tension
-
పదోతరగతి పరీక్షలు: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడి పరార్..! గెలుపుని ఒడిసిపడదాం ఇలా..
ఈనెల 21 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలు అంటే విద్యార్థులకు భయం ఏర్పడడం సహజం. ఇలాంటి సమయాల్లో ఎంతో నేర్పుగా ఉండి, ఆందోళనలను దూరం చేసుకుని స్వేచ్ఛగా పరీక్షలను రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక బద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలు కలుగుతుంది.ఉపాధ్యాయులు ఇలా చేయాలి..విద్యార్థులను జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరు తో ఒత్తిడి చేయరాదు. ఇంటి వద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దానిపై తల్లిదండ్రులతో ఆరా తీయాలి. పరీక్షల నేపథ్యంలో ఆందోళన చెందకుండా తరచూ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడి ప్రోత్సహించాలి.విద్యార్థులతో చేయకూడనివి..విద్యార్థులను ఇతరులతో పోల్చి వాళ్లలోని ఆత్మనున్యత భావాన్ని కలిగించరాదు. వారిని భోజనం చేయడానికి ఒంటరిగా వదలకుండా వారితో కలిసి కడుపునిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ వాళ్ల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. వారిపై అత్యాశలు పెట్టుకొని వారిని చదవాలంటూ తరచూ ఒత్తిడికి గురిచేయొద్దు. తల్లిదండ్రులు, టీచర్లు వారి ఆశలను పిల్లలపై రుద్ది ఇబ్బందులకు గురి చేయరాదు.వైద్యులతో కౌన్సెలింగ్పరీక్షలు అంటేనే భయానికి గురయ్యే విద్యార్థులకు ఒత్తిడి బారిన పడకుండా స్థానిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలని తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు సూచనలు చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర కలిగి ఉండడం, యోగా ధ్యానం చేసే విధంగా ప్రోత్సహించాలి. టీవీ సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి.పంచ సూత్రాలు పాటిద్దాం..ధోరణి: విద్యార్థులు మానసిక స్థితి బాగుండాలి. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఎలాంటి ఆందోళన గురికారాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సందేహాలను నివృత్తి చేసుకొని బృంద చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి.నమ్మకం: సబ్జెక్టుల వారీగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముందుగా తనపై తనకు నమ్మకం కలిగి ఏదైనా సాధించగలమనే దీమా పెంచుకోవాలి. లక్ష సాధనకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి.ఏకాగ్రత: పాఠ్యాంశాలను చదివే క్రమంలో పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండాలి. చదివే సమయంలో ఆలోచనలు, చూపు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.క్రమశిక్షణ: పరీక్షల సమయంలో సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలపైనే దృష్టి పెట్టాలి. చదువును వదిలి పక్కదారి పట్టే విధంగా కాకుండా క్రమశిక్షణగా మెలగాలి.దృష్టి: విద్యార్థుల దృష్టి పూర్తిగా చదువుపై కేంద్రీకరించాలి. వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలతోనే గడపాలి. టీచర్లు, పేరెంట్స్ విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి కఠిన అంశాలపై పట్టు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. సులువైన వాటిని చివరకు చదివే విధంగా సూచనలు చేయాలి.అందమైన చేతి రాతతో..పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించేందుకు అందమైన చేతి రాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలను ఆకట్టుకునే విధంగా గుండ్రంగా రాస్తూ పదాలకు పదాలకు మధ్య సమదూరాన్ని పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, అక్షర దోషాలు లేకుండా కొట్టివేతలకు తావుగకుండా చూసుకోవాలి.తేలికగా జీర్ణమయ్యే ఆహారం మేలుసమయానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు తినాలి. కాఫీ, టీ జోలికి పోరాదు. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.– డాక్టర్ గందె కార్తీక్, జనరల్ ఫిజీషియన్, నారాయణపేటప్రశాంతంగా చదవాలిపరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురికారాదు. మార్కులపై దృష్టి పెట్టి బెంగ పడితే లాభం ఉండదు. మానసిక ప్రశాంతతతోనే ఉత్తీర్ణత సాధిస్తాం. మెదడు చెరుకుగా పనిచేసే విధంగా ఉత్తేజితం కావాలి.– యాద్గిర్ జనార్ధన్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణపేట.ఇతర విషయాలపై దృష్టి పెట్టొద్దుప్రశాంతంగా ఉండి ఉత్సాహంతో పరీక్షలకు హాజరు కావాలి. గంటల తరబడి చదవాలనే నియమం లేదు. మానసికంగా సంసిద్ధులుగా ఉన్న సమయంలోనే పాఠ్యాంశాలు చదవాలి. ఇతర విషయాలపై దృష్టి పెట్టరాదు. ఇప్పటివరకు చదివిన అంశాలనే పునఃశ్చరణ చేసుకోవాలి. కొత్త వాటి జోలికి పోరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.– గోవిందరాజు, డీఈఓ(చదవండి: తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్ అధికారిగా మార్చింది..ఆనంద్ మహీంద్రా మెచ్చిన స్టోరీ..) -
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: మణిపూర్ వ్యాప్తంగా శనివారం నుంచి అన్ని రకాల వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. భద్రతా సిబ్బంది, కుకీ వర్గం ప్రజల మధ్య జరిగిన ఘర్షణల్లో నిరసనకారుడొకరు చనిపోగా 40 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది స్థానికులు కాగా, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ కంగ్పోక్పి వద్ద రెండో నంబర్ ఇంఫాల్–దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు నిరసన చేపట్టారు. అడ్డుకునేందుకు యతి్నంచిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో ప్రైవేట్ వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. మండుతున్న టైర్లను రోడ్డుపై పడేశారు. ఇంఫాల్ నుంచి సేనాపతి జిల్లా వైపు వెళ్తున్న రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయతి్నంచడంతో పరిస్థితి చేయి దాటింది. దీంతో, భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మైతేయి వర్గం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు కాంగ్పోక్పికి రాకమునుపే అడ్డుకున్నారు. ర్యాలీ ముందుకు సాగాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లోనే వెళ్లాలని వారికి షరతు విధించారు. చివరికి వారందరినీ 10 ప్రభుత్వ బస్సుల్లో తరలిస్తుండగా కుకీల మెజారిటీ ప్రాంతమైన కాంగ్పోక్పి వద్ద అడ్డుకుని, ఒక బస్సుకు నిప్పంటించేందుకు ప్రయతి్నంచారని పోలీసులు తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించి, నిరసన కారులను చెదరగొట్టాక మైతేయి శాంతి ర్యాలీ నిర్వాహకులున్న బస్సులు ముందుకు సాగాయని చెప్పారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచి్చందని చెప్పారు. -
New Year 2025: ప్రారంభంలోనే ‘పరీక్షా కాలం’
నేటి (2025, జనవరి ఒకటి)నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు పరీక్షా కాలంగా నిలిచింది. దీంతో వారు కాస్త ఆందోళనలో ఉన్నారు. ఈ పరీక్షలు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభంకానున్నాయి. యూజీసీ నెట్ మొదలుకొని జేఈఈ మెయిన్ వరకూ పలు పరీక్షలు ఈ మాసంలోనే జరగనున్నాయి. సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలుఈ సంవత్సరం ప్రారంభంలోనే సీబీఎస్ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీబీఎస్ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలలకు 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 14 మధ్య జరగనున్నాయి.యూజీసీ నెట్ పరీక్షనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డిసెంబర్ 2024 సెషన్ కోసం యూజీసీ నెట్ పరీక్షను 2025, జనవరి 3, నుండి జనవరి 16 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష 85 సబ్జెక్టులలో కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలుయూపీ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష జనవరి 23 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు.ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-2 పరీక్షస్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్)టైర్-2 పరీక్షను 2025, జనవరి 18, 19,20 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా గ్రూప్ బీ, సీ మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2కు హాజరుకాగలుగుతారు. మరింత సమాచారం కోసం ssc.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.యూకేసీఎస్సీ ఎస్ఐ పరీక్షఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్-ఇన్స్పెక్టర్ (యూకేసీఎస్సీ ఎస్ఐ) పోస్టుల రిక్రూట్మెంట్ పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ పరీక్ష 2025, జనవరి 12న నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్లను 2025, జనవరి 2 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు.యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఇంటర్వ్యూయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జనవరి 7 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు, ఇతర వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించవచ్చు.జేఈఈ మెయిన్స్ పరీక్షఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి సెషన్ 2025, జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు జారీ చేస్తారు. అయితే పరీక్ష జరిగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం nta.ac.in ని సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
రైతులపై టియర్ గ్యాస్.. ఢిల్లీ చలో వాయిదా
ఢిల్లీ : కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం ఆదివారం వాయిదా పడింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో శంభు సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి వందలాది మంది రైతులు పాదయాత్రగా ఢిల్లీ చలో కార్యక్రమాన్నిపున:ప్రారంభించారు. అయితే రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో కార్యక్రమంపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు శంభు సరిహద్దులో భారీ ఎత్తున మోహరించారు. పాదయాత్రగా తరలివస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. పాదయాత్ర సాగకుండా ఇనుపు కంచెలు ఏర్పాటు చేయడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆదివారం చేస్తున్న ఢిల్లీ చలో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. తమ పాదయాత్రపై సోమవారం తమ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు సరిహద్దు నుంచి ముందుకెళుతున్న రైతులపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారురైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారుటియర్ గ్యాస్ ప్రయోగంతో రైతులు చెల్లాచెదురయ్యారు.తమకు చెప్పిన 101 మంది ఇతరులు ర్యాలో పాల్గొన్నారంటున్న పోలీసులు అందుకే అడ్డుకున్నామని సమర్థింపు #WATCH | Farmers' 'Dilli Chalo' march | Visulas from the Shambhu border where Police use tear gas to disperse farmers"We will first identify them (farmers) and then we can allow them to go ahead. We have a list of the names of 101 farmers, and they are not those people - they… pic.twitter.com/qpZM8LK1vw— ANI (@ANI) December 8, 2024 పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరు కొనసాగిస్తున్నారు.డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ ఆదివారం(డిసెంబర్8) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది.#WATCH | Farmers begin their "Dilli Chalo' march from the Haryana-Punjab Shambhu Border, protesting over various demands. pic.twitter.com/9EHUU2Xt1j— ANI (@ANI) December 8, 2024 ‘ఢిల్లీ చలో’ నేపథ్యంలో దేశ రాజధాని శంభు సరిహద్దు వద్ద ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొందిరైతుల ర్యాలీని అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లను సిద్ధంగా ఉంచారు.#WATCH | Morning visuals from the Haryana-Punjab Shambhu Border where the farmers are protesting over various demands. A 'Jattha' of 101 farmers will march towards Delhi today at 12 noon according to farmer leader Sarwan Singh Pandher pic.twitter.com/NG9VfXL6cg— ANI (@ANI) December 8, 2024సరిహద్దు వద్ద కవరేజీకి మీడియాకు అనుమతి నిరాకరించిన పోలీసులుఇది పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేసి కుట్ర అని ఆరోపించిన రైతులుగత ఆందోళనల్లో మీడియా ప్రతినిధులు గాయపడ్డారంటున్న పోలీసులు#WATCH | SSP Patiala, Nanak Singh says, "Media has not been stopped. We have no such intentions. But, it was needed to brief the media. Last time we came to know that 3-4 media people were injured. To avoid that we briefed the media... We will try not to let this happen - but if… https://t.co/bStxTaLs8x pic.twitter.com/iacEB95jHQ— ANI (@ANI) December 8, 2024 నిజానికి శుక్రవారం నుంచే చలో ఢిల్లీ మలి విడత మొదలైంది.రైతుల ర్యాలీపై హర్యానా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో మొత్తం 16 మంది గాయపడ్డారు.. వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారు:రైతు నేతలుపలువురు రైతులు గాయపడడంతో శనివారం ర్యాలీని నిలిపివేశాం.తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు.మాతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకే చలో ఢిల్లీని ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాం. -
ఎక్కడ ఆ పులి.. ఇక్కడ ఆడ బెబ్బులి..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్–టి మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే పరిసర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే, అదే మండలంలోని పులిదాడి జరిగిన దుబ్బగూడ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు ఏమాత్రం వణుకులేకుండా ఎద్దుల బండిని తోలుతూ వ్యవసాయ పనులకు వెళ్తుండటం ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
పులి కోసమే వెతుకుతున్నాం సర్..
కాగజ్నగర్ డివిజన్లో ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిర్పూర్ రేంజ్లో అటవీ అధికారి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆయన కార్యాలయంలో నిజమైన పులిని తలపిస్తున్న పులి బొమ్మ ఆసక్తి రేపుతోంది.పులి భయంతో.. జ్వరం!ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో రైతు రౌత్ సురేశ్పై పులి దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుజాత జ్వరంతో మంచం పట్టింది. ఏ క్షణాన ఎవరిపై పులి దాడి చేస్తుందో తెలియక.. దుబ్బగూడ.. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. – ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ప్రెజర్ నుంచి ప్లెజర్కు...
పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యల ఒత్తిడి, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి... ‘ఒత్తిడి’ రాక్షస పాదాల కింద ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి. అయితే ఒత్తిడి అనేది తప్పించుకోలేని పద్మవ్యూహమేమీ కాదు. ఒత్తిడిని చిత్తు చేసే వజ్రాయుధం, ఔషధం సంగీతం అని తెలిసిన స్వప్నరాణి... ఆ ఔషధాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు, గృహిణుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమందికి చేరువ చేస్తోంది. మరోవైపు మరుగునపడిన జానపదాలను వెలికి తీస్తూ ఈ తరానికి పరిచయం చేస్తోంది. ‘సంగీతం ఈ కాలానికి తప్పనిసరి అవసరం’ అంటుంది.నిజామాబాద్కు చెందిన స్వప్నరాణి సంగీతం వింటూ పెరిగింది. సంగీతం ఆమె అభిరుచి కాదు జీవనవిధానంగా మారింది. యశ్వంత్రావ్ దేశ్పాండే దగ్గర హిందుస్తానీ సంగీతంలో డిప్లమా, పాలకుర్తి రామకృష్ణ దగ్గర కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ, పీహెచ్డీ చేసింది. ఉత్తర తెలంగాణలో సంగీతంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది.‘ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు’ అనే అంశంపై పరిశోధన చేసింది. తన పరిశోధనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరువందలకు పైగా జానపద పాటలను సేకరించింది. సంగీతం అనేది నిలవ నీరు కాదు. అదొక ప్రవాహ గానం. ఆ గానాన్ని సంగీత అధ్యాపకురాలిగా విద్యార్థులకు మాత్రమే కాదు వయో భేదం లేకుండా ఎంతోమందికి చేరువ చేస్తోంది స్వప్నరాణి.స్వప్నరాణి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి కనీస అర్హత ఏమిటి?‘నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది’ అనే చిన్న మాట చాలు.నిజామాబాద్లోని ప్రభుత్వ జ్ఞానసరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ తిప్పోల్ల స్వప్నరాణి ‘నాకు వచ్చిన సంగీతంతో నాలుగు డబ్బులు సంపాదించాలి’ అనే దృష్టితో కాకుండా ‘నాకు వచ్చిన సంగీతాన్ని పదిమందికి పంచాలి’ అనే ఉన్నత లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.స్వప్నరాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న వారిలో కాస్తో కూస్తో సంగీత జ్ఞానం ఉన్నవారితో పాటు బొత్తిగా స ప స లు కూడా తెలియని వారు కూడా ఉన్నారు.స్వప్న శిష్యుల్లో సాధారణ గృహిణుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎంతోమంది ఉన్నారు.‘సంగీతం గురించి వినడమే కానీ అందులోని శక్తి ఏమిటో తెలియదు. స్వప్న మేడమ్ సంగీత పాఠాల ద్వారా ఆ శక్తిని కొంచెమైనా తెలుసుకునే అవకాశం వచ్చింది. స్ట్రెస్ బస్టర్ గురించి ఏవేవో చెబుతుంటారు. నిజానికి మనకు ఏ కాస్త సంగీతం వచ్చినా ఒత్తిడి అనేది మన దరిదాపుల్లోకి రాదు’ అంటుంది ఒక గృహిణి.‘సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్నప్పటి కల. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాను. ఈ టైమ్లో సంగీతం ఏమిటి అనుకోలేదు. స్వప్నగారి పాఠాలు విన్నాను. నా కల నెరవేరడం మాట ఎలా ఉన్నా... సంగీతం వల్ల ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి.ఇప్పటికి ఐదుసార్లు శతగళార్చన కార్యక్రమాలు నిర్వహించిన స్వప్న ‘సహస్ర గళార్చన’ లక్ష్యంతో పనిచేస్తోంది. ‘రాగం(నాదం), తాళంలో శృతిలయలు ఉంటాయి. నాదంలో 72 ప్రధాన రాగాలు ఉంటాయి. ఏ శబ్దం ఏ రాగంలో ఉండాలో ట్రాక్ తప్పకుండా ఉండాలంటే నేర్చుకునేవారిలో ఏకాగ్రత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఒక దీక్షలా అభ్యసిస్తేనే సంగీతంలో పట్టు సాధించడం సాధ్యమవుతుంది’ అంటుంది స్వప్నరాణి.భవిష్యత్తుకు సంబంధించి స్వప్నరాణికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తన విద్యార్థులను ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి రోజున తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సంసిద్ధం చేయడం వాటిలో ఒకటి. భవిష్యత్తులో సహస్ర గళార్చన కార్యక్రమాలు ఎక్కువగా చేసే లక్ష్యంతో శిష్యులను తీర్చిదిద్దుతుంది.సంగీతం... ఈ కాలానికి తప్పనిసరి అవసరం‘సంగీతం మనకు ఏం ఇస్తుంది?’ అనే ప్రశ్నకు ఒక్క మాటల్లో జవాబు చెప్పలేం. సంగీతం అనేది తీరని దాహం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు. అందుకే ఈ కాలానికి సంగీతం అనేది తప్పనిసరి అవసరం.సంగీతం వినడమే కాదు నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. నా పరిశోధనలో భాగంగా మరుగున పడిన ఎన్నో జానపదాలను సేకరించిన వాటిని ఈ తరానికి పరిచయం చేస్తున్నాను.– స్వప్నరాణి– టి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
డీకే అరుణ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి,వికారాబాద్జిల్లా:మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం(నవంబర్ 18) చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. -
టీడీపీ-జనసేన బాహాబాహీ
సాక్షి, అమరావతి/పిఠాపురం: పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన ఎన్డీఏ పార్టీల విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు తలపడ్డారు. టీడీపీ ఇన్ఛార్జి వర్మ, జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలోనే ఇరుపార్టీల నేతలు ఒకరినొకరు తోసుకుని గందరగోళం సృష్టించడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి ఎవరికి వారు వెళ్లిపోయారు. అలాగే, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి వ్యతిరేకంగా ‘క్విట్ నెల్లిమర్ల’ అంటూ టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇక ఏలూరు జిల్లా పైడిచింతపాడులో పింఛన్ల పంపిణీపై టీడీపీ, జనసేన నేతలు ఘర్షణపడి కొట్టుకున్నారు. చివరికి.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోగా, జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గందరగోళంగా మారింది. ఇలా రెండు పార్టీల నేతలు తమదే పైచేయి కావాలని వివిధ నియోజకవర్గాల్లో పోటీపడుతూ.. ఘర్షణలకు దిగుతూ రభస సృష్టిస్తున్నారు.పైడిచింతపాడులో దాడికి దిగిన తెలుగు తమ్ముళ్ళు, జనసేన కార్యకర్తలుపిఠాపురంలో కండువాలు, ఫొటోల గోల..పిఠాపురంలో శుక్రవారం కూటమి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ సమావేశం కూటమి నేతల బాహాబాహీకి వేదికగా మారిపోయింది. వేదికపై వేసిన ఫ్లెక్సీలో టీడీపీ నేత వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్లవి పెద్ద ఫొటోలు వేసుకుని జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ది చిన్నఫొటో వేయడంపై జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. సమావేశంలో కురుమళ్ల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థి మూడు పార్టీల కండువాలు వేసుకున్నారుగానీ వచ్చిన టీడీపీ నేతలు కేవలం వారివారి పార్టీ జెండాలే వేసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇద్దరూ ఇకే మాటపై ఉంటుంటే ఇక్కడ మాత్రం టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తూ జనసేనను తొక్కేయాలని చూస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసేన పనిచేస్తోందా?.. మరి పిఠాపురంలో టీడీపీ ఎందుకు జనసేన, పవన్కు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ కురుమళ్ల ప్రశ్నించడంతో గందరగోళం మొదలైంది. దీంతో టీడీపీ నేతలు అరుపులు, కేకలతో వేదికపైకి దూసుకురావడంతో రెండు పార్టీల నేతల కార్యకర్తల మధ్య తోపులాట, తన్నులాట చోటుచేసుకుంది. రెండు పార్టీల నేతలు తమ కార్యకర్తలను అదుపుచేసేందుకు ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వర్మ, రాజశేఖర్, మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడ నుంచి నిష్క్రమించారు. పింఛన్ల పంపిణీ కోసం డిష్యూం డిష్యూం.. మరోవైపు.. పింఛన్ల పంపిణీ కోసం గురువారం దెందులూరు నియోజకవర్గం, కొల్లేరు గ్రామం పైడిచింతపాడు టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్లాటకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అనంతరం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వాస్తవానికి.. గ్రామ టీడీపీ నాయకుడు సైదు సత్యనారాయణ వర్గీయులు దీపావళి రోజున వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడగా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, గ్రామ సర్పంచ్ ముంగర తిమోతీ, మోరు సుబ్బారావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు తదితరులు సచివాలయానికి చేరుకున్నారు. తాములేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జనసేన నాయకుడు ముంగర వెంకటేశ్వరరావు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇందులో గాయపడిన జనసేన కార్యకర్తలు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) కట్టాలని పోలీసులను కోరారు. అదే సమయంలో టీడీపీ వారు సైతం ఆస్పత్రికి చేరుకుని, తమకు గాయాలయ్యాయని, ఎంఎల్సీ కట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలికి వారి ఫిర్యాదు మేరకు ఎంఎల్సీ కట్టారు. దీంతో జనసేన నేతలు విజయవాడ వెళ్లి అక్కడ ప్రభుత్వాస్పత్రిలో చేరి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ నేతల చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏలూరు రూరల్ పోలీసులు జనసేన నేతలను అదుపులో తీసుకున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నేతలు ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి.. టీడీపీ నేత, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆమెకు వ్యతిరేకంగా బంగర్రాజు శుక్రవారం టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి ఆమె నియోజకవర్గాన్ని విడిచి వెళ్లిపోవాలని హడావుడి చేశారు. ఆమె తీరుతో నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత లేకుండాపోయిందని వాపోతున్నారు. నిజానికి.. రెండ్రోజుల క్రితం నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి, బంగర్రాజు మధ్య హాట్హాట్గా వాగ్వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత
చురాచంద్పూర్: మణిపూర్లో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. చురాచంద్పూర్ జిల్లాలోని టుయుబాంగ్ సబ్ డివిజన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న దరిమిలా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్ నిర్వహించారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023లోని సెక్షన్ 163 ప్రకారం సబ్ డివిజన్లో నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు.కుకీ-జోమి గ్రామ వాలంటీర్లు పిలుపునిచ్చిన బంద్ కారణంగా మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయని, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బంద్ చేపట్టారు. బంద్ మద్దతుదారులు ట్యూబాంగ్ మార్కెట్ వద్ద రోడ్డు మధ్యలో పాత టైర్లతో సహా వ్యర్థ పదార్థాల కుప్పను తగులబెట్టారు. బాలిక కుటుంబ సభ్యులు అక్టోబర్ 21న ఫిర్యాదు చేయడంతో, నిందితుడైన దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఏవో వస్తువులు కొనుగోలు చేసేందుకు నిందితుని దుకాణానికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిందితులు ఆ దుకాణ యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత
-
కాంగ్రెస్ లో టెన్షన్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై గాంధీ భవన్ లో చర్చ
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
తాడిపత్రి,సాక్షి: ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు. -
ఆ శబ్దం వారికే వినిపిస్తుంది, వెంటాడుతుంది! వేలల్లో కేసులు నమోదు!
మీరెప్పుడైనా రాత్రి పూట చెవి చుట్టూ దోమ తిరగడం గమనించారా? అది తిరిగిన కాసేపు చిర్రెత్తుకొస్తుంది. లైటు వేసి దాన్ని చంపేదాకా నిద్రపట్టదు. కానీ ప్రపంచంలో చాలామందికి ఓ విచిత్రమైన కొత్తశబ్దాన్ని.. అసంబద్ధంగా వింటూ.. నిద్రకు దూరమవుతున్నారట. లైట్ తీసినా, వేసినా.. మెలకువగా ఉన్నా.. నిద్రపోయినా.. పోనీ ఆ చోటుని వదిలి ఎంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారు వినే ఆ శబ్దం.. తమ వెంట ఉన్నవారికి కూడా వినిపించకపోవచ్చు. అదే ‘ది హమ్’ మిస్టరీ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ కేసులు వేలల్లో నమోదయ్యాయి. శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య అస్పష్టమైన ఓ అలికిడి ఉంటుందని.. రాత్రివేళ దాన్ని స్పష్టంగా వింటున్నామని చెప్పే వాళ్లే ఈ మిస్టరీకి సృష్టికర్తలు. వీరిని ‘ది హియర్స్’ అంటారు. సాధారణంగా మనిషి చెవులు.. 20 ఏ్డ (తక్కువ పిచ్) నుంచి 20 జుఏ్డ (అత్యధిక పిచ్) మధ్య ఫ్రీక్వెన్సీలను గ్రహిస్తాయి. కానీ ‘ది హియర్స్’ మాత్రం తమకు ఇంకాస్త తక్కువ ఫ్రీక్వెన్సీలో అస్పష్టమైన నాయిస్ వినిపిస్తోందని వాదిస్తారు. వారు వినే శబ్దాన్ని.. అతి తక్కువ–ఫ్రీక్వెన్సీ హమ్మింగ్లా, రంబ్లింగ్ (దూరంగా ఉన్న పెద్దపెద్ద వాహనాల నుంచి వచ్చే ప్రతిధ్వని) నాయిస్గా భావించారు నిపుణులు. ప్రశాంతమైన నగరాల్లో, పల్లెటూళ్లలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ హమ్మింగ్కి బ్రిస్టల్ హమ్, టావోస్ హమ్, విండ్సర్ హమ్ వంటి పలు పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బ్రిస్టల్ హమ్.. ఇంగ్లాడ్లోని బ్రిస్టల్లో 1970లో తొలి కేసు నమోదైంది. అక్కడి నివాసితులు కొందరు.. రాత్రి పూట ఏదో శబ్దం నిద్రకు భంగం కలిగిస్తోందని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మొదట్లో ఈ హమ్ సమీపంలోని ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ పైలాన్లు కారణం అయ్యి ఉండొచ్చని భావించారట. అయితే మరికొందరు నివాసితులు.. ఆ శబ్దాలన్నీ గ్రహాంతర అంతరిక్ష నౌకల నుంచి వస్తున్నాయని భావించారు. ఇంకొందరైతే.. రహస్య సైనిక చర్యల్లో భాగం కావచ్చని నమ్మారు. అయితే చాలామంది ఈ హమ్ ఈ లోకానికి చెందినది కాదని, మరో లోకానికి సంబంధించిందని ప్రచారం చేశారు. కొన్ని నెలలకు ఆ హమ్ హఠాత్తుగా ఆగినట్లే ఆగి.. బ్రిట¯Œ లోని ఇతర ప్రదేశాలకు వినిపించడం మొదలైంది. అదే హమ్ని ఇప్పటికీ చాలామంది వింటూనే ఉన్నారట. టావోస్ హమ్.. ఇక అమెరికాలోని న్యూ మెక్సికోలో 1990లో ఈ హమ్ ఫిర్యాదులు మొదలయ్యాయి. అయితే ఈ హియర్స్ ఒకే రకమైన శబ్దాన్ని వినడం లేదని అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకమైన శబ్దాన్ని వింటున్నట్లు వివరించడం మొదలు పెట్టారు. దాంతో శాస్త్రవేత్తలు వారు నివేదించిన శబ్దాలను వినేందుకు.. వారి వారి ఇళ్లల్లో.. ప్రత్యేకమైన పరికరాలను కూడా అమర్చారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. శాస్త్రవేత్తలకు ఎలాంటి అసాధారణ కంపనాలు చిక్కలేదు. విండ్సర్ హమ్.. ఇంగ్లాడ్లోని విండ్సర్లో వినిపించే ఈ హమ్.. మొదటిగా ఎప్పుడు గుర్తించారో తెలియదు కానీ.. 2012 నుంచి ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విన్నవారంతా ఇది ఎక్కువ సేపు వినిపిస్తోందని.. బిగ్గరగా వినిపిస్తోందని వాపోతుంటారు. ఈ శబ్దం కిటికీలను కదిలిస్తోందని.. పెంపుడు జంతువుల్ని భయపెడుతోందని ఆరోపించారు. ఇది మానసికస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని మొరపెట్టుకు న్నారు. ఈ శబ్దాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు చేసినా.. ఆ శబ్దం వారిని వెంటాడుతూనే ఉందట. ఈ హమ్ కేసులో స్త్రీ పురుషులు సమానంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు.. తాము హమ్ కేసును పరిష్కరించామని.. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసునని చెప్పారు. పెద్ద పెద్ద అలల కారణంగా సముద్రపు అడుగుభాగం కంపించడమే ఈ హమ్మింగ్కు మూలమని ప్రకటించారు. అయితే ఆ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు ఖండించారు. సముద్రం లేని చోట కూడా ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయంటూ కొట్టిపారేశారు. ఇది ఒక మానసికమైన సమస్య అని కొందరు వైద్యులు చెబితే.. ఇది దూరంగా నడిచే ట్రాఫిక్ నుంచి కానీ, విమానాశ్రయాల నుంచి కానీ, నౌకాయానాల నుంచి కానీ, గాలి మరల నుంచి కానీ కావచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేశారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ఈ శబ్దానికి మిడ్షిప్మ్యాన్ ఫిష్ లేదా టోడ్ ఫిష్లు కారణం కావచ్చని భావించారు. ఈ చేపలు తన సహచరిని సంభోగానికి పిలుపునిచ్చినప్పుడు కొన్నిసార్లు చిన్నగానే హమ్మింగ్ చేస్తాయి కానీ.. కొన్నిసార్లు చాలా పెద్దగా ఎక్కువ సేపు హమ్మింగ్ చేస్తుంటాయట. అది సుమారు గంట ప్రక్రియ అని.. ఆ శబ్దాలే.. ఈ హియర్స్ చెవిన పడుతున్నాయని వాదించారు. మరోవైపు ఈ హమ్మింగ్ బాధితులకు కేవలం ఒత్తిడి, ఆందోళనల వల్లే అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయని ఇంకొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. ఏది ఏమైనా ఈ హమ్(శబ్దం) ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వినిపిస్తోంది? అనేది వినేవాళ్లకు కూడా తెలియకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
Parineeti Chopra: దేవుడా..! టెన్షన్లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్ ఇలా చేస్తుందా!
సాధారణంగా మన జీవితాల్లో ఎన్నో కుదుపులు, చికాకులు, అడ్డంకులు వస్తూంటాయి. వీటిని కొందరు తేలికగా, మరికొందరు టెన్షన్గా తీసుకుంటారు. మరి ఆ టెన్షన్లో చాలామంది కొన్నిరకాల చేష్టలు చేస్తూంటారు. వాటిలో గోళ్లు కొరకడం, వేళ్లు విరవడం, తల పట్టుకోవడం, చికాకు పడుతూ ఉండటంలాంటివి. ఇక ఈ బాలీవుడ్ నటికి మాత్రం ఇలాంటి అలవాటుందని తెలుసా..! టెన్షన్లో ఉన్నప్పుడు.. భయమేసినప్పుడు పరిణీతి చోప్రాకు.. చేతివేళ్ల గోళ్లను కాదు.. ఆ గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్ని కొరకడం అలవాటట! విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా భయపడుతుందట! ఆ భయంతో గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్ని కొరుకుతుందని బాలీవుడ్ సోర్సెస్ ఇన్ఫో. పిజ్జా అంటే పరిణీతికి ప్రాణం. పగలు.. రాత్రి.. అర్ధరాత్రి.. అనే తేడా లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిజ్జా పనిపడుతుందట! ఇవి చదవండి: Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! -
ట్రబుల్ షూటర్ ఎంట్రీ.. టీడీపీ నేతల్లో మొదలైన కలవరం
ఆ నేతకు వైఎస్సార్ కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్గా పేరుంది. ఇప్పుడు ఆయన పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆక్కడి విపక్షాలు కకావికలం అవుతున్నాయి. మొన్నటి వరకు ఎలాగొలా గెలుస్తాం అనుకున్న విపక్షం ట్రబుల్ షూటర్ దిగడంతో కలవరపడుతున్నారు. వైస్సార్సీపీ ట్రబుల్ షూటర్ విజయసాయి రెడ్ది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చే ఎటువంటి టాస్క్ను అయినా.. విజయవంతంగా అమలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. సైరా విజయసాయిరెడ్డిగా ఆయన అభిమానులు పిలుచుకునే ఈ నాయకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. నిన్న మొన్నటి వరకు తమకు తిరుగులేదని భావించిన సింహపురి టీడీపీ నేతలకు సైరా ఎంట్రీతో కలవరం మొదలైంది. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుతో పాటు.. తాను ఎంపీగా గెలిచేలా విజయసాయిరెడ్డికి సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ తన అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. టీడీపీ మాత్రం కొన్ని చోట్ల అభ్యర్థులు లేక.. కొన్ని చోట్ల ఎవరికి ఇస్తే..ఎవరికి కోపం వస్తుందో అనే భయంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొనసాగుతోంది. తొలి జాబితాలో నాలుగు సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించినా.. కోవూరు, ఆత్మకూరు, కందుకూరు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయలేక సతమతం అవుతోంది. దీంతో అక్కడి క్యాడర్, నేతలు డైలామాలో పడ్డారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పేరు ప్రకటించడంతో టీడీపీ నేతలకు భయం రెట్టింపు అయింది.. ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది. విజయసాయి రెడ్డి వేసే ఎత్తులు, పైఎత్తులను తట్టుకోవడం కష్టమని జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించడంతో పాటు.. మొత్తం అన్ని నియోజకవర్గాలో గెలుపే లక్ష్యంగా విజయసాయిరెడ్ది పక్కా ప్రణాళికతో జిల్లాలోకి ఎంటర్ అయ్యారని.. టీడీపీ నేతలను మడత పెట్టడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్దిని.. అలాగే అనం రామ నారాయణ రెడ్డిని ఓడించడం కోసం విజయసాయి రెడ్ది వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని జిల్లాల్లో టాక్ నడుస్తోంది. సింహపురి జిల్లాపై మంచి పట్టు ఉన్న విజయసాయిరెడ్ది ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగటంతో టీడీపీ నేతలకు ఏమీ పాలుపోవడంలేదు. జిల్లాలోని అన్ని వర్గాల్లో, టీడీపీ నాయకులతో కూడా విజయసాయిరెడ్డికి విస్తృత సంబంధాలు ఉండటమే టీడీపీ నాయకత్వంలో భయానికి కారణం అంటున్నారు. విజయసాయి రెడ్దితో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు.. జిల్లా పార్టీ నేతలకు ఇప్పటికే సమాచారం పంపారని తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు సైరాకు టచ్ లో ఉన్నారని.. వారు ఏ క్షణమైనా వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు. విజయసాయిరెడ్డి ఇంకా పూర్తిస్థాయిలో బరిలోకి దిగక ముందే టీడీపీ నేతలకు కంటిమీద కునుకు కరువైంది. వైఎస్ఆర్సీపీలోని నేతల్ని సెట్ రైట్ చెయ్యడంతో పాటు.. టీడీపీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు విజయసాయిరెడ్ది ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే మరోసారి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లిన్ స్వీప్ చేయడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. -
గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్
సాక్షి, హైదరాబాద్: కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల పాఠశా లలు, కళాశాలల్లోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను తెలంగాణరాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఓ కొలిక్కి తీసుకొచ్చింది. వారంరోజుల్లో ఖాళీ లు భర్తీ చేసి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ నియామకాల కంటే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. దీనిపై సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతులు కూడా సమర్పించాయి. సీనియారిటీ జాబితాలు సిద్ధం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యి విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 22వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లలో సీని యర్లకు పదోన్నతులు కల్పించాలి. దీనికి సంబంధించి సొసైటీలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుందని సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే అన్ని కేటగిరీల్లో 3 వేల మందికి పదోన్నతులు దక్కుతాయి. ఆలస్యమైతే.. అంతే టీఆర్ఈఐఆర్బీ ద్వారా గురుకుల విద్యాసంస్థల్లో కొత్తగా 9వేల మంది ఉద్యోగులు చేరనుండగా, ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు పీజీటీ కేటగిరీల్లో 2వేల మంది నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా నియామక పత్రాలు, ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశముంది. అయితే కొత్తవారికి నియామక పత్రాలు ఇవ్వగానే వారి సర్విసు గణన ప్రారంభమవుతుంది. దీంతో అర్హత ఉండి పదోన్నతులు రాని వారంతా కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా ఉండిపోతారు. ఇలా పీజీటీ, జేఎల్, డీఎల్ కేటగిరీల్లోని సీనియర్ల సీనియారిటీ క్రమం తారుమారు అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు చాలా కేటగిరీల్లోని టీచర్లకు పదోన్నతులు రాలేదు. ఇటీవల సీఎంతోపాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు కల్పిస్తారనే నమ్మకం ఉంది. – మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి సీనియర్లు నష్టపోతారు కొత్త నియామకాల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడితే సీనియర్లు తీవ్రంగా నష్టపోతారు. తదుపరి పదోన్నతుల సమయంలో జూనియర్లుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆరేళ్లుగా గురు కులాల్లో పదోన్నతులు నిర్వహించలేదు. పదేళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య పెద్దగానే ఉంది. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తే ప్రస్తుతం పనిచేస్తున్నవారికి లాభదాయకం. – సీహెచ్.బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
Delhi Chalo: రైతు ఉద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు. పోలీసుల భాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై మూడురోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టువిడవడం లేదు. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రి, సింఘు, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్గ్యాస్ షెల్స్కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్లోని బీఎస్ఎఫ్ టియర్స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మొహరించారు. చండీగఢ్లో రైతు సంఘాల నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథెర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్య గురువారం రాత్రి మూడో దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్ను పాటించనున్నారు. ‘‘రైతులెవ్వరూ శుక్రవారం నుంచి పొలం పనులకు వెళ్లొద్దు. కారి్మకులు సైతం ఈ బంద్ను భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. భారత్బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హరియాణాలోని నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో 17వ తేదీ దాకా టెలికాం సేవలను నిలిపేస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు సైన్యంలా ఢిల్లీ ఆక్రమణకు వస్తున్నారంటూ బీజేపీ పాలిత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్లోనూ శుక్రవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పట్టాలపై బైఠాయింపు నిరసనల్లో భాగంగా గురువారం రైతులు రైల్ రోకో కూడా నిర్వహించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అతి పెద్దదైన రాజాపురా రైల్వే జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు పట్టాలపై బైఠాయించారు. మధ్యా హ్నం నుంచి సాయంత్రం దాకా రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. -
అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!
ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రంగంలోకి అడుగుపెట్టినా అనూహ్యమైన అడుగులతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ టాప్ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో వాల్ట్ డిస్నీని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పంద ప్రక్రియ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో డిస్నీ హాట్స్టార్ మీడియా కార్యకలాపాలు రిలయన్స్కు దక్కుతాయి. ఈ డీల్ తర్వాత, ఉమ్మడి సంస్థలో రిలయన్స్ 51 శాతం, డిస్నీ హాట్స్టార్ 49 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రత్యక్ష పోటీకి చెక్! జియోకు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా.. డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. మొదట జియో సినిమా.. డిస్నీ హాట్స్టార్ నుంచి ఐపీఎల్ హక్కులను దక్కించుకుంది. ఆ తర్వాత డిస్నీ హాట్స్టార్.. జియో సినిమా నుంచి ఆసియా కప్, క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇప్పుడు జియో ఏకంగా డిస్నీ హాట్స్టార్నే కొనుగోలు చేస్తోంది. జియో సినిమాతో పోటీలో ఈ కంపెనీ గణనీయమైన నష్టాలను చవిచూడటం గమనార్హం. ఐపీఎల్, ఫిఫా ప్రపంచ కప్ తర్వాత, హాట్స్టార్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ రెండింటిలో టెన్షన్.. ఈ ఒప్పందం తర్వాత, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీనం కానున్నాయి. అంటే రెండు యాప్ల కంటెంట్ను ఒకే యాప్లో యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ కస్టమర్లు జియో సినిమాకి మారతారు. ఈ పరిణామాలు ప్రముఖ ఓటీటీలైన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లలో టెన్షన్ను కలిగిస్తున్నాయి. ఎందుకంటే జియో సినిమా సరసమైన ప్లాన్లను అందించవచ్చు. టెలికాం, ఓటీటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో రీఛార్జ్తో చవకైన యాడ్-ఆన్ ప్లాన్లను ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒకే దెబ్బకు ముడు పిట్టలు అన్నమాట! ఇదీ చదవండి: ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..! -
మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం
పాట్నా: బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మతగురువు స్థానికంగా శవమై కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల వైఫల్యంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. మనోజ్ కుమార్ దనపుర్ గ్రామంలోని శివ దేవాలయంలో మతగురువుగా పనిచేస్తున్నారు. టెంపుల్కి పూజ కోసం వెళ్లిన మనోజ్ కుమార్.. గత ఆరు రోజులగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ మనోజ్ కుమార్ను కనిపెట్టలేకపోయారు. చివరికి మనోజ్ కుమార్ స్థానిక పొదల్లో శవమైన కనిపించారు. ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేశారు. జననాంగాలను కోసేశారు దుండగులు. ఈ వార్త తెలవడంతో స్థానిక గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. హైవేపై నిలిపి ఉంచిన పోలీసు వాహనానికి నిప్పంటించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జిల్లా పోలీసు అధికారి ప్రాంజల్ తెలిపారు. అయితే.. మనోజ్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్ షా స్థానికంగా బీజేపీ డివిజినల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. బయటకు వెళ్లిన మనోజ్ కుమార్ ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండిందని భావించినట్లు మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. మనోజ్ను ఎందుకు చంపారో? తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
తెలంగాణ భవన్ లో టెన్షన్ టెన్షన్
-
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె తెలుగుదేశంలో గందరగోళం
-
హర్యానాలో మళ్లీ ఉద్రిక్తత
చండీగఢ్: హర్యానా నూహ్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పిల్లలు జరిపిన రాళ్ల దాడుల్లో ఎనిమిది మంది మహిళలు గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత జులైలో నూహ్లో రెండు వర్గాల మధ్య ఆందోళనలు జరిగిన తర్వాత తాజా ఘటన ఆందోళన కలిగిస్తోంది. నూహ్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మహిళలు వెళ్తుండగా.. పిల్లలు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి 8:20 సమయంలో జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. ఆందోళనలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 31న నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ యాత్ర చేపట్టిన నేపథ్యంలో అల్లరిమూకలు రాళ్లు విసిరారు. దీంతో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనలు పక్కనే ఉన్న గురుగ్రామ్, ఢిల్లీ ప్రాంతాలకు వ్యాపించాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు! -
టెన్త్ విద్యార్థులకు యూడైస్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు కొత్త చిక్కు వచ్చిపడేలా ఉంది. యూడైస్లో పేరు లేకుంటే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వకూడదని విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిణామం విద్యార్థుల తల్లిదండ్రులను కలవర పెడుతుండగా.. ఇప్పటికిప్పుడు ఈ నిబంధన తేవడం సరికాదని ఉపాధ్యాయులూ అంటున్నారు. యూడైస్ అప్డేట్లో క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించాలని సూచిస్తున్నారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్ మాత్రం ఇవేవీ పట్టించుకునేందుకు సిద్ధంగా లేకపోవడం సమస్యకు దారి తీస్తోంది. ఈ నెల 28వ తేదీ నాటికి యూడైస్లో విద్యార్థులందరి పేర్లు చేర్చాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే గడువు ముగిసే నాటికి దాదాపు 45 శాతం మంది విద్యార్థుల పేర్లు ఎక్కించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు 5 లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాత రికార్డు లేకుంటే అంతే... ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రతి విద్యార్థి సమగ్ర వివరాలు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థి ఎక్కడ చదివింది, వారి టీసీల వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా లభించే ప్రతి ప్రయోజనానికి (సంక్షేమ పథకం) యూడైస్నే ప్రామాణికంగా తీసుకోవాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకూ విద్యార్థికి అంతకుముందు ఎక్కడ చదివిందీ తెలిపే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ)తో పనిలేదు. ఈ మేరకే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను టీసీలు లేకున్నా 8వ తరగతిలో చేర్చుకున్నాయి. స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులకు కొన్ని ప్రైవేటు స్కూళ్ళు టీసీలు ఇవ్వకుండా ఆపాయి. ఈ కారణంగా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు టీసీల్లేకుండానే ఇతర స్కూళ్ళల్లో చేరారు. ఇంతే కాకుండా చాలా స్కూళ్ళు కింది తరగతుల్లో అనుమతులు లేకుండానే విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ కారణంగానూ విద్యార్థుల వివరాలు లభించని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో యూడైస్ కోసం పాత రికార్డు ఎలా తేవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. టెన్త్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు యూడైస్ సాధ్యాసాధ్యాలను ఉన్నతా ధికారులు గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ఎదుర య్యే సమస్యలను అర్థం చేసుకోవాలి. యూ డైస్లో పేరులేదని పరీక్ష ఫీజు కట్టించుకోని పరిస్థితి వస్తే, అనేకమంది టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడతారు. పరీక్షలు దగ్గరప డుతున్న సమయంలో వారిని మానసికంగా దెబ్బతీయడం సరైన చర్య కాదు. – చావా రవి (టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) వెసులుబాటు ఇవ్వకపోతే ఇబ్బందులే విద్యార్థి 8 నుంచి ఒకే స్కూల్లో ఉన్నప్పుడు దాన్నే ప్రామాణికంగా తీసుకుని యూడైస్లో చేర్చే ఆప్షన్ ఇవ్వాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఇందులోని ఇబ్బందులను విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాయి. అప్పటివరకూ తాము యూడైస్లో చేర్చే ప్రక్రియ పూర్తి చేయలేమంటున్నాయి. ఆన్లైన్ ఈ మేరకు సాంకేతిక వెసులుబాటును కల్పించాలని కోరుతున్నాయి. -
సుప్రీం ఏం చెబుతుందో!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఏడాదిన్నర సన్నద్ధత అంతా వృథా అయిపోతుందా?, ఎన్నో ఆశలతో గ్రూప్–1 కొలువు కోసం చేసిన ప్రయత్నాలు మళ్లీ మొదటికి వస్తాయా? అనే ఆందోళన నెలకొంది. మొత్తం మీద రెండోసారి రాసిన పరీక్షను హైకోర్టు రద్దు చేయడమే ఇందుకు కారణం. ప్రశ్నపత్రాల కుంభకోణం నేపథ్యంలో తొలిసారి ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు తాజా తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించిందనే సమాచారం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరటనిస్తోంది. అప్పుడలా..ఇప్పుడిలా..! రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ కేటగిరీల జాబితా తయారు చేసి 1:50 నిష్పత్తిలో మెయిన్కు అర్హుల జాబితాను ప్రకటించి పరీక్ష తేదీలు సైతం వెల్లడించింది. అయితే టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ప్రశ్నపత్రాల కుంభకోణం వెలుగు చూసింది. కమిషన్ సిబ్బంది కొందరు వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు లీక్ చేశారనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూడడంతో టీఎస్పీఎస్సీ వరుసగా వివిధ పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను సైతం రద్దు చేసింది. గత జూన్ 11వ తేదీన తిరిగి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. రెండోసారి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ అనుమతించింది. రెండోసారి 2,33,248 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాశారు. అయితే రెండోసారి నిర్వహించిన పరీక్షలను కమిషన్ అత్యంత లోపభూయిష్టంగా నిర్వహించిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి కమిషన్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న తీర్పు ఇచ్చారు. దీంతో ఎంతకాలంగానే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాగా దీనిపై టీఎస్పీఎస్సీ అప్పీల్కు వెళ్లింది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్య వైఖరి వల్లే గందరగోళం నెలకొందంటూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సైతం స్పష్టం చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిoచింది. దీంతో అభ్యర్థులు మరింత ఆవేదనకు గురయ్యారు. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్లు సమాచారం. మళ్లీ చిగురిస్తున్న ఆశలు హైకోర్టు తీర్పు తుది కాపీ రాగానే వచ్చేవారంలో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. దీంతో ఉద్యోగాల కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, ఏ విధమైన తీర్పు వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు బలంగా విన్పించాలని, మళ్లీ పరీక్ష నిర్వహించే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ, ఆ తర్వాత గాంధీ జయంతి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వరుస సెలవులున్నాయి. కాగా సుప్రీంకోర్టు తీర్పుపైనే గ్రూప్–1 పరీక్ష భవితవ్యం ఆధారపడి ఉంది. ఇతర గ్రూప్ పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో గ్రూప్–1 మళ్లీ నిర్వహణ ప్రభుత్వానికి కూడా సవాలుగానే మారే అవకాశం ఉంది. -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్భవన్వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
Manipur Violence: ఆగని మణిపూర్ అల్లర్లు
ఇంఫాల్: మణిపూర్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం చెలరేగిన హింసాకాండలో పదిహేను ఇళ్లు తగలబడ్డాయి. లంగోల్ గేమ్స్ విలేజ్లో అల్లరిమూక దాడులకు తెగబడి ఇళ్లను తగులబెట్టారు. దీంతో భద్రతా సిబ్బంది బాష్పవాయువుని ప్రయోగించి పరిస్థితుల్ని అదుపులోనికి తీసుకువచ్చారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకోన్ ప్రాంతంలో దుండగులు వాణిజ్య సముదాయాలను తగులబెట్టారు. మరోవైపు రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీయేలో ఇన్నాళ్లూ భాగస్వామ్యపక్షంగా ఉన్న కుకీ పీపుల్స్ అలయెన్స్ బైరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. లూటీ చేసిన ఆయుధాలు వెనక్కి మణిపూర్లో అల్లరిమూకలు భారీగా లూటీ చేసిన ఆయుధాల్ని తిరిగి స్వా«దీనం చేసుకునే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లూటీ అయిన ఆయుధాల్లో 1,195 తిరిగి స్వా«దీనం చేసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతం జిల్లాల నుంచి 1,057 ఆయుధాలు , కొండ ప్రాంతం జిల్లాల నుంచి 138 ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఐజీ ర్యాంకు అధికారి ఒకరు ఆయుధాగారాల లూటీకి సంబంధించి విచారణ జరుపుతున్నారు. అయిదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనలో అయిదురుగు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ప్రాంతం పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ సహా అయిదుగురు సిబ్బందిని దీనికి సంబంధించిన వీడియో బయటకి వచి్చన వెంటనే సస్పెండ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఒక వర్గం ప్రజలు వారి సస్పెన్షన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతీరోజూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదని చెప్పారు. జంకుతున్న ఎమ్మెల్యేలు ఈ నెల 21 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి కుకీ వర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరుకావడానికి విముఖతతో ఉన్నారు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో తమకి భద్రత లేదని వారు భయపడుతున్నారు. శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం వల్ల తాము అసెంబ్లీకి హాజరు కావడం లేదని కుకి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎల్.ఎమ్ ఖాటే చెప్పారు. ఎమ్మెల్యేల ఇంఫాల్ ప్రయాణం సురక్షితం కాదని అన్నారు. -
మణిపూర్లో ఆయుధాల లూటీ
ఇంఫాల్: మణిపూర్లో తెగల పోరు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీసు ఆయుధాగారంపై దుండగులు దాడి జరిపి ఆయుధాలను లూటీ చేశారు. ఎకే 47, ఘాతక్ వంటి అత్యాధునిక రైఫిల్స్, వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు. బిష్ణుపూర్ జిల్లా నారన్సైనా ప్రాంతంలో రెండవ ఇండియా రిజర్వ్ బెటాలియన్లో ఈ లూటీ జరిగింది. ‘‘బెటాలియన్ కేంద్రంపై దాడులకు దిగిన అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలను లూటీ చేశారు. ఏకే, ఘాతక్ రైఫిళ్లు, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అయిదు ఎంపీ–5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్ గ్రేనేడ్స్ను దొంగిలించారు’’ అని అధికారులు తెలిపారు. మరోవైపు మే 3వ తేదీన జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సామూహిక ఖననానికి ఆదివాసీలు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకి దారి తీస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న మరికొందరు ప్రదర్శనగా ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 25 మందికిపైగా గాయపడ్డారు. దీంతో, అంతిమ సంస్కార కార్యక్రమాలను కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు. -
పల్నాడు ప్రాంతంలో పులి భయం
-
మళ్లీ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
లండన్: ఖలిస్తానీ మద్దతుదారుల దాడితో ఘటనకు కేంద్ర బిందువుగా మారిన లండన్లోని భారతీయ హైకమిషన్ వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం భారతీయ హైకమిషన్పై దాడికి తెగబడిన ఘటన మరువకముందే మళ్లీ దాదాపు 2,000 మందితో కూడిన ఆ వేర్పాటువాద మూక అదే భవంతి సమీపానికి చేరుకుంది. ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేసిన వేర్పాటువాదులు వెంట తెచ్చుకున్న రంగులు వెదజల్లే చిన్న బాణసంచా, నీళ్ల సీసాలు, కొన్ని వస్తువులను హైకమిషన్ భవంతిపైకి విసిరారు. ఆదివారం నాటి దుశ్చర్యతో అప్రమత్తమైన లండన్ పాలనా యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీసులను అంతకుముందే అక్కడ మొహరించడంతో వేర్పాటువాదుల భారీ దాడి యత్నాలు ఆచరణలో విఫలమయ్యాయి. అమృత్పాల్ అరెస్ట్కు కంకణం కట్టుకున్న పంజాబ్ పోలీసుల చర్యను నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ సిఖ్ ఆర్గనైజేషన్స్, సిఖ్ యూత్ జతేబందియా వంటి సంస్థలు ఉమ్మడిగా ‘నేషనల్ ప్రొటెస్ట్’ పేరిట బ్యానర్లు సిద్ధంచేసి భారతీయ హైకమిషన్ వద్ద దాడికి కుట్ర పన్నినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకుని తరలించేందుకు దాదాపు 20 బస్సులను పోలీసులు తెప్పించారు. అప్రమత్తతలో భాగంగా కొందరు పోలీసులను అక్కడి వీధుల్లో కవాతుచేశారు. ఖలిస్తానీవాదులు అక్కడికి రాగానే పంజాబ్లో మానవహక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఇంగ్లిష్, పంజాబీ భాషల్లో మైకుల్లో భారత వ్యతిరేక ప్రసంగాలు ఇచ్చారు. నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలూ ఉండటం గమనార్హం. భారత్ తమను వేర్పాటువాదులని, పాక్ ఐఎస్ఐతో కుమ్మక్కయ్యారని ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. భారత్ హైకమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఖలిస్తానీ మద్దతుదారులు -
బెజవాడ సైకిల్కు టెన్షనెందుకు?
ఆ పసుపు నేత కాలం కలిసొచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈ సారి ఆయన పరిస్థితి రివర్స్ అయిందక్కడ. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పచ్చ పార్టీ ఎమ్మెల్యేకి ముచ్చెమటలు పడుతున్నాయట. తనకంటే వయసులో చిన్నోడే అయినా... అధికారపార్టీ యువనేతను చూస్తేనే సైకిల్ పార్టీ నేతకు టెన్షన్ ఎక్కువవుతోందట. అందుకే కడుపు మంటను చల్లార్చుకునేందుకు నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నాడు. ఏడాది ముందే వెన్నులో వణుకు ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర ఉండగానే బెజవాడ టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి భవిష్యత్ గుర్తొచ్చి టెన్షన్ పెరుగుతోందట. ఒకప్పటి గన్నవరం ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ గత రెండు సార్లు విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు. రెండు సార్లు గెలిచినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి గద్దె చేసిందేమీ లేదు. దివంగత నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏ పదవిలోనూ లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు బాగా చేరువయ్యారు. సీఎం జగన్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. ముఖ్యంగా సీఎం హామీతో కృష్ణలంక వాసుల చిరకాలవాంఛ అయిన కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ ను 130 కోట్ల రూపాయలతో పూర్తిచేయగలిగారు. నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలతో అవినాష్ ముఖ్యమంత్రి జగన్ దృష్టిని ఆకర్షించారు. ఇటీవలే తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ ను ఖరారు చేశారు. డ్రామా పాలిట్రిక్స్ ఈ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లో వణుకు మొదలైంది. ఇప్పటి వరకూ నియోజకవర్గానికి ఇంఛార్జి హోదాలోనే ఇంత అభివృద్ధి సాధిస్తే...అతన్నే అభ్యర్థిగా ప్రకటించడంతో ..ఇక తన మనుగడ కష్టమని గద్దె డిసైడైపోయారట. రాబోయే ఎన్నికల్లో తనకు పోటీగా దేవినేని అవినాష్ నిలబడితే తనకు డిపాజిట్లు రాననే భయంతో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. వైసీపీ ప్రభుత్వానికి, దేవినేని అవినాష్ కు మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక కడుపుమంటతో గడప గడప కార్యక్రమంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. అందులో భాగంగానే 17వ డివిజన్ పరిధి రాణీగారితోట ప్రాంతంలో గడప గడప కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్న సమయంలో ఓ టీడీపీ కార్యకర్తతో డ్రామా స్టార్ట్ చేశారు. కావాలనే తమ ఇంటికి అవినాష్ ను పిలిపించి తమకు పథకాలేవీ రావడం లేదంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. ఐతే వారికి ఏమేమి పథకాలు వచ్చాయో లిస్ట్ చదివి చెప్పడంతో టీడీపీ మహిళా కార్యకర్తలు కిమ్మనకుండా ఉండిపోయారట. టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం ముందు నాటకాలు.. తర్వాత గొడవలు తన పాచిక పారలేదని గ్రహించి తెల్లారేసరికి పథకం ప్రకారం మళ్లీ అదే టీడీపీ మహిళా కార్యకర్తలు స్థానిక వాలంటీర్ తో పాటు వైసీపీ మహిళలతో గొడవకు దిగారు. వారి కళ్లల్లో కారం కొట్టి... దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఒక్కసారిగా తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా వేడి రాజుకుంది. ఈ దాడిని తమకు అనుకూలంగా చేసుకోవాలని గద్దె వేసిన స్కెచ్ వర్కవుట్ కాలేదట. తన ప్లాన్ బెడిసిగొట్టడంతో పాటు తనకే రివర్స్ అవ్వడంతో గద్దె షాక్ లో ఉన్నారట. చదవండి: అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..! పథకాలు రావట్లేదని గొడవ చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఏమేమి అందాయో ఆధారాలతో సహా దేవినేని అవినాష్ బయటపెట్టడంతో గద్దె రామ్మోహన్ ను సొంత పార్టీ వాళ్లే అసహ్యించుకుంటున్నారని టాక్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడి పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకు తెలిసింది ఇలాంటి చీప్ పాలిట్రిక్సేనా అని తల బాదుకుంటున్నారట స్థానిక పసుపు క్యాడర్. దేవినేని అవినాష్ చేస్తున్న గడప గడప కార్యక్రమంతో గద్దే రామ్మోహన్కు గుబులు మొదలైందనే టాక్ తెలుగుదేశం వర్గాల్లోనే మొదలైంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల సమావేశంలో ఉద్రిక్తత
పంజగుట్ట: పోలీస్ రిక్రూట్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ నెల 6న దున్నపోతులకు వినతిపత్రం, 7 కలెక్టరేట్ల ముందు ధర్నా, 9వ తేదీ చలో హైదరాబాద్ నిర్వహిద్దామని తీర్మానం చేసి కార్యాచరణ ప్రకారం వెళదామనగా కొందరు ప్రతిపాదించగా, మరికొందరు వ్యతిరేకిస్తూ సమస్యలు పరిష్కరించే వరకు ప్రెస్క్లబ్లోనే ఆమరణ నిరాహారదీక్షకు కుర్చున్నారు. పంజగుట్ట ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఎంత సముదాయించినా వినకపోవడంతో రాత్రి 7:30 గంటల సమ యంలో అభ్యర్థులను, వారికి మద్దతు పలికిన నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని... పరుగుపందెంలో ఉత్తీర్ణత సాధించిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలని, హైకోర్టు ఆదేశాల మేరకు 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని, రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వీరికి మద్దతు పలికేందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, సీపీఐ, సీపీఎం నేతలు బాలమల్లేష్, నర్సింగ్రావు హాజరయ్యారు. కోదండరామ్ మాట్లాడుతూ ఆర్మీ సెలక్షన్స్లో కూడా లేని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అభ్యర్థులు పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేయమంటున్నారని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వివిధ విద్యార్ధి సంఘాల నేతలు కె.ధర్మేంద్ర, ఆనగంటి వెంకటేశ్, సలీంపాషా, డాక్టర్ వలీఖాద్రీ, కోట రమేశ్, అశోక్ రెడ్డి, రెహమాన్ పాల్గొన్నారు. -
గన్ షాట్: వాళ్లకు పెన్షన్.. వీళ్లకు టెన్షన్
-
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు దగ్గర ఉద్రిక్తత
-
త్రివిక్రమ్ తో మహేష్ సినిమాపై బయపడుతున్న ఫ్యాన్స్
-
జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో ఉద్రిక్తత
-
భైంసాలో టెన్షన్.. టెన్షన్..!
భెంసాటౌన్/ఆదిలాబాద్/హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారె తెలిపారు. భైంసాలో నిర్వహించే సభకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. భైంసాలోని సున్నిత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రతోపాటు సభకు ఎస్పీ ప్రవీణ్కుమార్ అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రెండు, మూడురోజులుగా ఎంపీ సోయం బాపురావు, ఇతర జిల్లాల నాయకులు భైంసాలోనే మకాం వేసి సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్డి(బి) బైపాస్ రోడ్లో జరిగే భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసిన డీసీసీ మాజీ అ«ధ్యక్షుడు రామారావు పటేల్ ఈ సభావేదికగానే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలో భారీఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం చేసుకున్నారు. బీజేపీ టికెట్ ఆశావహులు సైతం భైంసా రహదారులను ఫ్లెక్సీలతో కాషాయమయం చేశారు. ఈ నేపథ్యంలో బండి యాత్రకు అనుమతి నిరాకరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఎంఐఎంకు భయపడే: సోయం ఎంఐఎంకు భయపడే సంజయ్ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని ఎంపీ సోయం బాపురావ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాసమస్యలను పరిష్కరించలేక బండి యాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ‘న్యాయస్థానం తలుపు తడతాం. న్యాయస్థానం అనుమతి తీసుకుని యాత్ర కొనసాగిస్తాం’అని ప్రకటించారు. ‘సభావేదిక వేసేదాక చూసి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దిగే హెలీప్యాడ్ను కూడా పరిశీలించిన పోలీసులు అకస్మాత్తుగా అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉంది’అని పేర్కొన్నారు. యాత్రతో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని భయపడి, అనుమతులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. అడ్డుకోవడం పిరికిపంద చర్య: డీకే అరుణ సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం సీఎం కేసీఆర్ పిరికిపంద చర్యకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రజల కోసం చేస్తున్న యాత్రగా కేసీఆర్ గ్రహించి అనుమతించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజల్లో టీఆర్ఎస్పై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే బీజేపీని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘మత ఘర్షణలు జరుగుతాయనే సాకుతో అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ పోలీసులకు సత్తా ఉంటే యాత్రకు అనుమతివ్వాలి. బందోబస్తులో ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.అయితేనే పోలీస్ వ్యవస్థకు మనుగడ ఉన్నట్లు’అని అరుణ పేర్కొన్నారు. భైంసా సభను అడ్డుకోవడం కుట్ర రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించ తలపెట్టిన భైంసా సభకు అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. తెల్లారితే సభ ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను నిర్మల్ వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్కు భయం పట్టుకుందని, ఆయన ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ తనకు తాను నయా నిజాం అనుకుంటున్నారని.. నిజాం మెడలు వంచినట్లే కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం పలికే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జగిత్యాలలో హై టెన్షన్.. బండి సంజయ్ మరోసారి అరెస్ట్ -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం
-
కొమరం భీమ్ జిల్లాలో టైగర్ టెన్షన్
-
పొలిటికల్ కారిడార్ : కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన మునుగోడు
-
పొలిటికల్ కారిడార్ : మూడు పార్టీల నేతల్లో మునుగోడు టెన్షన్
-
పొలిటికల్ కారిడార్ : తిరువూరు తమ్ముళ్ల మధ్య చిచ్చు
-
మునుగోడులో గుర్తుల గోల...
