చిత్తూరు జిల్లా తిరుపతి నగరం బైరాగిపట్టెడ ప్రాంతంలోని రవీంద్రభారతి స్కూల్ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
స్కూల్ భవనంపై నుంచి పడి..
Nov 25 2015 11:27 AM | Updated on Nov 9 2018 5:02 PM
గాంధీనగర్: చిత్తూరు జిల్లా తిరుపతి నగరం బైరాగిపట్టెడ ప్రాంతంలోని రవీంద్రభారతి స్కూల్ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలివీ... పద్మావతి పురం ప్రాంతానికి చెందిన మునిస్వామిరెడ్డి, మహేశ్వరి దంపతుల కుమారుడు హరికృష్ణారెడ్డి (14) స్థానిక రవీంద్రభారతి స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.
బుధవారం ఉదయం పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి హరికృష్ఱ కిందికి పడిపోయాడు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన అతనిని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటనపై విద్యార్థి తల్లి దండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థి ని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి రిమ్స్కు తరలించారు.
Advertisement
Advertisement