపు అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్.. అడవి నుంచి వచ్చిన ఓ కొండముచ్చుకు రోజూ తిండి పెట్టేవారట. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన పార్థీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. ఆ కొండముచ్చు ఇలా తన విశ్వాసం.. ప్రేమను ప్రదర్శించింది. మరో ఘటనలో.. నంద్యాల డోన్ పట్టణం పాతపేటలో తనకు తిండి పెట్టిన ఓ మహిళ చనిపోతే శవయాత్రలో ఆ కొండ ముచ్చు పరుగులు తీసిన వీడియో ఒకటి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బలిజ లక్ష్మీదేవి అనే మహిళ బజ్జీల కొట్టు నడిపిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది. అలా రోజూ వచ్చే కొండముచ్చుకు.. మంగళవారం నాడు లక్ష్మీదేవి కనిపించలేదు. ఆకస్మాత్తుగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బంధవులు అంత్యక్రియల కోసం శవయాత్రను ఓ వాహనంలో నిర్వహించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఆ కొండముచ్చు ఆ వాహనం వెంట పరుగులు తీయడాన్ని కొందరు రికార్డు చేసి వైరల్ చేశారు. All lives, #animals #birds #plants have intelligence & emotions. #Monkey mourns death of man who fed every day. By kissing him. Touching. Happened in #Srilanka. Mattaglabbu. pic.twitter.com/nBLKEW2JUZ — Straight Talk India (@sttalkindia) October 20, 2022 -
చాలా రిచ్.. కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఎక్కడో తెలుసా?
విదేశాల్లో పెంపుడు జంతువుల పేర్ల మీద కోట్ల ఆస్తులు వీలునామా రాసిన ఘటనలు విన్నాం. కానీ మనదేశంలో కోతుల పేరు మీద భూమి ఉండటం అరుదే. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి ఉంది. ఈ విషయం గ్రామ పంచాయతీ రికార్డుల్లో స్పష్టంగా రాసి ఉంది. అటవీ శాఖ మొక్కలు నాటిన ఆ భూమిలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూడా ఉంది. ఈ భూమి కోసం గొడవలవుతున్నాయి. నగరాల్లో గజం జాగ కొనాలంటే గగనమవుతోంది. అలాంటిది కోతులకు 32 ఎకరాల భూమి ఎలా వచ్చింది? అసలు జంతువుల పేరు మీద రిజిస్టర్ ఎలా చేశారు? ఎవరు రిజిస్టర్ చేశారు? అనేక సందేహాలు వస్తున్నాయి కదా! ‘కానీ.. ఎవరు రిజిస్టర్ చేశారు? ఎలా చేశారు?’అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదని చెబుతున్నాడు ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్. అక్కడ కోతుల పేరుమీద భూమి ఉండటమే కాదు, వాటికి ఎనలేని గౌరవం కూడా ఉంది. ఉప్లా గ్రామవాసులు కోతులకు ఒకప్పుడు ఇంకా ఎక్కువ మర్యాద ఇచ్చేవారు. వేడుక ఏదైనా కోతులకు ప్రత్యేక స్థానం ఉండేది. పెళ్లిళ్లు అయితే.. ముందు వాటికి కానుకలు ఇచ్చిన తరువాతే వేడుక మొదలయ్యేది. ఇప్పుడు ఆ ఆచారాన్ని తక్కువ మంది పాటిస్తున్నారు. అయినా ఇప్పటికీ... కోతులు ఇంటిముందుకొస్తే ఆహారం మాత్రం కచ్చితంగా పెడతారు. -
కోతిని మింగి..చనిపోయి
దండేపల్లి (మంచిర్యాల): ఓ కోతిని మింగి... కొండచిలువ చనిపోయిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో జరిగింది. కదలకుండా పడి ఉన్న కొండచిలువ చుట్టూ కొన్ని కోతులు చేరి అరుస్తుండటంతో గ్రామస్తులు గమనించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కొండచిలువ చనిపోయి ఉంది. అది మధ్యలో ఉబ్బెత్తుగా కనిపించింది. కోతిని మింగడం వల్ల మిగతా కోతులు దాడి చేసి ఉంటాయని, ఆ దాడిలో అది చనిపోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
Photo Feature: కల్లు కమ్మగుంది..
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద ఆదివారం ఓ కోతి కల్లు తాగింది. కల్లు కవర్ను తెచ్చుకొని గోడపై కూర్చొని రుచి చూసింది. -
పులినే ఒక ఆట ఆడుకున్న కోతి.. వీడియో వైరల్
పెద్ద పులి కనిపిస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. కానీ, ఓ కోతి మాత్రం నువ్ పులి అయితే.. నాకేంటి ఇది నా అడ్డా చూసుకుందాం రా.. అన్న విధంగా ప్రవర్తించింది. తన కోతి చేష్టలతో పులినే ఒక ఆట ఆడుకుంది. వానరాన్ని వేటాడేందుకు పులి ప్రయత్నించి చెట్టుపై నుంచి పడిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. చెట్టుపై ఉన్న ఓ కోతిని వేటాండెందుకు పులి ప్రయత్నించింది. చిటారు కొమ్మన ఉన్న వానరాన్ని పట్టుకునేందుకు పులి సైతం చెట్టుపైకి ఎక్కింది. కొమ్మలపై అటూ ఇటూ అలవోకగా దూకటం కోతులకు పుట్టుకతో వచ్చే విద్య. అదే నైపుణ్యంతో పులిని ఆటాడుకుంది కోతి. చేతికి అందినట్లు అంది మరో కొమ్మపైకి దూకుతూ పులికి ముచ్చెమటలు పట్టించింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 74 వేల మంది వీక్షించారు. 8,300 లైకులు వచ్చాయి. हालात का ‘शिकार’ pic.twitter.com/myHtQ3qw5s — Awanish Sharan (@AwanishSharan) March 3, 2022 ఇదీ చదవండి: జీవితాంతం చదువుకుంటూ వృద్ధుడిగా మారిపోతా.. పిల్లాడి మాటలకు నెటిజన్లు ఫిదా -
కోతి తెలివి సల్లగుండ.. ఇలా కూడా చేస్తాయా!.. వైరలవుతున్న వీడియో
భూమ్మీద ఉన్న తెలివైన జంతువులలో కోతులు ఒకటి. కానీ వాటి చేష్టలు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని సార్లు అవి చేసే పనులు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తాయి. దేవాలయాలు, పార్క్లు, బహిరంగ ప్రదేశాల్లో జనాల చేతుల్లో ఆహార పదార్థాలు, ఫోన్లు, పర్స్లు కనిపిస్తే చాలు తెలివిగా వాటిని ఎత్తుకెళ్లిపోతుంటాయి. ఇళ్లలోకి దూరి కిచెన్లోని వస్తువులను కూడా దొంగిలిస్తుంటాయి. చేతికి దొరికిన తీసుకొని పరారవుతుంటాయి. తాజాగా ఓ కోతి బ్యాగ్ నుంచి దొంగిలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో.. ఓ వ్యక్తి భుజానికి బ్యాగ్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఈ బ్యాగ్ అక్కడున్న రెండు కోతుల కంట పడింది. కానీ అక్కడ కోతులు ఉన్నాయని ఆ వ్యక్తి గమనించుకోలేదు. వెంటనే కోతులు వ్యక్తి తగిలించుకున్న బ్యాగ్ వద్దకు చేరుకున్నాయి. అందులో ఓ కోతి మెల్లగా బ్యాగ్ జిప్ తీసింది. మొదటి జిప్లో ఏం దొరకలేదు. దీంతో మరో జిప్ తెరిచింది. అందులో దానికి ఒక యాపిల్ దొరికింది. ఇంకేముంది దానిని తీసుకొని పరుగో పరుగు తీసింది. దీనిని రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో షేర్చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్.. వేలల్లో లైక్లు వచ్చి చేరుతున్నాయి. దొంగ కోతి, అది చికాగో, న్యూయార్క్ నుంచి వచ్చినా సరే కోతులన్నీ దొంగవే. కోతి తెలివి మామూలుగా లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అబ్బా! ఏం చేశాడ్రా... మూన్ వాకింగ్ స్టైల్కి ఫిదా అవుతున్న నెటిజన్లు View this post on Instagram A post shared by Waow Africa (@waowafrica) -
పరాయి వస్తువులపై మోజు.. ఇన్ని ఇబ్బందులా!
