విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పెరిగాయి. ఏజెన్సీ ప్రాంతంలోని చింతపల్లిలో 15.5 డిగ్రీలు, లంబసింగిలో 13, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు చలీగాలులు బాగా వీచడంతో గిరిజనులు ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది.