monkey
-
కోతిని తుపాకీతో కాల్చి వండి తినేశారు!
సేలం(తమిళనాడు): కోతిని(monkey) నాటు తుపాకీతో కాల్చి వండి తిన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..దిండుగల్ జిల్లా వీరసిన్నంపట్టి ప్రాంతానికి చెందిన రాజారాంకు అదే ప్రాంతంలో మామిడి, కొబ్బరి తో ఉంది. కోతకు వచ్చిన మామిడి కాయలను ఆరగిస్తూ కోతులు నష్టం కలిగించసాగాయి. దీంతో రాజారాం గ్రామానికి చెందిన జయమణికి రూ. 1000 ఇచ్చి కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. దీంతో జయమణి నాటు తుపాకీతో ఒక కోతిని కాల్చి, దాన్ని వండుకుని తిన్నట్టు తేలింది. ఇది తెలుసుకున్న సిరుమలై అటవీ శాఖ పోలీసులు రాజారాం, జయమణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
హల్దీ ఫంక్షన్లో హనుమాన్ హల్చల్.. వైరల్ వీడియో
పెళ్లిళ్లల్లో ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు. మూడుముళ్లూ పడి, అమ్మాయి అత్తారింటికి వెళ్లేదాకా వధువు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మర్యాదలకోసం అత్తింటివారు చేసే ఆగడాలు, పెళ్లి కొడుకు అలకలు, అబ్బో..ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉంటాయి. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. కానీ ఒక షాదీలోకి అనుకోని అతిధి వచ్చి గందరగోళం సృష్టించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చివరిదాకా చదవాల్సిందే.!పెళ్లి వారంతా హల్దీ వేడుకలో సందడిగా ఉంటే, ఎక్కడినుంచి వచ్చిందో ఒక మర్కటం నానా హంగామా చేసింది. సందు చూసుకొని తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. దీనికి తోడు ఇంకో పిల్లకోతి కూడా చేరింది. అతిథుల చేతిలోని పళ్లను చేతపట్టుకుని గెంతులేస్తూ అక్కడున్న వారినందరినీ హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాలో షేర్ అయింది. వధూవరుల హల్దీ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అతిథులంతా వధూవరులకు పసుపు పూస్తూ, నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంగా పూర్తిగా వేడుకల్లో మునిగిపోయారు. మరికొందరు ఫోటోలు క్లిక్ చేస్తూ బిజీ...బిజీగా ఉన్నారు. ఇంతలో, ఒక కొంటె కోతి, దాని పిల్ల ఎంట్రీ ఇచ్చాయి. పళ్లు,పళ్లాలతో కొతి గెంతులు వేసింది. ఇంతటితో ఆగలేదు.. ఏకంగా పండ్లతో నిండిన పళ్లాన్ని పట్టుకుని కనిపించింది. ఓరి దేవుడా.. అని స్పందించేలోగానే అతిథుల చేతిలోని పండ్లను చేతబట్టుకొని ఇంకోచోటికి తుర్రుమంది. దీంతో పెళ్లి కొడుకు సహా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిగా అక్కడ్నించి జారుకుంది. కాసేపటికి తేరుకున్న అందదూ నవ్వుల్లో మునిగి పోయారు. మనమూ కోతి నుంచే వచ్చాంగా అనుకున్నారో ఏమోగానీ మరింత అల్లరి చేశారు. దీంతో అప్పటిదాకా ఆందోళనగా ఉన్న అక్కడి వాతావరణం మంకీ గలాటాతో నవ్వులతో నిండిపోయింది. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis); స్వయంగా హనమాన్జీ యే వచ్చాడు: నెటిజన్లుఈవీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హనుమాన్ జీ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు" , స్వయంగా హనుమంతుడే దిగివచ్చాడు అని కొందరు, ఏది జరిగినా మన మంచికే అని మరికొందరు, అయ్యో.. ఇంకొన్ని పళ్లు తీసుకుని వెళ్లాల్సి ఉందని కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. -
భారత్లో మంకీపాక్స్ కేసు నమోదు.. ఎక్కడంటే?
బెంగళూరు : భారత్లో తాజాగా మరో మంకీ పాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుంచి భారత్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.జనవరి 17న బాధితుడు దుబాయ్ నుంచి భారత్లోని కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరానికి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే అతడి శరీరంపై దద్దుర్లు, జ్వరంతో పాటు ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సదరు ఆస్పత్రి వైద్యులు బాధితుడి లక్షణాలపై అనుమానం రావడంతో కర్ణాటక (karnataka) వైద్యఆరోగ్యశాఖకు సమాచారం అందించారు.అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ బాధితుడి రక్త నమోనాలను సేకరించారు. వాటిని పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్లో బాధితుడికి మంకీ పాక్స్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం బాధితుడు, అతని కుటుంబ సభ్యుల్ని ఐసోలేషన్ వార్డ్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మంకీపాక్స్ నమోదు కావడంపై వైద్యులు స్పందించారు. కోవిడ్-19తో పోలిస్తే మంకీపాక్స్ ప్రమాద తీవ్రత చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్టులో మంకీ పాక్స్ సోకిన బాధితుణ్ని ఎవరు ఆలింగనం చేసుకున్నారో.. వారందరిని ఐసోలేషన్ వార్డ్కు తరలించాం. త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. -
నిషాలో తూగడం...ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వ సాధారణం : మత్తుపదార్ధం. కొన్ని పదార్ధాలు పవిత్రమైనవాటివిగా పరిగణింపబడతాయి, కానీ ఎక్కువ సార్లు, మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం.మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమకోడుస్తాయి. తమిళనాడులోని బానేట్ మాకాక్లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవయితే, కరీబియన్ వెర్వేట్ కోతులు క్రమం తప్పక తప్పతాగి తూగుతుంటాయి. ఆ దీవిలో ఏడాది పొడుగునా సెలవల సందడి ఉండడంతో అక్కడ మత్తు పానీయాలకు ఏమి కొదవలేదు.పనికిమాలినట్టుగా అనిపించినా, వెర్వేట్ కోతుల తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం, అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి - అవి త్వర త్వరగా, ఎక్కువ ఎక్కువ, తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి - అవి సరాసరి మద్యాన్ని సోడాగానీ, నీళ్లుగానీ కలపకుండా, క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. కానీ చాలామటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికీ మనకీ పోలికలు ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి, కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి, మరికొన్ని దిగాలుగా, ముభావంగా తయారవుతాయి. కానీ చాలామటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి…. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి.మామూలు నలుపురంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైత ఒళ్లు మర్చిపోయేంతగా విజ్రుoభిస్తాయి. జార్ఖండ్లో ఆశియా ఏనుగులు పాకల లోపల కాగుతున్న మద్యాన్నిగైకొనడానికి పాకలని నాశనం చేస్తాయని విషయం తెలిసినది. కొన్ని ఏళ్ల క్రితం, ఒక మత్తెక్కిన ఏనుగులగుంపు ఊరుమీద విరుచుకుపడి, విద్యత్ స్థంభాలను పాడగొట్టి తిరిగితూ, ఆ ప్రక్రియలో అవే విద్యుత్ షాకు తగిలి కాలిపోయాయి.పశ్చిమ దేశాలలో పిల్లులు పుదీనాలా ఉండే క్యాట్నిప్ అనే మొక్క మత్తులో మునిగిపోతాయి. పిల్లులు ఆ పుదీనా వంటి మొక్క కొమ్మల మీద పడి మూలుగుతూ, చోంగకారుస్తూ, మళ్ళీ మళ్ళీ దొర్లుతాయి. నేను కొంచం ఆ మొక్కను తెచ్చి ఇవ్వగానే, ముందెన్నడూ ఆ మొక్కని చూడని మా నాన్నగారి పిల్లి కూడా మతిపోయినట్టు ప్రవర్తించింది. కానీ కొద్ది నిముషాల తరవాత అది బాగా తేరుకుని మళ్ళీ హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏళ్ల తర్వాత అమెరికా జంతు ప్రదర్శనశాలను సందర్శించే సమయంలో, మేము ఒక కౌగర్ క్యాట్నిప్తో నింపివున్న మేజోడు పట్టుకుని వెర్రివేషాలు వేయడం చూశాము. అన్ని జాతుల పిల్లులూ ఈ క్యాట్నిప్కు ఆకార్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.రాకీ కొండలలో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం, ఒక రకమైన బూజు గోకి తినడానికి, ఎంతో ప్రమాదకరమైన కొండ చరియలుఎక్కుతాయని తెలిసినది. మరి ఈమెన్లో మేకలైతే వారి కాపారులలాగే ఖట్ ఆకుల మత్తుకు బానిసలు.ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి, ఎర్ర టోపీలతో, పైన కాస్త పంచదార చల్లినట్టు ఉండీ, యాక్షినిల కథలలో కనిపించే బొమ్మల్లో అమ్మాయాకంగా కనిపించే పుట్టగొగుల పేరు ఫ్లై ఆగారికస్ పుట్టగొడుగులు. నన్ను తినకండి అని హెచ్చరించే రంగులో ఉన్నాకూడా రెయిన్ డీర్లు వాటిని తిని మత్తులో గెద్దలంత ఎత్తు ఎగురుతాయి. ఎన్నో మత్తు పదార్ధాలను రెయిన్ డీర్ మూత్ర పిండాలు వడగొట్టగలవు కనుక, వాటి మూత్రం పుట్టగొడుగులు తినటం కాంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మారియు ఉత్తర ఆసియాలో గొర్రెకాపరులు చేసేది అదే!ఎన్నో శాంతా క్లాస్ పుట్టుక కథలలో ఒకటైన కథ మనని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక సీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో, ఒక నాటు వైద్యుడు, పోగాకమ్ముకున్న ఒక ముఖం ద్వారoగుండా ఫ్లై ఆగారిక్ నిండిన సంచీని మోస్తూ ఒక యూర్ట్ ( జూలుతో చేయబడ్డ గుండ్రటి డేరా) లోపలకి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ, వారి ముఖము - ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు, ఎర్రగా మారతాయి. శాంతా, అతని ఎర్ర ముక్కు రెయిన్ డీర్ రుడోల్ఫ్, ఆకాశంలో దీనిపై ఎగురుతున్నారన్న అంచనా వేసినందుకు ఏమి బహుమతులు లేవు!శతాబ్దాలా నుంచీ సమాజం ఈ పదార్ధాలను భయంకరమైన చెడుతో కూడిన వాటిగా పరిగణించి బహిష్కరించడానికి ప్రయత్నించింది. అయినా వాటిలో మునిగి తెలడం మన ఆచ్చారాలలో ఎంత బలంగా నాటుకుందో, అది అంతే బలంగా మన జన్యువులో కూడా నాటుకుని ఉండి ఉంటుంది. పిల్లలు కూడా ఆ అనుభూతి పొందడానికి కళ్ళుతిరిగి, కాలపై నిలబడడానికి తడబడేదాకా పదే పదే గుండ్రంగా తిరిగితారు. దెర్విషలు (సన్యాసులు) కూడా మనకుకి అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి ఇటువంటి పద్దతే వాడతారు. పార్స్వ ఆలోచన అనే భావాన్ని పెంపొందించిన ఎడ్వర్డ్ డి బోనో ప్రస్తావన ఇక్కడే వస్తుంది. అతను మత్తుపదార్థాలు మనని పోతపోసిన ఆలోచనా విధానాలనుంచి బయటకులాగి, ఎంతో సృజనత్మాకంగా ఆలోచింపచేయగలదని అతను సూచించాడు. అదే గనక నిజమైతే, మనసుని మార్చేటువంటి ఈ మత్తు అనుభూతులతో, ఖచ్చితంగా ఈ పాటికి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మారియు ప్రయత్నలు చూసుండేవాళ్ళం. రచన : జానకి లెనిన్ ఫోటోలు: సిద్దార్థ్ రావు -
సోషల్ మీడియా స్టార్ ‘రాణి కోతి’: యూట్యూబ్ ద్వారా లక్షలు : వైరల్ వీడియో
కుంచం అంత కూతురుంటే మంచం మీదే కూడు అనేది సామెత. అంటే ఇంట్లో చిన్న ఆడకూతురుంటే చాలు..ఆ ఇంట్లోని అన్ని పనుల్లో ఎంతో చేయూత అని. ఈ విషయంలో నేనేం తక్కువ అంటోంది ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలోని ఖాగీపూర్ సద్వా గ్రామానికి చెందిన కోతి. అవును మీరు చదివింది నిజమే. కోతి ఇంట్లో అన్ని పనులు చకా చకా పెట్టేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన కోతి కథేంటో తెలుసుకోవాలని ఉంది కదా.. పదండి మరి!యూపీలోని రాయ్బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ఇంట్లోని కోతిని చూస్తే ఔరా అనాల్సిందే. అందుకే దీనికి ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు.ఇల్లంతా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసేస్తుంది. గిన్నెలు తోముతుంది. బట్టలు ఉతకడం, మాప్ పెట్టడం, మసాలాలు రుబ్బడం, పొలంలో సహాయం చేయడం ఇలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అంతేనా రాణి గారు శ్రద్ధగా గుండ్రంగా చపాతీలు చేసి ఇస్తుంది. ఇది చాలదన్నట్టు గ్రామంలోని ఇతర ఇళ్లల్లో ఆడవానికి కూడా పనిలో సహాయం చేస్తుంది. అందుకే దాదాపు ఎనిమిదేళ్ల నుంచి విలేజ్ డార్లింగ్లా మారిపోయింది. పుట్టింది కోతిగా అయినా.. మనిషిలానే చేస్తున్న పనులు, అందరికీ సాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ అభిమానంగా మారింది.యూట్యూబ్ ద్వారా లక్షల ఆదాయం రాణి వంటలు చేస్తున్న వీడియోను యజమాని ఆకాష్ పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రాణి పనులను, చేష్టలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకోవడంతో అశోక్ అదృష్టం మారిపోయింది. యూట్యూబ్లో రాణి వీడియోల ద్వారా 5 లక్షల రూపాయలకు పైగా ఆర్జించామని అశోక్ పేర్కొన్నాడు. కోట్లాదిమంది తమ వీడియోను వీక్షించారని తెలిపాడు. ముంబై, కోల్కతా, వారణాసి ఇలా అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆమెను చూడటానికి వస్తారట. అమెరికా, యూకే సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, ఇరాన్, రష్యా, చైనా , అనేక ఇతర దేశాల వాళ్లు ఫోన్లు చేస్తారన్నాడు. ఎంత స్నేహశీలి అయినా, రాణిగారికి సొంత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆమెకు నచ్చితేనే మనుషుల్ని దగ్గరకు రానిస్తుంది. తనకు నచ్చితే వారి ఒడిలో నిద్రపోతుంది కోపం వస్తే మాత్రం చిన్నగా మణికట్టును కొరుకుతుంది. రాణికి ఇష్టమైన ఆహారం, అరటిపండ్లు. వీటితోపాటు బఠానీలు, రొట్టెలు తినడం కూడా ఆమెకు చాలా ఇష్టం. #WATCH | यूपी के रायबरेली जिले में रानी नाम की बंदरिया का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में बंदरिया रोटी बनाने से लेकर बर्तन धोने समेत घर के काम करते दिख रही है। वीडियो देख हर कोई हैरान है।#Raibareli pic.twitter.com/3UWY4izZ6N— Hindustan (@Live_Hindustan) December 30, 2024 -
శశి థరూర్ ఒడిలో వానరం..ఫొటోలు వైరల్
తన నివాసంలో సేద తీరుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను అనుకోని అధితి రూపంలో ఓ వానరం ఆయన్ను చుట్టుముట్టింది.పేపర్ చదువుతున్న శశి థరూర్ చుట్టూ తిరుగుతూ తెగ అల్లరి చేసింది. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా నెట్వర్క్లలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.ఇంతకి ఏం జరిగిందంటే?శశిథరూర్.. బుధవారం ఉదయం తన ఇంటి ఆవరణంలో పేపర్ చదువుతున్నారు. ఆ సమయంలో ఓ వానరం ఆయన దగ్గరకు వచ్చింది. పేపర్ చదువుతున్న శశి థరూర్ చుట్టూ తిరిగింది. అనంతరం థరూర్లో ఒడిలోకి కూర్చుంది.Had an extraordinary experience today. While i was sitting in the garden, reading my morning newspapers, a monkey wandered in, headed straight for me and parked himself on my lap. He hungrily ate a couple of bananas we offered him, hugged me and proceeded to rest his head on my… pic.twitter.com/MdEk2sGFRn— Shashi Tharoor (@ShashiTharoor) December 4, 2024 -
అయ్యప్ప స్వాములతో భోజనం చేసిన కోతి
-
భక్తుడి ఫోన్ ఎత్తుకుపోయి గుడి ఎక్కిన కోతి..
-
భార్య బాసన్లు కడుగుతుండగా.. భర్త కర్ర పట్టుకుని..
ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల ‘సౌర’భాలుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్రిపుల్ ఐటీలో వాకథాన్ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఇన్చార్జ్ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్ ఆవరణలోని ఎకో పార్క్లో వాకింగ్ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణదీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భోజనం చేస్తుండగా సడెన్గా కోతి ఎంట్రీ..ఐతే ఆ తర్వాత..!
ఒక్కోసారి జంతువులు మనతో ప్రవర్తించే తీరు భయబ్రాంతులకు, ఆశ్చర్యానికి లోను చేస్తాయి. ఆ క్షణంలో చాలామంది భయంతో హడావిడి చేస్తే..కొందరు మాత్రం చాలా కూల్గా వ్యవహరిస్తారు. నిజానికి ఆ జంతువుల సడెన్ ఎంట్రీ కంటే.. వాటితో కొందరు వ్యక్తులు వ్యవహరించే తీరు అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పైగా ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయానికి గురవ్వుతాం కూడా. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటు చేసుకుంది. మనం ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో భోజనం చేస్తుండగా సడెన్గా ఓ కోతి నేరుగా మనవద్దకు వస్తే ఏం చేస్తాం చెప్పండి. భయంతో వణికిపోతాం. దాన్ని పొమ్మనే ప్రయత్నమే లేక మనమే పక్కకు తప్పుకునే యత్నమో చేస్తాం కదా..!. కానీ ఈ పెద్దాయన మాత్రం అలా చేయలేదు తాను భోజనం చేస్తుండగా వచ్చిన కోతిని చూసి భయపడ లేదు కదా..!. దాన్ని చూసి ఛీత్కరించనూ లేదు. ఆ కోతి తన పళ్లెంలోనే తింటున్న ఏం అనలేదు. పైగా దాన్ని తినమని ప్రోత్సహిస్తూ.. ఆయన కూల్గా భోజనం చేశారూ. అంతేగాదు అక్కడ వడ్డించేవాళ్లు ఆ కోతికి అంతరాయం కలగకుండా చూడటమే కాకుండా..బెదురు లేకుండా తినేలా ఆ కోతికి పెద్దాయన భరోసా ఇవ్వడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న చుట్టుపక్కల వాళ్లు కూడా ఒకింత ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పెద్దాయన చేసిన పనికి మెచ్చుకోవడమే గాక హనుమాన్ జీ మీతో విందుని పంచుకోవాలనుకున్నారు కాబోలు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by shalu Sharma (@shalu_weightlifter) (చదవండి: నగదు రహిత చెల్లింపుల్లో అంతకుమించి..!వాట్ ఏ టెక్నాలజీ..?) -
గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..
నేడు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. గాంధీ జీవితంతో ముడిపపడిన పలు కథనాలు మనం వింటుంటాం. వాటిలో ఒకటే గాంధీ చెప్పే ‘మూడు కోతుల కథ’. ఆ మూడు కోతులు చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అనే సందేశాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గాంధీ దగ్గరకు ఈ మూడు కోతులు ఎలా వచ్చాయనే దాని వెనుక ఆసక్తికర ఘట్టం ఉంది.గాంధీ చెప్పే మూడు కోతుల కథ సుమారు 90 ఏళ్ల క్రితం నాటిది. ఈ కోతుల బొమ్మలు జపాన్ నుంచి గాంధీకి బహుమతిగా వచ్చాయి. జపాన్కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి నిచిదత్సు ఫుజీ గాంధీకి ఈ మూడు కోతుల బొమ్మలను బహూకరించారు. జపాన్లోని అసో కాల్డెరా అడవుల్లో జన్మించిన నిచిదత్సు ఫుజీ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారాడు. 1917లో భారత్లో ఆయన తన మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించాడు.1923లో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ సమయంలో నిచిదత్సు ఫుజీ జపాన్కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి భారత్ వచ్చాడు. 1931లో నిచిదత్సు ఫుజీ కలకత్తా చేరుకుని, నగరమంతా పర్యటించాడు. తన భారత పర్యటనలో నిచిదత్సు ఫుజీ మహాత్మా గాంధీని కలవాలనుకుని, వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వచ్చాడు. నిచిదత్సు ఫుజీని చూసి గాంధీ చాలా సంతోషించారు. అతను గాంధీకి మూడు కోతుల బొమ్మలను కానుకగా ఇచ్చాడు. గాంధీకి ఈ కోతి బొమ్మలు ఎంతగా నచ్చాయంటే, ఆయన వాటిని తన టేబుల్పై పెట్టుకున్నారు.గాంధీని కలవడానికి వచ్చిన ప్రతివారూ ఆ టేబుల్పై ఉన్న మూడు కోతులను గమనించి, దానిలోని అంతర్థాన్ని తెలుసుకునేవారు. అనతికాలంలోనే ఈ మూడు కోతుల సందేశం అందరికీ చేరింది. తరువాతి కాలంలో నిచిదత్సు ఫుజీ బీహార్లోని రాజ్గిర్లో శాంతి గోపురాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో జపాన్ దేవాలయం కూడా ఉంది. జపనీస్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అందమైన తెల్లటి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. నిచిదత్సు ఫుజీ 1986 జనవరి 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
గుళికల ప్యాకెట్ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే
-
వయనాడ్ విషాదం : ఇదో కన్నీటి వ్యథ!
కేరళ వయనాడ్ విషాద దృశ్యాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక విషాద కథనాలు, హృదయవిదారక అంశాలు ప్రకృతి సృష్టించిన ప్రకోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. వయనాడులో విధ్వంసం తరువాత.. ఒక తల్లి కోతి తను కన్నపిల్లను కాపాడుతున్న విధానం కంటతడిపెట్టిస్తోంది. ఎంతైనా అమ్మ అమ్మే అంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో రెండు కోతి పిల్లలు బురదలో భయంతో వణుకుతూ బిక్కు బిక్కు మంటూ ఒకదాన్ని ఒకటి పట్టుకుని కూర్చుని ఉండటాన్ని చూడొచ్చు. దీనిని గమనించిన వ్యక్తి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. #KeralaDisaster #WayanadLandslide pic.twitter.com/pILH3hM8pq— Harish R.Menon (@27stories_) August 6, 2024కాగా కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయానికి దాదాపు 400 వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. -
మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!
కాఫీ ఘమఘములుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాగే అలవాటు లేనివారైన సైతం నోరూరించేలా చేస్తుంది. అలాంటి కాఫీ పొద్దుపొద్దునే పడకపోతే రోజు మొదలవ్వుదు చాలమందికి. అటువంటి కాఫీలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల కాఫీలు పేర్లు మనకు తెలిసి ఉండే అవకాశమే లేదు. అవి అత్యంత ఖరీదు కూడా. ఈ ఖరీదైన కాపీలలో ఒకటిగా పేరగాంచిందే మంకీ స్పిట్ కాఫీ. ఏంటీ కోతి పేరుతో పిలిచే కాఫీనా అనే కదా..!. దీని తయారీ విధానం కూడా అత్యంత విచిత్రంగా ఉంటుంది. బాబాయ్..! ఎలా తాగుతారురా దీన్ని అనిపిస్తుంది కూడా. అయితే ఈ కాఫీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందట.భారతదేశంలోని చిక్మగళూరు నుంచి అరకు వరకు అరబికా, రోబస్టా బీన్స్తో చేసే కాఫీలు ఫేమస్. ఇవే ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణిస్తారు. కానీ వీటికి మించి అత్యత్తుమమైన రుచితో కూడిన ఖరీదైన కాఫీ మరొకటి ఉంది. అదే మంకీ స్పిట్ కాఫీ. భారతదేశంలోని తైవాన్లో లభించే అరుదైన కాఫీ గింజలు ఇవి. ఇవి మంకీల సాయంతో సేకరిస్తారు. వాటి కారణంగానే ఈ కాఫీ గింజలకు అంత రుచి వస్తుందట. ఎలా తయారు చేస్తారంటే..ఈ కాఫీ అరబిక్ కాఫీ పండ్లతోనే తయారు చేస్తారు. అయితే ఇక్కడ ప్రాసెస్ చేసే విధానం కాస్త అసాధారణంగా ఉంటుంది. ముందుగా ఈ కాఫీ గింజలను చిక్మగళూరులోని రీసస్ కోతులు తిని ఉమ్మి వేస్తాయి. ఇవి కాఫీ తోటల చుట్టూ తిరుగుతూ బాగా పండిన రుచికరమైన కాఫీ బెర్రీలను తింటాయట. ది బెస్ట్ కాఫీ గింజలు వాటికే తెలుస్తాయట. అవి కాఫీ గింజల బయట పొర, గుజ్జును తినేసి లోపలి గింజలను ఉమ్మివేస్తాయి. అవి అలా కాఫీ గింజలను ఉమ్మివేయడంతో ఒక రకమైన రసాయన చర్యకు గురవ్వుతాయట. కోతి నోటిలోని అమైలేస్ అనే ఎంజైమ్ ఈ గింజలకు ప్రత్యేక రుచిని ఇస్తాయట. ఇలా కోతులు ఉమ్మివేసిన కాఫీ గింజలను సేకరించి శుభ్రం చేసి గ్రైండ్ చేస్తారట. సాధారణం ఈ కాఫీ గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దాని పంటి కింద పడి బయటకు ఉమ్మి రూపంలో వచ్చినప్పుడూ బూడిదరంగులో ఉంటాయట. వాటిని ఎండబెట్టి, కాల్చి ప్రాసెస్ చేస్తారట. ఇది ఎంతో తియ్యగా సుగంధభరితంగా ఉంటుందట. చెప్పాలంటే చాక్లెట్ ఫ్లేవర్తో కూడిన చేదుతో ఉంటుందట. అందువల్ల దీన్ని మంకీ కాఫీ లేదా మంకీ పార్చ్మెంట్ కాఫీ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇలా కోతులు కాఫీ తోటల్లో చిందర వందరగా పడేసిన కాఫీ గింజలను వ్యర్థాలుగా భావించేవారు. 2000 ప్రారంభం నుంచి జంతు సహాయక కాఫీ గింజలతో లాభాలు ఆర్జించడం మొదులు పెట్టాక కోతులను పంటల్లోకి వచ్చేలా రైతులే ఆహ్వానించడం ప్రారంభించారు. వాటి సాయంతోనే మంచి కాఫీని తయారు చేయడం ప్రారంభించారు. కోతులు పసిగట్టినట్లుగా మంచి కాఫీ గింజలను సేకరించడం మనుషుల వల్ల కాదని అక్కడి ప్రజలు చెబుతుండటం విశేషం. ఈ కాఫీ సాధారణ కాఫీలన్నింటి కంటే అత్యంత ఖరీదైనది కూడా.(చదవండి: కమలా హారిస్ ఇష్టపడే సౌత్ ఇండియన్ వంటకం ఇదే..!) -
మంకీ ట్రాప్ గురించి విన్నారా..?
మంకీ ట్రాప్ ఏంటీ అనుకోకండి. ఎందుకుంటే తెలియకుండానే మన అందరం ఈ ట్రాప్లో పడిపోతున్నాం. చేజేతులారా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. నిజానికి మన పెద్దవాళ్లు కొన్నింటిని వదిలేసేందుకు ఇష్టపడితేనే హాయిగా ఉండగలం అని చెబుతుంటారు. కానీ మనం వదలం. పట్టుకుని కూర్చొంటాం. జరగాల్సిన నష్టం జరిగేటప్పటికే మనం ఉండం. ఇలా ఈ భూమ్మీద ఎందరో ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. అసలు ఏంటీ ట్రాప్..? అంతలా మనం ఆ ట్రాప్లో ఎలా పడతామంటే..రెండు రోజుల క్రితం పేపర్లో వచ్చిన వార్త పరిశీలిస్తే..భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి సంచిలో అక్షరాల మొత్తం 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం". ఇక్కడ... విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం.మంకీ ట్రాప్ అంటే..దీన్నే "మంకీ ట్రాప్" అంటారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని ఒక తెగ వారు ఉపయోగిస్తారు. వాళ్లు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.నిజంగా మనకు ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతే..? అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం ఉన్నట్లే.. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దాచిపెట్టుకొని ..ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు రాక.. తనువు చాలించిన వారు చాలా మందే సమాజంలో ఉన్నారు. డబ్బు నిజంగా మనిషిని అంతగా కట్టి పడేస్తుందా?? అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్ లో ఉన్నామనే విషయం గ్రహించకపోవడం విశేషం. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేం? ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఉన్నారు. అందుకే చిన్న మోతాదులో కానీ, పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నామేమో? చెక్ చేసుకోవాలి.అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. ఉదాహారణకు..మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...నో చెప్పలేని మోహమాటలు...తిరిగి అడగలేని అప్పులు...దండిచలేని ప్రేమలు...ఊపిరి సలపనివ్వని పనులు...ఒత్తిడి పెంచే కోరికలు....ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...పేరు కోసం తీసే పరుగులు....అన్నీ మంకీ ట్రాప్ లే!!అందుకే కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం...... మరింత మనశ్శాంతిగా...ప్రశాంతముగా" ఉండేందుకు ప్రయత్నించండి అని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. (చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
డ్యూటీలో ఉండగానే.. నర్సులు చేసిన పని చూస్తే షాక్ అవుతారు
-
భలే రుచిగా ఉందే..