వజ్రపురం అనే గ్రామంలో నివసించే రాజయ్య, రత్నమ్మ దంపతులకు లేకలేక పాప పుట్టింది. ఆ పాపకి అపురూప అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచసాగారు. అపురూప మూడో యేట అడుగుపెట్టింది. ఆ పుట్టినరోజు నాడు అపురూపకి పట్టులంగా, పట్టు జాకెట్టు కుట్టించారు. అలాగే పాపాయి బుల్లి బుల్లి చేతులకు బంగారు గాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రపులోలకులు, వజ్రాలహారం వేశారు. ఆరుబయట పందిరిలో సింహాసనంపై అపురూపను కూర్చోబెట్టి అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. అదే సమయానికి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఒక తల్లికోతి, పిల్లకోతి ఆ వేడుకకు దగ్గరలో ఉండే చెట్టు మీదకు చేరి ఆ వేడుకనంతా చూశాయి. పిల్లకోతికి అపురూప వేసుకున్న పట్టులంగా, పట్టు జాకెట్టు, గాజులు, అరవంకీలు, వజ్రాల హారం ఎంతగానో నచ్చాయి. తనకు అవన్నీ తెచ్చిపెట్టమంటూ తల్లికోతితో పేచీ పెట్టుకుంది. ‘వద్దమ్మా, పరులసొమ్ము పాము వంటిది’ అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూ కూర్చుంది. ఆఖరుకు పిల్లకోతి బాధ చూడలేక ‘సరేనని’ ఒప్పుకుంది తల్లికోతి. వేడుకంతా పూర్తయి అంతా సర్దుకునేసరికి చీకటి పడింది. అపురూప వేసుకున్న పట్టు జాకెట్టు, పట్టు లంగా ఒక సంచిలో పెట్టారు. బంగారుగాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రాలహారాన్ని ఒక పెట్టెలో పెట్టి.. అదే సంచిలో సర్దారు. ఆ సంచిని బీరువాలో పెడదామనుకుని అలసిపోయి ఉండటంతో ఆదమరచి నిద్రపోయారంతా. ఇదే అదనుగా భావించి తల్లి కోతి ఆ సంచిని దొంగిలించి చెట్టు పైకి తీసుకెళ్ళింది. తను అడిగినవన్నీ సంచిలో ఉండటంతో పిల్లకోతి సంతోషానికి హద్దే లేకుండాపోయింది. అప్పటికప్పుడు వాటన్నింటిని తనకు వేయమని గొడవపెట్టింది. ఆ పిల్లకోతికి లంగా, జాకెట్టు వేసింది తల్లి కోతి. చేతులకు గాజులు, అరవంకీలు తొడిగింది. మెడలో వజ్రాల హారాన్నీ వేసింది. వాటిని చూసుకుని పిల్లకోతి ఎంతగానో మురిసిపోయింది. తెల్లవారుతుండగా మెల్లగా చెట్టు దిగి.. వయ్యారంగా ఊరిలోకి నడవసాగింది. రాజయ్య,రత్నమ్మలు ఉదయాన్నే లేచి చూసే సరికి తమ అమ్మాయి నగలు, పట్టు బట్టలు ఉన్న సంచి కనిపించకపోవటంతో వెతకటం మొదలు పెట్టారు. వాళ్ళకు పట్టులంగా, జాకెట్టు, నగలతో పిల్లకోతి ఎదురైంది. వెంటనే కోతులు పట్టుకునే అతన్ని పిలిపించి పిల్లకోతిని పట్టించారు. దాని ఒంటి మీది బట్టలు, నగలు తీసుకుని, అతనికి మంచి బహుమతినిచ్చి పంపించారు ఆ దంపతులు. ఈ లోపు తన పిల్ల కనిపించక ఆదుర్దాగా వెతకటం ప్రారంభించింది తల్లికోతి. ఎట్టకేలకు కోతులు పట్టే అతని చేతిలో ఒంటి మీద బట్టలు, నగలు ఏమీ లేకుండా కనిపించింది. అప్పటికే పిల్లకోతి తల్లి పై బెంగ పెట్టుకుంది. తల్లి కోతిని చూసే సరికి ఎక్కడలేని ఆనందం పుట్టుకొచ్చింది. కోతులు పట్టే అతనికి కనిపించకుండా ‘కంగారుపడకు, నిన్ను కాపాడుకుంటాను’ అంటూ పిల్లకోతికి సైగచేసింది తల్లికోతి. కోతులు పట్టే అతను ఆ పిల్లకోతిని తీసుకెళ్ళి సర్కస్ కంపెనీ వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు పిల్లకోతిని నానా హింసలు పెట్టి అది సర్కస్లో నాట్యం చేసేలా, గంతులేసాలా దానికి శిక్షణ ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో పిల్లకోతి నరకయాతన పడింది. తన తల్లి చెబుతున్నా వినకుండా పరాయి వస్తువుల కోసం ఆశపడటంతో ఇన్ని ఇబ్బందులు, బాధలు పడవలసి వచ్చిందని తెలుసుకుంది. (క్లిక్: ప్రతిభకు పట్టం.. అందుకే ఇలా మారువేషంలో..) ఒక రోజు సర్కస్ ముగించుకుని అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తల్లి కోతి.. పిల్లకోతి దగ్గరకు వెళ్ళి దానికి కట్టిన తాడుని అతి కష్టం మీద నోటితో కొరికి తెంపింది. గుట్టుచప్పడు కాకుండా తన పిల్లతో బయట పడింది. తల్లిని పట్టుకుని పిల్లకోతి వెక్కివెక్కి ఏడుస్తూ ‘అమ్మా! ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. పరులసొమ్ము ఇంకెప్పుడూ ఆశించను’ అంటూ తల్లిఒడిలో తలదాచుకుంది. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
జిల్లా కలెక్టర్కే ఝలక్ ఇచ్చిన కోతి.. ఏం చేసిందంటే?
లక్నో: ఒక జిల్లాకు కలెక్టర్ అధిపతి. జిల్లాలో ఆయనను మించిన పవర్ఫుల్ వ్యక్తి మరొకరు ఉండరు. అయితే, అలాంటి వ్యక్తికే ఝలక్ ఇచ్చింది ఓ కోతి. చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు, స్థానికులు ఉన్నప్పటికీ కలెక్టర్ కంటి అద్దాలను ఎత్తుకెళ్లి తానేంటో చూపించింది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్, మథురాలోని బృందావన్ నగరంలో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. జిల్లా మెజిస్ట్రేట్ నవనీత్ చాహల్ గ్లాసెస్ను ఎత్తుకెళ్లిన వానరం దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు భారత అటవీ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద. కలెక్టర్ నవనీత్ చాహల్, పలువురు పోలీసులు ఓ భవనం వద్ద గుమిగూడి కోతి నుంచి గ్లాసెస్ ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ భవనం గోడలపై ఇతర కోతులు సైతం ఉన్నాయి. కొద్ది సేపు బుజ్జగించిన తర్వాత కంటి అద్దాలను తిరిగి ఇచ్చేసింది ఆ వానరం. ‘భారత్లోని ఓ జిల్లాలో డిస్ట్రిక్ట్ మెజిస్టేట్ను మించిన పవర్ఫుల్ వ్యక్తి ఉండడు. బృందావన్లో డీఎం నవనీత్ చాహల్ అద్దాలను కోతీ ఎత్తుకెళ్లింది. కొద్ది సమయం బుజ్జగించిన తర్వాత తిరిగి ఇచ్చేసింది’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు సుశాంత నంద. If you had not seen someone more powerful than District Magistrate of a District in India😊 Monkey snatches glasses from DM Navneet Chahal in Vrindavan, Mathura.After some pleading,the monkeys returned the glasses. pic.twitter.com/YTERfjh62G — Susanta Nanda IFS (@susantananda3) August 21, 2022 ఇదీ చదవండి: మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి! -
ఒడిలో పడుకోబెట్టుకుని తల్లిలా ఓదార్చిన ‘కోతి’.. నెటిజన్లు ఫిదా!