-
గుజరాత్ లోని పోరుబందర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
-
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత
-
ఎగిరిన రాళ్లు.. విరిగిన కర్రలు.. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోకి ప్రవేశించడంతో స్థానిక బీజేపీ శ్రేణులు బాణసంచాలు కాలుస్తూ ఘనస్వాగతం పలికాయి. అక్కడ స్వరాజ్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో బండి సంజయ్ మాట్లాడారు. నాటి నిజాం సర్కారు, నేటి కేసీఆర్ పాలన తీరును ఎండగట్టారు. రెండువర్గాల వారు పరస్పరం తలపడ్డారు. కంకర రాళ్లు ఎగిరి పడగా, జెండా కర్రలు విరిగేలా కొట్టుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వారితో పాటు సభకు వచ్చిన ఓ సాధారణ మహిళ సత్తెమ్మ.. మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి లాఠీలకు పనిచెప్పారు. ఈ సంఘటన దేవరుప్పుల చౌరస్తా వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. డీజీపీకి సంజయ్ ఫోన్ ఈ సంఘటనపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోనే ఫోన్ ద్వారా డీజీపీ మహేందర్రెడ్డితో మాట్లాడుతూ, వరంగల్ సీపీ.. మంత్రి దయాకర్రావుకు గుత్తేదారుగా తయారు కావడం వల్లే తమ యాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నా యని ఫిర్యాదు చేశారు. పోటాపోటీ ధర్నాలు అనంతరం బండి సంజయ్ యాత్ర దేవరుప్పుల నుంచి ధర్మాపురానికి బయలుదేరింది. యాత్ర వెళ్లాక తమ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు పలువురు బీజేపీ నాయకుల కార్ల అద్దాలు పగులగొట్టారు. ఈ క్రమంలో బీజేపీ మహిళ మోర్చా మేడ్చల్ జిల్లా నాయకురాలు హైమారెడ్డి, సుధారాణి, సులోచనలు వాహనంలో వస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అద్దాలు పగులగొట్టారు. దీనికి నిరసనగా సూర్యాపేట రహదారిపై నాలుగు గంటలపాటు ధర్నాకు దిగారు. 500 మంది గూండాలతో యాత్ర: ఎర్రబెల్లి బండి సంజయ్ 500 మంది గూండాలతో యాత్ర చేస్తూ, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, రాళ్లు, కర్రలతో దాడి చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. దేవరుప్పులలో గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్తలు జనగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంత్రి.. నాయకులతో కలిసి పరామర్శించారు. చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం -
అగ్గి రాజేసిన అగ్రరాజ్యం... యుద్ధానికి సై అంటున్న దేశాలు: వీడియో వైరల్
China Amid Tension With Taiwan: అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటన చివరికి యుద్ధానికి తెరలేపినట్లు తెలుస్తోంది. తొలుత పెలోసి పర్యటన పెద్ద వివాదంగా మారింది. ఆ వివాదం కాస్త ముదరి ఇప్పుడూ ఇరు దేశాల మద్య నిప్పు రాజేసి యుద్ధానికి సంసిద్ధమయ్యేలా చేసింది. చైనా కూడా ఈ పర్యటన పలు పరిణామాలకు దారితీస్తుందంటూ అమెరికాని మొదట నుంచి హెచ్చరించింది. కానీ అమెరికా కూడా వెనక్కి తగ్గేదే లే అంటూ పర్యటించేందుకు సిద్ధం అయ్యింది. ఇది రెచ్చగొట్టే చర్య అని చైనా పదే పదే చెబుతున్న ఖతారు చేయలేదు. ఆఖరికి రష్యా కూడా చైనాకి మద్దతు ఇస్తూ ఇది కవ్వింపు చర్య అని అమెరికాని హెచ్చరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్ ఈ పర్యటన వ్యక్తిగతమైనది కాదని, ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. దీంతో అమెరికా అలర్ట్ అయ్యి పెలోసి పర్యటన నిమిత్తం తైవాన్ ద్వీప సమీపంలో నాలుగు యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రీక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు చైనా తైవాన్ పై యుద్ధానికి సిద్ధం అంటూ తైవాన్ సరిహద్దు సమీపంలో భారీగా సాయుధవాహానాలను, ఇతర సైనిక పరికరాలను మోహరించింది. మరోవైపు తైవాన్ కూడా యుద్ధానికి సై అంటూ తమ పోరాట పటిమను చూపించేలా తమ ఆయుధాలతో ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల సాయుధ బలగాలకు సంబధించిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. In Fujian right now😯😯 pic.twitter.com/hHxfPTDQEo — Yin Sura 尹苏拉 (@yin_sura) August 2, 2022 ⚡ There was a video of a military exercise in China in the South China Sea on the eve of Nancy Pelosi’s visit to Taiwan. Reuters reports Taiwan’s defence ministry had “reinforced” its combat alertness level from Tuesday morning to Thursday noon pic.twitter.com/7Cru0hSL6u — Flash (@Flash43191300) August 2, 2022 (చదవండి: యూఎస్కి వార్నింగ్ ఇచ్చిన రష్యా! ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యే!) -
ఆమ్నేషియా పబ్ కేసు.. జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీజేపీ ధర్నాకు దిగింది. పోలీస్స్టేషన్లోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎంఐఎం నేత కొడుకును తప్పించారంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. చదవండి: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’ -
పరీక్షలపై బెంగతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
జియాగూడ: ఆరోగ్యం సరిగా లేక పరీక్షలు సరిగా రాయలేనేమోననే బెంగతో పదో తరగతి విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ ఇక్బాల్గంజ్లో కమల, బాషా గౌడ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. బాషా గౌడ్ ప్రైవేటు ఉద్యోగి. వీరి పెద్ద కూతురు వివాహం జరిగింది. రెండో కూతురు ప్రియాశక్తి 21 డిగ్రీ మొద టి సంవత్సరం చదువుతోంది. 15 ఏళ్ల చిన్నకూతురు జియాగూడ శ్రీనివాస హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. 15 రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. 10వ తరగతి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ క్రమంలో సరిగా చదవలేకపోతున్నానని మానసిక ఆందోళనకు గురైంది. శనివారం సాయంత్రం తల్లితో బాగానే ఉంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోని పూజగదిలోని థమ్సప్ బాటిల్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా మంటలు చెలరేగడంతో వేరే గదిలో ఉన్న తల్లి కమల, అక్క ప్రియాశక్తి వెంటనే వచ్చి రగ్గులతో మంటలు ఆర్పివేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్యూటీలో ఉన్న ఎస్.ఐ.మురళీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు 67 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్) -
JP Nadda: నడ్డా రోడ్డెక్కె.. సిటీ హీటెక్కె
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేకెత్తించింది. మంగళవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో దిగడం మొదలు పార్టీ కార్యాలయానికి చేరుకునే దాకా ఉత్కంఠ భరితంగానే కొనసాగింది. ఇటు ఎయిర్పోర్టులో, అటు సికింద్రాబాద్ ఎంజీరోడ్డులో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం, పోలీసులు భారీయెత్తున మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనలేదు. నడ్డా ప్రకటనతో టెన్షన్ కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరిట తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు పంపించడంపై బీజేపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్న నేపథ్యంలో నడ్డా నగరానికి చేరుకున్నారు. సంజయ్ అరెస్టుకు నిరసనగా మంగళవారం సాయంత్రం ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు తాను స్వయంగా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ మౌన ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని, అరెస్ట్కు కూడా భయపడేది లేదని నడ్డా సోమవారం ఢిల్లీలోనే ప్రకటించారు. దీంతో అటు పోలీసులు, ఇటు పార్టీ నాయకుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇతర నేతలు పాల్గొనే కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతి కోరుతూ నార్త్ జోన్ డీసీపీ జి.చందన దీప్తికి బీజేపీ సికింద్రాబాద్ శాఖ అధ్యక్షుడు బి.శ్యామ్ సుందర్గౌడ్ దరఖాస్తు చేశారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పాటు నగరంలో నెలకొన్న పరిస్థితులు, ర్యాలీతో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు అదే విషయం లిఖిత పూర్వకంగా తెలిపారు. మంగళవారం విమానాశ్రయంలోనూ, బీజేపీ శాంతియాత్ర నిర్వహిస్తామన్న ఎంజీరోడ్డులో భారీగా మోహరించారు. శంషాబాద్లో ఘన స్వాగతం సాయంత్రం 5 గంటల సమయంలో నడ్డా శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నెలకొంది. ఎయిర్పోర్టులో నడ్డాకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, డాక్టర్కె.లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి, బంగారు శ్రుతి తదిత రులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ లాంజ్లోనే రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్ఛుగ్, నేతలు డీకే అరుణ, ఏపీ జితేందర్రెడ్డి, ఎన్.రామచంద్రరావు, గుజ్టుల ప్రేమేందర్రెడ్డి తదితరులతో నడ్డా భేటీ అయ్యారు. సంజయ్ అరెస్ట్, రిమాండ్ పరిస్థితులు, తదనంతర పరిణామాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఉద్యోగుల విభజన, నిరుద్యోగుల సమస్య, ఇతర అంశాలపై పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును గురించి నడ్డాకు పార్టీ నాయకులు వివరించారు. ర్యాలీలకు అనుమతి లేదన్న జాయింట్ కమిషనర్ కాగా, అనుమతి లేకున్నా నడ్డా, నేతలు నిరసన ర్యాలీ కొనసాగించాలని నిర్ణయించారు. అప్పటికే ఎయిర్పోర్ట్కు బీజేపీ శ్రేణులు తరలివచ్చాయి. దీంతో అప్రమత్తమైన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సికింద్రాబాద్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూనే సంయుక్త పోలీసు కమిషనర్ కార్తికేయను విమానాశ్రయం దగ్గరకు పంపించారు. అక్కడ నడ్డాను కలిసిన కార్తికేయ ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నాయని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని వివరించారు. సికింద్రాబాద్లో తలపెట్టిన కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని కోరారు. నల్లజెండాలు, రిబ్బన్లతో నిరసనలు అనంతరం పార్టీ నేతలతో కలిసి నడ్డా ఎంజీ రోడ్డుకు చేరుకున్నారు. సికింద్రాబాద్లో మాజీ మేయర్, బీజేపీ నేత బండా కార్తీకరెడ్డి ఇతర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. చేతుల్లో నల్లజెండాలు ధరించి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. సంజయ్ను విడుదల చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడ బీజేపీ నాయకులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి నడ్డా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సంజయ్ను వెంటనే విడుదల చేయాలి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న బండి సంజయ్ని ఎలా అరెస్టు చేస్తారు? అని నడ్డా నిలదీశారు. సంజయ్ అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా సంజయ్ అరెస్టును ఖండించారు. టీఆర్ఎస్ నిరంకుశ ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం కరోనా దృష్ట్యా ర్యాలీని రద్దు చేసినట్లు, సత్యాగ్రహం పూర్తయిందని కిషన్రెడ్డి ప్రకటించారు. బాంబే హోటల్ వరకు ర్యాలీ అయితే గాంధీ విగ్రహం నుంచి ఎంజీరోడ్డు మీదుగా బాంబే హోటల్ వరకు ర్యాలీ సాగింది. నడ్డా కారులోనే ఉండి ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు క్యాండిల్స్ చేత పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనం తరం బీజేపీ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. ర్యాలీ సందర్భంగా, ర్యాలీ అనంతరం సుమారు ఒక గంట పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. ర్యాలీ తర్వాత నడ్డా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపు పార్టీ నేతలతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అనంతరం ఘట్కేసర్ సమీపంలోని తారామతిపేట గ్రామంలోని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి గెస్ట్హౌస్కు రాత్రి బస నిమిత్తం వెళ్లారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు ఇక్కడికి సమీపంలోని అన్నోజిగూడలో జరిగే ఆరెస్సెస్ అఖిల భారత కార్యకారణి సమావేశాల్లో నడ్డా పాల్గొంటారు. నా ప్రజాస్వామ్య హక్కును అడ్డుకోలేరు: నడ్డా తాము కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూనే ప్రజాస్వామ్యబద్ధంగా తమ కార్యక్రమాలు నిర్వహిస్తామని, గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించడం వరకే పరిమితం అవుతా మని జేసీకి నడ్డా చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగల పౌరు డిగా నిబంధనలు పాటించి.. ప్రజాస్వామ్య పద్ధతిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. జాయింట్ సీపీ కార్తికేయ తనతో మాట్లాడారని, రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారని తెలిపారు. కానీ నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ అడ్డుకోలేరని నడ్డా స్పష్టం చేశారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే.. అన్న విలేకరుల ప్రశ్నకు అరెస్ట్ చేస్తే చూద్దామని వ్యాఖ్యానించారు. -
Coronavirus: మహారాష్ట్రలో థర్డ్ వేవ్ టెన్షన్
-
హాస్టళ్ల మూసివేతపై ఉద్రిక్తత
కేయూ క్యాంపస్ (వరంగల్): కరోనా కట్టడికిగాను విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి కూడా సెలవులు ప్రకటించారు. అలాగే, బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వసతిగృహాలను కూడా మూసి వేయనున్నట్లు చెప్పడం.. మరోవైపు పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొనడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధికారులు, విద్యార్థులకు మధ్య స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరీక్షలు నిర్వహిస్తూ హాస్టళ్లను మూసివేస్తే తామెక్కడ ఉండాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆవరణ నుంచి కేయూ క్రాస్ రోడ్డు వరకు వెళ్లి రాస్తారోకో చేశారు. ఆందోళన కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అధికారులు యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
టీకాల పనితీరుపై.. ‘టెన్షన్’ ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: మానసిక కుంగుబాటు, ఒత్తిళ్లు, ఒంటరితనం, దీర్ఘకాలిక రోగాలు, ఇతర అనారోగ్య లక్షణాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయనే విషయాన్ని వైద్య, వైజ్ఞానిక పరిశోధనలు ఇప్పటికే నిర్ధారించాయి. తాజాగా ఇలాంటి లక్షణాలు ఉన్న వారిపై కొన్ని వ్యాధులకు సంబంధించిన టీకాలు పూర్తిస్థాయి కచ్చితత్వంతో పనిచేయడం లేదని వెల్లడైంది. అమ్మవారు (స్మాల్పాక్స్), పోలియోలతో పాటు మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్న వివిధ వ్యాధుల నిరోధానికి అనేక వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. టీకాల కారణంగానే పోలియో పూర్తిగా పోయింది. అయితే కొన్ని వ్యాధులకు సంబంధించి గతంలో అభివృద్ధి చేసిన టీకాలు మొదలుకుని ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లతో కూడా.. మానసిక సమస్యల కారణంగా పూర్తిస్థాయి ఫలితాలు రాకపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికన్ సైకాలజీ జర్నల్ ‘పర్స్పెక్టివ్స్ ఆన్ సైకలాజికల్ సైన్స్’లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనంలో దీనికి సంబంధించిన పలు అంశాలను పరిశోధకులు పొందుపరిచారు. ప్రతి ఒక్కరిలో ఒకే విధమైన ఫలితాలు కష్టం మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటు వంటి లక్షణాలున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వేస్తున్న కరోనా వ్యాక్సిన్ ద్వారా కూడా కావాల్సినంత స్థాయిలో ‘యాంటీబాడీస్’ ఏర్పడకపోయే అవకాశాలున్నాయని తెలిపారు. వాస్తవానికి వైద్య పరిశోధనల చరిత్రలోనే టీకాలు అత్యంత సురక్షితమైనవి, ప్రభావవంతంగా పనిచేసేవని ఇప్పటికే స్పష్టమైంది. ప్రస్తుతం అమెరికాలో వేస్తున్న పలు వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని, అయితే వీటిని తీసుకున్న ప్రతి ఒక్కరిలో వెంటనే ఒకే విధమైన ఫలితాలు, ప్రభావం చూపడం కష్టమేనని పరిశోధకులు పేర్కొన్నారు. పర్యావరణ అంశాలతో పాటు వ్యక్తుల జన్యుపరమైన అంశాలు, శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారంగా రోగనిరోధక శక్తి పెరగడం, వ్యాక్సిన్కు స్పందన వంటివి చోటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. (ఫైజర్ ఎఫెక్ట్: 12 వేల మందికి కరోనా పాజిటివ్) ‘ఆర్థిక పరమైన సవాళ్లు, భవిష్యత్ పట్ల అనిశ్చితి, బంధుమిత్రులను స్వేచ్ఛగా కలుసుకోలేకపోవడం, ఒంటరితనం పెరగడం వంటివి మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు దారితీస్తోంది. తద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇవన్నీ మనిషి రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి..’ అని ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అన్నెలైస్ మాడిసన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యత కలిగిన ఈ అంశాలపై సీనియర్ సైకియాట్రిస్ట్లు, సైకాలజిస్ట్లు తమ అభిప్రాయాలను ‘సాక్షి ’ప్రతినిధితో పంచుకున్నారు. ప్రభావం కొంత తక్కువగా ఉండొచ్చు ‘వ్యాక్సిన్ ఇచ్చాక యాంగ్జయిటీ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్న వారిలో.. మిగతావారి కంటే యాంటీబాడీస్ వృద్ధి కొంత తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ మొత్తంగా దాని వల్ల ఫలితం లేదని కాదు. సాధారణంగానే మానసిక కుంగుబాటు వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అనవసర భయాలు, ఆందోళనలకు గురికాకుండా వ్యాక్సిన్పై నమ్మకం పెట్టుకోవాలి. ‘స్మాల్పాక్స్’, పోలి యో వంటివి ఇప్పుడు పూర్తిగా లేకుండా పోవడానికి వ్యాక్సిన్లు సాధించిన ఘనతే కారణం’. – డాక్టర్ ఎమ్.ఎస్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్ హెల్ప్డెస్క్లు ఏర్పాటుచేయాలి ‘వైరస్పై పోరాటంలో మానసిక ఆరోగ్యం కూడా కీలకపాత్ర పోషిస్తోంది. వాస్తవానికి అది సోకిన వారి కంటే కూడా సోకని ఎంతోమంది అది తమకు ఎక్కడ వ్యాపిస్తుందా అన్న భయంతోనే గడిపారు. తద్వారా మానసిక వత్తిళ్లకు గురయ్యారు. ఈ కారణంగా పలువురిలో రోగనిరోధకశక్తి తగ్గింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్తో పాటు సైకలాజికల్ సమస్యలతో ముడిపడిన అంశాలపై ప్రజలకు తగిన సలహాలు, సూచనలిచ్చేలా హెల్ప్డెస్క్ లేదా టోల్ఫ్రీ నంబర్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యతనివ్వాలి’. – డాక్టర్ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ (చదవండి: సెకండ్ రౌండ్లో టీకా తీసుకోనున్న మోదీ?!) ప్రశాంతంగా ఉంటే వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది ‘మానసిక ఒత్తిళ్లతో, తెలియని భయంతో ఉన్నపుడు మన శరీరం రాబోయే ప్రమాదమో లేక ఇతర విషయాల గురించో ఆలోచిస్తుంది. కాబట్టి ఆ సమయంలో రోగనిరోధక వ్యవస్థలో పూర్తిస్థాయి స్పందన రాకపోవచ్చు. ప్రశాంత చిత్తంతో ఎలాంటి ఒత్తిడీ లేకుండా ఉంటే మనం తీసుకునే వ్యాక్సిన్ లేదా ఎలాంటి ఔషధమైనా బెటర్గా పనిచేస్తుంది. వ్యాక్సినేషన్ తర్వాత మద్యం, సిగరెట్ వంటివి తీసుకున్నా, సరైన ఆహారం తీసుకోకపోయినా రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది’. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్షైన్ హాస్పిటల్స్ -
ప్రవేశ పరీక్షలు రాసేదెలా?