కూడేరు: మండల కేంద్రం కూడేరులో ప్రసిద్ధిగాంచిన శివపార్వతుల జోడు లింగాల ఆలయం వద్ద శనివారం ఓ రెండు వానరాలు గోడపైకి చేరాయి. అక్కడ ఆడుకునేందుకు వచ్చిన పిల్లల్లో ఒక చిన్నారి చేతిలో ఉన్న కూల్డ్రింక్ బాటిల్ను ఓ వానరం లాక్కుంది. అందులో ఏముందోనని వాసన చూసింది. వెంటనే మరొక వానరం ఆ బాటిల్ వైపు ఆశతో చూడసాగింది. దీంతో మొదటి వానరం కూల్డ్రింక్ కాస్త తాగగానే రుచిగా అనిపించడంతో గుటగుటా లాగించేసింది. తర్వాత ఖాళీ బాటిల్ చూపగా.. పక్కనున్న వానరం నిరాశతో పక్కకు వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. -
కోతి... కొబ్బరి కాయ!
కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా? అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా! కానీ మీరోసారి థాయ్లాండ్, మరీ ముఖ్యంగా... దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి... మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!! విషయం ఏమిటంటే... థాయ్ల్యాండ్లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం. థాయ్ల్యాండ్ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి. నాణేనికి మరోవైపు... కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్లాండ్ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ. పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతులకు పెట్టింది పేరు... థాయ్లాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్లాండ్ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా? -
ఫండే: 'వానర జలక్రీడ'! మీరు విన్నది నిజమే!!
వానరాలు(కోతులు) చెట్లపైనుంచి దూకడం, గంతులేయడం, కీచుమంటూ అరవడంలాంటివి మనం ఎన్నో చూసుంటాం. అవి చేసే తమాషా చేష్టలకి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ వానరాలు ఎప్పుడైనా ఈత కొట్టడం చూశారా! చెరువులో కాదు, బావిలో కాదు, ఏకంగా సముద్రంలో.. నమ్మలేకున్నారు కదూ..! అయితే ఈ దృశ్యం చూడండి.. వానరాలు ఈతకొడుతూ కనిపించడం చాలా అరుదు. మకాక్ జాతికి చెందిన ఈ మగ వానరం సముద్రంలో హాయిగా మునకీత కొడుతున్న అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. థాయ్లాండ్లోని ఫై ఫై దీవి తీరం వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని కువైట్కు చెందిన ఫొటోగ్రాఫర్ సులేమాన్ అలాతికి తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో ఇటీవల ‘అండర్ వాటర్ ఫొటోగ్రఫీ–2024’ పోటీలో బహుమతి దక్కించుకుంది. ఇవి చదవండి: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా! -
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా
వేములవాడ రూరల్: వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణా మిడ్మానేరు ముంపు గ్రామం కావడంతో ఇక్కడ పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ మహిళా కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో చందుర్తి మండలం మర్రిగడ్డకు వరినాట్ల పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి వద్ద ఆటోకు ఎదురుగా కోతి వచ్చింది. డ్రైవర్ కోతిని తప్పించబోగా ఆటోకింద ఇరుక్కోవడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో జాతరకొండ మల్లవ్వ (51) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ కుర్ర బాలవ్వ (65) కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మిగతా 11 మంది కూలీలు వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేములవాడ రూరల్ ఎస్సై మారుతి కేసు నమోదుచేసి, మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది?
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తెగ అలరిస్తుంటాయి. ఇలాంటి కొన్ని వీడియోలు మనకు ఒకపట్టాన నమ్మశక్యం కాదు. తాజాగా ఇటువంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన తర్వాత ‘ఇదేందిది’ అనకుండా ఉండలేరు. అలాగే నవ్వకుండానూ ఉండలేరు. మరి.. అంత వినోదం ఉంది ఈ వీడియోలో.. మనం కోతులకు సంబంధించిన వీడియోలను చూసేవుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో ఈ కోతి చేష్టలు తారాస్థాయికి చేరాయనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. కోతులకు నిజంగా ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో ముందుగా పులులు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే అక్కడే చెట్టుపై నుంచి వేలాడున్న ఒక కోతి కిందినున్న పులిని తెగ ఆటపట్టిస్తుంటుంది. ఆ కోతి ఒకసారి పులి తోకను , మరోమారు దాని చెవిని పట్టుకుని లాగుతుంది. ఈ చేష్టలను పులి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా ఫలితం లేకపోతుంది. ఈ కోతి చేష్టలు ఆ పులిని తెగ చికాకు పెడతాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ కోతి నిజంగానే పులితో ఒక ఆట ఆడుకున్నదని, ఇకపై ఆ పులులు కోతికి దూరంగా ఉంటాయంటూ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ Gibbons like to live dangerously pic.twitter.com/kNHbYI0TDd — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 16, 2023 -
ఎజెండాలో కపిరాజు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. కానీ పల్లె, పట్నం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అ న్నిచోట్లా ఇబ్బందులకు కారణమవుతున్న కోతుల సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఏపార్టీ కూడా ఈ సమస్యపై ఇప్పటివరకు మాట్లాడలేదు. జనావాసాలపై దాడులు.. అడవుల్లో ఉండాల్సిన కోతులు అక్కడ ఆహారం దొరక్క 20 ఏళ్లుగా ఊర్ల బాట పట్టాయి. మొదట్లో అడవుల గుండా వెళ్లే హైవేల పక్కన అడ్డా ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చి పోయేవారు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూశాయి. ఇక అక్కడి నుంచి ఊర్లలోకి వచ్చిన తర్వాత పంట పొలాలు మొద లు ఇంట్లోని కిచెన్ వరకు ప్రతీ చోట కోతుల దాడి పెరిగింది. కోతులు అడవులకు వెళ్లాలి తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. ‘వనాలు పెరగాలి – కోతులు అడవులకు పోవాలి’ అనేది హరితహారం నినాదం. పదేళ్లు గడిచే సరికి తెలంగాణలో స్థూలంగా అడవుల విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ హరితహారం నినాదానికి తగ్గట్టుగా కోతులు అడవులకు పోలే దు సరికదా మరింతగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులకు పంట నష్టం జరుగుతోంది. కనిపించని ఫుడ్కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో కోతుల కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్ కోర్టులంటూ పండ్ల మొక్కలను ఎంపిక చేసిన స్థలాల్లో నాటారు. కానీ సరైన ఆలనాపాలన లేకపోవడంతో ఇవి నామరూపాల్లేకుండా పోయాయి. అసెంబ్లీలో సైతం చర్చ తెలంగాణ తొలి శాసనసభలో సీఎం కేసీఆర్ స్వయంగా కోతుల కారణంగా గ్రామాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కోతుల కారణంగా కూరగాయల సాగుకు రైతులు దూరమయ్యారని చెప్పారు. కోతులు బాధ భయంకరంగా మారిందన్నారు. అడవుల్లో ఫలాలు ఇచ్చే వృక్షాలను పెంచడం తప్ప మరో మార్గం లేదన్నారు. పరిహారం మాటేమిటి? కోతుల కారణంగా జరుగుతున్న పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ 2017లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నాటి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు డిమాండ్ చేశారు. అప్పటి అటవీశాఖ మంత్రి జోగురామన్న కోతుల వల్ల ఇబ్బందులేమీ లేవని చెప్పే ప్రయత్నం చేయగా వరంగల్కు చెందిన ఎర్రబెల్లి దయాకర్రావు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కోతుల సమస్య తీవ్రంగా ఉందంటూ చర్చలో తమ అభిప్రాయాలు తెలిపారు. ఆఖరికి కోతులను బెదరగొట్టేందుకు కొండెంగలు (కొండముచ్చులు) అద్దెకు తీసుకురావాలని అప్పటి శాసన సభ్యులు కోరారు. కోతుల నియంత్రణ కోసం రూ. 2.2 కోట్లతో నిర్మల్లో ప్రత్యేక సెంటర్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఆచరణ అంతంతగానే ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకుని కోతులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. -
పురాతన ఆలయం కోతులకు ఆవాసం!
రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గల్తాజీ’ పీఠం మర్కట మందిరంగా పేరుమోసింది. ప్రతిరోజూ ఇక్కడ మనుషుల కంటే మర్కటాలే ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ కొండలు, ఆ కొండల నుంచి జలధారలు, ఆ జలధారలతో ఏర్పడిన జలకుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ఆరావళి పర్వతాల నడుమ వెలసిన విలక్షణ ఆలయం ఇది. ఆరావళి కొండల నుంచి వెలువడే జలధారలతో ఏర్పడిన నీటికుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. విశిష్టాద్వైత స్థాపకుడైన రామానుజాచార్యుల పరంపరకు చెందిన గల్తాజీ ఇక్కడ పదిహేనో శతాబ్దిలో రామానుజ సంప్రదాయం ప్రకారం వైష్ణవ పీఠాన్ని నెలకొల్పారు. ఉత్తర భారతదేశంలో రామానుజ సంప్రదాయంలో ఏర్పడిన తొలి పీఠం ఇదే! ప్రధాన ఆలయంలో సీతారాములు కొలువుదీరగా, ఈ ప్రాంగణంలోనే సూర్యాలయం కూడా ఉంది. ఇక్కడ కనిపించే మర్కట సమూహాలు ఆనాటి వానర సేనల వారసులేనని భక్తులు నమ్ముతారు. (చదవండి: తల్లి ప్రేమకు సరిహద్దులు లేవు) -
పంది కిడ్నీతో కోతికి రెండేళ్ల ఆయుష్షు.. మరో మెట్టెక్కిన ఆధునిక వైద్యం!
మానవులకు జంతు అవయవ మార్పిడి చికిత్సలో వైద్యశాస్త్రం మరోముందడుగు వేసింది. జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది కిడ్నీని అమర్చిన ఒక కోతి మరో రెండు సంవత్సరాల ఆయుష్షు పోసుకుంది. మానవులకు జంతు అవయవ మార్పిడి విషయంలో జరుగుతున్న ప్రయోగ పరిశోధనలలో ఇదొక మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వెల్లడించిన వివరాల ప్రకారం పరిశోధకులు పందులలో జన్యు సవరణపై సాగిస్తున్న ప్రయోగాలలో మరింత పురోగతి సాధించారు. జంతువులలో జన్యుమార్పిడి చేసిన అవయవాలను అమర్చినప్పుడు, ఆ అవయవాలు నిద్రాణమైన వైరస్లను కలిగి ఉండవని, మార్పిడి అనంతరం ఆ నూతన అవయవాలు అంతర్గత దాడికి గురికావని శాస్త్రవేత్తలు గమనించారు. మానవేతర జీవులలో అవయవ మార్పిడి జరిగినప్పుడు ఆ మార్పిడి అవయవం సురక్షితంగా ఉందని, ఆ జీవికి లైఫ్ సపోర్ట్ అందిస్తుందని నూతన ప్రయోగ ఫలితాలలో తేలిందని యూఎస్ బయోటెక్ సంస్థ ఇజెనెసిస్లోని మాలిక్యులర్ బయాలజిస్ట్ వెన్నింగ్ క్విన్ తెలిపారు. జినోట్రాన్స్ప్లాంటేషన్ అనేది వివిధ జాతుల మధ్య ఒక అవయవాన్ని మార్పిడి చేసే విధానం. దీని ద్వారా బాధితులకు అవయవదానంతో ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే లక్షకు పైగా బాధితులు అవయవదానం కోసం ఎదురుచూస్తున్నవారి జాబితాలో ఉన్నారు. అవయవదానం కోసం ఎదురుచూస్తూ, ఫలితం లేకపోవడంతో ప్రతిరోజూ 17 మంది మృతి చెందుతున్నారు. అవయవ మార్పిడి చికిత్సల పరిశోధనల్లో సైన్స్ మరింతగా అభివృద్ధి చెందుతోంది. గత ఏడాది వైద్యులు జన్యు ఇంజనీరింగ్ చేసిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి మార్పిడి చేశారు. అయితే ఆ పంది గుండె గ్రహీత చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత మరణించాడు. ఇదేవిధంగా గత నెలలో మధ్య వయస్కుడైన ఒక వ్యక్తికి కూడా పంది గుండెను అమర్చారు. బ్రెయిన్ డెడ్ స్థితికి చేరిన మనుషులలో అవయవమార్పిడి చేసేందుకు జెనోట్రాన్స్ప్లాంట్ సహరిస్తుంది. తాజా పరిశోధనలో జెనోట్రాన్స్ప్లాంట్ చేసిన అవయవాల మార్పిడి కారణంగా కోతుల జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. మొత్తం 69 జన్యువులను పరిశోధకులు పరిశీలించగా, వాటిలో ఎక్కువశాతం గ్రహీత రోగనిరోధక వ్యవస్థ అవయవంపై దాడి చేయవని వెల్లడయ్యింది. ఇందుకోసం పంది జన్యువులో నిద్రాణమైన వైరస్లను సవరించారు. అవి కోతుల రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఉండేందుకు ఔషధ చికిత్స చేశారు. అలాగే పంది అవయవాలలో మానవ జన్యువులను ప్రవేశపెట్టారు. మానవ జన్యువులు ప్రవేశపెట్టని మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు ఆ కోతులు చికిత్స అనంతరం సగటున 24 రోజులు మాత్రమే జీవించాయి. మొత్తం 21 కోతులపై ఈ ప్రయోగాలు జరిగాయి. అయితే మానవ జన్యువులను ప్రవేశపెట్టిన మూత్రపిండాలు కలిగిన కోతులలో అవయవ మార్పిడి చేసినప్పుడు అవి సగటున అధికంగా 176 రోజులు జీవించాయని తేలింది. అలాగే ఈ ప్రయోగాలలో వినియోగించిన ఐదు కోతులు ఒక సంవత్సరానికి మించి జీవించాయని, ఒకకోతి ఏకంగా రెండేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా జీవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో జెనోట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగాలకు సాధారణ పందులను ఉపయోగించినప్పటికీ, నూతన పరిశోధనల్లో మినీయేచర్ పిగ్లను ఉపయోగించారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన జెనోట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ముహమ్మద్ మొహియుద్దీన్ మాట్లాడుతూ మనుషులలో జంతు అవయవ మార్పిడి చికిత్స విజయవంతం అయ్యేందుకు, ఆ అవయవాల జన్యువును మరింత సవరించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవ దానం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ఈ ప్రయోగాలు వరం లాంటివని పేర్కొన్నారు. అయితే ఇది సాకారం అయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని అన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు -
కోతి పిల్లకు పిల్లి ఆసరా.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..!
ఏ జంతువైనా తమ బిడ్డలను తప్పా ఇంకే జంతువు పిల్లలను దగ్గరికి తీసుకోవు. అంతేకాదు.. పొరబడి వచ్చినా.. తమ పిల్లలు కాదని గుర్తించి దాడి చేస్తాయి. అందునా వేరే జాతి జంతువు పిల్లలనయితే.. అసలే దగ్గరికి రానియ్యవు. కానీ మీరు చూడబోయే ఈ వీడియోలో ఓ కోతి పిల్లను అక్కున చేర్చుకుంటుంది పిల్లి. వేరే జాతి జంతువు పిల్లను ఓ పిల్లి దగ్గరికి తీసుకుని పోషించడం గ్రేట్ కదా..? వీడియో ప్రకారం.. ఓ కోతి పిల్ల తన తల్లి నుంచి దూరమవుతుంది. దీంతో ఓ పిల్లి కోతి పిల్లను దగ్గరికి తీసుకుంటుంది. తన సొంత తల్లిపై ఎక్కినట్లు పిల్లి బొజ్జకు హత్తుకుని కూర్చుంటుంది కోతి పిల్ల. ఇక.. ఆ కోతి పిల్లని బరువని భావించక.. తనతో పాటే మోసుకుపోతుంది పిల్లి. This lost baby monkey was adopted by this cat. ❤️pic.twitter.com/goRlTYyZJ6 — Figen (@TheFigen_) July 13, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్గా మారింది. తెలివి ఉన్న మనుషులే ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే ఈ రోజుల్లో ఈ పిల్లి అందరికీ ఆదర్శం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇస్తోందంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
మంకీ హెయిస్ట్.. డబ్బుల బ్యాగ్ను భలేగా కొట్టేసింది
-
ఒక్క దెబ్బకి ఆ కోతి లక్షాధికారి అయ్యింది!
Monkey Stole Money Viral రాత్రికి రాత్రే నసీబ్ మార్చుకుని కోటీశ్వరులైన మనుషుల కథల్ని విని ఉంటాం. కానీ, ఓ కోతి పట్టపగలే.. అదీ అడ్డదారిలో కొన్ని గంటలపాటు లక్షాధికారిగా మారిపోయిందట. ఇది సోషల్ మీడియాలో పేలుతున్న జోక్ మాత్రమే. ఉత్తర ప్రదేశ్ షాహాబాద్లో జరిగిన ఓ సరదా ఘటన.. ఓ వ్యక్తిని కాసేపు ఆగమాగం చేసింది. ఓ కోతి లక్షా యాభై వేల నగదు ఉన్న సంచిని ఓ మోటర్ సైకిల్ నుంచి ఎత్తుకెళ్లింది. షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి సేల్ డీడ్ కోసం నగదుతో రిజిస్ట్రీ ఆఫీస్ వచ్చాడు. ఆ సమయంలో ఓ కోతి అక్కడికి వచ్చింది. పార్కింగ్లో ఉన్న ఒక్కో బ్యాగ్ను వెతుక్కుంటూ ముందుకెళ్లింది. అయితే.. దాని కన్ను డబ్బులున్న షరాఫత్ బ్యాగ్ మీదే పడింది. అంతే.. నైస్గా దానిని ఎత్తుకెళ్లింది. కాసేపటికి బండి దగ్గరకు వచ్చిన ఆయన డబ్బు లేకపోయేసరికి దొంగతనం జరిగిందేమో అనుకుని లబోదిబోమన్నాడు. ఈలోపు కొందరు బ్యాగ్ కోతి ఎత్తుకెళ్లిందని చెప్పడంతో దాని కోసం వెతికారు. అది కాస్త దగ్గర్లోని ఓచెట్టుపై నిమ్మలంగా కూర్చుని ఉంది. చాలాసేపు ప్రయత్నించాకే.. అది ఆ బ్యాగ్ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో షరాఫత్ ఊపిరి పీల్చుకున్నాడు. -
బైక్కు అడ్డొచ్చిన కోతి.. భార్య కోమాలోకి.. భర్త పరిస్థితి విషమం
వరంగల్ : దంపతులు బైక్పై వెళ్తుండగా మర్గమధ్యలో వానరం అడ్డువచ్చింది. దీంతో సడన్ బ్రేక్ వేయగా.. భార్య బైక్ నుంచి పడి తీవ్రగాయాలపాలై కో మాలోకి వెళ్లి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గార్ల మండలం కొత్తపోచారం గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యురాలు తిప్పారపు రూతమ్మ భర్త హనుమంతరావుతో కలిసి బైక్పై శుక్రవారం గార్ల కు వచ్చారు. అనంతరం స్వగ్రామం వెళ్తుండగా గో పాలపురం సమీపంలో బైక్కు కోతి అడ్డొచ్చింది. దీంతో హనుమంతరావు సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న రూతమ్మ రో డ్డుపై పడింది. తల వెనుక భాగంలో తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కో మాలోకి వెళ్లింది. క్షతగా త్రురాలిని హుటాహుటినా 108 ద్వారా ఖమ్మం తరలిచారు. ప్రస్తుతం ఆ మె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, తమది నిరుపేద కుటుంబమని, కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బు లేదని, దాతలు స్పందించి తన భార్యకు ప్రాణభిక్ష పెట్టాలని హనుమంతరావు వేడుకుంటున్నాడు. దాతలు 9573073641 నంబర్కు ఫోన్ పే చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
4 గంటలు ముప్పుతిప్పలు.. రూ.21,000 రివార్డ్ ఉన్న మోస్ట్ వాంటెడ్ కోతిని..
భోపాల్: రెండు వారాల భయాందోళనల తర్వాత సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని ఎట్టకేలకు అధికారులు నిర్బంధించారు. అధికారులు, రెస్క్యూటీం, స్థానికులు నాలుగు గంటలు పాటు శ్రమించి చివరికి దాని బోనులో పెట్టగలిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఒక కోతి జనసంచారంలో సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా ప్రజలపైకి దాడి చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు ఆ కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేశారు. ప్రజలపై దాడి చేస్తున్న ఆ కోతిని పట్టుకోవడానికి అనేకసార్లు చేసిన ప్రయత్నించి విఫలం కావడంతో చివరికి స్థానిక అధికారులు.. కోతిని పట్టుకున్నవారికి ₹ 21,000 నగదు బహుమతిని ప్రకటించారు. చివరికి జిల్లా కలెక్టర్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఎలా పట్టుకున్నారంటే! జిల్లా కలెక్టర్ ప్రమేయంతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్గఢ్కు చేరుకున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు ఇందుకు సహాయం చేశారు. ఇంతమంది సహకారంతో చివరికి.. ఆ కోతిని పట్టుకోవడానికి 4 గంటల సమయం పట్టుకోగలిగారు. డ్రోన్ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. దాన్ని పట్టుకుని బోనులో బంధించారు. కోతిని పట్టుకున్నందుకు దానిపై ఉన్న ఉన్న 21,000 నగదు బహుమతిని జంతు రక్షక బృందానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే! -
నైట్క్లబ్లో కోతికి గొలుసు కట్టి..వీడియో వైరల్..నెటిజన్ల ఆగ్రహం
కలకత్తా:కలకత్తాలోని ఓ నైట్క్లబ్లో గొలుసుతో కట్టిన కోతి కనిపించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామిక్ కాలనీ ప్రాంతంలోని ఓ నైట్క్లబ్ టాయ్ రూమ్లో కోతి కనిపించడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్ నిర్వహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 16న సర్కస్ థీమ్తో కూడిన పార్టీని టాయ్ రూమ్లో నిర్వహించదలచారు. ఈ క్రమంలో ఓ కోతిని గొలుసుతో కట్టడం ద్వారా జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) కోతికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా కనిపించడంతో బెంగాళీ యాక్టర్ శ్వాస్తికా ముఖర్జీ స్పందించారు. వీడియోలను షేర్ చేస్తూ కోతిని గొలుసుతో బంధించడాన్ని ఆక్షేపించారు. మనుషులు ఇలా క్రూరంగా ఎలా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి వెళ్లిన వ్యక్తులు కూడా ఆ దృశ్యాలను చూస్తూ ఆపకుండా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ఆ వీడియోలను ట్యాగ్ చేశారు. So #ToyRoomKolkata brought in this tiny monkey for its circus-themed night. Nothing, absolutely nothing can be more inhumane than this. @PetaIndia @Manekagandhibjp @AnushkaSharma @swastika24 @KolkataPolice @MamataOfficial @ParveenKaswan @ToyRoomLondon @PTI_News @ttindia pic.twitter.com/g57qZv12Q9 — Deblina Halder (@StoriesbyD) June 17, 2023 గొలుసుతో కోతి కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో టాయ్ రూమ్ నిర్వహకులు వెంటనే స్పందించారు. నైట్ క్లబ్లోకి ఎలాంటి కోతులను అనుమతించలేదని స్పష్టం చేశారు. క్లబ్లోకి రాదలచిన మదారీ(కోతులను ఆడించే వ్యక్తులు)లకు అనుమతి నిరాకరించిన తర్వాత వారు రెస్టారెంట్ ప్రాంగణంలో కనిపించారని చెప్పారు. మదారీలు గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్లి వారి జీవన పోషణను చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో కోతులకు ఎలాంటి హానీ జరగలేదని యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.. క్షమాపణలు కోరుతున్నట్లు ఓ పోస్టును విడుదల చేసింది. View this post on Instagram A post shared by Toyroom kolkata (@toyroomkolkata) ఇదీ చదవండి:వడగాల్పుల దెబ్బకు 54 మంది మృతి.. ఆస్పత్రుల్లో స్ట్రెచర్లు లేక భుజాలపైనే.. -
Adipurush: థియేటర్ కి వచ్చి ఆదిపురుష్ మూవీ చూసిన వానరుడు
-
కోతి చేసిన పనికి 20 గ్రామాలకు పవర్ సప్లై కట్!
సాక్షి, వరంగల్: కోతి తన చేష్టలతో కరెంటోళ్ళకే షాక్ ఇచ్చింది. 20 గ్రామాలకు కరెంటు సప్లై లేకుండా చేసింది. కోతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. విద్యుత్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టి, లక్షా రూపాయల వరకు నష్టం కలుగజేసింది. జనగామ జిల్లా వడ్లకొండ 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ స్తంభాలపై ఎగిరిన కోతి, ట్రాన్స్ ఫార్మర్ను పట్టుకుంది. దీంతో ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో పాటు కోతికి తీవ్ర గాయాలయ్యాయి. వడ్లకొండ 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి లింగాలఘనపురం, జనగామ, అడవికేశ్వాపూర్, గానుగుపహాడ్, పసరమడ్ల 33/11 కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ సంబంధించి ఎప్పటికప్పుడు రీడింగ్ నమోదు చేసేలా అక్కడే ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ను కోతి పట్టుకోవడంతో పేలిపోవడంతో పాటు జంపర్లు పూర్తిగా తెగిపడ్డాయి. ఫలితంగా 20 గ్రామాలకు మూడుగంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్లో చిక్కుకున్న కోతిని కిందికి దింపి, మరమ్మతులు నిర్వహించి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. కోతి కారణంగా సంస్థకు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది. -
కట కటా... మర్కటా!
ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ కోతి వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనగా....ఒకాయన ఏదో ఆలోచిస్తూ ఆలయం మెట్లు ఎక్కుతూ వస్తుంటాడు. ఆ మెట్ల పక్కన గద్దెపై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్లద్దాలను లాగేసుకుంది. ఇతడు బిత్తరపోతూ ఉండగానే ‘ఈ అద్దాలు నాకు సెట్ అవుతాయా’ అన్నట్లుగా ట్రయల్స్ స్టార్ట్ చేసింది కోతి. ఈలోపు అక్కడికి వచ్చిన ఒక మహిళ కొన్ని పండ్లను కోతి ముందు పెట్టింది. అంతే...ఆ అద్దాలను పక్కన పెట్టి పండ్ల పని పట్టింది కోతి. ఈ వీడియోను చూస్తూ బిగ్గరగా నవ్వుతున్న వాళ్లతో పాటు ‘అయ్యో..ఈ వనజీవులు ఎంత ఆకలితో అల్లడుతున్నాయో కదా!’ అని బాధపడుతున్న వారూ ఎందరో ఉన్నారు. -
రీల్స్ చూస్తూ స్నాక్స్ తింటూ.. ఈ కోతిచేష్టలు మామూలుగా లేవు
-
ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి చిరుత వేట
-
మెట్రో రైలులో షికారుకెళ్లిన కోతి
-
పెళ్లి మండపంలోకి హఠాత్తుగా చొరబడ్డ కోతి..వధువరులపై దాడి చేసి..
పెళ్లి అనేది ఎవరికైనా జీవితంలో మర్చిపోలేని ఒక మధురాను ఘట్టం. అలాంటి వాటిల్లో ఏదైన్న అనుకోనిది జరిగితే ఎవరికైనా కాస్త బాధగానే ఉంటుంది. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మానవుని ఊహకు కూడా అందని విధంగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే ఈ పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఓ పెళ్లి వేడుకలో వధువరులు ఆనందంగా పెళ్లి చేసుకుటున్నారు. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా నిరాటంకంగా జరుగుతోంది. సరిగ్గా ఆ జంట తలంబ్రాలు వేసుకుంటూ ఉల్లాసంగా ఉన్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి నేరుగా మండంపంలోకి వచ్చేసింది. అంతే ఒక్కసారిగా అక్కడున్న వరుడు తలపై అటాక్ చేసి కొన్ని అక్షంతలు తీసుకుంది. దీన్ని చూసి వధువు షాక్తో ఉండిపోయింది. క్షణాల్లో ఆమె నెత్తిపై కూడా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్నవారందరూ కంగుతిన్నారు. అయితే ఆ కోతి వారిని ఆశీర్వదించేందుకు వారిపైకి అలా దూకిందేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by ⓉⒺⓁⓊⒼⓊ.ⒷⒺⒶⓉⓈ_①_④_③//50k🔵 (@telugu.beats_1_4_3) (చదవండి: హాట్ టబ్లో సేద తీరుతున్న జంటపై సడెన్గా మౌంటైన్ లయన్ దాడి..ఆ తర్వాత..) -
కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి.. వీడియో వైరల్
-
ఫ్లెక్సీపెట్టి.. అన్నదానం చేసి
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కన్నుమూస్తే సంతాప సూచకంగా వారి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి కూడళ్లలో ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే ఖమ్మంలో మృతిచెందిన ఓ కోతికి సైతం ఫ్లెక్సీ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తిరుగుతూ, నిత్యం హమాలీల మధ్య ఉంటూ.. వారు పెట్టే భోజనం తింటూ గడిపే ఓ కోతి ఇటీవల మృతి చెందింది. దీంతో హమాలీలు ఆ వానరానికి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా శుక్రవారం అన్నదానం సైతం నిర్వహించారు. ఇంతటితో సరిపెట్టకుండా ఆ కోతి ఫొటోతో ఫ్లెక్సీ చేయించి మార్కెట్ ప్రధాన గేటుకు పెట్టగా పలువురు ఆసక్తిగా పరిశీలించారు. చదవండి: మహబూబాబాద్: టమాటా కూర అత్త ప్రాణం మీదకు తెచ్చింది -
అట్లుంటది మన యాక్టింగ్.. పోలా అదిరిపోలా!