బాధలో ఉన్న వ్యక్తిని ఎవరైనా దగ్గరకు తీసుకుని ఓదార్చితే మనసుకు ఎంతో హాయినిస్తుంది. మనకుంటూ ఒకరు ఉన్నారనే భావన కలుగుతుంది. అలాంటిది ఓ మనిషిని మూగజీవాలు అక్కున చేర్చుకుంటే ఆ దృశ్యం హృదయాన్ని కదిలిస్తుంది. అలాంటి పనే చేసి ఔరా అనిపించింది ఓ వానరం. బాధతో తలపట్టుకున్న ఓ వ్యక్తిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఓదార్చింది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటనకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కోతి వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా.. వైరల్గా మారింది. అందులో.. లాగు, చొక్క ధరించిన ఓ కోతి సోఫాలో కూర్చుని ఉంటుంది. అక్కడికి ఓ వ్యక్తి ఒత్తిడిలో చికాకుపడుతూ తలపట్టుకుని వచ్చి వానరం పక్కన కూర్చున్నాడు. అది గమనించిన ఆ కోతి.. ఆ వ్యక్తిని పిలిచి తన ఒడిలో పడుకోవాలని సైగ చేస్తుంది. అతడు కోతి ఒడిలో తల వాల్చగా జోకొడుతూ చిన్న పిల్లలను నిద్రపుచ్చిన మాదిరిగా చేసింది. ఈ వీడియోను 30 లక్షల మందికిపైగా వీక్షించారు. కొందరు నెటిజన్లు ఆ వానరం తమకు కావాలంటూ కామెట్లు చేశారు. ‘ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితులకు ఆ తెలివైన వానరం నాకు అవసరం’ అని రాసుకొచ్చారు ఓ నెటిజన్. 452- Ağlayan arkadaşını dizine yatırıp teselli eden maymun pic.twitter.com/gezl0NKX8g— 59.748 farklı hayvan (@59748hayvan) July 30, 2022 ఇదీ చదవండి: ఏంది బ్రో అది: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై ఊహించని రీతిలో.. -
Photo Feature: కుక్క.. కోతి సయ్యాట
సాక్షి, ఖమ్మం: గ్రామాలు, పట్టణాల్లో ఇటీవల కోతుల సంచారం పెరిగింది. కోతి కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడి తరుముతుంటాయి. కానీ ముదిగొండ మండల కేంద్రంలో జాతి వైరాన్ని మరిచి ఓ కోతి కుక్కపైన ఇలా పడుకుని సేద తీరింది. ఆ తర్వాత కోతి, కుక్క కలిసి ఆడుకోవడం కనిపించింది. ఈ సన్నివేశాలను అటుగా వెళ్తున్న వారు ఆసక్తిగా చూశారు. చదవండి: Photo Feature: హరివిల్లుతో పులకింత -
వానరబంధం!
వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు క్రైం) ప్రేమ, ఆప్యాయత, అనుబంధం..మనుషుల్లోనే కాదు.. తమలోనూ ఉంటాయని నిరూపించిందో పిల్ల వానరం. తన యజమానికి దెబ్బ తగిలితే ఒక పిల్ల కోతి తల్లడిల్లిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రొద్దుటూరులోని పక్కీరప్ప ఒక పిల్ల వానరాన్ని పెంచుకుంటున్నాడు. అతను బయటికి ఎక్కడికి వెళ్లినా దానిని వెంట తీసుకొని వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం జరిగిన గొడవలో పక్కీరప్పకు స్వల్ప గాయాలయ్యాయి. అతనితో పాటు కోతిని కూడా 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రక్తగాయాలతో ఉన్న పక్కీరప్పను చూసి పిల్ల వానరం తల్లడిల్లి పోయింది. పడుకొని ఉన్న యజమాని పక్కనే కూర్చుంది. అతన్ని లేపడానికి పదే పదే ప్రయతి్నంచింది. వానరం, యజమాని బంధం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. మరో వైపు స్థానికులు పిల్లకోతికి ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. -
నిందగా మారిన గణచిహ్నం
హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 1983 నాటి ‘కిసీ సే న కెహనా (ఎవరితో చెప్పొద్దు)’ ప్రసిద్ధ హాస్యచిత్రం. అందులో ‘హనీమూన్’ హోటల్ బోర్డును ‘హనుమాన్’గా మార్చారని హీరోయిన్తో అంటాడు హీరో. అలా హనుమాన్ను వ్యాపారీకరించడాన్ని దర్శకుడు చూపించారు. ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ఈ సినిమా స్క్రీన్ షాట్ను చూపి, ‘2014 ముందు హనీమూన్, 2014 తర్వాత హనుమాన్’ అని 4 ఏళ్ల క్రితం ట్వీటారు. ఇది మత భావాలను రెచ్చగొట్టే అంశంగా మారింది. భగవాన్ హనుమాన్ను కోతి అని అవమానించారని జుబేర్పై అభియోగం. పురాణాల్లో రాక్షసులు, దేవగణాలు, యక్షులు, రామాయణంలో వానరులు వారి గణచిహ్నాలతో పేర్కొనబడ్డ స్థానిక జాతుల మానవ సమూహాలు. గణచిహ్నాలను రూపాలకు అన్వయించారు. ‘కపి’ పదాన్ని కోతి అని అనువదించారు. సవరులు, శబరులు, ఇతర ఆదివాసీ తెగలవారు రామాయణంలో వానరులుగా పేర్కొనబడ్డారు. వీరు వాలం (తోక) గల నరులు. తోకలాంటి వస్త్రం ధరించే నరులు. వెనుక పొడవుగా వేలాడే గోచీని కట్టుకునేవారు. ఈ గోచీ పురుషులకు మాత్రమే పరిమితం. వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమాదేవి, ఆంజనేయుని తల్లి అంజనీ దేవి వగైరా వానర జాతి స్త్రీలకు తోకలుండవు. వానరులు, వానర రాజ్యాల గురించి రామాయణం చాలా విషయాలు చెప్పింది. వాటిని కల్పిత, ఉద్దేశపూరిత వక్రీకరణలకు గురిచేశారు. వానరులంటే కోతులని ప్రచారం చేశారు. రాముడు కూడా యుద్ధంలో వానరులు మానవరూపాల్లో ఉండరాదన్నాడు. హరిరూపంలో ఉండాలన్నాడు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, పాము, కోతి, కప్ప అని అర్థాలు. ఆటవికుల ద్వేషులు కోతి అన్న అర్థాన్ని స్థిరీకరించారు. వానరజాతికి కోతిచేష్టలు అంటగట్టి వినోదించారు. వానరులను కోతులను చేసి ఆంజనేయుని అవమానించింది ఆర్య జాత్యహంకారులే. మతవాదులు వారి వారసులు. హేతుబద్ధ ఆలోచనలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత సామాజిక శాస్త్రవేత్తలదీ, విజ్ఞులదీ! (క్లిక్: ప్రశ్నించినవారికి నిర్బంధమా?) – సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు -
ఊర్లు వదిలిపోవట్లే.. జనానికి సవాల్గా మారిన కోతులు