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ పెరిగిపోతోంది. కరోనా మూలంగా ఇంకా కాలేజీలే మొదలు కాలేదు... అప్పుడే ఏడునెలల విలువైన కాలం గడిచిపోయింది. మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదివే దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షల భయం పట్టుకుంది. ప్రత్యక్ష బోధన లేక, డిజిటల్/ఆన్లైన్ బోధన అర్థంకాక తలపట్టుకుంటున్న విద్యార్థులను... ఒక్కొక్కటిగా ప్రవేశపరీక్షల నోటిఫికేషన్ల జారీ షురూ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో తమ చదువులెలా? అన్న ఆవేదనలో విద్యార్థులు పడ్డారు. ప్రత్యక్ష బోధన లేని ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలే కాదు.. ఎంసెట్ వంటి రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనైనా నెగ్గుకు రాగలుగుతామా? అన్న భయం వారిని వెంటాడుతోంది. ఏపీ విద్యార్థుల నుంచే ప్రధాన పోటీ జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయ పరీక్షలకు సిద్ధం కావాలన్నా, ఎంసెట్ లాంటి రాష్ట్ర స్థాయి పరీక్షలు రాయాలన్న ప్రత్యక్ష బోధన ఉండాల్సిందేనని అధ్యాపకులే చెబుతున్నారు. రాష్ట్రంలో సెపె్టంబర్ 1 నుంచి ఆన్లైన్/ డిజిటల్ బోధన చేపట్టినా ఫలితం అంతంతేనంటున్నారు. విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లోని ఓపెన్ కోటా 20% సీట్లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడతారు. ఎంసెట్లో తీవ్ర పోటీ ఉంటుంది. హైదరాబాద్లో టాప్ కాలేజీ లు ఎక్కువగా ఉండటంతో ఏపీ విద్యార్థులు తెలం గాణ ఎంసెట్పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఏపీలో నవంబర్ 2 నుంచే ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. దాదాపు 30% సిలబస్ కూడా పూర్తయినట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ప్రిపరేషన్ మెరుగ్గా ఉంది కాబట్టి ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు ఎక్కువ శాతం సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వార్షిక పరీక్షలూ కష్టమే రాష్ట్రంలో సెపె్టంబర్ 1 నుంచి ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధన ప్రారంభమైంది. అయితే విద్యార్థులంతా డిజిటల్ పాఠాలను వినడం లేదని అధ్యాపకులే చెబుతున్నారు. టీశాట్లో వీడియోపాఠాలు ప్రసారం చేస్తున్నా విద్యార్థులకు అర్థం కావడం లేదని, ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన వీడియో పాఠాలపై అనుమానాలు వస్తే నివృత్తి చేసుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారు. మొత్తానికి 50 శాతం మంది విద్యార్థులు అంతంతగానే పాఠాలు నేర్చుకునే పరిస్థితి నెలకొనగా, 30 శాతం మంది విద్యార్థులు అసలు పాఠాలే వినడం లేదని ఆన్లైన్/డిజిటల్ బోధనను పర్యవేక్షిస్తున్న లెక్చరర్లు చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఏప్రిల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిర్వహించేలా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ కేలండర్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వీడియో పాఠాలు అర్థంకాక, కొంత మంది పాఠాలే వినలేని పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు ఎలా రాస్తారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. నిర్ణయం తీసుకునేదెప్పుడు? ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ఎలాగోలా పాస్ చేసినా, ఇంటరీ్మడియట్ విషయంలో ప్రత్యక్ష బోధన లేకుండా ఎలా ముందుకు సాగాలన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. అంతేకాదు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలు రాసి, మెరుగైన ర్యాంకులు సాధిస్తేనే వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలను పొందగలుగుతారు. అయితే ప్రత్యక్ష విద్యా బోధన లేకుండా విద్యార్థులు ఎలా ప్రవేశ పరీక్షలకు సిద్ధం అవుతారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. కాలేజీలు తెరిచేందుకు గతంలోనే ప్రతిపాదనలను పంపించినా వాటికి మోక్షం లభించకపోవడంతో ఇంటర్బోర్డు, ఇంటరీ్మడియట్ విద్యాశాఖ చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తోంది. పాఠాలు అర్థం కావడం లేదు కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన అధ్యాపకులు టీవీలో ఏకధాటిగా చెబుతూ వెళ్తుండటం, చెప్పింది అర్థం కాకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. నోట్స్ రాసుకునే సమయం ఇవ్వడం లేదు. టీవీలో పాఠం వింటూ వేగంగా నోట్స్ రాసుకోవడమే తప్ప.. తిరిగి వారిని డౌట్లు అడిగే వీలు లేదు. – మనీష, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, నయాబజార్ కళాశాల, ఖమ్మం అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం లేదు ఆన్లైన్లో పాఠాలు వింటున్నా. అయితే క్లాస్రూమ్లో వింటున్న అనుభూతి.. డౌట్ వస్తే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకునే వెసులుబాటు లేదు. డిజిటల్ క్లాసులు వేగంగా కొనసాగుతున్నాయి. పాఠం అర్థమైందో..లేదో తెలుసుకునే అవకాశం అధ్యాపకులకు లేదు. – ఉష, బైపీసీ, ద్వితీయ సంవత్సరం, నయాబజార్ కళాశాల, ఖమ్మం వన్వే బోధనతో లాభం లేదు మొదట్లో 80 శాతం మంది పాఠాలు విన్నారు. ఇప్పుడది చాలా వరకు తగ్గిపోయింది. నెట్వర్క్, ఇతరత్రా సమస్యలతో వినడం లేదు. ఆన్లైన్/ డిజిటల్ బోధన ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదు. విద్యార్థి– అధ్యాపకుల మధ్య ఉన్న అనుబంధం లేకుండా పోయింది. వన్వే వల్ల విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పోయింది. –కృష్ణకుమార్, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు విద్యార్థులకు తీవ్ర నష్టం ఇంటర్లో ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రత్యక్ష బోధనకు డిజిటల్ బోధన సాటిరాదు. డిజిటల్ బోధన వల్ల విద్యార్థులకు పాఠాలు అర్థం అయ్యేది అంతంతే. ప్రత్యక్ష బోధన లేకుండా విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కష్టమే. – డాక్టర్ పి.మధుసూదన్రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో రచ్చరచ్చ
దేవ్రియా: ఉత్తరప్రదేశ్లోని దేవ్రియాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవ్రియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ను ముకుంద్ భాస్కర్మణికి ఖరారు చేశారు. దీనిపై నిర్వహించిన సమావేశంలో రేపిస్టుకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఆగ్రహిస్తూ తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సచిన్ నాయక్ అనే నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగిలిన కార్యకర్తలు తారా యాదవ్ను అడ్డుకున్నారు. ఇది సోషల్ మీడియా లో వైరలైంది. దీనిపై తారా నాయక్ నలుగురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కొట్టి, అవమానించారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ డీజీపీకి లేఖ రాశారు. -
డ్రాగన్కు చెక్ : సరిహద్దుల్లో సైన్యం సమర నినాదం
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దూకుడు పెంచిన చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సన్నద్ధమైంది. సరిహద్దుల్లో ఇప్పటికే సమర సన్నద్ధతను పెంచిన భారత్ తాజాగా వివాదానికి కేంద్ర బిందువైన తూర్పు లడఖ్లో టీ-90, టీ-72 యుద్ధ ట్యాంకులను మోహరించింది. చుమర్-డెమ్చోక్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి యుద్ధ బలగాలతో పాటు ట్యాంకులను తరలించింది. 14,500 అడుగుల ఎత్తులో చైనా సైనికులతో తలపడేందుకు భారత సేన సాయుధ బలగాలు సిద్ధమయ్యాయి. భారత్ టీ-72, టీ-90 ట్యాంకులను మోహరించగా చైనా తేలికపాటి టైప్ 15 ట్యాంకులను మోహరించింది. సరిహద్దు ప్రతిష్టంభనతో భారత్-చైనాల మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి. ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ చైనా పలుమార్లు భారత భూభాగంలోకి చొచ్చుకురావడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం చైనా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ దీటుగా స్పందిస్తోంది. సరిహద్దు వెంబడి చైనా సైన్యం కుయుక్తులను తిప్పికొడుతూ భారత సేనలు పలుమార్లు డ్రాగన్ను నిలువరించాయి. మరోవైపు చైనాతో దౌత్య, సైనిక సంప్రదింపులు జరుపుతూనే డ్రాగన్ దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టేందుకు భారత సైన్యం అప్రమత్తమైంది. చదవండి : కరోనా మూలాలు తేలాల్సిందే! -
ముంబైలో అడుగుపెట్టిన కంగనా
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ ఫైర్బ్రాండ్ నటి కంగనా రనౌత్ బుధవారం మధ్యాహ్నం భారీ భద్రత నడుమ ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు. ఎయిర్పోర్ట్ వెలుపల ఆమె రాకను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమికూడగా కర్ణిసేన, ఆర్పీఐ కార్యకర్తలు క్వీన్కు మద్దతుగా భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాలు ఎయిర్పోర్ట్ వద్ద నినాదాలతో హోరెత్తించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్పోర్ట్ నుంచి కంగనా ప్రత్యేక గేట్ నుంచి బయటకు వెళ్లడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలదోయడంతో ముంబైని ఆమె మరోసారి పీఓకేతో పోల్చారు. కంగనా రాకతో ఆమె నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్ కారణంగా సెప్టెంబర్ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్ ఇప్పుడు గమనిస్తోందని కంగనా బీఎంసీ చర్యపై మండిపడ్డారు. కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు విచారణకు సంబంధించి ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని ఫైర్బ్రాండ్ నటి చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను ఈనెల 9న ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోవాలని కంగనా చేసిన ప్రకటనతో ఉత్కంఠ నెలకొంది. చదవండి : కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ -
టెస్టులంటే టెన్షన్
ఆదిలాబాద్కు చెందిన ఆమె పేరు లక్ష్మీబాయి (పేరు మార్చాం). ఇటీవల కొద్దిగా జ్వరం, దగ్గు రావడంతో డాక్టర్ సూచన మేరకు మందులు వాడింది. అయినా తగ్గలేదు. కరోనా టెస్ట్ చేయించుకోవాలని కుమారుడు చెబితే తనకు వచ్చింది సీజనల్ జ్వరమంటూ వాదించింది. చివరకు ఆయాసం మొదలవడంతో పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్గా తేలింది. ఆమె ఆక్సిజన్ స్థాయిలు 80కి పడిపోవడంతో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నారు. కరీంనగర్కు చెందిన మరో వ్యక్తి రామలింగయ్య. ఇటీవల పొడి దగ్గు రాగా దగ్గు మందు వాడాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కరోనా పరీక్ష చేయించుకోవాలని చెప్పినా తొలుత పట్టించుకోలేదు. వారమైనా దగ్గు తగ్గకపోవడం, ఆయాసం రావడంతో సీటీ స్కాన్ చేయించుకోగా కరోనాగా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆక్సిజన్ బెడ్పై ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా మంది కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి మాత్రం ముందుకు రావట్లేదు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా సీజనల్ వ్యాధులుగా భావించి టెస్టులు చేయించుకోవట్లేదు. కొందరైతే జ్వరం వస్తే సొంతంగా పారాసిటమాల్ మాత్రలు వాడేస్తున్నారు. దగ్గు, జలుబు చేస్తే సొంత వైద్యంపైనే ఆధారపడుతున్నారు. పరిస్థితి విషమించే దాకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొందరు డాక్టర్లు కూడా కరోనా అనుమానితులకు సాధారణ చికిత్సపైనే దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కరోనా కాలంలో ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితి చేయిదాటిపోతోంది. సామాజిక వ్యాప్తి మొదలైనా... రాష్ట్రంలోనూ కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది. ఎక్కడ, ఎలా కేసులు నమోదవుతున్నాయో కూడా ఎవరికీ అంతుబట్టట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం, దగ్గు, జలుబు, ఇతరత్రా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి పెద్దాసుపత్రుల వరకు 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తోంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే తక్షణమే కరోనా నివారణ కిట్లు ఇస్తున్నారు. ఒకవేళ ఫలితం నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని చెబుతోంది. అయితే ఇన్ని రకాలుగా వసతులున్నా కొందరు బాధితులు చాలా తేలికగా తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోవడానికి భయపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి అందరితో కలసి టెస్టు చేయించుకోవడం వల్ల తమకు వైరస్ లేకున్నా సోకుతుందేమోనని అనుమానపడుతున్నారు. మరికొందరేమో పాజిటివ్ వస్తే కుటుంబ సభ్యులు భయపడతారని భావిస్తున్నారు. ఇంకొందరేమో తమకు ఏమీ లేదన్న ధీమాతో ఉంటున్నారు. దీంతో ఇలాంటి వారిలో ఒక్కోసారి వైరస్ తీవ్రత పెరిగి పరిస్థితి విషమిస్తోంది. ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోతుండటంతో అప్పుడు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో అనేక సందర్భాల్లో ఆక్సిజన్ బెడ్పైకి లేకుంటే ఐసీయూలోకి వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి ప్రాణాంతకం అవుతోంది. ఇక విరివిగా ప్రచారం.. కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు, లక్షణాలుంటే తక్షణమే స్పందించేలా అవగాహన పెంచడం కోసం పట్టణాలు, గ్రామాల్లో విరివిగా ప్రచారం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. జిల్లాల్లో ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా కూడా భారీగా ప్రచారం చేయనుంది. కరపత్రాలు ముద్రించాలని, గ్రామాల్లో చాటింపులు వేయించడం ద్వారా కరోనా లక్షణాలున్న వారు తక్షణమే ఆసుపత్రికి వచ్చేలా చేయాలని నిర్ణయించింది. కరోనా వస్తే ఏమీ కాదని, ఆలస్యం చేయడం వల్లే సమస్యలు వస్తాయని ప్రజలకు వివరించనుంది. ముందే స్పందిస్తే కరోనాతో ముప్పులేదు.. కరోనా పరీక్షలను పీహెచ్సీలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో చేస్తున్నారు. అత్యంత ఖరీదైన విలువైన రెమిడెసివిర్, టోసీలుక్సిమాబ్ మందులు అన్ని జిల్లా ఆసుపత్రులలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పటికే ఉన్న 8 వేల ఆక్సిజన్ పడకలకు తోడుగా మరో పది వేలు పెంచాలని నిర్ణయించింది. కాబట్టి ఎవరికైనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. వెంటనే స్పందిస్తే కరోనా వల్ల ముప్పు ఏమీ ఉండదు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
సంస్మ‘రణం’
సాక్షి, హైదరాబాద్ : రెండువారాలుగా మన్నెంలో అలజడి మొదలైంది. మావోల రాక, పోలీసుల వేటతో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ పేరుతో కొత్త దళం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రాష్ట్రంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా గ్రీన్ టైగర్స్, కోబ్రా తదితర పేర్లతో కొన్ని దళాలు ఉండేవి. నక్సలైట్ల సానుభూతి పరులు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు లక్ష్యంగా పనిచేసేవి. ఇపుడు దాదాపు రెండు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో తిరిగి అలాంటి పరిస్థితులే పునరావృతమవుతుండటం గమనార్హం. దీంతో ఏజెన్సీలోని గిరిజనులు, ఆదివాసీలు భయాందోళనలో గడుపుతున్నారు. నిత్యం మావోయిస్టులు, వారి వెనక కూంబింగ్ దళాల బూట్ల చప్పుళ్లతో భయభయంగా గడుపుతున్నారు. అప్పుడలా..ఇప్పుడిలా..! దండకారణ్యంలో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మావోయిస్టులు ఈసారి మునుపెన్నడూ లేని స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. ఇందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల మావో అగ్రనేతలు, మిలీషియా సభ్యులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి తాజాగా విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. దండకారణ్య ప్రత్యేక మండల కమిటీ కార్యదర్శి రామన్న అనారోగ్యకారణాలతో గతేడాది మరణించారు. ఈయన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు. ఈసారి వార్షికోత్సవాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో రామన్న స్థానంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టు సభ్యుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు. అందుకే కీలకమైన ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు కావాల్సిన నిధులు, కొత్తవారి రిక్రూట్మెంట్ కోసం ఈసారి తెలంగాణలోకి మావోయిస్టులు అడుగుపెట్టారు. లాక్డౌన్ కాలంలో పోలీసులు కోవిడ్ విధుల్లో ఉండగా.. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు జనారణ్యంలోకి వచ్చారు. అందులో భాగంగానే బెదరింపులు, వసూళ్లు, రిక్రూట్మెంట్ యత్నాలు చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆటలు సాగనివ్వం.. తెలంగాణలో పదేళ్లుగా పెద్దగా మావోయిస్టుల కదలికలు లేవు. అలాంటిది లాక్డౌన్ కాలంలో పుంజుకోవడంపై హోంశాఖ సీరియస్గా పరిగణిస్తోంది. ఆసిఫాబాద్లో భాస్కర్ దళం సంచారంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అరాచకాలు ఇక్కడ సాగనిచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండటం మంగ్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతాల్లో స్వయంగా ఆయనే కూంబింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మరో కారణం కూడా చెప్పుకోవాలి. పదేళ్ల నుంచి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మావోల కార్యకలాపాలు లేవు. అదే సమయంలో స్పెషల్పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసుల్లో కొత్తగా చేరిన అధికారుల్లో మెజారిటీ మంది సుశిక్షితులేగానీ... వారికి ఎన్కౌంటర్లు ఎదుర్కొన్న అనుభవం లేదు. అందుకే, వారిలో ఉత్సాహం నింపి, మావోయిస్టులను తరిమికొట్టాలన్న వ్యూహంతో పోలీసు బాసు పర్యటనలు చేస్తున్నారని సమాచారం. -
మన బుర్రలను ప్రశాంతంగా ఉంచుకునేందుకు..
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి 20 రోజులు గడిచిపోయాయి. పార్టీల అనుభూతులిప్పటికే కరిగిపోయి ఉంటాయి. అంతా బాగుండాలని.. మనవాళ్లందరికీ మేలే జరగాలని ఎన్నో అనుకుంటాం. కానీ, అనుకున్నామని అన్నీ జరిగిపోతాయా? అన్న ఓ శంక కూడా ఎక్కడో ఓ మూల మనల్ని పట్టిపీడిస్తూనే ఉంటుంది. కాదంటారా? అక్షరాలా నిజమే అంటారు శాస్త్రవేత్తలు. మన మెదళ్లు ఎప్పుడూ భవిష్యత్తులో మన అవసరాలేమిటి? వాటిని సాధించుకునే మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఉంటాయి? అన్న అంశాలపై నిత్యం ఆలోచిస్తూనే ఉంటాయట. ఇంకోలా చెప్పాలంటే.. చింత అనేది మనకు పుట్టుకతో వచ్చే సహజ లక్షణమన్నది శాస్త్రవేత్తల అంచనా. జేమ్స్ కార్మోడీ అనే శాస్త్రవేత్త ఏం చెబుతారంటే.. నిత్యం మనల్ని వెంటాడే చింతలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదూ అని!. వైద్యశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా తాను అటు వైద్యులకు, ఇటు రోగులకూ ఈ టెక్నిక్కులు నేర్పించానని ఆయన అంటున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ టెక్నిక్కులు కొందరికి ఒక్కసారికే వంటబడితే.. మిగిలిన వాళ్లకు ఎంతకీ అర్థం కావు. చింతను మరిపించే పని.. చింత తాలూకు ప్రభావాలూ అన్నీఇన్నీ కావు. టెన్షన్.. నిద్రలేమి, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండటం మచ్చుకు కొన్నే. కాకపోతే వీటన్నింటి నుంచి మన బుర్రలను ప్రశాంతంగా ఉంచుకునేందుకూ మార్గాలున్నాయి. చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైన సందర్భాలను గమనించండి.. ఆ క్షణాల్లో మీరు కచ్చితంగా ఆనందంగానే ఉండి ఉంటారు. ఇలా ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన చింతలకు కొంత దూరం అయ్యేందుకు అవకాశముందన్నమాట. పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. చేసే పనిపై శ్రద్ధ పెడితే సంతోషం వస్తుందని తెలిసినా.. మనలో చాలామంది ఎందుకు ఆ పని చేయలేకపోతుంటారు? మన మెదడు పనితీరు దీనికి కారణమని అంటారు జేమ్స్. మనకు తక్కువగా ఉండే వనరుల, ఎదురుకాగల ముప్పుల గురించి ఆలోచిస్తుండటం మెదడు స్వతఃసిద్ధంగా చేసే పనని ఆయన వివరిస్తారు. మన ఆలోచనలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మైండ్ఫుల్నెస్తో ఉండటం ద్వారా టెన్షన్లను మరికొంత తగ్గించుకోవచ్చునని జేమ్స్ చెబుతారు. ఈ అంశంపై కేవలం రెండు మూడు వారాల శిక్షణ పొందితే చాలు.. ఏ అంశంపైనైనా దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరగడంతోపాటు, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని, చంచలమైన ఆలోచనలను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చునని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయని జేమ్స్ వివరించారు. మరెందుకు ఆలస్యం.. ఈ కొత్త ఏడాది ఎంచక్కా మైండ్ఫుల్నెస్తో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టండి మరి!. -
ఢిల్లీ జామియా వర్శిటీ వద్ద టెన్షన్
-
కిషన్రెడ్డి పర్యటన.. ఫ్లెక్సీలు తగలబెట్టడంతో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఆసిఫ్నగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. కిషన్రెడ్డి ఆదివారం ఆసిఫ్నగర్లో పర్యటిస్తున్న సమయంలో.. ఓ యువకుడు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టాడు. దీంతో పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిషన్రెడ్డి ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకుడిని పట్టుకొని బీజేపీ శ్రేణులు చితకబాదాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆసిఫ్నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. -
నిద్ర అలవాట్లలో తేడా వస్తే...