ఈ కోతికి కొంచెం యాక్టింగ్ పిచ్చి.. ఎప్పటికైనా సినిమాల్లో స్టార్ అయిపోవాలని కలలుగంటోంది..పైగా.. చావు సీన్లలో యాక్ట్ చేయడంలో స్పెషలైజేషన్ కూడా ఉంది. ఎంతలా అంటే యాక్టింగా.. లేక నిజంగానే చచ్చిందా అన్నది సాటి కోతులు కూడా కనిపెట్టలేవు. ఫొటోగ్రాఫర్ ఫెడ్రికా(ఇటలీ) కూడా చనిపోయిందనే అనుకున్నారు. ఇంతలో ఎవరు కట్ అన్నారో తెలియదుగానీ.. చటుక్కున లేచి కూర్చుందట. కామెడీ వైల్డ్ లైఫ్ అవార్డ్స్ జ్యూరీ మెచ్చిన చిత్రమిది. ఇట్స్ ఏ గోల్.. ఈ గద్ద.. మెస్సీ ఫ్యాన్ అట. ఈ మధ్యే ఫిఫా వరల్డ్ కప్ చూసొచ్చింది. అప్పటి నుంచీ ఇదే వరుస. గోల్ మీద గోల్ కొట్టేస్తోంది. ఏమో.. ఎప్పుడైనా తమ గద్దల్లోనూ ఫుట్ బాల్ పోటీపెడితే.. పనికివస్తుందని ఇప్పటి నుంచే తెగ ప్రాక్టీస్ చేస్తోంది. జియా చెన్ తీసిన ఈ చిత్రం కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో అమేజింగ్ ఇంటర్నెట్ పోర్ట్ఫోలియో పురస్కారాన్ని గెలుచుకుంది. సాక్షి సెంట్రల్డెస్క్ -
Monkey Food Court: కోతుల కోసం మూడు ఎకరాల్లో పండ్ల మొక్కలు
సాక్షి, దుబ్బాక(సిద్ధిపేట): కోతుల బెడదతతో ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. అడవుల్లో ఉండాల్సిన కోతులు గుంపులు గుంపులుగా గ్రామాలకు చేరాయి. అక్కడ వాటికి సరిపడా ఆహారం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. ఏకంగా ఇళ్లలోకి చోరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లుతున్నాయి. ఇండ్ల పైకప్పులను ధ్వంసం చేస్తున్నాయి. రైతులు పండించి కూరగాయలను, ఇతర ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రస్థాయిలో నష్ట పోతున్నారు. కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకోవడానికి వాయిస్ అలారం ఏర్పాటు చేశారు. కొంత మంది రైతులు డప్పు చప్పుడు, టపాసులు కాల్చుతున్నారు. కోతులను బెదర కొట్టేందుకు కొన్ని గ్రామాల రైతులు ఇతర జిల్లాల నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టి కొండెంగలను కొనుగోలు చేసి తిప్పుతున్నారు. వాటి సంరక్షులకు ప్రతీ నెల జీతం ఇస్తున్నారు. పద్మనాభునిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం కోతుల బెడదను తప్పించడానికి అవి ఊర్లలోకి రాకుండా, పంట పొలాలను నష్టం చేయకుండా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలోని గ్రామ శివారులో ప్రత్యేకించి ‘మంకీ ఫుడ్కోర్టు’ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మూడు ఎకరాలను చదును చేసి అందులో పలు రకాల పండ్ల మొక్కలు నాటారు. అవి నాటి మూడు సంవత్సరాలైంది. మామిడి, జామ, దానిమ్మ, సపోట, సీతాఫలం, రేగుపండ్లు, బొప్పాయి, సంత్ర, అరటి, బత్తాయి, అల్లనేరేడు, వెలగ పండ్లు, ఖర్బూజ, దోస పండ్ల మొక్కలను పెంచుతున్నారు. రాజక్కపేటలో కొండెంగలను తిప్పుతున్న గ్రామస్తులు -
Viral Video: యువకుడ్ని సావకోట్టిన కోతి
-
Viral Video: పిల్ల కోతి కోసం తల్లడిల్లిన తల్లి కోతి
-
ప్రకాశం: పసికందును బలిగొన్న వానరం
సాక్షి, ప్రకాశం: జిల్లాలో శుక్రవారం ఘోరం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రపోతున్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి కిందపడేసింది వానరం. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర-సుమతీ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. రెండు నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది సుమతీ. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. పసికందును ఆరుబయట మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి.. పసికందును మంచం మీద నుంచి ఈడ్చుకెళ్లింది. గట్టిగా కిందపడేయడం.. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యవసాయ సామాగ్రి ఆ పసికందుపై పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలికిడికి అక్కడికి వచ్చిన తల్లి.. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. పసికందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వైరల్ వీడియో: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
-
Viral Video: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
లక్నో: ఎవరైనా పిచ్చిగా ప్రవర్తిస్తే ‘కల్లు తాగిన కోతి లెక్క చేస్తున్నవ్’ అంటారు. కానీ, నిజానికి కోతి కల్లు తాగటం చూసినవారు చాలా తక్కువ. అలాంటిది లిక్కర్కు బానిసైన వానరాలూ ఉన్నాయంటే నమ్ముతారా? కానీ, ఓ కోతి ఏకంగా వైన్స్ షాప్లోకి దూరి చోరీ చేస్తోంది. మద్యం మత్తులో తూలుతూ జల్సా చేస్తోంది. బీరు బాటిల్ ఎత్తి తాగుతున్న ఓ కోతి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలో లిక్కర్కు అలవాటు పడిన ఓ కోతి షాపుల్లో దూరి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోందంటూ స్థానిక వైన్స్ షాపుల విక్రయదారులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓ కోతి మద్యం తాగుతూ ఎవరైనా కనిపిస్తే వారి దగ్గర నుంచి బాటిళ్లు లాక్కుని పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. అడ్డుకోవడానికి చూస్తే మీద పడి కరిచేందుకు సైతం ఎనకాడటం లేదటా. దీంతో వైన్స్ షాపులకు వచ్చి మందు కొనాలంటేనే భయపడుతున్నారటా మద్యం ప్రియులు. మొత్తానికి ఈ తాగుబోతి వానరం అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. రాయ్బరేలీ జిల్లాలోని గడాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్గంజ్ ప్రాంతంలో ఓ కోతి బీరు తాగుతున్న వీడియో తెగ వైరల్గా మారింది. ఫిర్యాదులు పెరిగిపోతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులతో కలిసి కోతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: కేబుల్ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా? -
కోతులతో కష్టాలు కనుమా.. కొండెంగలను తెచ్చినా..
సాక్షి, హైదరాబాద్: ఇంతకు ముందు పంట పొలాలకు రక్షణ కోసం కంచెలు వేయడం చూశాం. వివిధ రకాల పశువులు, పక్షులు, అడవి జాతి జంతువులతో పంట నష్టపోకుండా పొలం చుట్టూ రకరకాల బొమ్మలు, వైర్లు, టపాకాయలు, దిష్టి బొమ్మలు, సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేయడం చూశాం. కానీ ఇంటిపై కప్పులపై బొమ్మలు, కరెంట్ తీగలు, కంచె వేయడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు అనేక గ్రామాల్లో ఇంటి పైకప్పులపై కంచెలు కనిపిస్తున్నాయి. కేవలం కోతుల కోసమే ఇలాంటి జాగత్త్రలు, రక్షణ చర్యలు తీసుకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యం అనిపించినా.. అక్షరాలా నిజమే. ఒకప్పుడు కేవలం అటవీ పరిసర ప్రాంతాలు, పల్లెల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఊళ్ళల్లోనే కాదు పట్టణాల్లోనూ వానరాల సంచారం తీవ్రమైంది. కొండెంగలను తెచ్చినా.. కోతుల కట్టడి కోసం చాలా ఊళ్ళల్లో, కాలనీల్లో స్థానికులు తలాకొంత వేసుకుని వాటి రక్షణకు కొండెంగలను తెచ్చి పెట్టుకున్నారు. కానీ ఒక దిక్కున కొండెంగలను ఏర్పాటు చేస్తే మరో దిక్కున కోతులు చొరబడుతున్నాయి.. అన్ని చోట్లా పెట్టేందుకు ఎక్కువగా కొండెంగలు కావాల్సి ఉన్నా వాటి కొరత నేపథ్యంలో గ్రామస్తులకు విసుగొచ్చి చివరికి తీసుకువచ్చిన కొండెంగలను కూడా అడవిలో వదిలేశారంటే వానర సైన్యం సంఖ్య ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు సౌండ్స్ సిస్టం ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు, కోతులు పట్టితెచ్చిన వారికి 2 రూ.వేల నుంచి పదివేలు ముట్టజెప్పినా... ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ కోతుల బెడద తప్పడంలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి కోతులు రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం కానరావడం లేదు. ఈ మధ్య మా ఊళ్లో ఓ ఇంట్లోకి కోతి వెళ్లింది. పొరపాటున ఇంటి డోర్లాక్ పడటంతో వందలాది కోతులు ఇంటిని చుట్టుముట్టి నానారభస చేసి. పైకప్పును పూర్తిగా పాడు చేశాయి. ఆ సమయంలో ఇంట్లో మనుషులు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏమిటి? – గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ–2, ముస్తాబాద్ -
గుండెల్ని కదిలించేలా.. ఈపాటి విశ్వాసం మనిషికెక్కడిది?
మనిషికి విశ్వాసం ఏమాత్రం?.. మూగజీవాలతో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువే!!. ఇది నిరూపించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది. ఆప్యాయంగా ఆయన్ని చూస్తూ.. హత్తుకుని.. కాసేపు అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్.. అడవి నుంచి వచ్చిన ఓ కొండముచ్చుకు రోజూ తిండి పెట్టేవారట. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన పార్థీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. ఆ కొండముచ్చు ఇలా తన విశ్వాసం.. ప్రేమను ప్రదర్శించింది. మరో ఘటనలో.. నంద్యాల డోన్ పట్టణం పాతపేటలో తనకు తిండి పెట్టిన ఓ మహిళ చనిపోతే శవయాత్రలో ఆ కొండ ముచ్చు పరుగులు తీసిన వీడియో ఒకటి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బలిజ లక్ష్మీదేవి అనే మహిళ బజ్జీల కొట్టు నడిపిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది. అలా రోజూ వచ్చే కొండముచ్చుకు.. మంగళవారం నాడు లక్ష్మీదేవి కనిపించలేదు. ఆకస్మాత్తుగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బంధవులు అంత్యక్రియల కోసం శవయాత్రను ఓ వాహనంలో నిర్వహించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఆ కొండముచ్చు ఆ వాహనం వెంట పరుగులు తీయడాన్ని కొందరు రికార్డు చేసి వైరల్ చేశారు. All lives, #animals #birds #plants have intelligence & emotions. #Monkey mourns death of man who fed every day. By kissing him. Touching. Happened in #Srilanka. Mattaglabbu. pic.twitter.com/nBLKEW2JUZ — Straight Talk India (@sttalkindia) October 20, 2022 -
చాలా రిచ్.. కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఎక్కడో తెలుసా?
విదేశాల్లో పెంపుడు జంతువుల పేర్ల మీద కోట్ల ఆస్తులు వీలునామా రాసిన ఘటనలు విన్నాం. కానీ మనదేశంలో కోతుల పేరు మీద భూమి ఉండటం అరుదే. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి ఉంది. ఈ విషయం గ్రామ పంచాయతీ రికార్డుల్లో స్పష్టంగా రాసి ఉంది. అటవీ శాఖ మొక్కలు నాటిన ఆ భూమిలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూడా ఉంది. ఈ భూమి కోసం గొడవలవుతున్నాయి. నగరాల్లో గజం జాగ కొనాలంటే గగనమవుతోంది. అలాంటిది కోతులకు 32 ఎకరాల భూమి ఎలా వచ్చింది? అసలు జంతువుల పేరు మీద రిజిస్టర్ ఎలా చేశారు? ఎవరు రిజిస్టర్ చేశారు? అనేక సందేహాలు వస్తున్నాయి కదా! ‘కానీ.. ఎవరు రిజిస్టర్ చేశారు? ఎలా చేశారు?’అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదని చెబుతున్నాడు ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్. అక్కడ కోతుల పేరుమీద భూమి ఉండటమే కాదు, వాటికి ఎనలేని గౌరవం కూడా ఉంది. ఉప్లా గ్రామవాసులు కోతులకు ఒకప్పుడు ఇంకా ఎక్కువ మర్యాద ఇచ్చేవారు. వేడుక ఏదైనా కోతులకు ప్రత్యేక స్థానం ఉండేది. పెళ్లిళ్లు అయితే.. ముందు వాటికి కానుకలు ఇచ్చిన తరువాతే వేడుక మొదలయ్యేది. ఇప్పుడు ఆ ఆచారాన్ని తక్కువ మంది పాటిస్తున్నారు. అయినా ఇప్పటికీ... కోతులు ఇంటిముందుకొస్తే ఆహారం మాత్రం కచ్చితంగా పెడతారు. -
కోతిని మింగి..చనిపోయి
దండేపల్లి (మంచిర్యాల): ఓ కోతిని మింగి... కొండచిలువ చనిపోయిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో జరిగింది. కదలకుండా పడి ఉన్న కొండచిలువ చుట్టూ కొన్ని కోతులు చేరి అరుస్తుండటంతో గ్రామస్తులు గమనించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కొండచిలువ చనిపోయి ఉంది. అది మధ్యలో ఉబ్బెత్తుగా కనిపించింది. కోతిని మింగడం వల్ల మిగతా కోతులు దాడి చేసి ఉంటాయని, ఆ దాడిలో అది చనిపోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
Photo Feature: కల్లు కమ్మగుంది..
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద ఆదివారం ఓ కోతి కల్లు తాగింది. కల్లు కవర్ను తెచ్చుకొని గోడపై కూర్చొని రుచి చూసింది. -
పులినే ఒక ఆట ఆడుకున్న కోతి.. వీడియో వైరల్
పెద్ద పులి కనిపిస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. కానీ, ఓ కోతి మాత్రం నువ్ పులి అయితే.. నాకేంటి ఇది నా అడ్డా చూసుకుందాం రా.. అన్న విధంగా ప్రవర్తించింది. తన కోతి చేష్టలతో పులినే ఒక ఆట ఆడుకుంది. వానరాన్ని వేటాడేందుకు పులి ప్రయత్నించి చెట్టుపై నుంచి పడిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో ప్రకారం.. చెట్టుపై ఉన్న ఓ కోతిని వేటాండెందుకు పులి ప్రయత్నించింది. చిటారు కొమ్మన ఉన్న వానరాన్ని పట్టుకునేందుకు పులి సైతం చెట్టుపైకి ఎక్కింది. కొమ్మలపై అటూ ఇటూ అలవోకగా దూకటం కోతులకు పుట్టుకతో వచ్చే విద్య. అదే నైపుణ్యంతో పులిని ఆటాడుకుంది కోతి. చేతికి అందినట్లు అంది మరో కొమ్మపైకి దూకుతూ పులికి ముచ్చెమటలు పట్టించింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షా 74 వేల మంది వీక్షించారు. 8,300 లైకులు వచ్చాయి. हालात का ‘शिकार’ pic.twitter.com/myHtQ3qw5s — Awanish Sharan (@AwanishSharan) March 3, 2022 ఇదీ చదవండి: జీవితాంతం చదువుకుంటూ వృద్ధుడిగా మారిపోతా.. పిల్లాడి మాటలకు నెటిజన్లు ఫిదా -
కోతి తెలివి సల్లగుండ.. ఇలా కూడా చేస్తాయా!.. వైరలవుతున్న వీడియో
భూమ్మీద ఉన్న తెలివైన జంతువులలో కోతులు ఒకటి. కానీ వాటి చేష్టలు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని సార్లు అవి చేసే పనులు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తాయి. దేవాలయాలు, పార్క్లు, బహిరంగ ప్రదేశాల్లో జనాల చేతుల్లో ఆహార పదార్థాలు, ఫోన్లు, పర్స్లు కనిపిస్తే చాలు తెలివిగా వాటిని ఎత్తుకెళ్లిపోతుంటాయి. ఇళ్లలోకి దూరి కిచెన్లోని వస్తువులను కూడా దొంగిలిస్తుంటాయి. చేతికి దొరికిన తీసుకొని పరారవుతుంటాయి. తాజాగా ఓ కోతి బ్యాగ్ నుంచి దొంగిలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో.. ఓ వ్యక్తి భుజానికి బ్యాగ్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఈ బ్యాగ్ అక్కడున్న రెండు కోతుల కంట పడింది. కానీ అక్కడ కోతులు ఉన్నాయని ఆ వ్యక్తి గమనించుకోలేదు. వెంటనే కోతులు వ్యక్తి తగిలించుకున్న బ్యాగ్ వద్దకు చేరుకున్నాయి. అందులో ఓ కోతి మెల్లగా బ్యాగ్ జిప్ తీసింది. మొదటి జిప్లో ఏం దొరకలేదు. దీంతో మరో జిప్ తెరిచింది. అందులో దానికి ఒక యాపిల్ దొరికింది. ఇంకేముంది దానిని తీసుకొని పరుగో పరుగు తీసింది. దీనిని రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో షేర్చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్.. వేలల్లో లైక్లు వచ్చి చేరుతున్నాయి. దొంగ కోతి, అది చికాగో, న్యూయార్క్ నుంచి వచ్చినా సరే కోతులన్నీ దొంగవే. కోతి తెలివి మామూలుగా లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అబ్బా! ఏం చేశాడ్రా... మూన్ వాకింగ్ స్టైల్కి ఫిదా అవుతున్న నెటిజన్లు View this post on Instagram A post shared by Waow Africa (@waowafrica) -
పరాయి వస్తువులపై మోజు.. ఇన్ని ఇబ్బందులా!
వజ్రపురం అనే గ్రామంలో నివసించే రాజయ్య, రత్నమ్మ దంపతులకు లేకలేక పాప పుట్టింది. ఆ పాపకి అపురూప అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచసాగారు. అపురూప మూడో యేట అడుగుపెట్టింది. ఆ పుట్టినరోజు నాడు అపురూపకి పట్టులంగా, పట్టు జాకెట్టు కుట్టించారు. అలాగే పాపాయి బుల్లి బుల్లి చేతులకు బంగారు గాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రపులోలకులు, వజ్రాలహారం వేశారు. ఆరుబయట పందిరిలో సింహాసనంపై అపురూపను కూర్చోబెట్టి అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. అదే సమయానికి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఒక తల్లికోతి, పిల్లకోతి ఆ వేడుకకు దగ్గరలో ఉండే చెట్టు మీదకు చేరి ఆ వేడుకనంతా చూశాయి. పిల్లకోతికి అపురూప వేసుకున్న పట్టులంగా, పట్టు జాకెట్టు, గాజులు, అరవంకీలు, వజ్రాల హారం ఎంతగానో నచ్చాయి. తనకు అవన్నీ తెచ్చిపెట్టమంటూ తల్లికోతితో పేచీ పెట్టుకుంది. ‘వద్దమ్మా, పరులసొమ్ము పాము వంటిది’ అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూ కూర్చుంది. ఆఖరుకు పిల్లకోతి బాధ చూడలేక ‘సరేనని’ ఒప్పుకుంది తల్లికోతి. వేడుకంతా పూర్తయి అంతా సర్దుకునేసరికి చీకటి పడింది. అపురూప వేసుకున్న పట్టు జాకెట్టు, పట్టు లంగా ఒక సంచిలో పెట్టారు. బంగారుగాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రాలహారాన్ని ఒక పెట్టెలో పెట్టి.. అదే సంచిలో సర్దారు. ఆ సంచిని బీరువాలో పెడదామనుకుని అలసిపోయి ఉండటంతో ఆదమరచి నిద్రపోయారంతా. ఇదే అదనుగా భావించి తల్లి కోతి ఆ సంచిని దొంగిలించి చెట్టు పైకి తీసుకెళ్ళింది. తను అడిగినవన్నీ సంచిలో ఉండటంతో పిల్లకోతి సంతోషానికి హద్దే లేకుండాపోయింది. అప్పటికప్పుడు వాటన్నింటిని తనకు వేయమని గొడవపెట్టింది. ఆ పిల్లకోతికి లంగా, జాకెట్టు వేసింది తల్లి కోతి. చేతులకు గాజులు, అరవంకీలు తొడిగింది. మెడలో వజ్రాల హారాన్నీ వేసింది. వాటిని చూసుకుని పిల్లకోతి ఎంతగానో మురిసిపోయింది. తెల్లవారుతుండగా మెల్లగా చెట్టు దిగి.. వయ్యారంగా ఊరిలోకి నడవసాగింది. రాజయ్య,రత్నమ్మలు ఉదయాన్నే లేచి చూసే సరికి తమ అమ్మాయి నగలు, పట్టు బట్టలు ఉన్న సంచి కనిపించకపోవటంతో వెతకటం మొదలు పెట్టారు. వాళ్ళకు పట్టులంగా, జాకెట్టు, నగలతో పిల్లకోతి ఎదురైంది. వెంటనే కోతులు పట్టుకునే అతన్ని పిలిపించి పిల్లకోతిని పట్టించారు. దాని ఒంటి మీది బట్టలు, నగలు తీసుకుని, అతనికి మంచి బహుమతినిచ్చి పంపించారు ఆ దంపతులు. ఈ లోపు తన పిల్ల కనిపించక ఆదుర్దాగా వెతకటం ప్రారంభించింది తల్లికోతి. ఎట్టకేలకు కోతులు పట్టే అతని చేతిలో ఒంటి మీద బట్టలు, నగలు ఏమీ లేకుండా కనిపించింది. అప్పటికే పిల్లకోతి తల్లి పై బెంగ పెట్టుకుంది. తల్లి కోతిని చూసే సరికి ఎక్కడలేని ఆనందం పుట్టుకొచ్చింది. కోతులు పట్టే అతనికి కనిపించకుండా ‘కంగారుపడకు, నిన్ను కాపాడుకుంటాను’ అంటూ పిల్లకోతికి సైగచేసింది తల్లికోతి. కోతులు పట్టే అతను ఆ పిల్లకోతిని తీసుకెళ్ళి సర్కస్ కంపెనీ వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు పిల్లకోతిని నానా హింసలు పెట్టి అది సర్కస్లో నాట్యం చేసేలా, గంతులేసాలా దానికి శిక్షణ ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో పిల్లకోతి నరకయాతన పడింది. తన తల్లి చెబుతున్నా వినకుండా పరాయి వస్తువుల కోసం ఆశపడటంతో ఇన్ని ఇబ్బందులు, బాధలు పడవలసి వచ్చిందని తెలుసుకుంది. (క్లిక్: ప్రతిభకు పట్టం.. అందుకే ఇలా మారువేషంలో..) ఒక రోజు సర్కస్ ముగించుకుని అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తల్లి కోతి.. పిల్లకోతి దగ్గరకు వెళ్ళి దానికి కట్టిన తాడుని అతి కష్టం మీద నోటితో కొరికి తెంపింది. గుట్టుచప్పడు కాకుండా తన పిల్లతో బయట పడింది. తల్లిని పట్టుకుని పిల్లకోతి వెక్కివెక్కి ఏడుస్తూ ‘అమ్మా! ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. పరులసొమ్ము ఇంకెప్పుడూ ఆశించను’ అంటూ తల్లిఒడిలో తలదాచుకుంది. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
జిల్లా కలెక్టర్కే ఝలక్ ఇచ్చిన కోతి.. ఏం చేసిందంటే?
లక్నో: ఒక జిల్లాకు కలెక్టర్ అధిపతి. జిల్లాలో ఆయనను మించిన పవర్ఫుల్ వ్యక్తి మరొకరు ఉండరు. అయితే, అలాంటి వ్యక్తికే ఝలక్ ఇచ్చింది ఓ కోతి. చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు, స్థానికులు ఉన్నప్పటికీ కలెక్టర్ కంటి అద్దాలను ఎత్తుకెళ్లి తానేంటో చూపించింది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్, మథురాలోని బృందావన్ నగరంలో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. జిల్లా మెజిస్ట్రేట్ నవనీత్ చాహల్ గ్లాసెస్ను ఎత్తుకెళ్లిన వానరం దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు భారత అటవీ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద. కలెక్టర్ నవనీత్ చాహల్, పలువురు పోలీసులు ఓ భవనం వద్ద గుమిగూడి కోతి నుంచి గ్లాసెస్ ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ భవనం గోడలపై ఇతర కోతులు సైతం ఉన్నాయి. కొద్ది సేపు బుజ్జగించిన తర్వాత కంటి అద్దాలను తిరిగి ఇచ్చేసింది ఆ వానరం. ‘భారత్లోని ఓ జిల్లాలో డిస్ట్రిక్ట్ మెజిస్టేట్ను మించిన పవర్ఫుల్ వ్యక్తి ఉండడు. బృందావన్లో డీఎం నవనీత్ చాహల్ అద్దాలను కోతీ ఎత్తుకెళ్లింది. కొద్ది సమయం బుజ్జగించిన తర్వాత తిరిగి ఇచ్చేసింది’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు సుశాంత నంద. If you had not seen someone more powerful than District Magistrate of a District in India😊 Monkey snatches glasses from DM Navneet Chahal in Vrindavan, Mathura.After some pleading,the monkeys returned the glasses. pic.twitter.com/YTERfjh62G — Susanta Nanda IFS (@susantananda3) August 21, 2022 ఇదీ చదవండి: మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి! -
ఒడిలో పడుకోబెట్టుకుని తల్లిలా ఓదార్చిన ‘కోతి’.. నెటిజన్లు ఫిదా!
బాధలో ఉన్న వ్యక్తిని ఎవరైనా దగ్గరకు తీసుకుని ఓదార్చితే మనసుకు ఎంతో హాయినిస్తుంది. మనకుంటూ ఒకరు ఉన్నారనే భావన కలుగుతుంది. అలాంటిది ఓ మనిషిని మూగజీవాలు అక్కున చేర్చుకుంటే ఆ దృశ్యం హృదయాన్ని కదిలిస్తుంది. అలాంటి పనే చేసి ఔరా అనిపించింది ఓ వానరం. బాధతో తలపట్టుకున్న ఓ వ్యక్తిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఓదార్చింది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటనకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కోతి వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా.. వైరల్గా మారింది. అందులో.. లాగు, చొక్క ధరించిన ఓ కోతి సోఫాలో కూర్చుని ఉంటుంది. అక్కడికి ఓ వ్యక్తి ఒత్తిడిలో చికాకుపడుతూ తలపట్టుకుని వచ్చి వానరం పక్కన కూర్చున్నాడు. అది గమనించిన ఆ కోతి.. ఆ వ్యక్తిని పిలిచి తన ఒడిలో పడుకోవాలని సైగ చేస్తుంది. అతడు కోతి ఒడిలో తల వాల్చగా జోకొడుతూ చిన్న పిల్లలను నిద్రపుచ్చిన మాదిరిగా చేసింది. ఈ వీడియోను 30 లక్షల మందికిపైగా వీక్షించారు. కొందరు నెటిజన్లు ఆ వానరం తమకు కావాలంటూ కామెట్లు చేశారు. ‘ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితులకు ఆ తెలివైన వానరం నాకు అవసరం’ అని రాసుకొచ్చారు ఓ నెటిజన్. 452- Ağlayan arkadaşını dizine yatırıp teselli eden maymun pic.twitter.com/gezl0NKX8g— 59.748 farklı hayvan (@59748hayvan) July 30, 2022 ఇదీ చదవండి: ఏంది బ్రో అది: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై ఊహించని రీతిలో.. -
Photo Feature: కుక్క.. కోతి సయ్యాట
సాక్షి, ఖమ్మం: గ్రామాలు, పట్టణాల్లో ఇటీవల కోతుల సంచారం పెరిగింది. కోతి కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడి తరుముతుంటాయి. కానీ ముదిగొండ మండల కేంద్రంలో జాతి వైరాన్ని మరిచి ఓ కోతి కుక్కపైన ఇలా పడుకుని సేద తీరింది. ఆ తర్వాత కోతి, కుక్క కలిసి ఆడుకోవడం కనిపించింది. ఈ సన్నివేశాలను అటుగా వెళ్తున్న వారు ఆసక్తిగా చూశారు. చదవండి: Photo Feature: హరివిల్లుతో పులకింత -
వానరబంధం!
వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు క్రైం) ప్రేమ, ఆప్యాయత, అనుబంధం..మనుషుల్లోనే కాదు.. తమలోనూ ఉంటాయని నిరూపించిందో పిల్ల వానరం. తన యజమానికి దెబ్బ తగిలితే ఒక పిల్ల కోతి తల్లడిల్లిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రొద్దుటూరులోని పక్కీరప్ప ఒక పిల్ల వానరాన్ని పెంచుకుంటున్నాడు. అతను బయటికి ఎక్కడికి వెళ్లినా దానిని వెంట తీసుకొని వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం జరిగిన గొడవలో పక్కీరప్పకు స్వల్ప గాయాలయ్యాయి. అతనితో పాటు కోతిని కూడా 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రక్తగాయాలతో ఉన్న పక్కీరప్పను చూసి పిల్ల వానరం తల్లడిల్లి పోయింది. పడుకొని ఉన్న యజమాని పక్కనే కూర్చుంది. అతన్ని లేపడానికి పదే పదే ప్రయతి్నంచింది. వానరం, యజమాని బంధం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. మరో వైపు స్థానికులు పిల్లకోతికి ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. -
నిందగా మారిన గణచిహ్నం
హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 1983 నాటి ‘కిసీ సే న కెహనా (ఎవరితో చెప్పొద్దు)’ ప్రసిద్ధ హాస్యచిత్రం. అందులో ‘హనీమూన్’ హోటల్ బోర్డును ‘హనుమాన్’గా మార్చారని హీరోయిన్తో అంటాడు హీరో. అలా హనుమాన్ను వ్యాపారీకరించడాన్ని దర్శకుడు చూపించారు. ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ఈ సినిమా స్క్రీన్ షాట్ను చూపి, ‘2014 ముందు హనీమూన్, 2014 తర్వాత హనుమాన్’ అని 4 ఏళ్ల క్రితం ట్వీటారు. ఇది మత భావాలను రెచ్చగొట్టే అంశంగా మారింది. భగవాన్ హనుమాన్ను కోతి అని అవమానించారని జుబేర్పై అభియోగం. పురాణాల్లో రాక్షసులు, దేవగణాలు, యక్షులు, రామాయణంలో వానరులు వారి గణచిహ్నాలతో పేర్కొనబడ్డ స్థానిక జాతుల మానవ సమూహాలు. గణచిహ్నాలను రూపాలకు అన్వయించారు. ‘కపి’ పదాన్ని కోతి అని అనువదించారు. సవరులు, శబరులు, ఇతర ఆదివాసీ తెగలవారు రామాయణంలో వానరులుగా పేర్కొనబడ్డారు. వీరు వాలం (తోక) గల నరులు. తోకలాంటి వస్త్రం ధరించే నరులు. వెనుక పొడవుగా వేలాడే గోచీని కట్టుకునేవారు. ఈ గోచీ పురుషులకు మాత్రమే పరిమితం. వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమాదేవి, ఆంజనేయుని తల్లి అంజనీ దేవి వగైరా వానర జాతి స్త్రీలకు తోకలుండవు. వానరులు, వానర రాజ్యాల గురించి రామాయణం చాలా విషయాలు చెప్పింది. వాటిని కల్పిత, ఉద్దేశపూరిత వక్రీకరణలకు గురిచేశారు. వానరులంటే కోతులని ప్రచారం చేశారు. రాముడు కూడా యుద్ధంలో వానరులు మానవరూపాల్లో ఉండరాదన్నాడు. హరిరూపంలో ఉండాలన్నాడు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, పాము, కోతి, కప్ప అని అర్థాలు. ఆటవికుల ద్వేషులు కోతి అన్న అర్థాన్ని స్థిరీకరించారు. వానరజాతికి కోతిచేష్టలు అంటగట్టి వినోదించారు. వానరులను కోతులను చేసి ఆంజనేయుని అవమానించింది ఆర్య జాత్యహంకారులే. మతవాదులు వారి వారసులు. హేతుబద్ధ ఆలోచనలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత సామాజిక శాస్త్రవేత్తలదీ, విజ్ఞులదీ! (క్లిక్: ప్రశ్నించినవారికి నిర్బంధమా?) – సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు -
ఊర్లు వదిలిపోవట్లే.. జనానికి సవాల్గా మారిన కోతులు
బుచ్చెయ్యపేట: అనకాపల్లి జిల్లాలో కోతుల నిర్మూలనకు రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామాల్లో కోతులను నిర్మూలించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ గ్రామాల్లో వేలాది కోతులు ఐదారేళ్లుగా తిష్ఠవేశాయి. అరటి, చెరకు, కొబ్బరి, మామిడి, వరి, తమలపాకు, కూరగాయలు, తదితర పంటలపై దాడి చేసి ఫలసాయాన్ని తింటూ పాడు చేస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో తమ భూములను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా ఒక్కో రైతు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇళ్లలోకి చొరబడి... బుచ్చెయ్యపేట మండలం లోపూడి, బంగారుమెట్ట, ఎల్.బి.పురం, శింగవరం, పి.డి.పాలెం, చిన అప్పనపాలెం, భీమవరం, వడ్డాది, పాయకరావుపేట తదితర పరిసర గ్రామాల్లో కోతులు పంటలను పాడు చేయడమే కాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను పట్టుకుపోతున్నాయి. మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. రోడ్లపై తిష్ఠ వేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీటిని నిర్మూలించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి, కలెక్టర్కు, వ్యవసాయ శాఖ మంత్రికి వందలాది మంది రైతులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కోతులను అటవీ ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రవి పఠాన్శెట్టి ఆదేశాల మేరకు ముందుగా జిల్లాలో బంగారుమెట్ట, సత్యవరం గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అటవీ, వ్యవసాయ శాఖ అధికార్లు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. వీటిని పట్టేవారిని తీసుకొచ్చి బోనుల ద్వారా అటవీ ప్రాంతాల్లోకి తరలించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆరేళ్లుగా కోతుల బెడద.. మా గ్రామంలో రెండు వేల కోతులు సంచరిస్తున్నాయి. ఆరేళ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. పెట్టుబడులు పెట్టిన పంటలపై దాడి చేసి తినేస్తున్నాయి. ఏడాదికి రూ. రెండు లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాం. ఎట్టకేలకు అధికారులు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. – యెనుముల వాసు, రైతు సంఘం నాయకుడు, బంగారుమెట్ట, బుచ్చెయ్యపేట మండలం మిగిలిన గ్రామాల్లో కోతులను నిర్మూలించాలి రైతుల ఇబ్బందులను రైతు సంఘం నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. కోతులు నిర్మూలనకు తొలుత బంగారుమెట్ట, సత్యవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ రెండు గ్రామాలతోపాటు జిల్లాలో మిగిలిన గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అధికార్లు చర్యలు చేపట్టాలి. – చిక్కాల రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ -
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన కోతి: వీడియో వైరల్
మనుషులైతే ఏదైనా గాయమైతే చికిత్స కోసం ఆస్పుత్రులకు వెళ్లడం కామన్. కానీ జంతువులకు గాయలైతే వాటి పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు. జూలో ఉండే వాటికైతే అక్కడ ఉన్న అధికారులే దగ్గరుండి వాటి బాగోగులు చూసుకుంటారు. బయట ఉండే మిగతా జంతువులైతే ఏదైనా గాయమైతే అలానే నిరసించి ఉండిపోతాయి తప్ప చికిత్స అందించేవారు ఉండరు. కానీ ఇక్కడొక కోతి గాయాల బారిన పడితే మిగతా జంతువుల మాదిరిగా అలానే ఉండిపోలేదు. మనుషుల వలే ఆస్పుత్రికి వచ్చి చికిత్సకోసం వైద్యుడికై నిరీక్షించింది. వివరాల్లోకెళ్తే....బిహార్లోని ఒక కోతి తన గాయాలకు చికిత్స చేయించుకోవడం కోసం ససారమ్లోని ఆస్పత్రికి వెళ్లింది. ఆ కోతి చికిత్స కోసం తన బిడ్డతో సహా వచ్చింది. పైగా వైద్యుడి కోసం ఓపికగా నిరిక్షించింది కూడా. ఐతే ఈ విషయం తెలుసుకున్న అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఆస్పత్రిలో తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు ఆ కోతికి వైద్యం అందించిన డాక్టర్ అహ్మద్ మాట్లాడుతూ...మొదట ఆ కోతికి చికిత్స అందించాలంటే చాలా భయపడ్డాను. ఆ తర్వాత ఆ కోతిని కాస్త నిశితంగా గమనించి చూస్తే కోతి ముఖానికి గాయమైందని అర్థమైంది. ఒక ఇంజక్షన్ చేసి అయింట్ మెంట్ రాసిన తర్వాత పేషంట్ల మంచం పైనే విశ్రాంతి తీసుకుంది. కాసేపటి తర్వాత ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా వెళ్లిపోయింది. बिहार के सासाराम में आज एक बंदर अपने घायल बच्चे को लेकर एक डॉक्टर के क्लिनिक में पहुँच गया और इलाज कराने के बाद वहाँ से निकला @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/kI7LIpvQw5 — manish (@manishndtv) June 8, 2022 (చదవండి: గొరిల్లా పట్టు మాములుగా లేదుగా...కొద్దిలో సేఫ్ లేదంటే...) -
సెల్ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి..
-
Viral Video: సెల్ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి..
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శిలో ఓ కోతి సెల్ఫీలు దిగుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొబైల్ ఫోన్ను చేతిలో పట్టుకుని వాకింగ్ చేస్తూ ఉన్న ఓ వ్యక్తి నుండి మొబైల్ ఫోన్ను ఓ వానరం లాక్కెళ్లింది. అంతటితో ఆగకుండా దగ్గరలో ఉన్న గోడపై కూర్చొని సెల్ఫీలో దిగుతూ గంట పాటు మొబైల్ ఫోన్ను ఇవ్వకుండా ఆ వ్యక్తి కి ముచ్చెమటలు పట్టించింది. చదవండి: బెజవాడలో ఫేమస్.. రామకృష్ణ బుల్లెట్ గ్యారేజ్ ఆ కోతి చేష్టలకు వాకింగ్ చేస్తూ ఉన్నవారంతా ఒక్కసారి నోరెళ్ల పెట్టి అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత మొబైల్ను నోటితో పట్టుకొని చెట్లపై అటు ఇటు దూకుతూ తన కోతి చేష్టలను చూపెట్టింది. గంట తర్వాత చిన్నగా ఓ గోడపై వదిలి వెళ్లగా ఆ యువకుడు నానా కష్టాలు పడి గోడలు ఎక్కి మొబైల్ ఫోన్ తీసుకోవడంతో అక్కడి వారంతా కోతి చేష్టలకు ముక్కున వేలేసుకున్నారు. -
Photo Feature: 'పానీ'పట్టు యుద్ధం
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఆదివారం మధ్యాహ్నం కోతుల గుంపు వచ్చింది. బాగా దప్పికతో ఉన్నాయో ఏమో.. ఆ కోతులు నీటికోసం వెదుకులాడాయి. ఓ కోతికి నీళ్లబాటిల్ దొరింది. అయితే ఎలా తాగాలో అర్థంకాక సతమతమైంది. నీళ్లు తాగేక్రమంలో బాటిల్ కిందపడి నీళ్లు నేలపాలయ్యాయి. ఇంతలో ఓ నీళ్ల బక్కెట్ కోతుల కంటపడింది. ఒక్కొక్కటిగా బక్కెట్ వద్దకు చేరి కడుపునిండా నీళ్లు తాగి దప్పిక తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
హత్యకేసులో ఆధారాలు ఎత్తుకెళ్లిన కోతి!
జైపూర్: ఓ హత్య కేసులో కోర్టు ఎదుట హాజరైన పోలీసులు చెప్పిన సమాధానం విని జడ్జి బిత్తర పోయారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలన్నింటిని ఓ కోతి ఎత్తుకెళ్లిపోయిందట. ఈ ఘటన రాజస్థాన్లో ఈ ఘటన జరిగింది. ఓ హత్య కేసులో పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఇతర వస్తువులను ఓ బ్యాగ్లో ఉంచారట. అయితే ఆ సంచిని కోతి ఎత్తుకెళ్లిందని పోలీసులు, కోర్టు ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. 2016, సెప్టెంబర్లో.. జైపూర్ చాంద్వాజీ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శశికాంత్ శర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన తర్వాత న్యాయం కోసం మృతదేహాంతో అతని కుటుంబం ఢిల్లీ-జైపూర్ హైవేని దిగ్భంధించింది కూడా. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఐదురోజుల తర్వాత రాహుల్, మోహన్లాల్ కండేరా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే స్టేషన్లో జాగా లేకపోవడంతో.. ఈ కేసులో సేకరించిన పూర్తి ఆధారాలను ఓ బ్యాగులో ఉంచి.. స్టేషన్ బయట ఓ చెట్టుకింద పెట్టాడట డ్యూటీ కానిస్టేబుల్. ఆ టైంలో కోతి వచ్చి ఆ బ్యాగును ఎత్తుకెళ్లిందట. ఈ కేసులో కోర్టు విచారణ.. ఏళ్ల తరబడి సాగింది. ఈమధ్యే ఈ కేసు విచారణకు రాగా.. ఆ సమయంలో ఎవిడెన్స్ ఏవని? జడ్జి ప్రశ్నించారు. దీంతో.. కోతి ఎత్తుకెళ్లిందని సమాధానం ఇచ్చారు పోలీసులు. ఆ బ్యాగులో మొత్తం 15 వస్తువులు కేసుకు సంబంధించినవి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసులు కోర్టుకు సమర్పించిన రాత పూర్వక స్టేట్మెంట్లో.. ఈ విషయాన్ని కింది న్యాయస్థానానికి తెలియజేశామని, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలియజేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ను ఘటన తర్వాత సస్పెండ్ చేశారట. ఆ తర్వాత ఆయన రిటైర్డ్ కావడంతో పాటు మరణించాడని సదరు స్టేట్మెంట్లో కోర్టుకు వివరించారు పోలీసులు. ఇది కోతి కథతో పోలీసులు ఇచ్చిన వివరణ. -
షాకింగ్ ఘటన: చిన్నారిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది
సరదాగా ఆడుకుంటున్న ఆ చిన్నారి మీద.. ఓ కోతి దాడికి పాల్పడింది. నెమ్మదిగా వెనక నుంచి వచ్చి ఆమె మీదకు దూకి కింద పడేసింది. ఆపై ఆ చిన్నారిని లాక్కుంటూ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. చిన్నారి ఏడ్పులు విన్న ఓ స్థానికుడు అది గమనించి.. దానిని తరిమి ఆ చిన్నారిని రక్షించాడు. ఘటన సమయంలో ఆ చిన్నారి తల్లి లోపల పని చేసుకుంటుందట. సర్వేలెన్స్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూస్తేగానీ ఆ షాకింగ్ ఘటనను స్థానికులు నమ్మలేదు. గాయపడ్డ చిన్నారిని వ్యాక్సిన్ ఇప్పించి చికిత్స అందించారు. చైనా నైరుతి ప్రాంతం చోంగ్క్వింగ్లో ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉండగా.. ఆ కోతి అంతకు ముందు కొందరు గ్రామస్తుల మీద కూడా దాడి చేసిందట. పక్కనే ఉన్న గుట్టల్లోంచి ఆ కోతి గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన కలకలంతో అప్రమత్తమైన అధికారులు.. దానిని పట్టుకుని వైల్డ్ లైఫ్ విభాగానికి అందజేస్తామని చెప్తున్నారు. -
హమ్మయ్య.. దాహం తీరింది!
మండుతున్న ఎండలకు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. గ్రీష్మతాపంతో ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరడం లేదు. కోవెలకుంట్ల పట్టణంలో ఓ వానరం దాహం తీర్చుకునేందుకు పడరాని పాట్లు పడింది. గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ పూలవ్యాపారి దాహం తీర్చుకునేందుకు వాటర్ బాటిల్ తోపుడు బండిపై ఉంచుకున్నాడు. గమనించిన వానరం ఆ బాటిల్ను ఎత్తుకెళ్లింది. బాటిల్కు మూత ఉండటంతో పలుమార్లు ప్రయత్నించి.. చివరకు అతికష్టం మీద మూత తొలగించి బాటిల్లోని నీరు తాగి మెల్లగా జారుకుంది. – కోవెలకుంట్ల -
అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే
కోతి.. ఈ పేరు వినగానే అందరికి అది చేసే అల్లరే గుర్తుకు వస్తుంది. అందుకే పిల్లలు అల్లరి చేస్తే వారిని కోతి చేష్టలు అంటారు. కోతులు వేటిని కుదురుగా ఉంచవు. అన్నింటినీ కిందపడేసి, అటూ ఇటూ పరుగెత్తుతాయి. కుదురుగా ఒక చోట ఉండవు. నానా హంగామా చేస్తాయి. కోతుల చేష్టలు ఎక్కువగా మనుషులను పోలి ఉంటాయి. మనుషులు ఏం చేస్తే అవి వాటిని అనుకరిస్తాయి. తాజాగా ఓ కోతి చేసిన వినూత్న పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చెరువు పక్కన ఉన్నరోడ్డుపై వెళ్తున్న కోతి అచ్చం మనిషిలాగా రెండు కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని నేచర్ లైఫ్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియోలో కోతి ఒక సరస్సు సమీపంలోని రోడ్డుపై ఒక వ్యక్తిలాగా రెండు కాళ్లపై మీద దర్జాగా నడుస్తూ కనిపిస్తుంది. దీనిని చూస్తుంటే ఎంతో స్టైల్గా క్యాట్ వాక్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. అనంతరం బ్రిడ్జిపైకి దూకి దానిపై చకాచకా గెంతుతుంది. చదవండి: అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో ఇప్పటి వరకు మిలియన్కు పైగా వ్యూవ్స్ వచ్చాయి. ఇక కోతి స్టైల్ చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కోతి మోడల్గా మారి ర్యాంప్ వాక్ చేస్తుంది. బాడీ బిల్డింగ్ పోటీలకు రెడీ అవుతుందేమో.. మంచి ట్రైనింగ్ ఇచ్చారు’. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Travel | Nature | adventure (@naturelife_ok) -
ఇది కాకి.. కడవ కాలం కాదు.. ఓ నయా వా‘నరుడి’ స్టోరీ!
బుచ్చినాయుడుకండ్రిగ(చిత్తూరు జిల్లా): ఇది కాకి..కడవ కాలం కాదు. ఒక్కో రాయి కడవలో వేసి నీళ్లు పైకి వచ్చాక దాహం తీర్చుకోవడానికి. ఇదో కారు.. తెలివైన కోతి స్టోరీ. దర్జాగా కారులోకి వెళ్లి వాటర్ బాటిల్తో దాహం తీర్చుకున్న నయా వా‘నరుడి’ గాథ! వేసవి తాపానికి ఇక్కడి చిత్రంలోని వానరం దప్పికతో నీళ్ల కోసం కటకటలాడింది. అటూ ఇటూ పరుగులు తీస్తూ స్థానిక తెలుగుగంగ కార్యాలయం వద్ద నిలిపి ఉన్న కారును వానరం చూసింది. చదవండి: మగతనం లేదని హేళన.. కాస్త శ్రుతిమించడంతో చివరికి ఏం జరిగిందంటే? దానికేదో ఐడియా వచ్చినట్లుంది కాబోలు..గ్లాస్ డోర్ తెరచి ఉండడంతో కారు లోపలికి జంప్ చేసింది. అక్కడో వాటర్ బాటిల్ కనిపించేసరికి చటుక్కున అంది పుచ్చుకుంది. ఇలా దర్జాగా కూర్చుని వాటర్ బాటిల్ మూత తీసి, ఆబగా తాగేసింది. హమ్మయ్య ఈ పూటకు ఓకే అని ఓ క్షణం రిలాక్స్ అయ్యింది. బాటిల్ను అక్కడే పడేసి మళ్లీ చెట్లల్లోకి జంప్ చేసింది. ఔరా! ఏమి తెలివి దీనిది అంటూ అక్కడివారు ఆశ్చర్యంగా చూశారు. మంగళవారం మిట్ట మధ్యాహ్నం ఈ వానరుడు తన చేష్టలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. -
Viral Video: మండుటెండలో కోతి దాహం తీర్చిన పోలీస్.. ‘హ్యాట్సాఫ్ సార్’
ముంబై: ఎవరైనా ఆపదలో ఉంటే మనం చేయగలిగే సాయం చేయాలంటారు పెద్దలు. అప్పుడే మనిషిలోని మంచితనం బయటపడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనిషి నుంచి మానవత్వం మాయమైపోతుంది. బయట వరకు కాదు కదా సొంతవారికి ఆపదొచ్చిందని తెలిసినా పట్టించుకోవడం లేదు. నాకేం సంబంధం అంటూ చేతులు దులుపేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఓ వ్యక్తి వానరంపై చూపిన ప్రేమ ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. ఈ ఏడాది ఎండలు మామూలుగా లేవు. మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండ ధాటికి మనుషులలే జంతువులు కూడా తాళలేకపోతున్నాయి. మంచినీటి కోసం జంతువులు అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎండలను తట్టుకోలేని కోతి మంచినీటి కోసం విలవిల్లాడుతుండగా.. ఓ పోలీస్ స్వయంగా దానికి మంచినీటిని తాగించాడు. చదవండి: చేతిలో పసికందుతో సాహసం.. కానిస్టేబుల్కు ప్రమోషన్ Be kind wherever possible 💕💕 This video of constable Sanjay Ghude is circulating in SM for all the good reasons 🙏🙏 pic.twitter.com/oEWFC2c5Kx — Susanta Nanda IFS (@susantananda3) April 3, 2022 మహారాష్ట్రలో ఓ కానిస్టేబుల్ మండుటెండలో రోడ్డుపై దాహంతో ఉన్న కోతికి బాటిల్ ద్వారా నీటిని తాగించి దాని దాహార్తిని తీర్చాడు. తీవ్ర దాహంతో ఉన్న వానరం ఏకంగా బాటిల్ మంచినీటిని గుటగుటా తాగేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో పోస్టు చేశారు. ఇది తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వానరం దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్ను హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
శభాష్ వారియర్స్
-
వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
పిఠాపురం(తూర్పుగోదావరి): కన్న పిల్లలను సాకడంలో కోతిని మించిన జంతువు ఉండదంటారు. తన కడుపున పుట్టిన పిల్లలను తన కడుపుకే హత్తుకుని వెన్నంటి ఉంటుంది కోతి. కాని ఒక వానరం తన పిల్ల కాక పోయినా ఒక పిల్లి పిల్లను తన కన్న పిల్లలా సాకుతూ ఆశ్చర్యపరుస్తోంది. పిఠాపురం సమీపంలో మాధవపురం వెళ్లే రోడ్డులో ఉన్న ఒక కూరగాయల దుకాణం వద్దకు రోజూ వస్తున్న ఒక కోతి ఒక పిల్లి పిల్లను తన కడుపునకు హత్తుకుని తీసుకువచ్చి తనకు పెట్టిన ఆహారాన్ని దానికి తినిపిస్తోంది. జాతి వైరం లేదని చాటుతున్న దీనిని చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. చదవండి: ఖాకీ వనంలో ‘గోపాలుడు’ -
మ్యాజిక్ ట్రిక్ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి: వైరల్ వీడియో
Monkeys Reaction To Zoo Visitors Magic Trick: మ్యాజిక్ అంటే పెద్దలు పిల్లలు అనే తారతమ్యం లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు కొంతమందికి రకరకాల మ్యాజిక్లు గురించి తెలుసుకోవడమే కాక నేర్చుకుంటుంటారు కూడా. అయితే ఇక్కడోక జూలోని కోతి మ్యాజిక్ని చూసి ఏ చేసిందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... మెక్సికోలోని చాపుల్టెపెక్ జూని సందర్శించడానికి వచ్చిన మాక్సిమిలియానో ఇబర్రా అనే వ్యక్తి ఆ జూలో కోతి ముందు సరదాగా ఒక మ్యాజిక్ ట్రిక్ ప్లే చేయాలని అనుకున్నాడు. అయితే ఆ కోతి మొదటగా ఆ మ్యాజిక్ని అంతగా పట్టించుకోకుండా తన ఆహారాన్ని వెతుకుతున్నట్లుగా అటు ఇటూ చూస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ వ్యక్తి చేస్తున్న మ్యాజిక్ని ఆసక్తిగా తిలకించడం మొదలు పెట్టింది. అంతే ఆ వ్యక్తి ఆ ఆకుని ఎలా మాయం చేస్తున్నాడో అర్థం కాక మనుషులు ఎలా అయితే తెల్లబోయి చూస్తుంటారో అలానే ఆశ్చర్యంగా చూసింది. పైగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఏంటో అన్నట్లుగా విచిత్రమైన హావాభావాలను ఇచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!! ఆపై ఏం జరిగిందో చూడండి..) -
కూరగాయాల దుకాణం నడుపుతున్న కోతి!: వైరల్ వీడియో
In This Video Monkey Sitting At A Vegetable Shop: ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు చూశాం. మనుషులను కాపాడిన వీడియోలు, దాడి చేసిన వీడియోలు చూశాం. జంతువులు మనుషులును అనుకరిస్తాయని అందరికీ తెలుసు. కానీ మనుషలు మాదిరిగా వ్యాపారం చేసే జంతువులు గురించి విన్నారా!. విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్లోని ఒక కూరగాయాల దుకాణంలోకి కోతి చొరబడింది. కూరగాయలమ్ముకునే వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ కోతి అతని స్థానంలోకి వచ్చి కుర్చొంది. దుకాణదారుడి మాదిరిగా కూరగాయాలు అమ్ముతున్నట్లుగా నటిస్తూనే కూరగాయలను తినేసింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైన సరే కోతి కూరగాయాల దుకాణం నడుపుతుందని అనుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. కాగా మా దగ్గర విపరీతమైన కోతుల బెడద ఉందని.. అవి ఇలా దుకాణంలోకి చొరబడి వస్తువులను పాడుచేయడం లేదా ఎత్తుకుపోవడం చేస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by GNTTV (@goodnewstoday) (చదవండి: ఔను! ఆ పబ్లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో) -
ఎలన్ మస్క్ మరో సంచలనం..! ఇక మనుషుల్ని ఆడించనున్నాడా?
ఓ వ్యక్తి కంప్యూటర్ ఎదురుగా కూర్చున్నాడు. లాగిన్ అడిగింది. వెంటనే మనసులో ఓ పాస్వర్డ్ అనుకున్నాడు. అంతే ఆటోమెటిగ్గా టైప్ అయిపోయి ఓపెన్ అయింది. జస్ట్ మీ కళ్లతో స్క్రీన్ మీద అటూ ఇటూ చూస్తుంటే..మౌస్ కర్సర్ కదులుతుంది. ఏది కావాలంటే అది ఓపెన్ చేస్తోంది. ఇకపై ఇలాంటి పనులు టెక్నాలజీతో జరగనున్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్థాపించిన 'న్యూరాలింక్' డెవలప్ చేస్తున్న'బ్రెయిన్ ఇంప్లాంట్' ప్రత్యేకత ఇది. గతేడాది టెక్నాలజీలో భాగంగా న్యూరాలింక్ సంస్థ కోతి మెదడులో చిప్ను అమర్చించింది. దాంతో ఆ కోతి 'పింగ్ పాంగ్' అనే కంప్యూటర్ గేమ్ను ఆడింది. ఇప్పుడు ఈ ఏడాది ఈ టెక్నాలజీలో మరో కీలక అడుగు పడనుంది. కొద్దిరోజుల క్రితం సీఈఓ కౌన్సిల్ సమ్మిట్లో ఎలన్ మస్క్ మాట్లాడుతూ " న్యూరాలింక్ ప్రాజెక్ట్లో భాగంగా కోతుల్లో చిప్ లను అమర్చి అనేక పరిశోధనలు నిర్వహించాం. వాటి పనితీరు చాలా బాగుంది. అందుకే కోతుల నుంచి ఆ చిప్లను సురక్షితంగా తొలగించాం. ఆ పరిశోధనలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. న్యూరాలింక్ చిప్ వెన్నుమక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపయోగపడుతుంది. కుర్చి, లేదంటే మంచానికే పరిమితమైన బాధితులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తుంది' అని ఎలన్ మస్క్ తెలిపారంటూ వాల్స్ట్రీట్ జర్నల్ కథనాల్ని ప్రచురించింది. గతేడాది కోతుల్లో అమర్చిన ఆ చిప్ను మనుషుల్లో అమర్చుతామని ఎలన్ మాటిచ్చారు. కానీ కోవిడ్ కారణంగా సాధ్యపడలేదు. అందుకే ఈ ఏడాదిలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) విభాగం అనుమతిస్తే..వెంటనే మనుషుల బ్రెయిన్లలో ఆ చిప్లను అమర్చుతామని సీఈఓ సమ్మిట్ సందర్భంగా ఎలన్ తెలిపారు. ఎలా పనిచేస్తుంది? 'న్యూరాలింక్' ఇంప్లాంట్ పూర్తిగా వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్కు అనుసంధానం అవుతుంది. తల వెనుక భాగాన చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఈ ఇంప్లాంట్ను అమర్చుతారు. దానికి ఉండే ఎలక్ట్రోడ్లను మెదడు దిగువభాగాన నాడులకు అనుసంధానం చేస్తారు. ఈ ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్ల ద్వారా మెదడు ఇచ్చే సంకేతాలను కాపీ చేసి.. వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్కు పంపుతుంది. కంప్యూటర్ ఆ సంకేతాలను విశ్లేషించి.. మెదడు ఇచ్చిన ఆదేశాలేమిటనేది గుర్తించి, అమలు చేస్తుంది. చదవండి: ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్ మస్క్ అంటే కథ వేరుంటది -
Humorous video: ఈ హెయిర్ స్టైల్తో నా అందం రెట్టింపవ్వాలి.. జాగ్రత్త!
అసలేంటో ఈ యేడాది మొత్తం షాకులమీద షాకులు ఎదురౌతున్నాయి. యేడాది చివరిలో కూడా వీటి ఉధృతి ఏమాత్రం తగ్గేదేలే! అనే విధంగా ఉంది చూడబోతే. లేకపోతే ఏంటండీ.. ఎక్కడైనా కోతి బార్బర్ షాప్కి వెళ్లడం, షేవ్ చేయించుకోవడం, దర్జాగా కూర్చుని హెయిర్ కటింగ్ చేయించుకోవడం కనీవినీ ఎరుగునా? అందుకే ఈ నిష్ఠూరమంతానూ! కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్ స్టైల్స్, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐతే రొటీన్కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్ కొట్టినట్టుంది. స్టైల్ మార్చాలనుకుంది.సెలూన్కు వెళ్లింది. హెయిర్ డ్రెస్సర్స్ చైర్లో కూర్చుని, మెడ చుట్టూ షీట్ చుట్టించుకుంది. తర్వాత బార్బర్ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్ ట్రింబర్తో షేవ్ చేయడం ప్రారంభించాడు. ఇక కోతిగారేమో బుద్ధిగా కూర్చుని చక్కగా షేవ్ చేయించుకోవడం, బార్బర్ చెప్పినట్లు సూచనలు పాటించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెట్టింట కోతి బార్బర్ షాప్ విజిటింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంకేముంది ఈ క్యూట్ వీడియోను చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి, కామెంట్ల రూపంలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.. अब लग रहे SMART☺️☺️☺️👌👌👌 BEAUTY_PARLOUR☺️☺️😊@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @NaveedIRS @arunbothra @TheJohnAbraham pic.twitter.com/lCiy0tmqN0 — Rupin Sharma IPS (@rupin1992) November 29, 2021 -
కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
#MonkeyVsDoge: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో.. నెటిజన్లు ఎలా స్పందిస్తారో తెలియదు! ఎక్కడ ఏ ఘటన చోటుచేసుకున్నా తమదైనశైలిలో కామెంట్లు, మీమ్స్ తయారు చేసి సంఘటనలను ట్రెండింగ్లోకి తీసుకువస్తారు. విషాద ఘటనలైనా సరే గ్రూప్లుగా మరీ కామెంట్లు చేస్తూ ఆ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తారు. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం! కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. కానీ అన్ని జీవులకు పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. శనివారంమహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్న వార్తలు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ట్విటర్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. #MonkeyVsDoge అనే హ్యాష్ ట్యాగ్తో గ్రూప్లుగా మారీ నెటిజన్లు కామెంట్లు, మీమ్స్ తయరు చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన చాలా విషాదకరమైనప్పటికీ దేశవ్యాప్తంగా నెటిజన్లు ‘మంకీ గ్రూప్ వర్సెస్ డాగ్ గ్రూప్’ గా మారీ కామెంట్లు చేయడంతో ట్విటర్ ట్రెండింగ్లో ఉంది. గతంలో కుక్కలు కోతులను వెంటపడిమరీ చంపాయని.. దీంతో పగపట్టిన కోతులు ఫ్యాక్షన్ సినిమా తరహాలో గుంపులుగా చేరి కుక్కలను చంపడం ప్రారంభించాయని స్థానికులు తెలిపారు. Monkeys when they are going to Dog areas #MonkeyVsDoge pic.twitter.com/oIFIkZhuuc — Mr X (@tweets_of_X) December 18, 2021 The Biggest reason behind #MonkeyVsDoge gangwar 😂😂😂😂😂😂😂 pic.twitter.com/98NnuPlftc — 𝗔ɴᴋɪᴛ ❁ (@FanOfMySellf) December 18, 2021 Bhai! Ye Billiyon ki Saajish hai bata raha hoon.#MonkeyVsDoge pic.twitter.com/aYtoVu1caP — Ankush (@_James_Bong) December 18, 2021 #MonkeyVsDoge https://t.co/QduTYnHIzq pic.twitter.com/c78WHkSVEx — सिया 🥀 || (@HayeSiyapa) December 18, 2021 Dogs vs Monkeys #MonkeyVsDoge I support both of them check the next vid in the thread 🙏❤️ pic.twitter.com/vTl2sxKSES — Vishupedia (@vishupedia) December 18, 2021 Joe biden has decided to make a peace agreement between monke and doge Thanq biden 👏 #MonkeyVsDoge pic.twitter.com/oTGzAPnY3c — SM (@lolsaalam) December 18, 2021 -
ఖమ్మం: ఇక వానర గణనకు ప్రత్యేక యాప్..
వైరా: గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతున్న నేపథ్యంలో వాటి లెక్కను అంచనా వేసేందుకు సర్వే చేపడుతున్నారు. ఇళ్ల వద్ద కూరగాయల పాదులు ఆగం చేస్తూ, వస్తువులు చిందరవందరగా పడేస్తూ, చేల వద్ద పంటలకు నష్టం కలిగిస్తుండడంతో తీవ్రతను గుర్తించబోతున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు చేపట్టారు. వ్యవసాయ విస్తరణ అధికారు (ఏఈఓ)లు పల్లెల్లో తిరుగుతూ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. గ్రామాల్లో కోతులెన్ని తిరుగుతున్నాయి? అవి ఏ మేరకు పంటలు ధ్వంసం చేశాయి? అవి ఎక్కడ ఉంటున్నాయి ? చెట్లు, ఇళ్లు, గుట్టలు, పర్యాటక ప్రాంతం? రోడ్డు వెంట?..ఇలా ఎక్కడ నివసిస్తున్నాయనే అంశాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. రైతులతో మాట్లాడిన తర్వాత వివరాలను ఆన్లైన్ క్రాప్ బుకింగ్ మాడ్యూల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వానరాలను భయపెట్టేందుకు ప్రజలు నైలాన్ వలలు, సోలార్ ఫెన్సింగ్, మంకీ గన్, కొండ ముచ్చులు, బొమ్మలు, పులి అరుపు తదితర శబ్ద పరికరాలు వినియోగిస్తున్నారా? అనే వివరాలు కూడా యాప్లో పొందుపర్చాలి. కూరగాయల పంట మిగలట్లే.. జిల్లాలోని 21 మండలాల్లో సూమారు మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, కంది, మొక్కజొన్న, పత్తి, చెరకు, పామాయిల్, పెసరతో పాటు కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, కొణిజర్ల, చింతకాని ఈ మండలాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో గ్రామాల్లోకి కోతులు గుంపులుగా వస్తున్నాయి. వంగ, బీర, కాకర, సొర, టమాటా, తదితర కూరగాయాల పంటలను ఆగం చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు తెంపేస్తూ, సగం తిని సగం పడేస్తూ, మొక్కలను, తీగలను పీకేస్తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేల వద్ద కాపలా లేకుంటే దిగుబడి చేతికందే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. ఇళ్ల వద్ద ఆగమే.. వ్యవసాయ క్షేత్రాలే కాదు..ఇళ్ల వద్దకూ కోతులు గుంపులుగా వస్తున్నాయి. ఆరుబయట ఉన్న వస్తువులను చిందర వందర చేస్తున్నాయి. దుకాణాల్లోని తినుబండారాలను ఎత్తుకెళుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి దూరి బియ్యం, పప్పులు, అన్నం, ఇతర పదార్థాలను బుక్కుతున్నాయి. అడ్డుకోబోతే మీదికొస్తూ దాడిచేస్తున్నాయి. ఇంటి పైకప్పులు, చెట్లపై ఉంటూ కొన్నిచోట్ల పిల్లలు, పెద్దలను పరిగెత్తిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు జంకుతున్నారు. చాలామందిని కరిచిన సందర్భాలు ఉన్నాయి. వారంలోగా పూర్తిచేస్తాం.. గ్రామాల్లో ఎన్ని కోతులు ఉన్నాయనే అంశంపై సర్వే చేయాలని ఆదేశించాం. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తాం. ఏఈఓలు స్వయంగా పల్లెల్లో తిరిగి కోతుల నష్ట తీవ్రతను చూసి, వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. రైతులు సహకరిస్తే పక్కా సమాచారం లభిస్తుందని భావిస్తున్నాం. – బాబూరావు, ఏడీఏ, వైరా చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
కొంపముంచిన కోతి బొమ్మ.. చిటికేసినంత ఈజీగా రెండు కోట్ల రూపాయలు లాస్!
Bored Ape NFT Loss To Trader During Online Sale: కంగారు.. ఏమరపాటులో చేసే పనులు ఒక్కోసారి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇక్కడ కోట్లు కలిసి వస్తాయని ఆశపడ్డ ఆ వ్యక్తికి.. నష్టమే మిగిలింది. పొరపాటున బోటన వేలు తగిలి దాదాపు రెండు కోట్ల రూపాయలు లాస్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బోర్డ్ ఏప్ (దిగాలుగా ఉన్న కోతి).. మీమ్ నుంచి ఎన్ఎఫ్టీ (నాన్ ఫంగిబుల్ టోకెన్) ఫ్రాంచైజీగా ఎదిగి.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భారీ బిజినెస్ చేస్తోంది. సుమారు పది వేల పీసులు ఉన్న ‘బోర్డ్ ఏప్’ ఎఎఫ్టీ యాట్చ్ క్లబ్లో హాలీవుడ్ సెలబ్రిటీలు జిమ్మీ ఫాలోన్, స్టెఫ్ కర్రీలాంటోళ్లు సైతం ఉన్నారు. ఇప్పటివరకు గరిష్టంగా ఇది 85 ఎథెర్(క్రిప్టోకరెన్సీ కాయిన్ ఎథెర్.. 3, 20,000 డాలర్లకు సమానం) అమ్ముడుపోవడం విశేషం. అయితే ఈమధ్యే కాలంలో ఈ ఎన్ఎఫ్టీ 3 లక్షల డాలర్లకు(2,28,15,750రూ.) తక్కువ కాకుండా ట్రేడ్ అవుతోంది. దీంతో తన దగ్గరున్న ఎన్ఎఫ్టీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు ఓ ట్రేడర్. మాక్స్ అనే వ్యక్తి (మ్యాక్స్నాట్ యూజర్నేమ్) 75 ఎథర్లకు (3 లక్షల డాలర్లకు) ఆ ఎన్ఎఫ్టీ పీస్ను ఆన్లైన్లో అమ్మేయాలనుకున్నాడు. అయితే ధర నిర్ధారించేలోపు.. పొరపాటున అతని బోటన వేలు కంప్యూటర్ మౌస్ క్లిక్ అయ్యింది. దీంతో ధర 0.75 ఎథర్(3,000 డాలర్లు)గా కన్ఫర్మ్ అయ్యింది. తప్పును సరిదిద్దుకునే లోపే ఆ ప్రైస్ ఫిక్స్ అయిపోయింది. ఇక అంతే.. మన కరెన్సీ విలువ ప్రకారం.. 2,28,10,800రూ. అమ్ముడుపోవాల్సిన ఈ ఎన్ఎఫ్టీ.. కేవలం రూ. 2, 20, 000లకు అమ్ముడుపోయింది అది. తనకు వాటిల్లిన నష్టంపై ఘోల్లుమంటూ ఆ యూజర్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. చికేసినంత ఈజీగా రెండున్నర లక్షల డాలర్లు.. (మన కరెన్సీలో రెండున్నర కోట్ల రూపాయల దాకా) నష్టపోయానని వాపోయాడు. ఇందులో మరో దరిద్రం ఏంటంటే.. గతంలోనూ ఈ యూజర్కు ఇలానే ఆన్లైన్ సేల్ ద్వారా 20,000 డాలర్ల (15 లక్షల రూపాయల దాకా) నష్టం వాటిల్లడం. What do you gain from thinking about it? You just feel bad by choice. If you can't do anything about it, don't think about it. And you'll live a pretty happy life. — maxnaut.eth (@maxnaut) December 13, 2021 ఎన్ఎఫ్టీ అంటే బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు మనీకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా నడుస్తున్నాయి. ఇదే తరహాలో మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలులు చేయవచ్చు. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! -
‘మనకెందుకులే’ అని వదిలేయలేదు.. కోతికి ఊపిరి పోశాడు
Man Resuscitating Monkey Viral Video: మనం నెట్టింట మనుషులు జంతువులను కాపాడిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాదు కొన్ని జంతువులు తమ తోటి జంతువులను లేదా తమ విరోధి జంతువులను సైతం కాపాడిని వీడియోలను చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒక చిన్న కోతిపిల్లకు మనిషికి చేసినట్లుగా సపర్యలు చేసి మరీ బతికించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే...తమిళనాడుకి చెందిన వ్యక్తి కుక్కల గుంపు దాడిలో స్రృహ తప్పి పడిపోయిన ఎనిమిది నెలల కోతి పిల్లను బతికించడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. ఈ మేరకు ఆ వ్యక్తి ఆ కోతి ఛాతిని గట్టిగా నోక్కడం, నోటితో శ్వాస అందించడం వంటి ప్రయత్నాలతో ప్రాణం పోస్తాడు. చివరికి ఆ కోతి కళ్లు తెరవంగానే ఆ వ్యక్తి ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియోలో పోస్ట్ చేయడం కాక సదరు వ్యక్తిని "ప్రభు" అంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత క్రికెటర్ ఆర్ అశ్విన్ని సైతం ఈ వీడియో కదిలించడంతో ఆయన కూడా ఈ వీడియోకి" నాకు ఆ కోతి బతుకుతుందని ఆశ ఉంది"అనే క్యాప్షన్ని జోడించి మరీ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అదేం కక్కుర్తిరా నీకు!... ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకుంటావా!) There is hope 🙏🙏👏 https://t.co/wt3yNTDlk1 — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 13, 2021 -
మంత్రి.. మర్కట ప్రేమ.. కొత్తబట్టలు తొడిగి.. కేక్ కట్ చేయించి
సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): ఇళ్లల్లో పెంపుడు జంతువులకు పుట్టినరోజు, బారసాల, సీమంతాలు జరపడం నేటి రోజుల్లో ఒక ట్రెండ్గా మారింది. ఆ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించాలని యజమానులు కూడా తపిస్తుంటారు. ఇదే కోవలో ఒక కోతికి పుట్టినరోజు నిర్వహించగా, ఒక సీనియర్ మంత్రి హాజరై దానిని ఆశీర్వదించారు. ఈ తతంగం కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్.టి.రోడ్డులో నివాసం ఉండే పార్వతమ్మ అనే మహిళ ఆరేళ్ల నుంచి ఒక వానరాన్ని పెంచుకుంటోంది. సోమవారం సాయంత్రం కోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప, మరో స్వామీజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోతికి కొత్తబట్టలు తొడిగి, దానితోనే కేక్ కట్ చేయించి, తినిపించి ముచ్చట పడ్డారు. రాజకీయ వ్యూహాలతో సొంత, ప్రతిపక్ష పార్టీల నేతలను ముప్పతిప్పలు పెట్టే మంత్రి ఈశ్వరప్పలో ఇంత జంతు ప్రేమ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అలరిస్తోంది. -
ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!
Thailand Monkey Festival: : కొన్ని దేశాల్లో చాలా వింతైన పండుగలు జరుగుతుంటాయి. పైగా ఆ పండుగలను భారీ ఖర్చుతో అంగరంగ వైభవోపేతంగా జరుపుతారు. చూడటానికి కాస్త విడ్డూరంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. అచ్చం అలాంటి పండుగే ఒకటి థాయ్లాండ్ దేశంలో అట్టహాసంగా జరుగుతోంది. (చదవండి: ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!) అసలు విషయంలోకెళ్లితే.. థాయ్లాండ్లోని ప్రజలు కోతుల పండుగను అత్యంత అట్టహాసంగానూ, ఆహ్లాదభరితంగానూ నిర్వహిస్తారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత సెంట్రల్ థాయ్లాండ్లోని లోప్బురి పట్టణంలో ఈ పండుగ తిరిగి ప్రారంభమైంది. అంతేకాదు ఈపండుగలో వేలాది కోతులు రెండు టన్నుల అరటిపండ్లు, పైనాపిల్ పళ్లను తింటూ, గెంతుతూ అక్కడ ఉన్న పళ్ల కుప్ప పైకి ఎక్కి కూర్చుంటూ ఆనందంగా ఆరగిస్తాయి. అంతేకాదు ఈ పండుగకు సుమారు రూ 3 వేల డాలర్లు అంటే (దాదాపు రూ. 2లక్షలు) వరకు ఖర్చు పెట్టి మరి ఆకోతులకు ఘనంగా విందు నిర్వహిస్తారు. అయితే ఈ పండుగను ఎందుకు చేస్తారంటే పర్యాటక దేశం అయిన థాయ్లాండ్ని ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడంలో తమ వంతుగా సహకరిస్తున్న స్థానిక కోతులకు ధన్యావాదాలు చెప్పే నిమిత్తం ఈ పండుగను నిర్వహిస్తారు. ఇది థాయ్లాండ్ వార్షిక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పండుగను "మంకీ ప్రావిన్స్" అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది పండుగ థీమ్ ఏంటంటే వీల్ చైర్ కోతులు. ఈ థీమ్ ముఖ్యోద్దేశం ఏంటంటే థాయ్లాండ్లోని యోంగ్యుత్ పేద ప్రజలకు సుమారు వంద వీల్ చైర్లను విరాళంగా ఇవ్వడం. అంతేకాదు నవంబర్లో వ్యాక్సినేషన్ తీసుకున్న పర్యాటకుల కోసం నిర్భందరహిత పర్యాటక పథకాన్ని ప్రారంభిన నేపథ్యంలో మళ్లీ గతంలో మాదిరిగా పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. అయితే అక్కడ ఉన్న కొందరు పర్యాటకులు తమ కెమెరాలతో కోతులతో ఆడుకుంటూ కనిపించారు. ఈ మేరకు ఈ సంప్రదాయం మళ్లీ తిరిగి ప్రారంభం కావడం పట్ల అక్కడ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేళ్ళ తర్వాత కోతులు ఈ విధంగా అన్ని రకాల పండ్లు, కూరగాయలను తినడం ఇదే మొదటిసారి అని అక్కడ స్థానికుడు థనిడా ఫుడ్జీబ్ చెప్పారు. (చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్) -
ఫోన్ నాది.. కాదు నాది ఇచ్చేయ్: వైరలవుతోన్న క్యూట్ వీడియో
కోతి చేష్టలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అవి చేసే తింగరి పనులు అదరిని నవ్విస్తుంటాయి. ఇంటి ఆవరణలో, పైన ఏ వస్తువులు కనిపించిన వాటిని చెల్లాచెదురుగా పడవేస్తాయి. ఇక వాటికి ఏమైనా దొరికితే వాటిని పట్టుకొని నానా హంగామా సృష్టిస్తాయి. ఇక కోతులు డబ్బులు, ఫోన్లను పట్టుకొని పారిపోయిన సంఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్గా మారింది. చదవండి: హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్ ఈ వీడియోలో ఒక మంచంపై చిన్నారి మొబైల్తో ఆడుకుంటుంది. అక్కడికి వచ్చిన కోతి పాప పక్కనే కూర్చుంటుంది. వెంటనే చిన్నారి చేతిలోని ఫోన్కు లాక్కొని దాన్ని పరీక్షించి చూస్తుంది. కొద్దిసేపు కోతిని పరీక్షించిన చిన్నారి ఆ ఫోన్ను తిరిగి లాక్కుంటుంది. వెంటనే మళ్లీ పాప దగ్గరి నుంచి కోతి ఫోన్ లాక్కుంటుంది. ఇలా ఈ వీడియో చూస్తుంటే మొబైల్ నాదంటే నాది అని లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా వైరలవుతూ నెజిజన్లను నవ్విస్తోంది. చదవండి: అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్ View this post on Instagram A post shared by Jagadeesh Madineni (@jagadeeshmadinenimadineni) -
కుడి చేతిలో గద, ఎడమ చేతిలో ‘అరటిపండు’..
జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి): భారతదేశంలోనే విశిష్టమైన హనుమ దివ్యక్షేత్రం. శిఖరం లేని ఆలయం. తెల్ల మద్ది చెట్టే శిఖరం. స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామిహనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం. గద భక్తునికి అభయం, అరటిపండు ఫలప్రదం, ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం. స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్దిచెట్టు తొర్ర. భక్తుల పాలిట కొంగుబంగారం మద్ది హనుమ. మద్ది అంజన్న దర్శనం తోనే జన్మ లగ్నాత్ శనిదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు పోతాయి అని భక్తుల విశ్వాసం మరియు నమ్మిక. మంగళవారం, శనివారం ప్రదక్షిణలు విశేష ఫలప్రదం. మూడు యుగాలతో ముడిపడిన స్థలపురాణం. గర్గ సంహిత, శ్రీమద్ రామాయణం, పద్మ పురాణంలో స్థలపురాణ అంశాలు. భక్తుడి దివ్యకధకు రూపం. భక్తవరదుడై అనుగ్రహించిన అంజన్న కోరికలు తీర్చే కొంగుబంగారం. ఇలా ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలు తో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీమద్దిఆంజనేయస్వామి వారి ఆలయం. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువఒడ్డున పచ్చని పొలాల మధ్య అర్జున వృక్షం (తెల్లమద్ది చెట్టు) తొర్రలో కొలువైఉన్న ఆంజనేయస్వామివారి సన్నిధి శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దివ్యాలయం. ఆలయానికి వెళ్లే మార్గం : పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన నగరం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గం లో 48 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి 4 (నాలుగు)కిలోమీటర్ల ముందు ఈ క్షేత్రం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజధాని తాడేపల్లిగూడెం నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఆలయం తెరుచు వేళలు: ప్రతీ రోజూ ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు తిరిగి మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8:30 వరకు, ప్రతీ మంగళవారం మాత్రం వేకువజామున 5:00 గంటల నుండి స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది స్థలపురాణం : ఆలయ స్థలపురాణం ప్రకారం మూడు యుగాలకు అనుబందంగా స్థలపురాణం చెప్పబడింది త్రేతాయుగం: రావణుని సైన్యంలోని మద్వా సురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో రాక్షస ప్రవృత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడు. రామరావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనస్సు చలించి అస్త్రసన్యాసం చేసి హనుమా అంటూ తనువు చాలించారు. ద్వాపరయుగంలో : ద్వాపరంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జనుని రధం పైనున్న ’జండా పై కపిరాజు’ (ఆంజనేయస్వామి వారు)ను దర్శించి తన గతజన్మ గుర్తుకొచ్చి స్వామిని త్వరితగతిన చేరే క్రమంలో అస్త్రసన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు. కలియుగంలో : కలిలో మద్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతీ దినం కాలువలో దిగి స్నానం చరించి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు రోజూ లాగునే ఎర్రకాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడబోయినవుడు, ఎవరో ఆపినట్టు ఆగిపోయారు. ఒక కోతి చేయి అందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది. అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది. తన ఆకలి తీర్చడం కోసం ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు. అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం ప్రతీ రోజూ కోతి వచ్చి ఫలం ఇవ్వడం దానిని మద్వమహర్షి స్వీకరించడం జరిగేది. ఒకరోజు తనకు రోజూ ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ఇన్నాళ్లు మీతో సపర్యలు చేయించుకున్నానా ! అని నేను పాపాత్ముడను, జీవించి ఉండుట అనవసరం అని విలపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మద్వా ఇందులో నీతప్పు ఎంతమాత్రమూ లేదు నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏమి వరం కావాలో కోరుకోమన్నట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. వరప్రదానం :– మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మద్వమహర్షి కోరగా మద్వా నీవు అర్జున వృక్షానివై (తెల్లమద్దిచెట్టు)ఇక్కడ అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తమవుతాను.నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మద్ది ఆంజనేయుడుగా కొలువైవుంటాను అని వరం ఇచ్చి ఇక్కడ వెలిశారు అన్నది స్థలపురాణం. స్వప్నదర్శనం: అనంతర కాలంలో 1966 నవంబర్ 1న ఒక భక్తురాలికి స్వప్నదర్శనం ఇచ్చి తాను ఇక్కడ చెట్టు తొర్రలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తరా ఆలయ నిర్మాణం చేసినా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు స్థానికుల నుండి తెలిసిన స్వప్నవృత్తాంతం. చిన్నగా గర్భాలయం: ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు అనంతరం 40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. తర్వాత విశేష సంఖ్యలో భక్తుల రాకతో ఆలయం పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. మద్ది ఒక దివ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. హనుమద్ దీక్షలు: ప్రతీ సంవత్సరం భక్తులు హనుమద్ దీక్షలు మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమద్ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు.ఈ రీతిగా ముందుగా దీక్షా స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తిచేస్తారు.మద్దిక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రతిష్ఠితమూర్తులను భక్తులు దర్శించవచ్చు. ప్రదక్షిణలు: స్వామి హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక విధి. వివాహం కానివారు,వైవాహిక బంధం లో ఇబ్బందులు ఉన్నవారు,ఆర్ధిక ఇబ్బందులు,వ్యాపారం లో నష్టాలు,ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఈతిబాధలు ఉండి ఏ పని చేసినా కలిసిరాని వారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చకస్వాములు సూచించిన విధంగా కొన్నివారాలు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్యఅనుభవం. శనిదోషాలు,గ్రహదోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడి విశేషం. అంగారక, రాహు దోషాలు తో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగుతాయి అన్నది భక్తుల నమ్మిక. ఆధ్యాత్మిక వైభవం :– సువర్చలా హనుమ కల్యాణం ప్రతీ నెలా పూర్వాభాద్ర నక్షత్రం రోజు, పంచామృతాభిషేకం ప్రతీ శనివారం, 108 బంగారు తామలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, 108 వెండి తమలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, ఇంకా నిత్యపూజలు, విశేష పర్వదినాల్లో ప్రత్యేకపూజలు, అష్టోత్తర సేవ జరుగుతాయి. కార్తీకమాసంలో నెలరోజులూ వైభవమే: కార్తిక శుద్ధ పాడ్యమి నుండి కార్తిక అమావాస్య వరకూ కార్తికం లో ప్రతీ మంగళవారం విశేష ద్రవ్యాలతో పూజలు చూసి తరించవలసిందే వర్ణించ వీలుకాని వైభవం. అలాగే హనుమద్జయంతి 5 రోజులు పాంచహ్నిక దీక్షగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకూ జరుగుతుండగా, పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకూ జరుగుతాయి. ప్రవచనాలు, భజనలు, శోభాయాత్ర, తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి ప్రతీదీ ప్రత్యేకమే. -
కోతి కళ్లుజోడుని ఎలా తిరిగి ఇచ్చిందో చూడండి!
మన ఇళ్లలోని వస్తువులను కోతులు ఏవిధంగా ఎత్తుకుపోతాయో అందరికీ తెలుసు. ఆ వస్తువులను కోతులు తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాయి తప్ప అవి మనకు దొరికే అవకాశం కూడా ఉండదు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడోక కోతి ఒక వ్యక్తి కళ్లజోడుని ఎత్తుకుపోయి మళ్లా తిరిగి ఇచ్చేసింది. అలా ఎలా ఇచ్చేసిందబ్బా అనిపిస్తుందా? అనుమానంగా ఉందా? అయితే తెలుసుకుందాం రండి. (చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?) వివరాల్లోకెళ్లితే.....ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ కళ్లజోడుని ఒక కోతి ఎత్తుకుపోతుంది. పైగా ఆ కళ్లజోడు పట్టుకుని ఒక మెస్పై కుర్చోంటుంది. దీంతో మొదట అతనికి ఏం చేయాలో తోచదు. ఆ తర్వాత ఆయన ఒక జ్యూస్ ప్యాక్ని తీసుకువచ్చి కోతికి ఇస్తాడు. కోతులు సహజసిద్ధంగా ఉండే అనుకరించే బుద్ది కారణంగా ఆ కోతి జ్యూస్ ప్యాక్ని తీసుకుని కళ్లజోడుని మెస్ మీద నుంచి వదిలేస్తుంది. అయితే ఆ కళ్లజోడు మెస్లో ఇరుక్కుపోతుంది. అయినప్పటికీ ఆ తెలివైన కోతీ ఆ మెస్లో ఇరుక్కుపోతున్న కళ్లజోడుని తీసి మరీ శర్మకి తిరిగి ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోకి "ఒక చేత్తో తీసకుంటూ ఇంకో చేత్తో ఇచ్చింది" అనే క్యాప్షన్ జోడించి ట్టిట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు తినేందుకు ఏమి ఇవ్వకపోతే కోతులు మనవస్తువులను అంత తేలిగ్గా తిరగి ఇవ్వవు అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’) Smart 🐒🐒🐒 Ek haath do, Ek haath lo 😂😂😂😂🤣 pic.twitter.com/JHNnYUkDEw — Rupin Sharma IPS (@rupin1992) October 28, 2021 -
కచ్చ కొట్టిన కోతి
-
మందు.. సోడా.. మంచింగ్.. ఆ కోతే వేరబ్బా!
కోతి చేష్టలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సందర్భాల్లో ఆకతాయి పనులు చేసే వారిని ఆ కోతి చేష్టలు ఏమిటా అని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ తుంటరి పని చేసినా కోతితోనే పోలుస్తాం. చివరికి మందేసి.. చిందేసినా పెద్ద కోతి అంటూ విమర్శిస్తాం. మరి కోతే మందేస్తా.. అచ్చం మనషులు మందు తాగినట్లే తాగితే, మందుతో పాటు సోడా కూడా తాగాలని ఆ కోతి అనుకుంటే, అందులో మంచింగ్ ఉండాలని భావిస్తే ఏమనుకోవాలి. కాస్త విడ్డూరంగా అనిపించినా ఒక కోతి సోడా తాగి గ్లాస్లో ఉన్న మందు తాగి, ఆపై మంచింగ్ కూడా తీసుకుంటే ఏమనుకుంటాం.. ‘మందు.. సోడా.. మంచింగ్...ఆ కోతే వేరబ్బా’ అని అనుకోక తప్పదు. ఇలా ఒక కోతి మందేసిన ఘటన చిలకలూరిపేట మేఘన బార్ సమీపంలో చోటు చేసింది. అక్కడ షెడ్డుపై తాగేసి వదిలేసిన సోడాతో పాటు మందును తాగి తన దాహార్తిని కాస్త తగ్గించుకుంది. -
మందు.. సోడా.. మంచింగ్.. ఆ కోతే వేరబ్బా!
-
ఆసక్తికర దృశ్యాలు: వానరమా.. ఇంత వయ్యారమా..
సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం: వానరం వయ్యారాలు పోయింది. చేతికి దొరికిన చీర కప్పుకుని కోతి ఇలా సిగ్గులొలికింది. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలి వద్ద కనిపించిన ఈ దృశ్యాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. చదవండి: Horsley Hills: హార్సిలీహిల్స్ అసలు పేరేంటో తెలుసా....! -
చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ
ఎంత కష్టమొచ్చినా బిడ్డను కడుపులో దాచుకునే అమ్మల కథలు విన్నాం.. ఇది అలాంటి అమ్మ కథ కాదు.. కష్టంలో ఉన్న అమ్మను కడవరకు వీడని ఓ బిడ్డ వ్యథ.. తల్లి ప్రాణాలను చిరుత పట్టుకుపోతుంటే... వదలలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఆ అమ్మనే గట్టిగా పెనవేసుకున్న ఈ చిన్నారి వానర చిత్రం ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టేదే.. జాంబియాలోని నేషనల్ పార్క్లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్ ముల్లా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్మనిపించారు. చివర్లో ఈ పిల్లను కూడా చిరుత చంపేసిందని ఆయన తెలిపారు. చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా.. -
ఫన్నీ వీడియో: వీడెవడ్రా బాబు.. అచ్చం నాలాగే ఉన్నాడు!