బుచ్చెయ్యపేట: అనకాపల్లి జిల్లాలో కోతుల నిర్మూలనకు రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామాల్లో కోతులను నిర్మూలించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ గ్రామాల్లో వేలాది కోతులు ఐదారేళ్లుగా తిష్ఠవేశాయి. అరటి, చెరకు, కొబ్బరి, మామిడి, వరి, తమలపాకు, కూరగాయలు, తదితర పంటలపై దాడి చేసి ఫలసాయాన్ని తింటూ పాడు చేస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో తమ భూములను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా ఒక్కో రైతు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇళ్లలోకి చొరబడి... బుచ్చెయ్యపేట మండలం లోపూడి, బంగారుమెట్ట, ఎల్.బి.పురం, శింగవరం, పి.డి.పాలెం, చిన అప్పనపాలెం, భీమవరం, వడ్డాది, పాయకరావుపేట తదితర పరిసర గ్రామాల్లో కోతులు పంటలను పాడు చేయడమే కాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను పట్టుకుపోతున్నాయి. మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. రోడ్లపై తిష్ఠ వేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీటిని నిర్మూలించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి, కలెక్టర్కు, వ్యవసాయ శాఖ మంత్రికి వందలాది మంది రైతులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కోతులను అటవీ ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రవి పఠాన్శెట్టి ఆదేశాల మేరకు ముందుగా జిల్లాలో బంగారుమెట్ట, సత్యవరం గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అటవీ, వ్యవసాయ శాఖ అధికార్లు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. వీటిని పట్టేవారిని తీసుకొచ్చి బోనుల ద్వారా అటవీ ప్రాంతాల్లోకి తరలించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆరేళ్లుగా కోతుల బెడద.. మా గ్రామంలో రెండు వేల కోతులు సంచరిస్తున్నాయి. ఆరేళ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. పెట్టుబడులు పెట్టిన పంటలపై దాడి చేసి తినేస్తున్నాయి. ఏడాదికి రూ. రెండు లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాం. ఎట్టకేలకు అధికారులు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. – యెనుముల వాసు, రైతు సంఘం నాయకుడు, బంగారుమెట్ట, బుచ్చెయ్యపేట మండలం మిగిలిన గ్రామాల్లో కోతులను నిర్మూలించాలి రైతుల ఇబ్బందులను రైతు సంఘం నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. కోతులు నిర్మూలనకు తొలుత బంగారుమెట్ట, సత్యవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ రెండు గ్రామాలతోపాటు జిల్లాలో మిగిలిన గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అధికార్లు చర్యలు చేపట్టాలి. – చిక్కాల రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ -
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన కోతి: వీడియో వైరల్
మనుషులైతే ఏదైనా గాయమైతే చికిత్స కోసం ఆస్పుత్రులకు వెళ్లడం కామన్. కానీ జంతువులకు గాయలైతే వాటి పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు. జూలో ఉండే వాటికైతే అక్కడ ఉన్న అధికారులే దగ్గరుండి వాటి బాగోగులు చూసుకుంటారు. బయట ఉండే మిగతా జంతువులైతే ఏదైనా గాయమైతే అలానే నిరసించి ఉండిపోతాయి తప్ప చికిత్స అందించేవారు ఉండరు. కానీ ఇక్కడొక కోతి గాయాల బారిన పడితే మిగతా జంతువుల మాదిరిగా అలానే ఉండిపోలేదు. మనుషుల వలే ఆస్పుత్రికి వచ్చి చికిత్సకోసం వైద్యుడికై నిరీక్షించింది. వివరాల్లోకెళ్తే....బిహార్లోని ఒక కోతి తన గాయాలకు చికిత్స చేయించుకోవడం కోసం ససారమ్లోని ఆస్పత్రికి వెళ్లింది. ఆ కోతి చికిత్స కోసం తన బిడ్డతో సహా వచ్చింది. పైగా వైద్యుడి కోసం ఓపికగా నిరిక్షించింది కూడా. ఐతే ఈ విషయం తెలుసుకున్న అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఆస్పత్రిలో తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు ఆ కోతికి వైద్యం అందించిన డాక్టర్ అహ్మద్ మాట్లాడుతూ...మొదట ఆ కోతికి చికిత్స అందించాలంటే చాలా భయపడ్డాను. ఆ తర్వాత ఆ కోతిని కాస్త నిశితంగా గమనించి చూస్తే కోతి ముఖానికి గాయమైందని అర్థమైంది. ఒక ఇంజక్షన్ చేసి అయింట్ మెంట్ రాసిన తర్వాత పేషంట్ల మంచం పైనే విశ్రాంతి తీసుకుంది. కాసేపటి తర్వాత ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా వెళ్లిపోయింది. बिहार के सासाराम में आज एक बंदर अपने घायल बच्चे को लेकर एक डॉक्टर के क्लिनिक में पहुँच गया और इलाज कराने के बाद वहाँ से निकला @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/kI7LIpvQw5 — manish (@manishndtv) June 8, 2022 (చదవండి: గొరిల్లా పట్టు మాములుగా లేదుగా...కొద్దిలో సేఫ్ లేదంటే...) -
సెల్ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి..
-
Viral Video: సెల్ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి..
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శిలో ఓ కోతి సెల్ఫీలు దిగుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొబైల్ ఫోన్ను చేతిలో పట్టుకుని వాకింగ్ చేస్తూ ఉన్న ఓ వ్యక్తి నుండి మొబైల్ ఫోన్ను ఓ వానరం లాక్కెళ్లింది. అంతటితో ఆగకుండా దగ్గరలో ఉన్న గోడపై కూర్చొని సెల్ఫీలో దిగుతూ గంట పాటు మొబైల్ ఫోన్ను ఇవ్వకుండా ఆ వ్యక్తి కి ముచ్చెమటలు పట్టించింది. చదవండి: బెజవాడలో ఫేమస్.. రామకృష్ణ బుల్లెట్ గ్యారేజ్ ఆ కోతి చేష్టలకు వాకింగ్ చేస్తూ ఉన్నవారంతా ఒక్కసారి నోరెళ్ల పెట్టి అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత మొబైల్ను నోటితో పట్టుకొని చెట్లపై అటు ఇటు దూకుతూ తన కోతి చేష్టలను చూపెట్టింది. గంట తర్వాత చిన్నగా ఓ గోడపై వదిలి వెళ్లగా ఆ యువకుడు నానా కష్టాలు పడి గోడలు ఎక్కి మొబైల్ ఫోన్ తీసుకోవడంతో అక్కడి వారంతా కోతి చేష్టలకు ముక్కున వేలేసుకున్నారు. -
Photo Feature: 'పానీ'పట్టు యుద్ధం
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఆదివారం మధ్యాహ్నం కోతుల గుంపు వచ్చింది. బాగా దప్పికతో ఉన్నాయో ఏమో.. ఆ కోతులు నీటికోసం వెదుకులాడాయి. ఓ కోతికి నీళ్లబాటిల్ దొరింది. అయితే ఎలా తాగాలో అర్థంకాక సతమతమైంది. నీళ్లు తాగేక్రమంలో బాటిల్ కిందపడి నీళ్లు నేలపాలయ్యాయి. ఇంతలో ఓ నీళ్ల బక్కెట్ కోతుల కంటపడింది. ఒక్కొక్కటిగా బక్కెట్ వద్దకు చేరి కడుపునిండా నీళ్లు తాగి దప్పిక తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
హత్యకేసులో ఆధారాలు ఎత్తుకెళ్లిన కోతి!