వేళకింత తిని.. పడుకోవాలని పెద్దలు అంటూంటే.. వారిదంతా చాదస్తం అని యువతరం కొట్టిపారేస్తూంటుంది. కానీ.. బ్రైగమ్ అండ్ విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం.. నిద్ర అలవాట్లలో వచ్చే తేడాలు ఊబకాయం, హైపర్ టెన్షన్లతోపాటు మధుమేహం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలకూ కారణమవుతోందని తెలియడం చూస్తే మాత్రం పెద్దలమాట చద్దిమూట అనుకోవాల్సిందే. ఒక్కోరోజు ఒక్కో సమయంలో నిద్రపోయే వారితో పాటు.. నిద్రపోయే సమయంలో కూడా తేడాలు ఉండేవారు 2000 మందిని పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తియాన్వీ హువాంగ్ తెలిపారు. ఆరేళ్లపాటు జరిపిన పరిశీలనల తరువాత ఈ తేడాలు ఎక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఈ అధ్యయనంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర అలవాట్ల గురించి వారిని ప్రశ్నించి తెలుసుకోవడం ఇందులో ఒకటని.. ఆక్టీ గ్రాఫ్ వంటి వాచీలను వాడటం ద్వారా వారంలో వారు ఎంత సమయం నిద్రపోతున్నారో తెలుసుకున్నారని వీరు విమర్శిస్తున్నారు. వీటి ఆధారంగా వారి నిద్ర అలవాట్లలో వచ్చిన తేడాలు ఏమిటన్నది నిర్దిష్టంగా తెలియదని చెప్పారు. -
నాంపల్లి ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత
-
అమిత్షా ర్యాలీ నేపథ్యంలో కోల్కతలో ఉద్రిక్తత
-
బంకురలోని డ్యూలీలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
సూర్యాపేటలొ ఉద్రిక్తత
-
మధ్యప్రదేశ్ ఫలితాలపై కమలనాథుల్లో కలవరం
-
విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యలయం వద్ద ఉద్రిక్తత
-
తాడిపత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రి అర్బన్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరిరోజు పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. పోలీసులు అధికారపార్టీ ఎన్నికల ప్రచారానికి అనుమతిచ్చిన పోలీసులు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు విధించారు. పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు స్థానిక గాంధీ సర్కిల్లో ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసలేం జరిగింది.. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలకు ముగియనుండడంతో టీడీపీకి చెందిన నాయకులు మధ్యాహ్న సమయంలో పట్టణంలోని పోలీస్స్టేషన్ నుంచి ఆశోక్పిల్లర్ వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు కూడా సీబీ రోడ్డు మీదుగా తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సీబీ రోడ్డు మీదుగా వస్తున్న వైఎస్సార్సీపీ నేతల ప్రచారాన్ని స్థానిక పోలీస్స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు తమకు ఇంకా గడువు ఉందని గడువులోపు ప్రచారాన్ని పూర్తీ చేసుకుని వెళుతామని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు తెలిపారు. ఇందుకు పోలీసులు సీబీ రోడ్డులో ప్రచారానికి వెళ్ళడానికి వీలులేదని పుట్లూరురోడ్డు గుండా వెళ్లాలని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ససేమిరా అన్న వైఎస్సార్సీపీ శ్రేణులు సుమారు అరగంటపాటు స్థానిక పోలీస్స్టేషన్ సర్కిల్లో ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న అడిషన్ ఎస్పీ చౌడేశ్వరీ అనంతపురం నుండి హుటాహుటిన తాడిపత్రికి చేరుకున్నారు. ఆర్టీసి బస్టాండ్ వరకు ప్రచారం నిర్వహించడానికి వీలులేదని ఆలోపు గడువు ముగుస్తుందని దీంతో పుట్లూరు రోడ్డు మీదుగా ప్రచారం నిర్వహించి ముగించాలని అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీ వైఎస్సార్సీపీ నేతలకు తేల్చి చెప్పారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు స్థానిక స్టేషన్ సర్కిల్లో ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో పుట్లూరు రోడ్డు మీదుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పుట్లూరు రోడ్డు నుండి క్రిష్ణాపురం జీరో రోడ్డు గుండా యల్లనూరు రోడ్డులోకి ప్రవేశించే సమయంలో పోలీసులు అక్కడ కూడా వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నారు. తిరిగి పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య క్రిష్ణాపురం జీరో నుండి యల్లనూరు రోడ్డు సర్కిల్ వరకు ప్రచారాన్ని సాగించారు. ఇంతలోనే ప్రచారం గడువు ముగియడంతో నాయకులు వెనుతిరిగి వెళ్ళారు. -
కళ్యాణదుర్గం టీడీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
-
విశాఖ జిల్లా టీడీపీలో భీమిలి పచాయితీ
-
కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత
-
చెవిరెడ్డి అరెస్ట్: సత్యవేడు పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
మహబూబ్నగర్ జిల్లా దమ్మాయిపాలెంలో ఉద్రిక్తత
-
ఉద్రిక్తంగా మారిన యూటీఎఫ్ మహా పాదయాత్ర
-
డ్వాక్రా మహిళలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
-
మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల నిరసన సెగ!
-
మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల సెగ!
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ పేరుతో తమను మోసం చేశారంటూ తోపుదుర్తిలో డ్వాక్రా మహిళలు మంత్రి పరిటాల సునీతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు కర్కషంగా అరెస్టు చేశారు. డ్వాక్రా మహిళలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. డ్వాక్రా రుణమాఫీ గురించి అడిగితే అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వందలాదిమంది పోలీసులతో మహిళలను ఈడ్చిపారేస్తున్నారని వారు మండిపడ్డారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ఎవరినీ మోసం చేస్తారని మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రి పరిటాల సునీత పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. డ్వాక్రా మహిళల అరెస్టులను వైఎస్సార్సీపీ ఖండించింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తే అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్వాక్రా మహిళల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని, డ్వాక్రా మహిళలపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టి అర్థమవుతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. డ్వాక్రా మహిళలను పోలీసులు అడ్డుకోవడం దారుణమని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మండిపడ్డారు. డ్వాక్రా మహిళలతో మాట్లాడటానికి కూడా మంత్రి పరిటాల సిద్ధంగా లేరని, రుణమాఫీపై మంత్రి సమాధానం చెప్పాలంటూ మహిళలు తిరగబడ్డారని ఆయన తెలిపారు. మరోసారి మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆరోపించారు. -
నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
-
మణిక్యాలారావు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
-
శ్రీకాకుళం జిల్లా జన్మభూమి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత
-
కార్నూలు జిల్లా జన్మభూమి కార్యక్రమంలో రభస
-
అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత
-
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్తత
-
అనంతపురం రైల్వే స్టేషన్లో కలకలం
-
ఉద్యమం.. ఉద్రిక్తం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): మునిసిపల్ కాంట్రాక్ట్ పారి శుధ్య కార్మికుల సమ్మె తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తతకు దారితీసింది. 279 జీఓను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్ట ణాలలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక సంఘం అధికారులు గురువారం కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో వేరే వారితో స్థానిక వీకర్స్ కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనులు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలిసి సమ్మెలో ఉన్న కార్మికులు అక్కడికి చేరుకుని ప్రైవేట్ వ్యక్తులను పనులు చేయవద్దని కోరారు. తాము సమ్మెలో ఉన్నామని, సహకరించాలని కోరారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని సమ్మెలో ఉన్న కార్మికులను బలవంతంగా జీపులోకి ఎక్కించడం మొదలుపెట్టారు. దాంతో కార్మికులకు, పోలీస్లకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ముగ్గురు మహిళా కార్మికులు మర్రి చంద్రకళ, మండెల్లి జుయసుధ, కూనుపాముల దయామణి స్పృహ తప్పారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జీపులోకి మహిళా కార్మికులను ఎక్కించి వెనుక డోర్ వేయకుండానే వాహనాన్ని పోనివ్వడంతో కొంతమంది కార్మికులు కింద పడిపోయారు. వారికి తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళా కార్మికులు తాటికొండ మిరియ, ముత్యాలమహాలక్ష్మి లకు తలకు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గోసాల రవి అనే కార్మికుడి చేయి బెణికింది. తరువాత స్థానిక ఏరియా ఆసుపత్రి అత్యవసర విభాగం వద్దకు పారిశుధ్య కార్మికులు చేరుకుని ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కార్మిక నేతలు కర్రి నాగేశ్వరరావు, డి.సోమసుందర్, మండల నాగేశ్వరరావు, సిరపరపు రంగారావు, గుంపుల సత్యకృష్ణ, జనసేన నాయకులు నీలపాల దినేష్, సీఐ మూర్తి, ఎస్సైలు, ట్రాఫిక్ పోలీసులు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో కార్మిక నాయకులతో చర్చలు జరిగాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదు ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డి.సోమసుందర్, కర్రి నాగేశ్వరరావులు హెచ్చరించారు. ఓ వైపు కార్మికులు సమ్మె చేస్తుండగా పోటీగా కూలీ లను తీసుకువచ్చి పారిశుధ్య పనులు చేయించడం సరికాదన్నారు. 279 జీవో విధానం అంతా లోపభూయిష్టమన్నారు. ఎన్నో ఉద్యమాలు చూశామని పోలీసులు దౌర్జన్యం చేసినా, పోటీ కార్మికులను దింపినా ఉద్యమం తీవ్రతరం అవుతుందన్నారు. రానున్న ఎన్నికలలో సత్తా చూపించండి ప్రభుత్వం పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులపై కక్షసాధింపులు చేస్తున్నందున, కార్మికులు రానున్న ఎన్నికలలో తమ సత్తా చాటాలని ఓట్లు రూపంలో ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని ఏఐటీయూసీ నాయకులు డి.సోమసుందర్ కార్మికులకు పిలుపునిచ్చారు. రక్తం కారుతున్నప్పటికి సమ్మె వీడవద్దన్నారు. ఉద్యమాలు తీవ్రతరం చేద్దాం అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ, తమ ఇళ్ళు వద్ద ఆయా సందర్భాలలో పారిశుధ్య కార్మికులచే పనులు చేయించుకుంటున్నారని, వీరికి కాంట్రాక్ట్ కార్మికులు అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. అధికారులకు సైతం పారిశుధ్య కార్మికుల సంక్షేమం పట్టడం లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి: సీఐ మూర్తి పారిశుధ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సమ్మె చేస్తున్న కార్మికుల స్థానంలో ప్రభుత్వం వేరే కార్మికులతో పనులు చేయిస్తుందని, వారిని అడ్డుకోవడం తగదని సీఐ మూర్తి అన్నారు. పోలీసులు డ్యూటీలు చేస్తున్నారే తప్ప కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని వివరించారు. 8వ రోజుకు సమ్మె పారిశుధ్య కార్మికుల సమ్మె గురువారం నాటికి 8వ రోజుకు చేరింది. పురపాలక సంఘం శిబిరం వద్ద కార్మికులు వంట వార్పు కార్యక్రమం చేయడం ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. -
‘శబరిమల’ నిరసన హింసాత్మకం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేరళ దేవాదాయ మంత్రి కదంకపల్లి సురేంద్రన్ అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) గురువారం చేసిన యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత ఆందోళనకారులు సురేంద్రన్ ఇంటి వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను బద్ధలుకొట్టడానికి ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు తొలుత జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీ, కాంగ్రెస్ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలకు తన వైఖరి తెలియజేయాలని సీపీఎంనేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకు పూర్వమే ఆరెస్సెస్ కోరింది.. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కోరుతూ 12 ఏళ్ల క్రితమే ఆరెస్సెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి సురేంద్రన్ అన్నారు. బీజేపీ తలపెట్టిన 5 రోజుల ‘లాంగ్మార్చ్’ను..అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చేపట్టిన రథయాత్రతో పోల్చారు. ‘లాంగ్మార్చ్ను చూస్తుంటే నాకు రథయాత్ర గుర్తుకొస్తోంది. అన్ని వయసున్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలని ఆరెస్సెస్ 12 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు’ అని అన్నారు. మసీదుల్లోకి అనుమతించాలి.. శబరిమల తీర్పు స్ఫూర్తితో అన్ని మసీదుల్లోకి కూడా మహిళలను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేరళకు చెందిన ముస్లిం మహిళా హక్కుల సంఘం నిసా యోచిస్తోంది. మహిళలను కేవలం ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలనే కాకుండా వారిని ఇమామ్లుగా కూడా నియమించాలని ఉద్యమించనుంది. -
విశాఖ రైల్వే జోన్ : ఏంపీ హరిబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత
-
తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత
-
భారత్ బంద్ : ఉత్తరాదిలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణను నిరసిస్తూ పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం భారత్ బంద్ సందర్భంగా ఉత్తరాదిలో ఉద్రిక్తత నెలకొంది. బిహార్లో నిరసనకారులు పలు రైళ్లను నిలిపివేయగా, యూపీ, మధ్యప్రదేశ్ల్లో దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బిహార్లో విద్యాసంస్థలు, పెట్రోల్ పంపులు మూసివేశారు. బిహార్, జార్ఖండ్ల్లో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. దర్భంగా, ముంగర్ మసుదాన్, అర్రాలలో ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. 34 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను వివిధ జిల్లాల్లో మోహరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న దళిత సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు మధ్యప్రదేశ్లో భారత్ బంద్ ప్రభావం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపై టైర్లను దగ్ధం చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశామని, 35 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించామని పోలీసు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్, యూపీలో వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయని, బస్సుల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. -
నారావారిపల్లిలో ఉద్రిక్తత
-
వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత
-
విజయవాడలో స్టేట్ లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత
-
ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన ఫిర్యాదుతో వివిధ రాజకీయ పా ర్టీలు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కమి షనర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు పోలీసులు కమిషనర్పై ఎస్సీ,ఎస్టీ కేసు, అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు. ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనపై కమిషనర్ విజయసింహారెడ్డి అత్యాచారానికి ప్రయత్నించారని పారిశుద్ధ్య కార్మికురాలు ఎస్.వసంత వాపోయింది. ఆమెకు న్యాయం చేయాలని తోటి కార్మికులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎస్.వసంత పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు కమిషనర్ ఇంటి వద్ద పని చేయడానికి మేస్త్రీ అయిన నర్సింహరెడ్డి ద్వారా పిలవడం జరిగింది. దీంతో కమిషనర్ ఇంటి వద్దకు ఆమె వెళ్లింది. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత.. బెడ్ రూమ్లో శుభ్రం చేస్తుండగా కమిషనర్ వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను చెప్పినట్టు వింటే నీకు ఏమి కావాలన్నా ఇస్తాను’ అని లొంగదీసుకోవడానికి బలవంతంగా లాగారని వాపోయింది. తాను గట్టిగా కమిషనర్ను వెనక్కి నెట్టి పరుగెత్తుకుంటూ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తోటి కార్మికులకు జరిగిన విషయం తెలిపానని వివరించింది. మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయింపు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఈ విషయం మాట్లాడటానికి కార్మికులు ప్రయత్నించారు. అయితే అధికారులు బెదగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎం.హర్షవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు డి.సూర్యానారాయణరెడ్డి, పద్మనాభయ్య, నాగన్న, కడప పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణరెడ్డి, వర్రా డెవిడ్, నాయకులు దివాకర్రెడ్డి, షర్పుద్దీన్, మహుబూబ్వలి, బీజేపీ నాయకుడు నాగరాజు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.గంగిరెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు ఎస్.మంజుల, ఏఐటీయూసీ నాయకులు ఎం.నారాయణ అక్కడికి చేరుకున్నారు. కార్మికులతోపాటు వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అంతకుమునుపు బాధితురాలికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ ముసలయ్య నిలిచారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కమిషనర్ను ప్రత్యేక వాహనంలో కార్యాలయం నుంచి బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న కార్మికులు రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో రోడ్డుపై బైఠాయించారు. తర్వాత పోలీసులు కమిషనర్ను పోలీసుస్టేషన్కు తరలించారు. ఎస్ఐలు మారెన్న, చిరంజీవి, క్రిష్ణయ్య, మహమ్మద్ రఫీలు ఆందోళనను అదుపు చేశారు. ఆందోళనకారులు బాధితురాలు వసంతతోపాటు పోలీస్స్టేషన్కు వచ్చి కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కమిషనర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 354–ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మారెన్న తెలిపారు. డీఎస్పీ విచారణ కడప డీఎస్పీ మాసూంబాషా ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్కు వచ్చి విచారణ చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేత హర్షవర్ధన్రెడ్డి, సీ పీఐ నాయకురాలు మంజుల డీఎస్పీని కలిసి కోరారు. కమిషనర్ ఏమంటున్నారంటే.. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ విజయసిం హారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తనపై నిందా ఆరోపణలు వేస్తున్నారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ స మావేశంలో జీఓ 279ను ఆమోదం చేయాలని అజెం డాలో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ఈ జీ వో అమలులోకి వస్తే ఉద్యోగ భద్రత ఉండదని నెపం తో కార్మికులు తన పైన నిందలు వేస్తున్నారని చెప్పా రు. తాను కార్మికులను బలవంతం చేయలేదన్నారు. కమిషనర్ బదిలీ ఎర్రగుంట్ల మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. తనను బదిలీ చేయాలని ఆయన రెండు వారాల క్రితం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. -