రోజుకొకసారి అయిన అద్దం ముందు నిల్చొని తమ అందాన్ని తనివితీరా చూసుకుంటూ మురిసిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఒకసారి ముఖం పాడవుతుందని, మరోసారి తమ కంటే ఇంకెవరూ అందంగా లేరనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఇలా మీరూ ఖచ్చితంగా ప్రయత్నించే ఉంటారు కదూ.. ఇప్పుడిదంతా ఎందుకంటే... ఓ కోతి బైక్ అద్దంలో తనను తాను పరీక్షించుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. చదవండి: రైల్వే స్టేషన్లో యువతి హుషారైన స్టెప్పులు.. అందరూ చూస్తుండగానే! బైక్ మీద కూర్చొని ఒక చేతితో బైక్ హ్యండిల్ పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటుంది. అద్దం వైపు చూసి అందులో తన ప్రతిబింబం కనిపించడంతో షాక్ అవుతోంది. ఒక్కసారిగా మరో కోతి తన ఎదురుగా ఉందని భావించి కంగారు పడుతుంది. అనుమానంతో మరోసారి అద్థంలో చూసుకోగా మళ్లీ అలాగే కనిపించడంతో కోపంతో అద్దం మీద కొడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sachin Sharma (@helicopter_yatra_) చదవండి: ఫ్రెండ్స్తో కలిసి స్టెప్పులేసిన వధువు.. వావ్ వాట్ ఏ డ్యాన్స్ అంటున్న నెటిజన్స్! -
ఇంత పారవశ్యమా, ఇలాంటి వీడియో మీరెపుడూ చూసి ఉండరు
దసరా పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్గా మారింది. ఒక కోతి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏకంగా ఒక సాధువు ఒడిలో కూర్చున్న వానరం లయబద్ధంగా కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారినందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్వయంగా ఆ రాముడి కోసం దిగి వచ్చిన హనుమాన్ అంటూ ముగ్ధులవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక కోతి భజన చేస్తున్న సాధువుల చెంతకు చేరింది. వారితో పాటు భక్తి కీర్తనల్లో మునిగియంది. తాళానికి కనుగుణంగా భజనలో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆనందంలో మునిగిపోయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయితున్నారు. ఇది హనుమంతుడి రూపమే అంటూ మురిసి పోతున్నారు. ఇంత పారవశ్యామా ఇలాంటి కోతిని తాను ఎన్నడూ చూడలేదు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా ఆనందంగా ఉందంటూ మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. పంకజ్ పరాశర్ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మందికి వీక్షించగా, 30 వేల మంది షేర్ చేశారు. -
కోతి చేసిన పని.. ఓ వ్యక్తి ప్రాణం పోయింది
ఢిల్లీ: కోతుల బెడతతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కున్న ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే తాజాగా కోతి చేసిన పని వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలోని నబికరీం ప్రాంతంలో నివాసం ఉంటున్న మహ్మద్ కుర్బాన్ అనే వ్యక్తి తలపై ఓ ఇంటి నుంచి ఇటుక రాయి పడింది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారకులెవరో తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి నిర్లక్ష్యం ద్వారా ప్రమాదం జరిగినట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు విచారణలో.. ఓం ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తి ఇంటిపై నుంచి ఇటుక పడిందని తేలింది. దీంతో అతన్ని విచారించగా.. ఆ ఇటుకలను తాను ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్పై పెట్టినట్లు అంగీకరించాడు. అక్కడ కోతులు నిత్యం ట్యాంక్ మూత తీస్తుంటాయని మూత రాకుండా ఉండేందుకే ఆ ఇటుకలు పెట్టానని అన్నాడు. ఈ క్రమంలోనే ఇంటిపైకి వచ్చిన కోతి ఆ ఇటుకను కిందకు విసరగా, మహ్మద్ కుర్బాన్ పై పడిందని తెలిపాడు. అలసత్వంతోనే కోతులు ఇటుకలను కింద పడేశాయని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కూతురితో ప్రేమ వ్యవహారం.. యువకుడిని కిడ్నాప్ చేసి.. -
Viral: దాహమేసిన కోతికి కొబ్బరి బోండాం దొరికితే!
కోతులు జనావాసాలకు వస్తే.. ఇళ్లలో ఉండే ఆహారపదార్థాలను ఎత్తుకెళ్లి మరీ తింటాయి. నగరంలో అయితే పండ్లు, కూరగాలయలు, కొబ్బరి బోండాం షాప్లపై పడుతుంటాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే.. ఆ ఆనందం వేరు! అయితే కొబ్బరి చిప్పకు బదులు కొబ్బరి బోండాలు దొరికాయి. అసలే దాహం, ఆకలిలో మర్కటం ఓ కొబ్బరి బోండాన్ని తానే స్వయం ఒలుచుకుంది. మనుషుల వలే కొబ్బరి పీచును నెమ్మదిగా తీసింది. పచ్చి కొబ్బరి బోండాం కావటంతో ఆకలికి ఆగలేని కోతి.. పీచును కూడా తిన్నది. అయితే ఆ కొబ్బరి బోండాలు తాగి పక్కకు పడేసిన వియషం దాని తెలిక కొబ్బరి కోసం కుస్తీ పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో ఓ మార్ట్ వద్ద చోటుచేసుకుంది. దాహం వేసిన మర్కటం కొబ్బరి బోండాంను తానే స్వయంగా ఒలచుకుంది. చివరి నిముషంలో కొబ్బరిబోండాం వ్యాపారి ఆ మర్కటాన్ని తరిమివేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
లక్ష రూపాయల్ని టవల్లో చుట్టుకుంటే.. కోతి ఎత్తుకెళ్లిపాయె!
భోపాల్: ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తే వాళ్లని కోతిలా ప్రవర్తించకు అంటారు. అలా ఎందుకు అంటారో తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. ఓ వ్యక్తి ఆటోలో మూటగట్టిన లక్ష డబ్బులను ఒక కోతి లాక్కొనిపోయింది. అంతటితో ఊరుకుందా అది.. దగ్గర్లోని చెట్టు పైకి ఎక్కి ఆ టవల్ను విదిలించి ఆ డబ్బులన్నీ రోడ్డుపై పడేసింది. కటవ్ ఘాట్ ప్రాంతంలో.. ఆటోలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అంతలో వారి మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఆటోలోని ఒక వ్యక్తి తన వద్ద ఉన్న లక్ష నగదును టవల్లో చుట్టి ఉంచాడు. కాసేపు గడిచినా ట్రాఫిక్ క్లియర్ కాకపోయేసరికి ఆ ముగ్గురు ఆటోలోంచి బయటకు వచ్చారు. సరిగ్గా ఆ కోతి ఒక వ్యక్తి చేతిలో ఉన్న టవల్ని తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం పోయి ఓ చెట్టుపైకి ఎక్కింది. పాపం అందులో ఆహారం ఉందనుకుని టవల్ను విదిలించింది. దీంతో మూటలో ఉన్న డబ్బులు రోడ్డు పై వర్షంలా పడ్డాయి. ఇంకేముంది కొందరు దొరికిన నోట్లను తమ జేబులో వేసుకోగా.. చివరకు రూ.56 వేలు మాత్రమే డబ్బు యజమానికి దక్కింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా.. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మిగతా డబ్బులు ఎవరు తీసుకున్నారని తెలియలేదని తెలిపారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. చదవండి: Viral Video: ఏటీఎం సెంటర్లో యువతి.. సడన్గా ఏమైందో అలా ప్రవర్తించింది! -
ఎయిర్పోర్ట్లో అనుకోని అతిథి.. ఎంచక్కా జ్యూస్ తాగి, పుడ్ తిని సైలెంట్గా..
న్యూఢిల్లీ: కోతులు జన సంచారంలో రావడం, కాసేపు షికారు కొట్టి వెళ్లడం సాధారణంగానే జరుగుతుంటాయి. అయితే పటిష్ట భద్రత ఉండే ప్రదేశాలకు మనుషులు వెళ్లాలంటేనే అనుమతులు ఉండాలంటూ నిరాకరిస్తుంటారు. అలాంటిది ఓ కోతి మాత్రం ఎంచకా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్లో అతిథిలా వచ్చి ఏం కావాలో తినేసి సైలెంట్గా వెళ్లింది. ప్రస్తుతం ఆ వానరం చేసిన హంగామా సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. ఓ కోతి ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో.. నేరుగా విమానాశ్రయంలోని వీఐపీ లాంగ్లోకి వచ్చేసింది. అలా వచ్చిన వానరం ప్రయాణికులను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉన్న పుడ్ తినేసి, ప్రూట్ జ్యూస్ తాగేసి ఎంచక్కా వెళ్లిపోయింది. అలా కోతి ఎంజాయ్ చేయడాన్ని కొందరు ప్రయాణీకులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. విమానాశ్రయంలోకి వీఐపీ గెస్ట్ వచ్చాడు రోయ్ అంటూ కొందరు కామెంట్ చేయగా, హలో బాస్ క్రెడిట్ కార్డు స్వైప్ చేయకుండా వెళ్తున్నారు అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. కాగా ఐజీఐ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు గానీ ఏ రోజు జరిగిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. చదవండి: Viral:ఓ పక్క ఫోన్.. మరో పక్క కొండ చిలువ.. భళా బాలిక అంటున్న నెటిజన్స్ -
ఈ ‘ఫ్రెండ్షిప్’కి నెటిజనులు ఫిదా.. ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్
ఒక కుటుంబానికి చెందిన వారు.. ఒకే తల్లికి జన్మించిన వారి మధ్య ప్రేమాభిమానాలు ఉండటం సహజం. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా.. జీవితాంతం మన వెంట నిలిచేదే మైత్రి బంధం. స్నేహితుడు.. పేరులోనే ఉంది మన హితం కోరేవారని. జీవితంలో బంధువులు, తోబుట్టువులు మనల్ని విడిచిపెట్టి పోవచ్చు. కానీ ఫ్రెండ్ మాత్రం మనల్ని ఎన్నటికి విడిచిపెట్టడు. అయితే ఈ స్నేహ గుణం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. నోరులేని మూగజీవుల మధ్య కూడా మైత్రి బంధం ఉంటుంది. అది కూడా వేర్వేరు జాతుల జీవిల మధ్య. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో బెర్రి పళ్లు పట్టుకుని.. అడవిలాంటి ప్రదేశంలో నిల్చుని తన పెంపుడు మేక పిల్లను పిలుస్తాడు. యజమాని పిలుపు విన్న వెంటనే మేక అల్లంత దూరం నుంచి పరిగెత్తుకువస్తుంది. దగ్గరకు వచ్చాకే కనిపిస్తుంది అసలు చిత్రం. ఆ మేకపిల్ల ఒంటరిగా రాదు.. దానితో పాటు తన ఫ్రెండ్ అయిన చిన్న కోతి పిల్లను కూడా తీసుకువస్తుంది. ఆ బుజ్జి కోతి పిల్ల.. ఎంచక్కా మేకపిల్ల మెడను కర్చుకుని పట్టుకుంటుంది. (చదవండి: తిమింగలంతో దోస్తి) యజమాని దగ్గరకు వచ్చాక మేకపిల్లతో పాటు కోతి పిల్ల కూడా బెర్రి పళ్లను నోట కర్చుకుని మేక వీపు మీద కూర్చుని తింటుంది. ఈ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. వీటి ఫ్రెండ్షిప్కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ఈ మూగ జీవుల మైత్రి బంధానికి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 13 మిలియన్ల మందికి పైగా చూశారు. నా జీవితంలో ఇంత అద్భుత దృశ్యాన్ని ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. Am I high right now what is happening pic.twitter.com/itBaV1XUNK — Kristi Yamaguccimane (@wapplehouse) September 26, 2021 చదవండి: Friendship Day 2021: ముఖేశ్ మనసులో ఆనంద్ది చెరిగిపోని స్థానం -
ఆటో డ్రైవర్పై పగబట్టిన కోతి.. 22 కి.మీ ప్రయాణించి మరీ!
బెంగళూరు: అల్లరికి, పిచ్చి చేష్టలకు మారుపేరైన కోతి ఓ వ్యక్తి పాలిట విలన్గా మారింది. అతనిపై పగ పెంచుకున్న కోతి ప్రతీకారం తీర్చుకునేందుకు 22 కిలోమీటర్లు ప్రయాణించింది. కోతి దాడి భయంతో ఆ వ్యక్తి 8 రోజులుగా ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేదు. అయితే కనిపించిన వస్తువులను లాక్కోవడం, కొంటె పనులు చేయడం కోతుల లక్షణమే కానీ బోనెట్ మకాక్ జాతికి చెందిన ఈ కోతి కాస్తా వింతగా ప్రవర్తించింది. చదవండి: వైరల్: చీర కట్టులో చూడముచ్చటైన కేరళ యువతుల డ్యాన్స్ .. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగెహారా గ్రామంలో ఒక చిన్న కోతి ఒక స్కూల్ దగ్గర స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేది. రోజురోజుకీ దాని అల్లరి ఎక్కువై మనుషులపై దాడి చేస్తుండంతో పాఠశాల అధికారులు అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. హైపర్యాక్టివ్ కోతిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు కొంతమందిని పిలిపించారు. వారిలో జగదీష్ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు.ఇతను కోతిని పట్టుకోవడానికి అధికారులకు సాయం చేస్తుండగా కోతి అతని మీదకు ఎక్కి దాడి చేసింది. భయపడిపోయిన అతను తన ఆటోలో దాక్కున్నాడు. చదవండి: ‘వాలీ’ దొరికిందోచ్!.. 22 రోజుల్లో 900 కిలోమీటర్లు ఈదేసింది అది గమనించిన కోతి.. ఆటో టాప్, సీట్లను చించి.. జగదీశ్పై మళ్లీ దాడి చేసింది. చివరికి 3 గంటల తరువాత 30 మంది కష్టపడి కొతిని పట్టుకున్నారు. దీంతో కోతిని అటవీ శాఖ అధికారులు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలూర్ అడవిలో వదిలేశారు. అయితే కొన్ని రోజులకు బాలూర్ అడవి నుంచి తప్పించుకున్న కోతి లారీ మీద ఎక్కి 22 కిలోమీటర్లు ప్రయాణించి మళ్లీ గ్రామానికి చేరుకుంది. తనను పట్టించిన జగదీశ్పై కోపం పెంచుకున్న ఆ వానరం అతని వెంట పడింది. దీంతో భయపడిపోయిన అతను 8 రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. చివరికి విషయం తెలుసుకున్న అధికారులు కోతిని బంధించి తీసుకెళ్లారు. -
కోతుల గుంపు దాడి.. భయాందోళనతో బీజేపీ నాయకుడి భార్య మృతి
లక్నో: వానరాల దాడిలో బీజేపీ నాయకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొహల్ల అల్కాలలోని బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ చౌహాన్, సుష్మాదేవి (50) భార్యాభర్తలు. భార్య సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలు. ఆమె మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి మూడో అంతస్తులో నిలుచుని ఉంది. ఈ సమయంలో కోతుల మంద దాడి చేసింది. చదవండి: కర్ణాటక కీలక నిర్ణయం.. కేరళకు రాకపోకలు వద్దు ఈ హఠాత్పరిణామానికి భయాందోళన చెందిన ఆమె కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భవనం నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. మూడో అంతస్తు నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించేది. చదవండి: బట్టతల శాపం కాదు అదృష్టం! ఈ ఉత్సవం మీకోసమే.. -
Viral: బుల్లెట్టు బండి పాటొస్తేనే.. పాలు తాగుతోంది!
మహబూబాబాద్ రూరల్: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సంతరించుకున్న ‘బుల్లెట్టు బండెక్కి’ పాటకు అందరూ ఆకర్షితులవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడది జంతువులకూ పాకింది. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో ఓ కొండెంగ(కోతి) మొబైల్ ఫోన్లో బుల్లెట్టు బండి పాట పెడితేనే పాలు తాగుతోంది. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మొబైల్ ఫోన్లో పాటను చూస్తూ ఆ కొండెంగ పాలు తాగడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
‘కొంత మంది మనుషుల కన్నా.. ఈ కోతి చాలా నయం’
దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికి వైరస్ తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. అందుకే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికీ మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే, చాలా చోట్ల జనాలు కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్న సంఘటనలు ప్రతిరోజు వార్తల్లో చూస్తునే ఉన్నాం. అయితే, ఇక్కడో కోతి మాత్రం తాను మూతికి మాస్క్ ధరిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. కాగా, ఇక్కడ కోతి చేష్టలు ఫన్నీగా ఉన్నా.. అది ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. దీనిలో రోడ్డుపక్కన కోతుల గుంపు ఉంది. దానిలో ఒక కోతి రోడ్డుపై పడి ఉన్న నలుపు రంగు మాస్క్ను తీసుకుంది. దాన్ని చేతిలో తీసుకుని అటూ ఇటూ తిప్పి చూసింది. ఆ తర్వాత దాన్ని తన మొహనికి పెట్టుకుంది. అంతటితో ఆగకుండా అటు ఇటూ కాసేపు తిరిగింది. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేవు. కాగా, దీన్ని ఫ్రెడ్ షుల్ట్జ్ అనే ట్విటర్ యూజర్ తన అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘కొంత మంది మనుషుల కన్నా.. కోతులే నయం..’,‘కోతి భలే మాస్క్ వేసుకుంది..’,‘ఇప్పటికైన కరోనా నియమాలు పాటించండి’అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
వానర విన్యాసం.. చూసిన వారు ఔరా అనాల్సిందే!
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో సోమవారం ఉదయం ఓ వానర విన్యాసం చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు. స్థానిక శంకరప్పతోట వీధిలో ఓ ఇంటి ఎదుట పడి ఉన్న మాస్క్ తీసుకుని అటూఇటూ తిప్పి పరిశీలించిన వానరం.. అనంతరం దానిని మూతికి, ముక్కుకు వేసుకునే క్రమంలో తన ముఖం మొత్తం కప్పేసుకుని చకచకా ఇంటిపైకి చేరుకుంది. ఇదంతా గమనించిన చుట్టుపక్కల వారు... కరోనా బారిన పడకుండా ఇకపై తాము కూడా మాస్క్ ధరించాలంటూ చర్చకు తెర తీశారు. -
కోతి చేష్టతో లబోదిబో: రూ.3 లక్షలు ఎత్తుకెళ్లిన వానరం
లక్నో: కోతి చేష్టలు అని ఊరికే అనరు. తాజాగా ఆ చేష్టలతో ఓ వ్యక్తి రూ.3 లక్షలు నష్టపోయాడు. నగదుతో కూడిన బ్యాగ్ను వానరం ఎత్తుకెళ్లడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లా సాండీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఆశిష్సింగ్ అనే యువకుడు భూమి అమ్మగా వచ్చిన రూ.3 లక్షల డబ్బును ఓ బ్యాగ్లో పెట్టి బైక్ కవర్లో ఉంచాడు. అనంతరం లేక్పాల్ను కలిసేందుకు వచ్చాడు. సాండీ పోలీస్స్టేషన్ వద్ద బైక్ను నిలిపి లేక్పాల్ను కలిసేందుకు వెళ్లాడు. మాట్లాడి వచ్చి చూడగా బైక్ కవర్లో ఉన్న నగదుతో ఉన్న బ్యాగ్ కనిపించలేదు. కోతులు ఆ బ్యాగ్ను చిందరవందర చేశాయని గుర్తించాడు. కోతుల వెంట ఆశిష్ పరుగెత్తాడు. నగదు కోసం గాలించగా ఎక్కడా కనిపించలేదు. లబోదిబో అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు పిలుపునిచ్చాడు. చిందరవందరగా ఉన్న నగదును తీసుకొచ్చి ఆశిష్కు అందించాడు. తినే వస్తువులు కావడంతో కోతులు ఒకచోట పడేయగా వాటిని సెక్యూరిటీ గార్డు గమనించాడు. కిందపడిన నగదును నిజాయతీతో బాధితుడికి అందించాడు. పోయిన డబ్బులు తిరిగి రావడంతో ఆశిష్ ఆనంధానికి అవధులు లేవు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పి కొంత నగదు కానుక అందించాడు. -
కోతిని మింగేసిన కొండచిలువ..తరువాత ఏమైందంటే!
వడోదర: భారీ కొండచిలువ ఏకంగా ఓ కోతిని మింగేసింది. తరువాత కదల్లేక నదిలో ఉండిపోవడాన్ని అటవీ సిబ్బంది గమనించారు. పదడుగుల పొడవైన ఈ కొండచిలువను గుజరాత్ అటవీశాఖ అధికారులు మంగళవారం రక్షించారు. వడోదరలోని చిన్న నదిలో దీన్ని గుర్తించారు. ముగ్గురు రక్షకులు నది నుండి దీనిని బయటకు తీసారని, అనంతరం మింగేసిన కోతిని వాంతి చేసుకుందని గుజరాత్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పైథాన్ ఆరోగ్యం బాగానే ఉందని అటవీ అధికారి శైలేష్ రావల్ తెలిపారు. ఈ కొండచిలువను బోనులో సురక్షితంగా ఉంచినట్టు వెల్లడించారు. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామన్నారు. Gujarat Forest Department officials rescued a 10-foot long python from a small river in Vadodara. "It had swallowed a monkey and later unswallowed it. Python is in a good situation. We will release it in jungle once permission is obtained," said Shailesh Rawal, rescuer (09.08) pic.twitter.com/6DUUP00Ux9 — ANI (@ANI) August 10, 2021 -
వైరల్: మీరేనా.. మేమూ షికారు చేస్తాం!
మీరే కాదు మేము కూడా షికారు చేయగలమంటున్నాయి వానరాలు! నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం రెండు కోతులు వాహనాలెక్కి ఫోజులు కొట్టాయి. ఓ వానరం బైక్ అద్దంలో చూసుకుని హొయలు పోగా, మరో కోతి ఆటో టాప్పైన ఠీవీగా కూర్చుంది. ఈ రెండు చిత్రాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – నాగిరెడ్డిపేట -
50 కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి.. ఆపై
బెంగళూరు: రోజురోజుకూ మానవత్వం మంట కలసిపోతోంది. కొందరు మానవత్వాన్ని మరిచి మూగ జీవుల ప్రాణాలను తీస్తూ పాపం మూటగట్టుకుంటున్నారు. తాజాగా కోతులకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా బెలూర్ సమీపం చౌడనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు..గురువారం ఉదయం స్ధానిక యువకులు రోడ్డు పక్కన గోనెసంచుల మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా అందులో కోతులు కనిపించాయి. అయితే అప్పటికే కొన్ని మృత్యవాత పడగా, మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి. సంచులలో ఉన్న వానరాల్లో 30 కోతులు చనిపోగా.. మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి. స్థానికులు గాయపడిన కోతులను బయటకు తీసి నీళ్లు తాగించడంతో 20 కోతుల్లో 18 కోలుకొని ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయాయి. ఘటనపై సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోతులను వేరే చోటుకు రవాణా చేసే క్రమంలో వారి ప్రణాళికలు విఫలమైనందున ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరణించిన కోతులకు పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టులో విషం ఆనవాళ్లు ఉన్నట్లు తేలినట్లు ఆధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు రణ్దీప్ హుడా ట్విటర్లో షేర్ చేస్తూ విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. In an absolutely heinous act, more than 60 monkeys were poisoned, tied in bags and thrown on Sakleshpur Begur Crossroad in Hassan District, Karnataka. @moefcc @byadavbjp @aranya_kfd @CMofKarnataka pic.twitter.com/VqHv0Oew8v — Randeep Hooda (@RandeepHooda) July 29, 2021 -
బుల్లి కోతి కష్టాలు...!
-
వైరల్: నో బీర్, ఓన్లీ విస్కీ.. వైన్ షాప్లో మందేసిన కోతి
Monkey Alcohol Drinking Video: కోతులు చేసే చేష్టలు మామూలుగా ఉండవు. ఒక్కసారి గుంపులుగా జనావాసంలోకి చొరబడ్డాయంటే అవి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇంట్లోకి వచ్చాయంటే వస్తువులన్నీ చిందరవందర అవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు ఓ కోతి ఏకంగా ఓ వైన్ షాప్లోకే దూరింది. అక్కడున్న బీర్, వైన్ బాటిళ్లను పక్కకు పెట్టి విస్కీ బాటిల్ను టార్గెట్ చేసింది. ఇంకేముంది హీరోలా విస్కీ బాటిల్ను చేతులోకి తీసుకొని దర్జాగా తాగేసింది. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో చోటుచేసుకుంది. బహమని బంజార్ గ్రామంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి కొన్ని రోజుల నుంచి ఓ కోతి తరుచుగా వస్తోంది. ఖాళీగా పడి ఉన్న మద్యం సీసాల్లో మిగిలిపోయిన మద్యం చుక్కలను తాగేది.అయితే, ఓ రోజు ఆ కోతి ఏకంగా వైన్ షాపులోకే ఎంటర్ అయ్యింది. మద్యం దుకాణంలోకి ప్రవేశించిన కోతి కాటన్ తెరిచి అందులోంచి వైన్ బాటిల్ను లాక్కుంది. తరువాత ఓ టెబుల్పై దర్జాగా కూర్చొని విస్కీ బాటిల్ మూతను నెమ్మదిగా తీసేందుకు ప్రయత్నిస్తుంది. చివరికి మూత ఒపెన్ అవ్వడంతో ప్రొఫెషనల్ మందుబాబులా గటాగటా తాగేసింది. అయితే కోతి షాప్లోకి చొరబడినప్పటికీ యాజమాని ఎలాంటి కంగారు పడలేదు. అతని పని తను చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో షాప్ యాజమాని కోతికి బిస్కెట్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నించగా వద్దని తిరస్కరించి బాటిల్ మొత్తం ఖాళీ చేసి కూర్చుంది. కాగా, కోతి మద్యం సేవించడాన్ని వైన్ షాప్కు వచ్చిన పలువురు వీడియో తీశారు. ఆ వీడియోనుఓ వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కోతి విస్కీ తాగడంపై ఆశ్యర్యానికి గురవుతున్నారు. pic.twitter.com/RCUGLzzkcO — sudhanshu maheshwari (@smaheshwari523) July 14, 2021 -
వైరల్: పనికి కుదిరిన కోతి.. పాత్రలు తలతల?
కొన్నిసార్లు కోతుల చేష్టలు మనుషులను మించి ఉంటాయి. కోతులు గుంపులుగా ఉండి అల్లరి చేస్తే.. అంతకు మించిన హంగామా మరోటి ఉండదనిసిస్తుంది. కొంటె పనులు చేసినపుడు చాలా మంది కోతి చేష్టలేంటి? అంటూ చమత్కరిస్తుంటారు. అయితే తాజాగా ఓ కోతి టీ స్టాల్లో పాత్రలు శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ఘంటా అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో ‘‘అందరూ కష్టపడాలి’’ అనే క్యాప్షన్తో షేర్ చేయగా.. 2.5 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అంతే కాదండోయ్ 2 లక్షలకు పైగా లైక్ కొట్టి.. వేల మంది కామెంట్ చేస్తున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్లో “అమ్మీ జాన్ కెహతి థి కి కోయి భీ ధండా చోటా నహి హోతా, ఔర్ ధండే సే బాదా కోయి ధరం నహీ హోటా”. అంటూ వచ్చే డైలాగ్ మరింత ఆకర్షణగా నిలుస్తోంది. కోతి పాత్రలు కడిగి తర్వాత మళ్లీ వాసన చూసి చెక్ చేసుకోవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘పనికి కుదిరిన కోతి.. పాత్రలు తలతల?’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్.. జీతం ఎంతో చెప్పాలి.’’ అంటూ చమత్కరించాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.. కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by memes | culture | comedy (@ghantaa) -
కోతికి దాహమేసింది.. తర్వాత ఏం జరిగింది?
ఎండల వల్లో, మరేమో కానీ ఈ వానరానికి దాహమేసింది. చుట్టుపక్కల నీళ్లు కన్పించలేదు. ఎదురుగా మాత్రం వాటర్ క్యాన్ ఉంది. దాన్ని కిందకు పడేసింది. అయినా నీరు అందకపోవడంతో చేతితో క్యాన్లోని నీటిని లాగి ఇలా దాహం తీర్చుకుంది. ఈ దృశ్యం కర్నూలు జిల్లా మహానందిలో ‘సాక్షి’ కెమెరా కంటపడింది. – మహానంది -
ఆమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆ దేవుడే ఇలా వచ్చాడేమో!