జైపూర్: ఓ హత్య కేసులో కోర్టు ఎదుట హాజరైన పోలీసులు చెప్పిన సమాధానం విని జడ్జి బిత్తర పోయారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలన్నింటిని ఓ కోతి ఎత్తుకెళ్లిపోయిందట. ఈ ఘటన రాజస్థాన్లో ఈ ఘటన జరిగింది. ఓ హత్య కేసులో పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఇతర వస్తువులను ఓ బ్యాగ్లో ఉంచారట. అయితే ఆ సంచిని కోతి ఎత్తుకెళ్లిందని పోలీసులు, కోర్టు ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. 2016, సెప్టెంబర్లో.. జైపూర్ చాంద్వాజీ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శశికాంత్ శర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన తర్వాత న్యాయం కోసం మృతదేహాంతో అతని కుటుంబం ఢిల్లీ-జైపూర్ హైవేని దిగ్భంధించింది కూడా. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఐదురోజుల తర్వాత రాహుల్, మోహన్లాల్ కండేరా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే స్టేషన్లో జాగా లేకపోవడంతో.. ఈ కేసులో సేకరించిన పూర్తి ఆధారాలను ఓ బ్యాగులో ఉంచి.. స్టేషన్ బయట ఓ చెట్టుకింద పెట్టాడట డ్యూటీ కానిస్టేబుల్. ఆ టైంలో కోతి వచ్చి ఆ బ్యాగును ఎత్తుకెళ్లిందట. ఈ కేసులో కోర్టు విచారణ.. ఏళ్ల తరబడి సాగింది. ఈమధ్యే ఈ కేసు విచారణకు రాగా.. ఆ సమయంలో ఎవిడెన్స్ ఏవని? జడ్జి ప్రశ్నించారు. దీంతో.. కోతి ఎత్తుకెళ్లిందని సమాధానం ఇచ్చారు పోలీసులు. ఆ బ్యాగులో మొత్తం 15 వస్తువులు కేసుకు సంబంధించినవి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసులు కోర్టుకు సమర్పించిన రాత పూర్వక స్టేట్మెంట్లో.. ఈ విషయాన్ని కింది న్యాయస్థానానికి తెలియజేశామని, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలియజేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ను ఘటన తర్వాత సస్పెండ్ చేశారట. ఆ తర్వాత ఆయన రిటైర్డ్ కావడంతో పాటు మరణించాడని సదరు స్టేట్మెంట్లో కోర్టుకు వివరించారు పోలీసులు. ఇది కోతి కథతో పోలీసులు ఇచ్చిన వివరణ. -
షాకింగ్ ఘటన: చిన్నారిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది
సరదాగా ఆడుకుంటున్న ఆ చిన్నారి మీద.. ఓ కోతి దాడికి పాల్పడింది. నెమ్మదిగా వెనక నుంచి వచ్చి ఆమె మీదకు దూకి కింద పడేసింది. ఆపై ఆ చిన్నారిని లాక్కుంటూ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. చిన్నారి ఏడ్పులు విన్న ఓ స్థానికుడు అది గమనించి.. దానిని తరిమి ఆ చిన్నారిని రక్షించాడు. ఘటన సమయంలో ఆ చిన్నారి తల్లి లోపల పని చేసుకుంటుందట. సర్వేలెన్స్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూస్తేగానీ ఆ షాకింగ్ ఘటనను స్థానికులు నమ్మలేదు. గాయపడ్డ చిన్నారిని వ్యాక్సిన్ ఇప్పించి చికిత్స అందించారు. చైనా నైరుతి ప్రాంతం చోంగ్క్వింగ్లో ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉండగా.. ఆ కోతి అంతకు ముందు కొందరు గ్రామస్తుల మీద కూడా దాడి చేసిందట. పక్కనే ఉన్న గుట్టల్లోంచి ఆ కోతి గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన కలకలంతో అప్రమత్తమైన అధికారులు.. దానిని పట్టుకుని వైల్డ్ లైఫ్ విభాగానికి అందజేస్తామని చెప్తున్నారు. -
హమ్మయ్య.. దాహం తీరింది!
మండుతున్న ఎండలకు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. గ్రీష్మతాపంతో ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరడం లేదు. కోవెలకుంట్ల పట్టణంలో ఓ వానరం దాహం తీర్చుకునేందుకు పడరాని పాట్లు పడింది. గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ పూలవ్యాపారి దాహం తీర్చుకునేందుకు వాటర్ బాటిల్ తోపుడు బండిపై ఉంచుకున్నాడు. గమనించిన వానరం ఆ బాటిల్ను ఎత్తుకెళ్లింది. బాటిల్కు మూత ఉండటంతో పలుమార్లు ప్రయత్నించి.. చివరకు అతికష్టం మీద మూత తొలగించి బాటిల్లోని నీరు తాగి మెల్లగా జారుకుంది. – కోవెలకుంట్ల -
అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే
కోతి.. ఈ పేరు వినగానే అందరికి అది చేసే అల్లరే గుర్తుకు వస్తుంది. అందుకే పిల్లలు అల్లరి చేస్తే వారిని కోతి చేష్టలు అంటారు. కోతులు వేటిని కుదురుగా ఉంచవు. అన్నింటినీ కిందపడేసి, అటూ ఇటూ పరుగెత్తుతాయి. కుదురుగా ఒక చోట ఉండవు. నానా హంగామా చేస్తాయి. కోతుల చేష్టలు ఎక్కువగా మనుషులను పోలి ఉంటాయి. మనుషులు ఏం చేస్తే అవి వాటిని అనుకరిస్తాయి. తాజాగా ఓ కోతి చేసిన వినూత్న పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చెరువు పక్కన ఉన్నరోడ్డుపై వెళ్తున్న కోతి అచ్చం మనిషిలాగా రెండు కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని నేచర్ లైఫ్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో కోతి ఒక సరస్సు సమీపంలోని రోడ్డుపై ఒక వ్యక్తిలాగా రెండు కాళ్లపై మీద దర్జాగా నడుస్తూ కనిపిస్తుంది. దీనిని చూస్తుంటే ఎంతో స్టైల్గా క్యాట్ వాక్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. అనంతరం బ్రిడ్జిపైకి దూకి దానిపై చకాచకా గెంతుతుంది. చదవండి: అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో ఇప్పటి వరకు మిలియన్కు పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఇక కోతి స్టైల్ చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కోతి మోడల్గా మారి ర్యాంప్ వాక్ చేస్తుంది. బాడీ బిల్డింగ్ పోటీలకు రెడీ అవుతుందేమో.. మంచి ట్రైనింగ్ ఇచ్చారు’. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Travel | Nature | adventure (@naturelife_ok) -
ఇది కాకి.. కడవ కాలం కాదు.. ఓ నయా వా‘నరుడి’ స్టోరీ!
