చిత్తూరు: కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. గణేశుడికి మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి గురువారం పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో బోర్డు సభ్యులను కూడా దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఛైర్మన్, పాలకవర్గం, అధికారులు కార్యక్రమాన్ని బహిష్కరించారు.