జైపూర్: ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి మనుషుల మాదిరిగానే, నోరులేని జీవాలకు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఉదంతాలను తెలిపే అనేక సంఘటనలు చూసే ఉంటాం. తాజాగా, మరో భావోద్వేగానికి గురిచేసే సంఘటన ఒకటి రాజస్థాన్లో జరిగింది. వివరాలు.. జోధ్పూర్ జిల్లాలోని ఫలోడి అనే గ్రామం ఉంది. దీనిలో భన్వ్రీ దేవి అనే 90 ఏళ్ల వృధ్దురాలు ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగాలేక మంచానికే పరిమితమైంది.. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఒక పెద్ద కొండెంగ (లగూన్) ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. మెల్లగా ఆవృద్ధురాలు ఉన్న మంచంపై ఎక్కి కూర్చుంది. కాసేపు అటూ ఇటూ చూసింది. అంతటితో ఆగకుండా ఆ ముసలావిడ పైన కూర్చొని ఆప్యాయంగా ముఖంపై నిమిరింది. మొదట ముసలావిడ కాస్త భయపడినట్లు కనిపించినా, కాసేపటకి ,కొండెంగ చూపిస్తున్న ప్రేమకు భావోద్వేగానికి లోనైంది. ఆ వృద్ధురాలి కడుపు పైన కూర్చుని మరొసారి ఆలింగనం చేసుకుంటూ.. తన ప్రేమను చూపించింది. దీంతో, కొండెంగను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని దాని వీపుపై ప్రేమతో నిమిరింది. కాసేపటికి ఆ కొండెంగ మెల్లగా మంచం దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ వావ్.. మనుషుల కన్నా నోరులేని జీవాలే మిన్న..’, ‘బామ్మ.. నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆమె ఆరోగ్యం బాగు చేయడానికే ఆ దేవుడే వచ్చాడు..’,‘పాపం.. కొండెంగ.. తన గుంపు నుంచి తప్పిపోయిందేమో..’, ‘ఆ ప్రేమను చూసి మా కళ్లలో నీళ్లు తిరిగాయి..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’ చదవండి: ట్రైన్లో అడవి పంది: భళే పరుగులు తీస్తుందే!! -
వామ్మో.. కోతులు ఏమాత్రం భయం లేకుండా.. స్పైడర్మాన్లా..
న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు ఒకప్పుడు అడవులలో ఎక్కువగా ఉండేవి. పాపం.. వాటికి సరైన ఆహారం దొరక్క జనావాసాల మధ్యన చేరుకున్నాయి. అయితే, కోతులు చేసే హంగామా.. మాములుగా ఉండదు. అవి ఆహారం కోసం గుంపులు గుంపులుగా ఇళ్లపై దాడిచేసి, చేతికందినవి ఎత్తుకు పోతుంటాయి. ఈ క్రమంలో కోతులు ఒక్కోసారి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి పెద్ద చెట్లపై అమాంతం ఎక్కి, కొమ్మలను పట్టుకొని వేలాడుతుంటాయి. అదే విధంగా, ఒక ఇంటిపై నుంచి మరొక ఇంటిపై దూకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి దాడిచేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో రెండు కోతులు ఎనిమిది అంతస్థుల భవనంపైకి ఎక్కాయి. అవి వెళ్లిన పని అయిపోయిందేమో.. మరేమో.. కానీ ఆ తర్వాత ఒక గోడను ఆధారంగా చేసుకుని.. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా, పాకుతూ నేలను చేరుకున్నాయి. కాగా, ఈ వీడియోను టైకూన్కు చెందిన వ్యాపారవేత్త హార్ష గొయెంకా తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ‘ఆ కోతులు అంత ఎత్తున ఉన్న బిల్డింగ్పై నుంచి కూడా.. ఎంత తెలివిగా, జాగ్రత్తగా దిగుతున్నాయో.. మనిషి కూడా అదే విధంగా ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా ఎదుర్కొవచ్చని ’ చెప్పారు. ఇదే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుషాంత్నందా కూడా తన ఇన్స్టాలో వేదికగా పోస్ట్ చేశారు. దీనికి ఆయన ‘మనిషి జీవింతంలో సమస్యలు ఉండటం సహాజం.. కానీ, వీటిని మరింత జటిలం చేసుకుంటున్నారని ’ అని కోడ్ చేశారు. ఈ వీడియో ఎంతో స్పూర్తీవంతంగా ఉందని అన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఈ కోతులకు ఫైర్ డిపార్ట్మెంట్లో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా..’, ‘స్పైడర్మెన్ ఏంటా జారటం..’, ‘పట్టు తప్పితే.. ఇంకేమైనా ఉందా..’, ‘వాటి తెలివికి జోహర్లు..’ ‘హమ్మయ్య.. మొత్తానికి కిందకు చేరుకున్నాయి.’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. There are simple things in life you see and they light up your day….. pic.twitter.com/ceciyhKTox — Harsh Goenka (@hvgoenka) June 19, 2021 చదవండి: సైకిల్పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు.. -
వైరల్ వీడియో: మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది?
న్యూఢిల్లీ: కోతుల అల్లరి అంతా ఇంతా కాదు. ఇక అవి గుంపుగా ఉంటే ఆ దారి వెంట పోవాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అడవులు క్రమంగా తగ్గిపోతున్న వేళ గుంపులు గుంపులుగా కోతులు పల్లె సీమల్నే కాదు, పట్టణాలనూ ఆక్రమించుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ కోతి ఢిల్లీ మెట్రో రైలు ఎక్కింది. ఎక్కడికి వెళ్లాలి అనుకుందో గానీ.. మెట్రో రైలు కోచ్లో శనివారం కలియ తిరిగింది. అయితే అంత మంది ప్రయాణికులను చూసే సరికి భయం వేసిందో.. ఏమో గానీ.. బుద్ధిగా ఓ చోట సీటులో కూర్చుంది. అంతే కాదండోయ్ ఆ పక్కనే ఉన్న ప్రయాణికుడు తన నేస్తం అయినట్లు చేయి కూడా వేసింది. మెట్రో రైలు అద్దంలో నుంచి బయటి అందాలను చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వెంటనే ధృవీకరించక పోయినప్పటికీ, ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోకు ప్రతిస్పందనగా.. కోచ్ వివరాలను అందించాలని ఢిల్లీ మెట్రో అధికారులను కోరారు. కాగా దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. దయచేసి అతడిని స్టేషన్ బయట వదిలి పెట్టండి. వాళ్ల ఫ్యామిలీ తన కోసం ఎదురు చూస్తుంటుంది అని కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ మెట్రో ఎక్కిన కోతి.. మరి టికెట్ ఏది? అంటూ చమత్కరించాడు. Video: One-way ticket! Monkey taking fun ride in Delhi Metro#delhimetro #MonkeyInMetro #Delhi #DMRC #ViralVideo #Viral pic.twitter.com/rpvfbbVz3H — Priya Jaiswal (@jaiswalpriyaa) June 20, 2021 చదవండి: 81 రోజుల తర్వాత.. 50 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు -
పిల్లకు పాలు.. తల్లికి కూల్ డ్రింక్
రాయవరం: మండే ఎండల్లో ఎవరికైనా దప్పిక వేయడం సహజం. దాహార్తితో అల్లాడుతున్న ఓ వానరానికి ఓ వ్యక్తి గ్లాసులో కూల్డ్రింక్ పోసి దాని సమీపంలో ఉంచాడు. ఒక్క ఉదుటున దానిని అందుకున్న ఆ వానరం కూల్డ్రింక్ను ఆత్రంగా తాగుతూనే.. తన బిడ్డకు చనుబాలు ఇచ్చిన అపురూప దృశ్యాలివి. రాయవరం మండలం మాచవరం గ్రామ సమీపంలో ‘సాక్షి’ కంటపడ్డాయి. గ్లాసులో ఉన్నది ఏమిటబ్బా! తాగి చూస్తే పోలా! అమ్మా.. నాకు ఇవ్వవా మరి..! నువ్వు నా పాలు తాగు.. నేను ఈ డ్రింక్ తాగుతా -
వైరల్: పిల్లి పిల్లను కిడ్నాప్ చేసిందిరోయ్
సాక్షి, నల్గొండ : జాతి భేదం మరిచి తన పిల్ల అనుకుని పిల్లి పిల్లను వెంటేసుకుని తిరుగుతోంది ఓ కోతి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ కోతికి పుట్టిన పిల్ల చనిపోయింది. దీంతో ఆ తల్లి కోతి ఓ గ్రామస్తుడు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి పిల్లను ఎత్తుకొని పోయింది. రెండు రోజుల నుంచి ఆ పిల్లి పిల్లను వదలకుండా తనతోనే ఉంచుకుంటోంది. చదవండి: పులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్ -
పులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్
పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పులి కనుసన్నల్లో నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. ఒకసారి టార్గెట్ చేసిందంటే వార్ వన్సైడ్ అవ్వాల్సిందే. ఒకవేళ అదృష్టం బాగుండి ఆ జంతువు పులికి చిక్కకుండా తప్పించుకుందంటే దాని ఆయుష్యు గట్టిదన్నట్లే. అయితే ఎక్కువగా పులి జింకను, ఇతర పెద్ద జంతువులను వెంటాడటం చూస్తుంటాం. కానీ ఇక్కడ చెప్పబోయే పులి కన్ను ఓ కోతిపై పడింది. దాన్ని ఆరోజుకీ ఆహారంగా చేసుకుందామనుకుంది. కానీ చివరిలో ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్తో పులి కథ ముగిసింది. విషయంలోకెళితే.. కోతి ఏంచక్కా చెట్టుమీద కూర్చొని ఉంది. దీనిని గమనించిన పులి చకచకా చెట్టుమీదకు ఎక్కిది. కోతిపై దాడి చేసేందుకు ప్లాన్ వేసింది. మెల్లమెల్లగా కోతి దగ్గరకు వెళ్లి దాని మీదకు దూకేందుకు సిద్ధపడింది. పులి అటాక్ చేసే సమయంలోకోతి వెంటనే పక్కన ఉన్న కొమ్మ మీదకు జంప్ చేసింది. దీంతో పులి ప్లాన్ బెడిసికొట్టడమే కాకుండా అదుపుతప్పి కిందపడిపోయింది. ఇంకేముంది అనుకుంటూ అక్కడినుంచి వెనుదిరిగి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను భారత అటవీశాఖ అధికారి ప్రవీణ్ అంగూసామీ తన ట్విటర్లో షేర్ చేశారు. ‘నీ బలహీనతలను ఎవరికీ చూపించకండి. నీ బలాన్ని నమ్ముకొని ధైర్యంగా నిలబడి ఎదుర్కొ’.. అంటూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 10 వేల మందికి పైగా వీక్షించగా, నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెబుతున్నారు. కోతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. మరణం కొన్ని అంచుల దూరంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా తెలివిగా ఆలోచించే ధైర్యాన్ని పెంచుకోవాలంటూ పేర్కొంటున్నారు. చదవండి: పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి Don't push your weaknesses, always know & play with your strengths. pic.twitter.com/vhPmxy8nu8 — Praveen Angusamy, IFS 🐾 (@PraveenIFShere) March 23, 2021 -
అయ్యో ఈ కోతికి ఎంత కష్టమొచ్చింది!
థాయ్లాండ్: జంక్ ఫుడ్ తింటే మనుషులే కాదు జంతువుల సైతం అనారోగ్య బారిన పడతాయి. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. హాయిగా చెట్ల కొమ్మలపై అటూ ఇటూ దూకుతూ యాక్టివ్గా ఉండాల్సిన ఈ కోతి జంక్ ఫుడ్ తిని తిని ఉభకాయంతో బాధపడుతోంది. వివరాలు.. బ్యాంకాక్ చెందిన మనోప్ అనే ఓ షాప్ యాజమానురాలు గాడ్జిల్లా అనే కోతిని పెంచుకుంటోంది. ప్రస్తుతం దాని వయసు 3 సంవత్సరాలు. ఆమె రోజు తనతో పాటే ఈ కోతిని మార్కెట్కు తీసుకువచ్చి తన షాపు ఎదురుగా కట్టి ఉంచుతుంది. దీంతో ఆ దారిన వచ్చిపోయే వారంతా దానికి జంక్ ఫుడ్ను ఆహారంగా ఇవ్వడం మొదలు పెట్టారు. అలా రోజు బర్గర్, పిజ్జా, బన్లు వంటి పదార్థాలు తినడం వల్ల ఈ 3 ఏళ్ల కోతి 20 కేజీల బరువెక్కింది. అంటే దాని వయసుకు ఉండాల్సిన సాధారణ బరువు కంటే రెట్టింపు బరువుతో ఉందని కోతి యజమానురాలు మనోప్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింటా వైరల్ కావడంతో అందరి దృష్టి ఈ కోతిపై పడింది. అయ్యే ఈ కోతికి ఎంత కష్టం వచ్చిందో అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే గాడ్జిల్లా మొదటి యజమాని దానిని విడిచిపెట్టడంతో ఆమె ఈ కోతినిను పెంచుకుంటున్నట్లు చెప్పింది. అయితే దీనికి మంచి ఆహారం ఇవ్వాలన్నది తన కోరిక అట. కానీ గాడ్జిల్లా అధిక బరువుతో బాధపడుతుండటంతో తిరిగి దాని బరువును అదుపులోకి తీసుకువచ్చేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. గాడ్జిల్లా అతి చిన్న వయసులో ఉన్నప్పుడు రెస్క్యూ టీం బ్యాంకాక్ రోడ్లపై కనుగోని దీని పాత యజమానికి అప్పగించారట. ఇది చిన్నప్పటి నుంచి పట్టణంలో పెరగడం వల్ల ఆడవిలో స్వయంగా ఆహారం వెతుక్కొవడం దానికి తెలియదని ఆమె వివరించింది. అయితే ఈ కోతి రోజు ఉదయం పూట వ్యాయమం చేస్తున్నప్పటికి పలు అరోగ్య సమస్యల వల్ల ఉభకాయంతో బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించింది. గాడ్జీల్లా ఒంటరిగా ఉండటం వల్ల ఒత్తిడికి లోనవుతుందని అందుకే రోజు గాడ్జీల్లాను మార్కెట్కు తీసుకువస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే గాడ్జీల్లా కేవలం తనకు ఇష్టమైన వారు ఆహారం పెడితేనే తింటుందట. -
ఏనాటి బంధమిది.. తల్లిని కూడా దగ్గరకి రానివ్వలేదు
సోషల్ మీడియా వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో.. అదే రేంజ్లో లాభం కూడా ఉంటుంది. వాస్తవంగా సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత జరిగిన అద్భుతాలు అనేకం ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల సామాన్యులు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిన ఘటనలు కోకొల్లలు. ఇక గుండెని మెలిపెట్టే విషాదాలు.. కంట తడి పెట్టించే కథనాలు.. స్ఫూర్తి రగిలించే అంశాలు ఎన్నో సోషల్ మీడియా ద్వారా తెగ ప్రచారం పొందాయి. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కోతుల్ని చూడగానే కాస్త కంగారు పడతాం. ఎక్కడ మీద పడి దాడి చేస్తాయేమో అని భయపడతాం... మన దగ్గర ఏవైనా వస్తువులు ఉంటే కోతులు లాక్కెళ్లిపోతాయేమో అని టెన్షన్ పడతాం... అలాంటిది ఈ వీడియోలో... కోతి ఓ చిన్నారిని ఆప్యాయంగా హత్తుకొని... తల నిమిరి... ముద్దులు పెట్టుకొని... ప్రేమ కురిపించింది. ఇద్దరి మధ్య ఏ జన్మ అనుబంధమో ఏమో కానీ కనీసం కన్న తల్లికి కూడా బిడ్డను ఇవ్వలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ రోడ్డుపై ఉన్న చిన్నారికి కోతి రక్షణ కల్పించింది. "నువ్వేం కంగారు పడకు... నీకు నేనున్నాను... నిన్ను బంగారంలా చూసుకుంటాను" అని అన్నట్లుగా ఆ కోతి వ్యవహరించింది. తన బిడ్డను తనకు ఇచ్చేయమని ఆ తల్లి అడుగుతుంటే... కోతి ఇవ్వకుండా... కనీసం పిల్లాడిపై ఆ తల్లిని చెయ్యి కూడా వెయ్యనివ్వకుండా జాగ్రత్త పడింది. తన కొడుకును అంత జాగ్రత్తగా చూసుకుంటున్న కోతి నుంచి ఎలా తనని వెనక్కి తీసుకోవాలో ఆ తల్లికి అర్థం కాలేదు. తన కొడుకును ఇవ్వమని బతిమాలింది. ఎందుకో ఏమో కానీ కాసేపటి వరకు కోతి ఆ చిన్నారిని తల్లికి అప్పగించలేదు. ఆ తర్వాత ఎప్పటికో బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. చదవండి: ఎంతబాగా ప్రార్థన చేస్తున్నాడో; ఓర్నీ అసలు సంగతి ఇదా! -
కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె!
-
కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె!
ఆలూమగలన్నాక కోపతాపాలు, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ చెరిసగం పంచుకుంటూ ప్రేమ అనే నావతో సంసార సాగరాన్ని ఈదక తప్పదు. అయితే నచ్చింది కొనివ్వడం లేదని, పనుల్లో కాస్తైనా సాయం చేయడం లేదని భార్య కట్టుకున్నవాడి మీద కస్సుబుస్సులాడుతుంది. ఆమె కోరికల చిట్టాను తీర్చాలంటే కుబేరుడి దగ్గర ఉన్న ధనం కూడా సరిపోదని, ఆమె వాగుడుతో వేగలేకున్నామని భార్య మీద అసహనం వ్యక్తం చేస్తుంటారు మగ మహానుభావులు. కానీ ఇక్కడో కోతి మాత్రం ఓ మహిళకు నేనున్నానంటూ వంటపనిలో సాయం చేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఓ మహిళ కూరగాయలు కట్ చేస్తోంది. సాయం చేయడానికి నేనున్నాగా అన్నట్లుగా ఓ కోతి అక్కడే బుద్ధిగా కూర్చుంది. దీంతో ఆమె తన చేతిలో ఉన్న వాటిని కోతి ఎదురుగా ఉన్న గిన్నెలో వేసింది. ఇంకేముందీ వానరం వాటన్నింటినీ చకాచకా చేతితో విరుస్తోంది. దానికి ఇంతకుముందే ట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఎంతో స్పీడ్గా పని చేయడం విశేషం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 'కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె' అని ఒకావిడ తన భర్త ఏ సాయమూ చేయడని చురకలంటించగా, దీనికి ఇంత టాలెంట్ ఎక్కడ నుంచి వచ్చిందోనని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చదవండి: గాలి ద్వారా గర్భం.. గంటలోనే ప్రసవం! వైరల్: బుర్ర పనిచేసింది.. లేదంటే.. అచ్చం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోలా.. -
అచ్చం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోలా..
మీకు యాదుంది కదా...ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సీబీఐ ఆఫీసర్ అరుణ్ను చంపేస్తరు. ఎవరు చంపారు? ఎందుకు చంపారు....మొదలైన విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు న్యూరోసైంటిస్ట్ సారా (హీరోయిన్) సహాయంతో సీబీఐ ఆఫీసర్ ‘మెమోరీ’ని చిప్ రూపంలో కాంట్రాక్ట్ కిల్లర్ శంకర్ (మన హీరో) పుర్రెలో సెట్ చేస్తారు. క్రిమినల్ శంకర్ కాస్త í సీబీఐ సిన్సియర్ ఆఫీసర్ అరుణ్లా ప్రవర్తిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. అది సినిమా కదా...ఇక నిజజీవితంలోకి వద్దాం. ‘కోతులు కూడా ఇక ముందు వీడియోగేమ్స్ ఆడతాయి’ అని ప్రకటించాడు స్పేస్ ఎక్స్ సీయివో ఎలాన్ మాస్క్. ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరోలింక్’ కోతి పుర్రెలో ‘చిప్’ను సెట్ చేయడానికి రెడీ అయింది. ఆతరువాత కోతిగారు మనలాగే వీడియో గేమ్స్ ఆడతారన్నమాట. (ఇది జస్ట్ ప్రారంభమేనట. ఇంకా చాలాచాలా చేస్తారట) ‘కంప్యూటర్ చిప్ కోతిపుర్రెలో ఉన్న ఆనవాలు ఏదీ ఎవరికీ కనిపించదు’ అంటున్నాడు మాస్క్. అదిసరే...కోతి ‘మెమోరీ’ చిప్ను మన పుర్రెలో సెట్ చేస్తే ఏందీ పరిస్థితి? నాయనా మాస్కు, మా మీద కాస్త దయచూపు! -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు తీసిన కోతి
సాక్షి, హైదరాబాద్ : 2020 సంవత్సరం వెళుతూ వెళుతూ ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచేసింది. తన పని తాను చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా ఉన్న యువకుడు.. కుటుంబ సభ్యుల ముందే కన్నుమూశాడు. కోతులను అదిలించబోయి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన నగరంలోని కూకట్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి జయనగర్లో కోతుల బెడత ఎక్కువైంది. కోతిని కొట్టబోయి విద్యుత్ షాక్తో సాప్ట్వేర్ ఉద్యోగి లోకేష్ మృతిచెందాడు. సాప్ట్వేర్ ఉద్యోగి కావడంతో వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడంతో వాటిని బెదరగొట్టేందుకు ఇనుపరాడ్తో కొట్టబోయాడు. దీంతో ఇనుపరాడ్ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్కు గురయ్యాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేష్ ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో, కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
వామ్మో! ఉన్నట్టుండి తల చీల్చేసింది..
సాక్షి, గుంటూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కొండముచ్చు ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన మంగళవారం పిడుగురాళ్ల మండలం, జూలకల్లు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూలకళ్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం పెంపుడు కొండముచ్చును మీద ఎక్కించుకుని తన చుట్టూ గుమిగూడిన జనాలతో మాటలు చెబుతున్నాడు. జనం కూడా అతడు చెప్పే మాటలు వింటూ, కొండముచ్చు వంక చూస్తూ నవ్వసాగారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ కొండముచ్చు ఉన్నట్టుండి అతడిపై దాడి చేసింది. తలను కొరికి పై తోలు చీల్చి, నోటకరుచుకుపోయింది. ( భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు) ఈ హఠాత్పరిణామంతో అతడు షాక్ తిన్నాడు. ఏం జరుగుతోందో తెలిసేలోపే క్షణాలో అతడి తలను తీవ్రంగా గాయపర్చి అక్కడినుంచి పరారైంది కొండముచ్చు. తీవ్రంగా గాయపడ్డ అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కొండముచ్చులు ఉన్నట్టుండి దాడులకు తెగబడ్డాయి. గత ఫిబ్రవరి నెలలో నల్గొండ జిల్లా సూర్యా పేటలో ఓ వ్యక్తి బైకుపైకి ఎక్కిన కొండముచ్చు నమ్మకంగా ఉంటూ గొంతుకొరింది. -
కోతి చేష్టలు.. కరెన్సీ వర్షం..!
లక్నో: కోతి అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. ఇళ్లలో దూరి.. మనుషుల దగ్గర నుంచి వస్తువులు లాక్కేళ్లే అలవాటు బహుశా కోతికి మాత్రమే ఉందనుకుంటా. కోతి చేష్టలు చాలా సార్లు నవ్వు తెప్పించినా.. అప్పుడప్పుడు ప్రాణాల మీదకు కూడా తెస్తాయి. ఇదిగో ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఓ తుంటరి కోతి మనిషి చేతిలోంచి బ్యాగ్ లాక్కెళ్లింది. అంతటితో ఆగక దానిలో ఉన్నడబ్బు తీసి గాల్లోకి విసేరిసింది. దాంతో సదరు వ్యక్తి ప్రాణం పోయినంత పనైంది. ఎలాగోలా చివరకు కోతి చేతిలోంచి బ్యాగ్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్లో చోటు చేసుకుంది. ఓ నడి వయసు వ్యక్తికి వికాస్ భవన్ రిజిస్ట్రీ ఆఫీస్ వద్దకు వచ్చాడు. అతడి చేతిలో ఓ బ్యాగ్ ఉంది. దానిలో నాలుగు లక్షల రూపాయల నగదు ఉంది. డబ్బు ఉండటంతో ఎంతో జాగ్రత్తగా వెళ్తున్న సదరు వ్యక్తిని కోతి గమనించింది. ఒక్క ఉదుటున అతడి దగ్గరకు వచ్చి చేతిలో బ్యాగ్ తీసుకుని తిరిగి చెట్టెక్కింది. (చదవండి: కోతులకూ కుటుంబ నియంత్రణ!) ఈ ఘటనతో పాపం పెద్దాయన పై ప్రాణాలు పైనే పోయాయి. కోతి డబ్బు బ్యాగ్ లాక్కెళ్లిందని కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. బ్యాగ్ లాక్కెళ్లిన కోతి అది చాలదన్నట్లు దాన్ని ఒపెన్ చేసి డబ్బులు బయటకు తీసి గాల్లోకి విసరడం ప్రారంభించింది. చుట్టు గుమికూడిన జనం ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. మరి కొందరు మాత్రం బాధితుడికి సాయం చేయాలని భావించి కోతిని పట్టుకునేందుకు చెట్టు ఎక్కారు. అనేక ప్రయత్నాల తర్వాత చివరకు కోతి బ్యాగ్ను వదిలేసి వెళ్లింది. దాదాపు 12-14వేల రూపాయల డబ్బును వెదజల్లినట్లు తెలిసింది. దీని గురించి సమీప కొత్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
కోతులకూ కుటుంబ నియంత్రణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సారంగాపూర్ మండలం చించోలి (బి)వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. దేశంలో హిమాచల్ప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రం మొదటిది కాగా, తెలంగాణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రెండోది కావడం గమనార్హం. రూ.2.25 కోట్ల అటవీ శాఖ నిధులతో ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏం చేస్తారు? రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను ఈ సంరక్షణ కేంద్రానికి తీసుకొస్తారు. విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు అక్కడ తొలుత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తారు. అవి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అడవుల్లో వదిలేస్తారు. ఈ కేంద్రంలో పశువైద్యాధికారి, సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, ఆపరేషన్ థియేటర్, డాక్టర్స్ రెస్ట్ రూమ్స్, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారు చేశారు. అలాగే సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు. 2017లో దీని నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శంకుస్థాపన చేశారు. -
కోతులు కొట్లాట.. ఇద్దరు మృతి
లక్నో: తాజ్ నగరం నడిబొడ్డున రెండు కోతుల గుంపుల మధ్య జరిగిన కొట్లాట ఇద్దరి మృతికి కారణమయ్యింది. వివరాలు.. సత్సంగ్ గాలీలోని ఓ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంటి యజమాని, మరో వ్యక్తి గోడ పక్కన నిలబడి ఉన్నారు. ఇంతలో రెండు కోతుల గుంపు ఆ గోడ మీద చోటు కోసం పోట్లాడుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో గోడ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇంటి యజమాని, మరోక వ్యక్తి మీద శిథిలాలు పడ్డాయి. దాంతో వారు తీవ్రంగా గాయపడటమే కాక మరణించారు. చనిపోయిన వ్యక్తులను లక్ష్మణ్ తులసి, వీరాగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి ప్రాణాంతక సంఘటనలు వెలుగు చూస్తుండటంతో స్థానికులు కోతులను నగరం నుంచి తరిమెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. (దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు) వానరాల బెడద తప్పించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆగ్రా జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. అయితే గతంలో కార్పొరేషన్ కోతులను తరిమే ప్రయత్నం చేసింది. కానీ జంతు ప్రేమికులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ కోతులు స్థానికులను కాక పర్యాటకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత ఏడాది ఒక కోతి రునుక్త గ్రామంలో తల్లి ఒడిలో ఉన్న పసికందును లాక్కెళ్లి చంపేసింది. -
దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు
కౌలలాంపూర్: మలేషియాకు చెందిన జాక్రిడ్జ్ రోడ్జి అనే 20 ఏళ్ల యువకుడు శనివారం ఉదయం లేచే సరికి పక్కన ఫోన్ కనిపించలేదు. ఎక్కడ పెట్టానా? అని ఇల్లంతా వెతికాడు. కానీ దొరకలేదు. పోనీ ఎవరైనా ఎత్తుకెళ్లారా? అంటే ఆ ఆనవాళ్లు కూడా కన్పించలేదు. ఏదో మంత్రమేసినట్టుగా ఇలా మాయమైంటేందబ్బా అని తల గోక్కున్నాడు. ఎలాగైనా ఫోన్ను కనిపెట్టాల్సిందేనని అనుకున్నాడు. ఫోన్ లొకేషన్ను ట్రాక్ చేస్తూ ఇంటికి దగ్గర్లోని చిట్టడవికి దారి తీశాడు. అతని తండ్రి అదే పనిగా కాల్ చేస్తుండగా, దాని ద్వారా వచ్చే రింగ్ ఆధారంగా అతను చెవులు రిక్కిరించి మరీ ముందుకెళ్లాడు. అలా ఓ తాటి చెట్టు కింద ఫోన్ను గుర్తించాడు. (పెళ్లికి అనుకోని అతిథి, అంతా షాక్!) మొబైల్లో దొంగల ఫొటోలు ఉండొచ్చేమో చెక్ చేయమని అతడి అంకుల్ సలహా ఇచ్చాడు. దీంతో జాక్రిడ్జ్ ఫోన్ ఆన్ చేసి ఫొటోలు చూడగా ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఎందుకంటే అందులో ఉన్న దొంగ.. మనిషి కాదు, కోతి. అవును, ఆ దొంగ కోతి ఎన్నో సెల్ఫీలు తీసుకుంది. కొన్నిసార్లు ఫోన్ను తినేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కొన్ని ఫొటోలు క్యాప్చర్ అవగా, మరికొన్ని వీడియోలుగా రికార్డయ్యాయి. వీటన్నంటికి అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా తెరిచిన కిటికీ ద్వారా ఆ కోతి ఇంట్లోకి వచ్చి, తన ఫోన్ ఎత్తికెళ్లి ఉంటుందని జాక్రిడ్జ్ చెప్పుకొస్తున్నాడు. (కునుకు తీసిన కోతి.. నవ్వులు పూయిస్తున్న వీడియో) Something yang korang takkan jumpa setiap abad. Semalam pagi tido bangun bangun tengahari phone hilang. Cari cari satu rumah geledah sana sini semua takde then last last jumpa casing phone je tinggal bawah katil tapi phonenya takde. Sambung bawah. pic.twitter.com/0x54giujnY — z (@Zackrydz) September 13, 2020 -
పెళ్లికి అనుకోని అతిథి, ఒక్కసారిగా షాక్!