బుచ్చినాయుడుకండ్రిగ(చిత్తూరు జిల్లా): ఇది కాకి..కడవ కాలం కాదు. ఒక్కో రాయి కడవలో వేసి నీళ్లు పైకి వచ్చాక దాహం తీర్చుకోవడానికి. ఇదో కారు.. తెలివైన కోతి స్టోరీ. దర్జాగా కారులోకి వెళ్లి వాటర్ బాటిల్తో దాహం తీర్చుకున్న నయా వా‘నరుడి’ గాథ! వేసవి తాపానికి ఇక్కడి చిత్రంలోని వానరం దప్పికతో నీళ్ల కోసం కటకటలాడింది. అటూ ఇటూ పరుగులు తీస్తూ స్థానిక తెలుగుగంగ కార్యాలయం వద్ద నిలిపి ఉన్న కారును వానరం చూసింది. చదవండి: మగతనం లేదని హేళన.. కాస్త శ్రుతిమించడంతో చివరికి ఏం జరిగిందంటే? దానికేదో ఐడియా వచ్చినట్లుంది కాబోలు..గ్లాస్ డోర్ తెరచి ఉండడంతో కారు లోపలికి జంప్ చేసింది. అక్కడో వాటర్ బాటిల్ కనిపించేసరికి చటుక్కున అంది పుచ్చుకుంది. ఇలా దర్జాగా కూర్చుని వాటర్ బాటిల్ మూత తీసి, ఆబగా తాగేసింది. హమ్మయ్య ఈ పూటకు ఓకే అని ఓ క్షణం రిలాక్స్ అయ్యింది. బాటిల్ను అక్కడే పడేసి మళ్లీ చెట్లల్లోకి జంప్ చేసింది. ఔరా! ఏమి తెలివి దీనిది అంటూ అక్కడివారు ఆశ్చర్యంగా చూశారు. మంగళవారం మిట్ట మధ్యాహ్నం ఈ వానరుడు తన చేష్టలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. -
Viral Video: మండుటెండలో కోతి దాహం తీర్చిన పోలీస్.. ‘హ్యాట్సాఫ్ సార్’
ముంబై: ఎవరైనా ఆపదలో ఉంటే మనం చేయగలిగే సాయం చేయాలంటారు పెద్దలు. అప్పుడే మనిషిలోని మంచితనం బయటపడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనిషి నుంచి మానవత్వం మాయమైపోతుంది. బయట వరకు కాదు కదా సొంతవారికి ఆపదొచ్చిందని తెలిసినా పట్టించుకోవడం లేదు. నాకేం సంబంధం అంటూ చేతులు దులుపేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఓ వ్యక్తి వానరంపై చూపిన ప్రేమ ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. ఈ ఏడాది ఎండలు మామూలుగా లేవు. మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండ ధాటికి మనుషులలే జంతువులు కూడా తాళలేకపోతున్నాయి. మంచినీటి కోసం జంతువులు అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎండలను తట్టుకోలేని కోతి మంచినీటి కోసం విలవిల్లాడుతుండగా.. ఓ పోలీస్ స్వయంగా దానికి మంచినీటిని తాగించాడు. చదవండి: చేతిలో పసికందుతో సాహసం.. కానిస్టేబుల్కు ప్రమోషన్ Be kind wherever possible 💕💕 This video of constable Sanjay Ghude is circulating in SM for all the good reasons 🙏🙏 pic.twitter.com/oEWFC2c5Kx — Susanta Nanda IFS (@susantananda3) April 3, 2022 మహారాష్ట్రలో ఓ కానిస్టేబుల్ మండుటెండలో రోడ్డుపై దాహంతో ఉన్న కోతికి బాటిల్ ద్వారా నీటిని తాగించి దాని దాహార్తిని తీర్చాడు. తీవ్ర దాహంతో ఉన్న వానరం ఏకంగా బాటిల్ మంచినీటిని గుటగుటా తాగేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో పోస్టు చేశారు. ఇది తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వానరం దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్ను హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
శభాష్ వారియర్స్
-
వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
పిఠాపురం(తూర్పుగోదావరి): కన్న పిల్లలను సాకడంలో కోతిని మించిన జంతువు ఉండదంటారు. తన కడుపున పుట్టిన పిల్లలను తన కడుపుకే హత్తుకుని వెన్నంటి ఉంటుంది కోతి. కాని ఒక వానరం తన పిల్ల కాక పోయినా ఒక పిల్లి పిల్లను తన కన్న పిల్లలా సాకుతూ ఆశ్చర్యపరుస్తోంది. పిఠాపురం సమీపంలో మాధవపురం వెళ్లే రోడ్డులో ఉన్న ఒక కూరగాయల దుకాణం వద్దకు రోజూ వస్తున్న ఒక కోతి ఒక పిల్లి పిల్లను తన కడుపునకు హత్తుకుని తీసుకువచ్చి తనకు పెట్టిన ఆహారాన్ని దానికి తినిపిస్తోంది. జాతి వైరం లేదని చాటుతున్న దీనిని చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. చదవండి: ఖాకీ వనంలో ‘గోపాలుడు’ -
మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి: వైరల్ వీడియో
Monkeys Reaction To Zoo Visitors Magic Trick: మ్యాజిక్ అంటే పెద్దలు పిల్లలు అనే తారతమ్యం లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు కొంతమందికి రకరకాల మ్యాజిక్లు గురించి తెలుసుకోవడమే కాక నేర్చుకుంటుంటారు కూడా. అయితే ఇక్కడోక జూలోని కోతి మ్యాజిక్ని చూసి ఏ చేసిందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... మెక్సికోలోని చాపుల్టెపెక్ జూని సందర్శించడానికి వచ్చిన మాక్సిమిలియానో ఇబర్రా అనే వ్యక్తి ఆ జూలో కోతి ముందు సరదాగా ఒక మ్యాజిక్ ట్రిక్ ప్లే చేయాలని అనుకున్నాడు. అయితే ఆ కోతి మొదటగా ఆ మ్యాజిక్ని అంతగా పట్టించుకోకుండా తన ఆహారాన్ని వెతుకుతున్నట్లుగా అటు ఇటూ చూస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వ్యక్తి చేస్తున్న మ్యాజిక్ని ఆసక్తిగా తిలకించడం మొదలు పెట్టింది. అంతే ఆ వ్యక్తి ఆ ఆకుని ఎలా మాయం చేస్తున్నాడో అర్థం కాక మనుషులు ఎలా అయితే తెల్లబోయి చూస్తుంటారో అలానే ఆశ్చర్యంగా చూసింది. పైగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏంటో అన్నట్లుగా విచిత్రమైన హావాభావాలను ఇచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!! ఆపై ఏం జరిగిందో చూడండి..) -
కూరగాయాల దుకాణం నడుపుతున్న కోతి!: వైరల్ వీడియో
In This Video Monkey Sitting At A Vegetable Shop: ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు చూశాం. మనుషులను కాపాడిన వీడియోలు, దాడి చేసిన వీడియోలు చూశాం. జంతువులు మనుషులును అనుకరిస్తాయని అందరికీ తెలుసు. కానీ మనుషలు మాదిరిగా వ్యాపారం చేసే జంతువులు గురించి విన్నారా!. విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్లోని ఒక కూరగాయాల దుకాణంలోకి కోతి చొరబడింది. కూరగాయలమ్ముకునే వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ కోతి అతని స్థానంలోకి వచ్చి కుర్చొంది. దుకాణదారుడి మాదిరిగా కూరగాయాలు అమ్ముతున్నట్లుగా నటిస్తూనే కూరగాయలను తినేసింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైన సరే కోతి కూరగాయాల దుకాణం నడుపుతుందని అనుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. కాగా మా దగ్గర విపరీతమైన కోతుల బెడద ఉందని.. అవి ఇలా దుకాణంలోకి చొరబడి వస్తువులను పాడుచేయడం లేదా ఎత్తుకుపోవడం చేస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by GNTTV (@goodnewstoday) (చదవండి: ఔను! ఆ పబ్లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో) -
ఎలన్ మస్క్ మరో సంచలనం..! ఇక మనుషుల్ని ఆడించనున్నాడా?
