రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రమణక్క పేటలోని సరుగుడు తోటలను నరికేందుకు గురువారం అధికారులు ప్రయత్నించారు. దీంతో సెజ్ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు తెలియాల్సి ఉంది.