-
పెళ్లికి అనుకోని అతిథి, అంతా షాక్!
సాక్షి, ములుగు: కరోనా మహమ్మారి తోటి మనుషుల మద్య ‘దూరం’ పెంచింది. మొహానికి మాస్కు అంటించింది. వైరస్ భయాలు, ప్రభుత్వ నిబంధనలతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు సింపుల్గా కానిచ్చేస్తున్నారు. ఎంతటి వారి పెళ్లిళ్లలోనైనా అతిథులే కరువయ్యారు. ఈ సమయంలో తానే విషిష్ట అతిథై ఓ వానరం (కోతి) ఈ నూతన జంటకు ఆశీస్సులు అందించింది. తలంబ్రాల సందర్భంలో తాను చెయ్యి కలిపి మనసార ఆశీర్వదించింది. ఈ అరుదైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఓ వివాహ సమయంలో చోటు చేసుకుంది. వధూవరులు నూగురు వెంకటాపురానికి చెందినవారు. ఈ అద్భుత సంఘటనతో బంధువుల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం ఆనందం ఉరకలేసింది. -
నగదు, బంగారం ఎత్తుకెళ్లిన కోతులు
చెన్నై: కోతులు ఇళ్లలోకి దూరి అందినకాడికి వస్తువులు, తినుబండరాలను ఎత్తుకెళ్లడం సాధారణంగా జరిగే ఘటన. కానీ అలా ఎత్తుకెళ్లిన వాటిలో జీవితాంతం కష్టపడి దాచిన సొమ్ము, బంగారం ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది తమిళనాడుకు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలికి. పాపం కష్టసమయంలో అక్కరకు వస్తుందని దాచిన సొమ్ము ఇలా కోతుల పాలు కావడంతో విపరీతంగా బాధపడుతుంది ఆ వృద్ధురాలు. వివరాలు.. తిరువైయారూకు చెందిన 70 ఏళ్ల వితంతువు జి. శరతంబల్ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమె బట్టలు ఉతకడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో కోతులు ఆమె ఇంట్లో చేరి అరటి పళ్లు, బియం సంచి తీసుకుని పారిపోయాయి. పాపం శరతంబల్ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు కొద్ది పాటి బంగరాన్ని కూడా బియ్యం సంచిలోనే ఉంచింది. కోతులు వీటన్నింటిని తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాయి. (బంగారం వద్దు.. రూ.2 వేలు చాలు..!) ఇంటికి తిరిగి వచ్చిన శరతంబల్కి బియ్యం సంచి కనిపించకపోవడంతో బయటకు వచ్చి చూసింది. ఇంటి పైకప్పు మీద కోతుల చేతిలో ఉన్న బియ్యం సంచి చూసి.. తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దాంతో శరతంబల్ వాటిని అనుసరిస్తూ వెళ్లింది. విషంయం తెలిసిన స్థానికులు కోతులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. బియ్యం సంచిలో 25 వేల రూపాయల నగదుతో పాటు కొద్దిపాటి బంగారం కూడా ఉన్నట్లు తెలిపింది శరతంబల్. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికి కోతులను పట్టుకోలేకపోయింది. అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వస్తుందని భావించి.. జీవితాంతం కష్టపడి దాచిన సొమ్ము ఇలా కోతుల పాలవడంతో విచారంలో మునిగిపోయింది శరతంబల్. ఇప్పటికైనా కోతులు గ్రామంలోకి ప్రవేశించకుండా చూడాలని కోరుతున్నారు గ్రామస్తులు. -
కునుకు తీసిన కోతి.. నవ్వులు పూయిస్తున్న వీడియో
తరగతి గదిలో టీచర్ క్లాస్ చెబుతున్న సమయంలో మీరు ఎప్పుడైనా కునుకు తీశారా? దాదాపు ప్రతి ఒక్కరు ఇలా కునుకు తీయడం కామన్. కొందరైతే తూగుతూ కిందపడిపోతారు కూడా. క్లాస్లోనే కాదు చల్లని చెట్టు కింద కాసేపు కూర్చున్నా.. నిద్ర ఇట్టే పట్టేస్తుంది. ఇలాంటి సంఘటన చాలామందికే ఎదురై ఉంటుంది. అలా ఓ కోతి గాఢ నిద్రలోకి జారుకున్నది. అకస్మాత్తుగా కుదుపుతో మేల్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో చెట్టు కింద కునుకు తీస్తున్న కోతి చివర్లో తను పడుకోవాల్సిన చోటు అది కాదేమో అనేలా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. 14 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ ట్విటర్లో షేర్ చేశారు. మీరూ ఇలాంటివి చేసుంటే ఈ వీడియోను చూడండి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకున్నది. కొంతమంది నెటిజన్లు తమ జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటను కామెంట్ల ద్వారా పంచుకుంటున్నారు. RT if you have did this and can relate to this video. Watch full screen till the end 😀 #Shared pic.twitter.com/9aImikrDzO — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) August 5, 2020 -
ఎన్నాళ్లీ వానరయుద్ధం
జైపూర్(చెన్నూర్): మండలంలో వా‘నర’యుద్ధమే జరుగుతోంది. ఏక్షాణాన ఎటు నుంచి వానరమూకలు దాడి చేసి ఇళ్లపై పడతాయోనని నిత్యం ప్రజలు భయపడుతున్నారు. ఎంత భయపడ్డా రోజూ ఏదో చోట కోతులు దాడి చేస్తూ అమాయక జనాలను గాయపరుస్తూనే ఉన్నాయి. పెంకుటిళ్లను పీకి పందిరి వేస్తున్నాయి. ప్రజలు కోతుల దాడులను తట్టుకోలేక బెంబేలెత్తుతున్నారు. జైపూర్ మండలంలో వానర మూకలబెడద చాలా ఎక్కువగా ఉంది. జైపూర్ మండల కేంద్రంతో పాటు ఇందారం, రామారావుపేట, టేకుమట్ల, షెట్పల్లి, పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్(ఎస్), బెజ్జాల గ్రామాల్లో సమస్య అధికంగా ఉంది. ప్రజలు తమ ఇళ్ల తలుపులు ఎప్పుడూ మూసి ద్వారాల వద్ద ఎవరో యుద్ధానికి వస్తున్నట్లు కర్రలను సిద్ధంగా ఉంచుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఎవరి ఇళ్లముందు చూసినా కోతులను పారదోలేందుకు కర్రలు సిద్ధం చేసుకున్న దృశ్యాలే కనిపిస్తుంటాయి. పొరపాటున ఆదమరిస్తే ఇంట్లోకి చొరబడి సామగ్రిని కొల్లగొడతాయి. మండలంలో కోతుల దాడిలో గాయపడ్డ వారి సంఖ్య రో జురోజుకీ పెరిగిపోతోంది. సామగ్రి కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకురావటం కూడా ఇబ్బందే. వెంబడించి మరీ దాడి చేసి వస్తువులను గుంజుకుంటున్నాయి. కోతుల భయానికి జడిసి.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పరిసరాల్లో (పెరడు)లో కూరగాయలను పండిస్తుంటారు. కోతుల భయంతో ఇక్కడి ప్రజలు పెరడులో కూరగాయలను సాగు చేయటం పూర్తిగా మర్చిపోయారు. మానవులపై పోరాటం చేస్తున్న వానరులను నరులు ఏమీ చేయలేకపోతున్నారు. కోతుల ఇక్కట్లను ఎలా తొలగించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సెంటిమెంటే కారణమా..? మొదట్లో ఇక్కడ కోతులుండేవికావు. 2003లో కరీంగనర్ జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి డీసీఎంలలో కోతులను పట్టుకొచ్చి ఇక్కడి అటవీప్రాంతంలో వదిలి పెట్టడంతో కోతులు తయారయ్యాయి. అక్కడి పురపాలక సంస్థలు వీటి బెడదను తప్పించుకునేందుకు వాటిని పట్టించి వాహనాల్లో తీసుకువచ్చి ఈ ప్రాంతంలో వదిలేశారు. అయితే అప్పుడే పట్టుకున్న కోతులను హతమార్చి ఉంటే ఈ బెడద ఉండేది కాదు. కానీ కోతులను చంపితే మహా పాపం.. కోతులంటే దేవుడని రకరకాల సెంటిమెంట్లతో వాటిని హతమార్చకుండా భద్రంగా వదిలించుకున్నారు. ఇప్పుడు ఇక్కడి స్థానిక సంస్థలు కూడా సెంటిమెంట్తో వాటిని చంపలేక, దొరకబట్టి వేరేచోట వదలలేక చేతులెత్తేశాయి. దీంతో నాడు పదుల సంఖ్యలో ఉన్న కోతులు నేడు వేల సంఖ్యలో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కోతులతో వేగలేకపోతున్నాం గ్రామంలో విపరీతంగా కోతులున్నాయి. రోజు రోజుకూ వాటి సంఖ్య పెరిగిపోతుంది. పెరట్లో కూరగాయల చెట్లను దక్కనివ్వడం లేదు. పెట్టిన చెట్లను కూడ నాశనం చేస్తున్నాయి. కోతుల బాధకు కూరగాయల చెట్లు పెట్టడమే మానేశాం. ఉదయం, సాయంత్రం సమయంలో వీధుల్లో ఎక్కువగా కోతులు వస్తున్నాయి.– వెంకటలక్ష్మి, ఇందారం -
కర్రలతో కొట్టి.. పిన్నులతో గుచ్చి
లక్నో: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జంతువుల పట్ల హింస పెరిగిపోతుంది. కేరళలో ఏనుగు మృతి.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో కోతికి ఉరేసిన ఘటనల గురించి విన్నాం. ఈ దారుణాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి దారుణం మరొకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ కోతిని కింద పడేసి కర్రలతో కొడుతూ.. వెనక నుంచి పిన్నులతో గుచ్చుతూ ఆనందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చివరకు కోతి మీద నలుపు రంగు పోసి ఆ తర్వాత వదిలేశారు ఆ సైకోలు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కోతిని హింసించిన నలుగురిని అరెస్ట్ చేశారు. వారికి రూ.60వేలు జరిమానా విధించారు.(వీళ్లు మనుషులు కాదు రాక్షసులు) -
కోతులు.. తీరనున్న వెతలు
తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. ఈ కోతులు ఆహారం కోసం ఇళ్ల మీదికి వచ్చి, వీటి దాడిలో గాయపడిన వారు చాలా మంది ఉన్నారు. కోతుల బెడదను నుంచి విముక్తి చేయడానికి తుక్కుగూడ మున్సిపల్ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. ఈ కోతులను పటేందుకు మున్సిపల్ వార్షిక బడ్జెట్లో రూ. 5 లక్షల కేటాయించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోతులను పట్టే ప్రత్యేక టీమ్ సభ్యులకు ఈ పనులు అప్పగించారు. వీరు గత నెల 12వ తేదీ నుంచి కోతులను పట్టే కార్యక్రమం ప్రారంభించారు. 189 కోతుల పట్టివేత.. మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ, రావిర్యాల, మంఖాల్, సర్ధార్నగర్, ఇమూమ్గూడ, శ్రీనగర్కాలనీ, దేవేందర్నగర్కాలనీలో మున్సిపల్ సిబ్బంది దాదాపుగా 500 పైగా కోతులు ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రత్యేక టీమ్ సభ్యులు నెల రోజుల నుంచి ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు 189 కోతులను పట్టుకున్నారు. కోతులను పట్టుకోవడానికి ప్రత్కేక టీమ్ సభ్యులు వివిధ ఆహార పదార్ధాలను ఎర చూపుతున్నారు. ఆహారం కోసం వచ్చిన వాటిని పడుతున్నారు. పట్టుకున్న కోతులకు ఎలాంటి ప్రాణహాని లేకుండా సురక్షితంగా బోనులో ఉంచుతూ వివిధ రకాల పండ్లు, ఇతరు వస్తువులను ఆహారంగా అందిస్తున్నారు. పట్టిన కోతులను శ్రీశైలం అటవి ప్రాంతంలో వదిళివేస్తున్నారు. ఇప్పటì కే రెండు దఫాలుగా కోతులను ఈ అటవిలో వదలివేశారు. ఒక్కో కోతికి మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక టీమ్ సభ్యులకు రూ. ఒక వేయి అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ మున్సిపాలిటీలో ప్రస్తుతం కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో కోతుల పట్టి వాటి నుంచి తమకి విముక్తి లభించేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా వార్డుల ప్రజలు కొరుతున్నారు. మరో వారంలో పూర్తి మున్సిపల్ పరిధిలోని తుక్కుగూడ, రావిర్యాల, మంఖాల్, ఇమామ్గూడ, శ్రీనగర్కాలనీలో ఇప్పటికే ఒక దఫా కోతులను ప్రత్యేక టీమ్ సభ్యులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు 189 కోతులను పట్టి వాటిని శ్రీశైలం అడవిలో వదలివేశారు. మరో వారం రోజులో మున్సిపల్ వ్యాప్తంగా కోతులు పట్టే కార్యక్రమం పూర్తి అవుతుంది.– ఆర్.జ్ఞానేశ్వర్ మున్సిపల్ కమిషనర్ తుక్కుగూడ -
మనసున్న ఆటో డ్రైవర్
సాక్షి, ఖమ్మం : కొత్త ఆకులు చిగురించే వేళ అడవిలో కాయలు, పండ్లు లేక అల్లాడుతున్న కోతుల ఆకలి తీరుస్తున్నారు ఇల్లెందుకు చెందిన ఆటో డ్రైవర్ రాజ్కుమార్ (చిన్ను). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం – ఇల్లెందు ప్రధాన రహదారి వెంట సాత్ నంబర్, ఆట్ నంబర్గా పిలుచుకునే అటవీ ప్రాంతంలో రోడ్డు వెంట తచ్చాడుతున్న వానరాలకు వారానికి రెండు, మూడుసార్లు ఆహారాన్ని అందిస్తున్నారు. అరటిపండ్లు, కూరగాయలు, బియ్యం, శనగపప్పు వేస్తూ వాటి కడుపు నింపుతున్నారు. లాక్డౌన్ తీవ్రంగా ఉన్నప్పుడు కోతులు ఆకలితో రహదారి పక్కన కవర్లు, ఇతర సంచులు తెరచి చూస్తుండడండడం, నీరసంతో కనిపించడం కలచివేసిందని, అందుకే రెండు నెలలుగా తన వంతుగా ఇలా చేస్తున్నానని ఆయన తెలిపారు. మానవత్వం చాటేలా ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా ఇదిగో ఇలా క్లిక్మనిపించింది. -
వైద్యం కోసం ఆస్పత్రికి కొండముచ్చు
-
వైరల్: ఈ కొండముచ్చు చాలా డిఫరెంట్
బెంగళూరు : గాయం తగిలిన ఓ కొండముచ్చు సహాయం కోసం ఆసుపత్రి మెట్లెక్కింది. ఎంతో శ్రద్ధగా, ఓపిగ్గా ఎదురుచూసి గాయానికి వైద్యం చేయించుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని దండేలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఓ కొండముచ్చుకు గాయం అవ్వటంతో అది దండేలిలోని ఓ ఆసుపత్రికి చేరుకుంది. శ్రద్ధగా ఆసుపత్రి మెట్ల దగ్గర కూర్చుని, తన వంతు వచ్చే వరకు ఓపిగ్గా వేచి చూసింది. అనంతరం వైద్యుడికి గాయం అయిన చోటుని చూపించి మనిషిలా వైద్యం చేయించుకుంది. కొండముచ్చు వైద్యం కోసం ఆసుపత్రికి రావటం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. కొంతమంది అది వైద్యం చేయించుకునే దాకా ఎదురు చూసి, వీడియోలు సైతం తీసుకున్నారు. (ఇందులో పిల్లి ఎక్కడుందిరా బాబూ?) శ్రద్ధగా వైద్యం చేయించుకుంటున్న కొండముచ్చు ఓ వ్యక్తి కొండముచ్చు వీడియోను తన ఫేస్బుక్ ఖాతాలో ఉంచాడు. దీంతో అది కాస్తా వైరల్గా మారింది. అనంతరం ఐఎఫ్ఎస్ అధికారి సందీప్ త్రిపాఠీ ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అది కోలుకుందా? చాలా క్యూట్గా ఉంది. అద్భుతం! మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చెప్పే దృశ్యం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఎగ్జామ్కు ముందు 'బ్రిలియంట్' ఐడియా! ) -
వైరల్ : నిజంగా ఇదో అద్భుతమైన థ్రిల్లర్!
చిటార కొమ్మన ఉన్న మిఠాయి పొట్లం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘తేనె తుట్టె’. కానీ, ఈ చిరుతపులి దృష్టిలో మాత్రం చిటారు కొమ్మన ఉన్న మిఠాయి పొట్లం ఓ కోతి. దాన్ని అందుకోవటానికి చిటారు కొమ్మ వరకు చేరింది. మర్కటాన్ని కిందపడేయటానికి బాగానే శ్రమించింది. అది మాత్రం ప్రాణ భయంతో చిటారు కొమ్మను అతుక్కుపోయింది. కొద్దిసేపటి తర్వాత కోతి కింద పడిందనుకుందో ఏమో చిరుత పులి కిందకు దిగిపోయింది. కోతి బతుకు జీవుడా అనుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద శుక్రవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. (గర్భిణీ ఏనుగును చంపింది ఇతడేనా?) వీడియో దృశ్యం ‘‘చిటారు కొమ్మన ఉన్న కోతిని కిందపడేసి తినడానికి చిరుత ప్రయత్నం చేసింది. కోతి మాత్రం చెట్టును గట్టిగా పట్టుకుని బ్రతికి పోయింది. అరుదుగా కనిపించే దృశ్యం. నిన్న నేను పోస్ట్ చేసిన కోడెనాగు-కోతి వీడియో కంటే ఇది చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ప్రకృతి మనల్ని నిత్యం సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది.. ప్రకృతి నిజంగా ఓ అద్భుతమైన థ్రిల్లర్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (వైరల్: మీ మనసును టచ్ చేసే వీడియో!) చదవండి : కోబ్రాతో ఫైట్: కోతి పోరాటానికి ఫిదా! -
కోతిని తినడానికి చిరుత ప్రయత్నం..
-
కోతి, కింగ్ కోబ్రాల ఒళ్లు గగుర్పొడిచే ఫైట్
-
కోబ్రాతో ఫైట్: కోతి పోరాటానికి ఫిదా!
హైదరాబాద్ : కోతి, కింగ్ కోబ్రాల పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విటర్లో ఈ వీడియో షేర్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియో చాలా ఉత్కంఠగా ఉందని, శ్వాస కూడా తీసుకోకుండా వీక్షించినట్లు పేర్కొన్నారు. ఇక కోతి, కింగ్ కోబ్రా పోరులో అంతిమంగా కోతే గెలిచిందని, అంతేకాకుండా అద్భుత పోరాట స్పూర్థిని ప్రదర్శించిందని సుశాంత నంద ట్వీట్లో పేర్కొన్నాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అడవిలో కోతి, కింగ్ కోబ్రాలు ఎదురెదురుపడ్డాయి. ఈ క్రమంలో పాము పడగెత్తి, కసిగా బుసలు కొడుతుంటే తొలుత కోతి భయపడుతూనే ఎదురుదాడి చేసింది. అనంతరం ఒక్కసారిగా రెచ్చిపోయిన కోతి పాము తలను కొరకడానికి ప్రయత్నించింది. కోతి అసాధారణ పోరాటానికి కింగ్ కోబ్రా తోక ముడుచుకొని వెళ్లిపోయింది. థ్రిల్లింగ్ యాక్షన్ ఫైట్కు సంబంధించిన ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతి పోరాటానికి ఫిదా అవుతున్నారు. -
కలకలం: కరోనా సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి
లక్నో: మీరట్ వాసులు కోవిడ్ భయంతో వణికిపోతున్నారు. దీనికి కారణం అక్కడి కోతుల గుంపు చేసిన తుంటరి పనే. ఆట బొమ్మ అనుకుందో, అరటి పండే అనుకుందో ఏమో కానీ ఓ కోతుల గుంపు కరోనా అనుమానితుల నమూనాలను ఎత్తుకెళ్లింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీరట్ మెడికల్ కాలేజీలో ముగ్గురు కోవిడ్ అనుమానితులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిని పరీక్షించేందుకు శుక్రవారం ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఈ టెస్ట్ సాంపిల్స్ను మోసుకు వెళుతుండగా ఒక్కసారిగా కోతులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. (కోతులపై టీకా పరీక్ష.. సానుకూలం) అనంతరం అతని దగ్గర ఉన్న సాంపిల్స్ను ఎత్తుకెళ్లాయి. అందులో ఓ కోతి కరోనా టెస్టింగ్ కిట్ను నమిలివేస్తూ కనిపించిందని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతవాసులు హడలెత్తిపోతున్నారు. టెస్టింగ్ కిట్లలో కరోనా వైరస్ ఉండొచ్చేమోనని, వాటిని వానరాలు ఎక్కడ తమ ఇళ్లపై విసిరేస్తాయోనని ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మరోవైపు వైద్యులు కోవిడ్ అనుమానితుల దగ్గర నుంచి మరోసారి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. (పెళ్లి మండపం నుంచే క్వారంటైన్ సెంటర్కు..) -
కోతి కుప్పిగంతులు వేస్తూ హల్చల్
-
ఆపరేషన్ థియేటర్లో కోతి హల్చల్
వాషింగ్టన్: ఓ ఆసుపత్రిలో పాము సంచరిస్తోందన్న ఊహాగానాలు మొదలవడంతో అందులోని జనాలు భయాందోళనకు గురయ్యారు. తీరా అక్కడ పాము లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాముకు బదులుగా అక్కడి ఆపరేషన్ థియేటర్లో కోతి కుప్పిగంతులు వేస్తూ హల్చల్ చేసింది. ఈ ఘటన ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సుమారు మూడు నెలల లాక్డౌన్ తర్వాత ఆసుపత్రిలో శస్త్రచికిత్స సేవలను ప్రారంభించేందుకు శుక్రవారం సిబ్బంది సిద్ధమయ్యారు. (ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం) ఇంతలో ఓ ఆపరేషన్ గదిలో కోతి కనిపించగా వెంటనే దగ్గరలోని ఎంపరర్ వ్యాలీ జూ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే సదరు సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని కోతిని పట్టుకెళ్లారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. కోతి హంగామా వల్ల ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు ఆలస్యమయ్యాయి. అదే సమయంలో ఆసుపత్రిలో పెద్ద పాము కూడా తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు రావడంతో స్పందించిన యాజమాన్యం వీటిని ఖండించింది. ఆసుపత్రిలో పాము ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. (ఏటీఎమ్ చోరీకి యత్నించిన కోతి) -
అమ్మ ప్రేమ : ఎలా మిస్ అవుతుంది?
న్యూఢిల్లీ : ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే గొప్ప పేమ్ర ఏదీ లేదు. అమ్మచూపించే భద్రత, అమ్మ మన పట్ల తీసుకునే బాధ్యతని ఈ ప్రపంచంలో ఎవరు తీసుకోలేరు. అందుకే తల్లిని ప్రేమను మించిన దైవం ఉండదు అని అంటారు. కొన్ని సార్లు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకోసం కష్టపడుతుంది తల్లి. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. విద్యుత్ తీగలపై చిక్కుకున్న బిడ్డను ప్రాణాలకు తెగించి కాపాడింది ఓ తల్లి కోతి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘తల్లి చేసిన రెస్క్యూ ఆపరేషన్. ఎలా విఫలమవుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వీడియో ప్రకారం.. ఓ పిల్ల కోతి విద్యుత్ తీగలపై ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా.. తల్లి కోతి ఉన్న బిల్డింగ్పై చేరుకోలేకపోతుంది. విద్యుత్ తీగలపై ఇరుక్కొని బయటకు రాలేక అవస్థలు పడుతున్న బిడ్డని చూసి తల్లి కోతి తల్లడిల్లిపోయింది. వెంటనే తీగలపై దూకి బిడ్డను కాపాడే ప్రయత్నం చేసింది. కానీ సఫలం కాలేకపోయింది. దీంతో తిరిగి బిల్డింగ్పైకి జంప్ చేసిన తల్లి కోతి మరో మారు ప్రయత్నించింది. ఈ సారి గట్టిగా జంప్ చేసి క్షణాల్లో పిల్ల కోతిని తీసుకొని బిల్డింగ్పై దూకింది. ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.‘తల్లి ప్రేమ మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా ఒకేలా ఉంటుంది’,, ‘ బిడ్డ రక్షణ కోసం తల్లి ఏ పనైనా చేస్తోంది’,, ‘వావ్, తల్లి ప్రేమ అంటే ఇదే’,, ‘గొప్ప వీడియో.. తల్లి ప్రేమ వెలకట్టలేనిది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
కోతులపై టీకా పరీక్ష.. సానుకూలం
లండన్: కరోనా వైరస్పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలు కనిపించాయి. ఈ పరిశోధనలో భాగంగా ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్ను ఆరు కరోనా బాధిత కోతులకు ఇచ్చారు. దీంతో ఆ కోతుల్లోని రోగ నిరోధక శక్తి కరోనాను అడ్డుకున్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో దుష్ప్రభావాలు ఏవీ కనిపించలేదు. కరోనా వల్ల ప్రధానంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కానీ, ఈ వ్యాక్సిన్ డోసు ఇచ్చిన కరోనా బాధిత కోతుల్లో ఊపిరితిత్తులకు ఎలాంటి హానీ జరగలేదు. ఇతర అవయవాలపైనా వైరస్ తీవ్రతను వ్యాక్సిన్ తగ్గించింది. కోతుల్లో జరిగిన పరిశోధన సానుకూల ఫలితాన్ని ఇవ్వడంతో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తయారీకి ఊతం లభించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ మనుషుల్లో కూడా కరోనాను నిర్మూలిస్తుందని తేలితే ఈ ఏడాది చివరి కల్లా 10 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఔషధ తయారీ సంస్థ అస్ట్రాజెనికా వెల్లడించింది. -
ఏటీఎమ్ చోరీకి యత్నించిన కోతి
న్యూ ఢిల్లీ: కోతి చోరీకి పాల్పడింది. అయితే ఈసారి ఆహార పదార్థాలనో ఎత్తుకెళ్లలేదు. ఏకంగా బ్యాంకు ఏటీఎమ్ మీదే దాని కన్ను పడింది. ఇంకేముందీ ఎవరూ లేని సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఏటీఎమ్ గదిలోకి చొరబడింది. వెంటనే దానికి తోచిన ప్లాన్ను అమల్లో పెట్టింది. ఏటీఎమ్ను పట్టుకుని వేలాడుతూ, తిరుగుతూ కుప్పిగంతులేసింది. కోతి దెబ్బకు ఏటీఎమ్ ముందు భాగం తెరుచుకుంది. ప్లాన్ సక్సెస్ అయినట్టుందంటూ హుషారుగా అందులోకి తొంగి చూసిన వానరానికి ఒక్క నోటు కూడా కనిపించలేదు. దీంతో తన శ్రమంతా వృథా అయిందని భావించిన కోతి విసుగ్గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. (చేతుల్లేకి కోతికి అరటి పండు తినిపించిన పోలీసు) ఈ అరుదైన ఏటీఎమ్ చోరీ ఢిల్లీలో చోటు చేసుకుంది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. దోపిడీ ప్రధానాంశంగా తిరిగే పాపులర్ వెబ్ సిరీస్ "మనీ హేస్ట్"తో పోలుస్తూ కోతిని "మంకీ హేస్ట్" అని పిలుస్తున్నారు. కొందరేమో కోతి దొంగతనం కామెడీగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. "అసలే మందు రేట్లు మండిపోతున్నాయి. ఓ బాటిల్ కొనుక్కునేందుకు డబ్బుల్లేక, అది దొంగతనానికి ప్రయత్నించి ఉంటుంద"ని ఓ మందుబాబు దానిపై జాలి చూపించాడు. కొందరు మాత్రం అది నిజంగా దొంగ కోతేనేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చోరీ చేయడంపై శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎమ్ మీదకు వదిలినట్టున్నారని అభిప్రాయపడుతున్నారు. (కోతులకు కరోనా సోకితే అంతే) -
సైకిల్పై వచ్చి చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి
ఇటీవల ఓ కోతి సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి విచిత్ర సంఘటన మరొకటి చోటుచేసుకుంది. సైకిల్పై వచ్చిన ఓ కోతి రెండేళ్ల చిన్నారిని రోడ్డుపై లాక్కెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాళ్లోకి వెళితే.. కొంతమంది చిన్నారులు రోడ్డు పక్కన ఉన్న ఓ బెంచ్పై కూర్చొని ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో సైకిల్పై వేగంగా అక్కడికి వచ్చిన ఓ కోతి.. సైకిల్ కిందపడేసి చిన్న బాబును తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అతను అదుపు తప్పి కిందపడిపోయాడు. అయినా సరే కోతి వదిలిపెట్టలేదు.. మళ్లీ వెనక్కి వచ్చి మరీ చిన్నారి దుస్తులను పట్టుకొని కొంత దూరం రోడ్డుపై లాక్కెళ్లింది. ఇది గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే అక్కడికి రావడంతో కోతి బాలుడిని వదిలేసి పారిపోయింది. (ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు.. ) కాగా దీనికి సంబంధించిన వీడియోను అమెరికన్ బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ సోమవారం ట్విటర్లో పోస్ట్ చేశాడు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నాలుగు మిలియన్ల వ్యూవ్స్ను సొంతం చేసుకుంది. 16వేల మంది దీనిపై స్పందించారు. ఇక వీడియోను చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. కోతి బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. (అందుకోసం ఏడు గంటలు శ్రమించిన హృతిక్ )