ఓ వ్యక్తి కంప్యూటర్ ఎదురుగా కూర్చున్నాడు. లాగిన్ అడిగింది. వెంటనే మనసులో ఓ పాస్వర్డ్ అనుకున్నాడు. అంతే ఆటోమెటిగ్గా టైప్ అయిపోయి ఓపెన్ అయింది. జస్ట్ మీ కళ్లతో స్క్రీన్ మీద అటూ ఇటూ చూస్తుంటే..మౌస్ కర్సర్ కదులుతుంది. ఏది కావాలంటే అది ఓపెన్ చేస్తోంది. ఇకపై ఇలాంటి పనులు టెక్నాలజీతో జరగనున్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్థాపించిన 'న్యూరాలింక్' డెవలప్ చేస్తున్న'బ్రెయిన్ ఇంప్లాంట్' ప్రత్యేకత ఇది. గతేడాది టెక్నాలజీలో భాగంగా న్యూరాలింక్ సంస్థ కోతి మెదడులో చిప్ను అమర్చించింది. దాంతో ఆ కోతి 'పింగ్ పాంగ్' అనే కంప్యూటర్ గేమ్ను ఆడింది. ఇప్పుడు ఈ ఏడాది ఈ టెక్నాలజీలో మరో కీలక అడుగు పడనుంది. కొద్దిరోజుల క్రితం సీఈఓ కౌన్సిల్ సమ్మిట్లో ఎలన్ మస్క్ మాట్లాడుతూ " న్యూరాలింక్ ప్రాజెక్ట్లో భాగంగా కోతుల్లో చిప్ లను అమర్చి అనేక పరిశోధనలు నిర్వహించాం. వాటి పనితీరు చాలా బాగుంది. అందుకే కోతుల నుంచి ఆ చిప్లను సురక్షితంగా తొలగించాం. ఆ పరిశోధనలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. న్యూరాలింక్ చిప్ వెన్నుమక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపయోగపడుతుంది. కుర్చి, లేదంటే మంచానికే పరిమితమైన బాధితులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తుంది' అని ఎలన్ మస్క్ తెలిపారంటూ వాల్స్ట్రీట్ జర్నల్ కథనాల్ని ప్రచురించింది. గతేడాది కోతుల్లో అమర్చిన ఆ చిప్ను మనుషుల్లో అమర్చుతామని ఎలన్ మాటిచ్చారు. కానీ కోవిడ్ కారణంగా సాధ్యపడలేదు. అందుకే ఈ ఏడాదిలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) విభాగం అనుమతిస్తే..వెంటనే మనుషుల బ్రెయిన్లలో ఆ చిప్లను అమర్చుతామని సీఈఓ సమ్మిట్ సందర్భంగా ఎలన్ తెలిపారు. ఎలా పనిచేస్తుంది? 'న్యూరాలింక్' ఇంప్లాంట్ పూర్తిగా వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్కు అనుసంధానం అవుతుంది. తల వెనుక భాగాన చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఈ ఇంప్లాంట్ను అమర్చుతారు. దానికి ఉండే ఎలక్ట్రోడ్లను మెదడు దిగువభాగాన నాడులకు అనుసంధానం చేస్తారు. ఈ ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్ల ద్వారా మెదడు ఇచ్చే సంకేతాలను కాపీ చేసి.. వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్కు పంపుతుంది. కంప్యూటర్ ఆ సంకేతాలను విశ్లేషించి.. మెదడు ఇచ్చిన ఆదేశాలేమిటనేది గుర్తించి, అమలు చేస్తుంది. చదవండి: ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్ మస్క్ అంటే కథ వేరుంటది -
Humorous video: ఈ హెయిర్ స్టైల్తో నా అందం రెట్టింపవ్వాలి.. జాగ్రత్త!
అసలేంటో ఈ యేడాది మొత్తం షాకులమీద షాకులు ఎదురౌతున్నాయి. యేడాది చివరిలో కూడా వీటి ఉధృతి ఏమాత్రం తగ్గేదేలే! అనే విధంగా ఉంది చూడబోతే. లేకపోతే ఏంటండీ.. ఎక్కడైనా కోతి బార్బర్ షాప్కి వెళ్లడం, షేవ్ చేయించుకోవడం, దర్జాగా కూర్చుని హెయిర్ కటింగ్ చేయించుకోవడం కనీవినీ ఎరుగునా? అందుకే ఈ నిష్ఠూరమంతానూ! కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్ స్టైల్స్, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐతే రొటీన్కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్ కొట్టినట్టుంది. స్టైల్ మార్చాలనుకుంది.సెలూన్కు వెళ్లింది. హెయిర్ డ్రెస్సర్స్ చైర్లో కూర్చుని, మెడ చుట్టూ షీట్ చుట్టించుకుంది. తర్వాత బార్బర్ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్ ట్రింబర్తో షేవ్ చేయడం ప్రారంభించాడు. ఇక కోతిగారేమో బుద్ధిగా కూర్చుని చక్కగా షేవ్ చేయించుకోవడం, బార్బర్ చెప్పినట్లు సూచనలు పాటించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెట్టింట కోతి బార్బర్ షాప్ విజిటింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంకేముంది ఈ క్యూట్ వీడియోను చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి, కామెంట్ల రూపంలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.. अब लग रहे SMART☺️☺️☺️👌👌👌 BEAUTY_PARLOUR☺️☺️😊@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @NaveedIRS @arunbothra @TheJohnAbraham pic.twitter.com/lCiy0tmqN0 — Rupin Sharma IPS (@rupin1992) November 29, 2021 -
కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
#MonkeyVsDoge: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో.. నెటిజన్లు ఎలా స్పందిస్తారో తెలియదు! ఎక్కడ ఏ ఘటన చోటుచేసుకున్నా తమదైనశైలిలో కామెంట్లు, మీమ్స్ తయారు చేసి సంఘటనలను ట్రెండింగ్లోకి తీసుకువస్తారు. విషాద ఘటనలైనా సరే గ్రూప్లుగా మరీ కామెంట్లు చేస్తూ ఆ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తారు. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం! కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. కానీ అన్ని జీవులకు పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. శనివారంమహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్న వార్తలు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ట్విటర్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. #MonkeyVsDoge అనే హ్యాష్ ట్యాగ్తో గ్రూప్లుగా మారీ నెటిజన్లు కామెంట్లు, మీమ్స్ తయరు చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన చాలా విషాదకరమైనప్పటికీ దేశవ్యాప్తంగా నెటిజన్లు ‘మంకీ గ్రూప్ వర్సెస్ డాగ్ గ్రూప్’ గా మారీ కామెంట్లు చేయడంతో ట్విటర్ ట్రెండింగ్లో ఉంది. గతంలో కుక్కలు కోతులను వెంటపడిమరీ చంపాయని.. దీంతో పగపట్టిన కోతులు ఫ్యాక్షన్ సినిమా తరహాలో గుంపులుగా చేరి కుక్కలను చంపడం ప్రారంభించాయని స్థానికులు తెలిపారు. Monkeys when they are going to Dog areas #MonkeyVsDoge pic.twitter.com/oIFIkZhuuc — Mr X (@tweets_of_X) December 18, 2021 The Biggest reason behind #MonkeyVsDoge gangwar 😂😂😂😂😂😂😂 pic.twitter.com/98NnuPlftc — 𝗔ɴᴋɪᴛ ❁ (@FanOfMySellf) December 18, 2021 Bhai! Ye Billiyon ki Saajish hai bata raha hoon.#MonkeyVsDoge pic.twitter.com/aYtoVu1caP — Ankush (@_James_Bong) December 18, 2021 #MonkeyVsDoge https://t.co/QduTYnHIzq pic.twitter.com/c78WHkSVEx — सिया 🥀 || (@HayeSiyapa) December 18, 2021 Dogs vs Monkeys #MonkeyVsDoge I support both of them check the next vid in the thread 🙏❤️ pic.twitter.com/vTl2sxKSES — Vishupedia (@vishupedia) December 18, 2021 Joe biden has decided to make a peace agreement between monke and doge Thanq biden 👏 #MonkeyVsDoge pic.twitter.com/oTGzAPnY3c — SM (@lolsaalam) December 18, 2021 -
ఖమ్మం: ఇక వానర గణనకు ప్రత్యేక యాప్..
వైరా: గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతున్న నేపథ్యంలో వాటి లెక్కను అంచనా వేసేందుకు సర్వే చేపడుతున్నారు. ఇళ్ల వద్ద కూరగాయల పాదులు ఆగం చేస్తూ, వస్తువులు చిందరవందరగా పడేస్తూ, చేల వద్ద పంటలకు నష్టం కలిగిస్తుండడంతో తీవ్రతను గుర్తించబోతున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు చేపట్టారు. వ్యవసాయ విస్తరణ అధికారు (ఏఈఓ)లు పల్లెల్లో తిరుగుతూ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఏ మేరకు పంటలు ధ్వంసం చేశాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి ? చెట్లు, ఇళ్లు, గుట్టలు, పర్యాటక ప్రాంతం? రోడ్డు వెంట?..ఇలా ఎక్కడ నివసిస్తున్నాయనే అంశాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. రైతులతో మాట్లాడిన తర్వాత వివరాలను ఆన్లైన్ క్రాప్ బుకింగ్ మాడ్యూల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వానరాలను భయపెట్టేందుకు ప్రజలు నైలాన్ వలలు, సోలార్ ఫెన్సింగ్, మంకీ గన్, కొండ ముచ్చులు, బొమ్మలు, పులి అరుపు తదితర శబ్ద పరికరాలు వినియోగిస్తున్నారా? అనే వివరాలు కూడా యాప్లో పొందుపర్చాలి. కూరగాయల పంట మిగలట్లే.. జిల్లాలోని 21 మండలాల్లో సూమారు మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, కంది, మొక్కజొన్న, పత్తి, చెరకు, పామాయిల్, పెసరతో పాటు కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, కొణిజర్ల, చింతకాని ఈ మండలాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో గ్రామాల్లోకి కోతులు గుంపులుగా వస్తున్నాయి. వంగ, బీర, కాకర, సొర, టమాటా, తదితర కూరగాయాల పంటలను ఆగం చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు తెంపేస్తూ, సగం తిని సగం పడేస్తూ, మొక్కలను, తీగలను పీకేస్తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేల వద్ద కాపలా లేకుంటే దిగుబడి చేతికందే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. ఇళ్ల వద్ద ఆగమే.. వ్యవసాయ క్షేత్రాలే కాదు..ఇళ్ల వద్దకూ కోతులు గుంపులుగా వస్తున్నాయి. ఆరుబయట ఉన్న వస్తువులను చిందర వందర చేస్తున్నాయి. దుకాణాల్లోని తినుబండారాలను ఎత్తుకెళుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి దూరి బియ్యం, పప్పులు, అన్నం, ఇతర పదార్థాలను బుక్కుతున్నాయి. అడ్డుకోబోతే మీదికొస్తూ దాడిచేస్తున్నాయి. ఇంటి పైకప్పులు, చెట్లపై ఉంటూ కొన్నిచోట్ల పిల్లలు, పెద్దలను పరిగెత్తిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు జంకుతున్నారు. చాలామందిని కరిచిన సందర్భాలు ఉన్నాయి. వారంలోగా పూర్తిచేస్తాం.. గ్రామాల్లో ఎన్ని కోతులు ఉన్నాయనే అంశంపై సర్వే చేయాలని ఆదేశించాం. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం. ఏఈఓలు స్వయంగా పల్లెల్లో తిరిగి కోతుల నష్ట తీవ్రతను చూసి, వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. రైతులు సహకరిస్తే పక్కా సమాచారం లభిస్తుందని భావిస్తున్నాం. – బాబూరావు, ఏడీఏ, వైరా చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
కొంపముంచిన కోతి బొమ్మ.. చిటికేసినంత ఈజీగా రెండు కోట్ల రూపాయలు లాస్!
Bored Ape NFT Loss To Trader During Online Sale: కంగారు.. ఏమరపాటులో చేసే పనులు ఒక్కోసారి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇక్కడ కోట్లు కలిసి వస్తాయని ఆశపడ్డ ఆ వ్యక్తికి.. నష్టమే మిగిలింది. పొరపాటున బోటన వేలు తగిలి దాదాపు రెండు కోట్ల రూపాయలు లాస్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బోర్డ్ ఏప్ (దిగాలుగా ఉన్న కోతి).. మీమ్ నుంచి ఎన్ఎఫ్టీ (నాన్ ఫంగిబుల్ టోకెన్) ఫ్రాంచైజీగా ఎదిగి.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భారీ బిజినెస్ చేస్తోంది. సుమారు పది వేల పీసులు ఉన్న ‘బోర్డ్ ఏప్’ ఎఎఫ్టీ యాట్చ్ క్లబ్లో హాలీవుడ్ సెలబ్రిటీలు జిమ్మీ ఫాలోన్, స్టెఫ్ కర్రీలాంటోళ్లు సైతం ఉన్నారు. ఇప్పటివరకు గరిష్టంగా ఇది 85 ఎథెర్(క్రిప్టోకరెన్సీ కాయిన్ ఎథెర్.. 3, 20,000 డాలర్లకు సమానం) అమ్ముడుపోవడం విశేషం. అయితే ఈమధ్యే కాలంలో ఈ ఎన్ఎఫ్టీ 3 లక్షల డాలర్లకు(2,28,15,750రూ.) తక్కువ కాకుండా ట్రేడ్ అవుతోంది. దీంతో తన దగ్గరున్న ఎన్ఎఫ్టీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు ఓ ట్రేడర్. మాక్స్ అనే వ్యక్తి (మ్యాక్స్నాట్ యూజర్నేమ్) 75 ఎథర్లకు (3 లక్షల డాలర్లకు) ఆ ఎన్ఎఫ్టీ పీస్ను ఆన్లైన్లో అమ్మేయాలనుకున్నాడు. అయితే ధర నిర్ధారించేలోపు.. పొరపాటున అతని బోటన వేలు కంప్యూటర్ మౌస్ క్లిక్ అయ్యింది. దీంతో ధర 0.75 ఎథర్(3,000 డాలర్లు)గా కన్ఫర్మ్ అయ్యింది. తప్పును సరిదిద్దుకునే లోపే ఆ ప్రైస్ ఫిక్స్ అయిపోయింది. ఇక అంతే.. మన కరెన్సీ విలువ ప్రకారం.. 2,28,10,800రూ. అమ్ముడుపోవాల్సిన ఈ ఎన్ఎఫ్టీ.. కేవలం రూ. 2, 20, 000లకు అమ్ముడుపోయింది అది. తనకు వాటిల్లిన నష్టంపై ఘోల్లుమంటూ ఆ యూజర్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. చికేసినంత ఈజీగా రెండున్నర లక్షల డాలర్లు.. (మన కరెన్సీలో రెండున్నర కోట్ల రూపాయల దాకా) నష్టపోయానని వాపోయాడు. ఇందులో మరో దరిద్రం ఏంటంటే.. గతంలోనూ ఈ యూజర్కు ఇలానే ఆన్లైన్ సేల్ ద్వారా 20,000 డాలర్ల (15 లక్షల రూపాయల దాకా) నష్టం వాటిల్లడం. What do you gain from thinking about it? You just feel bad by choice. If you can't do anything about it, don't think about it. And you'll live a pretty happy life. — maxnaut.eth (@maxnaut) December 13, 2021 ఎన్ఎఫ్టీ అంటే బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! -
‘మనకెందుకులే’ అని వదిలేయలేదు.. కోతికి ఊపిరి పోశాడు
Man Resuscitating Monkey Viral Video: మనం నెట్టింట మనుషులు జంతువులను కాపాడిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాదు కొన్ని జంతువులు తమ తోటి జంతువులను లేదా తమ విరోధి జంతువులను సైతం కాపాడిని వీడియోలను చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒక చిన్న కోతిపిల్లకు మనిషికి చేసినట్లుగా సపర్యలు చేసి మరీ బతికించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే...తమిళనాడుకి చెందిన వ్యక్తి కుక్కల గుంపు దాడిలో స్రృహ తప్పి పడిపోయిన ఎనిమిది నెలల కోతి పిల్లను బతికించడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. ఈ మేరకు ఆ వ్యక్తి ఆ కోతి ఛాతిని గట్టిగా నోక్కడం, నోటితో శ్వాస అందించడం వంటి ప్రయత్నాలతో ప్రాణం పోస్తాడు. చివరికి ఆ కోతి కళ్లు తెరవంగానే ఆ వ్యక్తి ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియోలో పోస్ట్ చేయడం కాక సదరు వ్యక్తిని "ప్రభు" అంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత క్రికెటర్ ఆర్ అశ్విన్ని సైతం ఈ వీడియో కదిలించడంతో ఆయన కూడా ఈ వీడియోకి" నాకు ఆ కోతి బతుకుతుందని ఆశ ఉంది"అనే క్యాప్షన్ని జోడించి మరీ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అదేం కక్కుర్తిరా నీకు!... ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకుంటావా!) There is hope 🙏🙏👏 https://t.co/wt3yNTDlk1 — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 13, 2021