ఏజెన్సీలో ఉద్రిక్తత
సాక్షి, ఆసిఫాబాద్: ఏజెన్సీ సర్టిఫికెట్ విషయంలో వివాదంతో కుమురంభీం జిల్లాలో సోమవారం మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నాలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో ఆదివారం రాత్రి ఓ సందేశం వైరల్గా మారడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సోమవారం ఒక దశలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందేమోనని అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. సిర్పూర్(యూ) మండలంలో ఎస్టీ సర్టిఫికెట్ జారీ విషయంలో జరిగిన వివాదం కాస్త ముదిరి కలెక్టరేట్ ముట్టడికి దారి తీసింది. జిల్లా పోలీసుల కృషితో సాయంత్రం వరకు పరిస్థితి అంతా సద్దుమణిగింది. సోమవారం ఉదయం నుంచే జిల్లా కేంద్రం ఆసిఫాబాద్తోపాటు వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్, తిర్యాణి మండలాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ మండలాల నుంచి ఎస్సైలను ఆసిఫాబాద్కు రప్పించి వజ్ర వాహనంతో గస్తీ నిర్వహించారు. కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు లంబాడ వర్గాలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ఆదివాసీ గ్రామాల్లో మావా నాటే మావ రాజ్(మా ఊళ్లో మా రాజ్యం) పేరుతో లంబాడ ఉద్యోగులను బహిష్కరిస్తున్నారు. దీంతో ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీలో రెవెన్యూ అధికారులు జంకుతున్నారు. రాజ్యాంగంలోని 342 ప్రకారం మొదటగా గుర్తించిన షెడ్యూల్డ్ కులాల్లో లంబాడ వర్గం ఆ జాబితాలో లేరని, వారిని 1976లో సవరణ ద్వారా చేర్చారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో తహసీల్దార్లు స్థానిక ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలా వద్దా ? అనే సందేహాలు రావడంతో కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ ఈ విషయం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆ శాఖ కమిషనర్ క్రిస్టియానా జడ్ చాంగ్దూ ఓ సర్క్యులర్ జారీ చేశారు. వాటి ప్రకారం మొదట 1950లో పేర్కొన్న వర్గాలకు మాత్రమే ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఈ ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వడంగానీ, నిలిపివేయడం గానీ ఐటీడీఏ పీవో చైర్మన్గా, ఆర్డీవో, జిల్లా గిరిజ సంక్షేమ శాఖ అధికారి, ట్రైబల్ కమిషనర్ హైదరాబాద్ నుంచి ఒక అధికారిని సభ్యులుగా ఓ కమిటీ నిర్ధారిస్తుంది. ఈ నిబంధనలు అమలు చేయడంతో తాజాగా నిరసనలకు దారి తీసినట్లయింది. ఏజెన్సీ సర్టిఫికెట్తో రాజుకున్న వివాదం ఈ నెల 7న కుమురంభీం జిల్లా సిర్పూర్(యూ) మండలం దనోరా(పి)కి చెందిన లంబాడ యువకుడు అడె ప్రవీణ్కుమార్కు స్థానిక ఎస్టీ సర్టిఫికెట్ కోసం ఆ మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 24 ప్రకారం ఇవ్వడం కుదరని అప్పటి ఇన్చార్జి తహసీల్దార్ మస్కూర్ అలి ఆ యువకుడికి మెమొ ఇచ్చారు. ఈ మెమొలో జీవో నంబర్ 24ను పేర్కొంటూ కారణంగా చూపించారు. ఈ మెమొ జారీపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్కు ఫిర్యాదు అందడంతో కలెక్టర్ సదరు తహసీల్దార్ను వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహించి కలెక్టర్ తీరుకు నిరసగా సోమవారం మూకుమ్మడిగా పెద్దయెత్తున కలెక్టరేట్కు వినతిపత్రాలు ఇచ్చేందుకు తరలివచ్చారు. అంతేకాక ‘సంవిధాన్ పడో–ఆదివాసీ బచావో’(రాజ్యాంగం చదువు–ఆదివాసీని కాపాడుకో) అంటూ ప్రత్యేకంగా ఓ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నిరసన ఎక్కడ ఉగ్రరూపం దాల్చుతుందోనని పోలీసులు ముందస్తుగా ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఫలించిన ఎస్పీ వ్యుహం... ఆదివాసీలు నిరసనలు చేపడుతున్నారని తెలిసి ఎస్పీ కల్మేశ్వర్ సింగనేవార్ పరిస్థితిని ఆదిలో అదుపులోకి తెచ్చారు. ఆదివాసీలు సోమవారం కలెక్టరేట్కు పెద్ద ఎత్తున వస్తున్నరాన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ నాయకులు కలెక్టరేట్కు వచ్చేకంటే.. వాళ్లలో ఎంపిక చేసిన కొందరిని పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో కలెక్టరేట్కు తీసుకువచ్చారు. నిరసనలు చేపడుతామని అనుకున్న వారిని శాంతియుతంగా చర్చలకు ఆహ్వానించారు. వారిలో ముఖ్యులతో దాదాపు గంటపైగా సమావేశం ఏర్పాటు చేయించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో సమన్వయపరుస్తూ పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేశారు. వీరిలో కొందరు ఆదివాసీ నాయకులు చర్చల సందర్భంగా ఎస్పీ సార్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో శాంతి భద్రతలకు సహకరిస్తున్నామని, ఆదివాసీలు ఇంత ఉద్యమం చేస్తున్నా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెవెన్యూ శాఖలో ఎస్టీ సర్టిఫికెట్ల జారీ.. ఇటీవల విద్యావాలంటీర్ల నియామకాలు, సీఆర్టీల ఎంపికలోనూ అదే అన్యాయం జరుగుతోందని ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు వివరించినట్లు సమాచారం. ఇటీవల తిర్యాణిలో ఆదివాసీలు ఆశ్రమ పాఠశాలల్లో జరిగిన నియామకాలను వ్యతిరేకించినా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నుంచి తిరిగి వారికే పోస్టింగ్ ఇవ్వడంతో జిల్లా ఉన్నతాధికారులపై నమ్మకం పోతోందని చర్చల సందర్భంగా వాపోయినట్లు ఆదివాసీ నాయకుడు ఒకరు ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలపై నమ్మకం పోయిందని జిల్లా ఉన్నతాధికారులే తమ శాంతియుత ఉద్యమాన్ని గుర్తించి భవిష్యత్తు తరాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. చర్చల సందర్భంగా నాయకులు చెప్పిన విషయాలు విన్నాక తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించగలుగుతామని వారికి వివరించారు. అంతేకాక చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించొద్దని ఎస్పీ ఆదివాసీ నాయకులకు పదే పదే విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. దుకాణాలు బంద్ ఆసిఫాబాద్: ఆదివాసీల ఆందోళనను అంచనా వేసిన పోలీసులు ఏజెన్సీ మండలాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గతంలో కలెక్టరేట్పై ఆదివాసీల దాడిని దృష్టిలో పెట్టుకుని పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం ఉదయం ఆసిఫాబాద్ ప్రధాన మార్కెట్లోని దుకాణాలను మూసి వేయించారు. తుడుందెబ్బ జిల్లా అద్యక్షుడు కొట్నాక విజయ్, ఆదివాసీ నాయకులు డీఎస్పీ సత్యనారాయణను కలిసి సమస్య వివరించారు. శాంతియుతంగా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని కోరడంతో సుమారు 40 మంది ఆదివాసీలు కలెక్టర్ ప్రశాంత్పాటిల్, ఎస్పీ కల్మేశ్వర్ సింగనేవార్లను కలిసి సమస్య వివరించారు. కలెక్టర్, ఎస్పీ ఆదివాసీలతో చర్చలు జరిపి వారిని శాంతింపజేశారు. -
నెల్లూరు జిల్లా కవలిలో ఉద్రిక్తత
-
విశాఖపట్నం బీచ్లో పొలిటికల్ టెన్షన్
-
బీజేపీ ర్యాలీలో ఉద్రిక్తత
-
ప్రతిపక్షం గొంతు నొక్కడం దారుణం
నరసరావుపేట: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును వినపడనీయకుండా అణచివేయాలనుకోవటం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో అవినీతికి చిరునామాగా కోడెల కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. నరసరావుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన సభను జరగనీయకుండా తనతో పాటు కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడుతో కలసి పాత్రికేయులతో మాట్లాడారు. స్థల వివాదంలో తాను లూథరన్ అంధుల పాఠశాల ఉన్న ఏఈఎల్సీ సంస్థ చైర్మన్ను కలిశానని చెప్పారు. ఆయన తాము ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదని చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న వారు కూడా శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ తాము లీజుకు తీసుకోలేదని, కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారన్నారు. తాము లీజుకు తీసుకున్నట్లు డాక్యుమెంట్ తీసుకొస్తే వెంటనే తమ ఖర్చులతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తామని వారు ప్రకటించారన్నారు. ఈ వ్యవహారంలో నకిలీ లీజు అగ్రిమెంట్ను టీడీపీ నాయకులు సృష్టించారని గోపిరెడ్డి ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు సాయితేజ డెవలపర్స్ పేరుపై ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధం చేసుకున్నారని, దానిలో ఏడుగురు వ్యక్తుల పేర్లు ఉండగా అందులో ముగ్గురు టీడీపీకి చెందినవారని గోపిరెడ్డి వివరించారు. వారిపేర్లు బయటపెట్టకుండా కేవలం వైఎస్సార్సీపీకి చెందిన వారి పేర్లే బయటపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. గుంటూరులో సంగతి మాట్లాడరే ? గుంటూరులో ఏఈఎల్సీకి చెందిన ఆరు ఎకరాలు మంత్రి నక్కా ఆనందబాబు చేతిలో ఉన్నాయని గోపిరెడ్డి చెప్పారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్కు చెందిన గ్రాండ్ హోటల్ నాగార్జున ఏఈఎల్సీ స్థలంలో నిర్మించినదేనని తెలిపారు. టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు స్థలం లీజుకు తీసుకొని రమేష్ హాస్పిటల్స్ నిర్మించేందుకు ఇచ్చారన్నారు. వీరందరూ టీడీపీకి చెందినవారేనని గుర్తు చేశారు. వీరు తీసుకున్నప్పుడు ఆందోళనలు, ఉద్యమాలు ఎందుకు చేయలేదని, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కేవలం సంబంధం లేని వ్యవహారాన్ని తనకు చుట్టి తనపై బురదచల్లేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తనపై కల్తీ పాలు, టీటీడీ లేఖలు అంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారని, అయితే ఏ విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరినా వారు స్వీకరించటం లేదని గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం వారి చేతిలో ఉన్నా తనపై ఎందుకు కేసులు పెట్టటం లేదని ప్రశ్నించారు. తన ప్రమేయం లేదని తెలిసే కేసులు పెట్టలేదన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసులు పెట్టాలని, ఏ స్థాయి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. అవినీతి సామ్రాట్ శివరాం స్పీకర్ డాక్టర్ కోడెల కుమారుడు శివరామ్ అవినీతికి చిరునామాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. భూకబ్జాలు చేస్తున్న వ్యక్తే తమపై నిందలు మోపుతున్నాడన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల గ్రామంలో సుబ్బారావుకు చెందిన 17 ఎకరాల భూమిని కబ్జా చేసి ఆ స్థలంలో ఉన్న రూ.2 కోట్ల ఆస్తిని ధ్వంసం చేశారన్నారు. ఏడు ఇళ్లు నాశనం చేసి సుమారు 10 వేల కోళ్లను తిన్నారన్నారు. నరసరావుపేట పలనాడు రోడ్డులో ఎస్ఎస్ఎన్ కళాశాల అధ్యాపకుడికి చెందిన రూ.5 కోట్ల స్థలాన్ని, నల్లపాడులో సాంబిరెడ్డి అనే వ్యక్తికి చెందిన 2.5 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. తాను తిరుపతి పాదయాత్రకు వెళుతూ లక్షలు వసూలు చేశారనే శివరామ్ విమర్శలను ఎమ్మెల్యే గోపిరెడ్డి ఖండించారు. వెంకటేశ్వరస్వామి పాదయాత్రను కూడా రాజకీయం చేసిన దుర్మార్గుడు శివరామ్ అన్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లోఫర్స్ అంటూ శివరామ్ చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్కు వెళతామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయకుండానే సత్తెనపల్లి, నరసరావుపేటలలో దోచుకున్న రూ.150కోట్ల డబ్బుతో గుంటూరులో కేఎస్పీ మాల్ నిర్మించారని తెలిపారు. ముఖ్యమంత్రి హెచ్చరించినా రైల్వే కాంట్రాక్టర్ నుంచి రూ.5కోట్లతో పాటు సత్తెనపల్లిలో బాలాజీ స్వీట్స్ నుంచి నెలకు రూ.50వేలు వసూలు చేస్తున్నాడన్నారు. చివరకి తన పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా డబ్బులు వసూలుచేస్తూ వారే తనకు బలమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక మాజీ ఎంపీపీ మట్టి తోలుకున్నాడని నాలుగు రోజుల పాటు జైలులో పెట్టించాడన్నారు. తన ఇంటిలో బాంబులు పేలి నలుగురు కార్యకర్తలు చనిపోతే ఇప్పటివరకు ఆ కుటుంబాలను ఆదుకోలేదని తెలిపారు. ఇటువంటి వ్యక్తికి ఆర్డీవో కార్యాలయం వద్ద పోలీసులు ఆరు గంటల పాటు మైకు ఇచ్చి స్టేజ్ ఏర్పాటు చేసుకుంటే తప్పు లేనిదీ... ఏ తప్పూ చేయని తాము సభ పెట్టుకుంటామంటే హౌస్ అరెస్టుచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ నేరం చేశాడని అరెస్టు చేశారు: బొల్లా వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఏ నేరం చేశాడని అరెస్టు చేశారంటూ ప్రశ్నించారు. డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని విధాలా ప్రజలను దోచుకుంటున్న వీరు అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు నూరుల్ అక్తాబ్, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఏ.హనీఫ్, జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా పాల్గొన్నారు. నరసరావుపేటలో నియంతృత్వ పాలన ? నరసరావుపేట టౌన్: నరసరావుపేటలో నియంత పాలన కొనసాగుతుందా అన్నట్లు శనివారం వాతావరణం కనిపించింది. ఎటుచూసినా ఖాకీలు గుంపులు గుంపులుగా లాఠీలు పట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీనంతటికీ టీడీపీ నేతల అవినీతిపై ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసరటమే కారణంగా కన్పిస్తోంది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే ఎక్కడ తమ అవినీతి పుట్ట పగులుతుందోనని కలవరపాటుతో అధికార పార్టీ కుట్ర చేసి సభను భగ్నం చేసింది. 144 సెక్షన్ అస్త్రాన్ని ఉపయోగించి నియోజకవర్గ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో పట్టణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసి ఇతరులనెవ్వరిని అటుగా అనుమతించలేదు. దీంతో పాటు మల్లమ్మ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయ సెంటర్, పల్నాడు బస్టాండు, ఆర్టీసి బస్టాండు వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డుగా డివైడర్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అటుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. దీంతో ప్రజానీకం అసౌకర్యానికి గురైయ్యారు. పోలీసుల అదుపులో పట్టణం మూడు సబ్ డివిజన్ల అధికారులు, సిబ్బందితో పాటు గుంటూరు నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన సెంటర్లలో 10 నుంచి 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 10 వాహనాల్లో పోలీసులు గస్తీ తిరిగి జనాలను చెదరగొడుతూ భయబ్రాంతులకు గురిచేశారు. మరో ఐదు రోజుల పాటు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న దృష్ట్యా పోలీసులు ఇదే అత్యుత్సాహం ప్రదర్శిస్తే జనజీవనం అస్తవ్యస్తం అవ్వటం ఖాయం. -
విజయవాడ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం కార్పొరేషన్ను ముట్టడించేందుకు కార్మికులు భారీగా తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కార్పొరేషన్లోనికి చొచ్చుకు పోయేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగడంతో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
పాతబస్తీలో ఉద్రిక్తత : హిజ్రాలపై రాళ్లతో దాడి
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులకు అమాయకుల ప్రాణాలు బలైతూనే ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్తత వాతారణం నెలకొంది. పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే నెపంతో స్థానికులు ముగ్గురు హిజ్రాలపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా దాడులకు దిగారు. పెట్రోలింగ్ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. అయిదే దాడిలో తీవ్రంగా గాయపడిన ఒకరు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే తీరులో మాదన్నపేటలో సైతం ముగ్గురు బిహార్ వాసులను స్థానికులు చితకబాదారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్సా అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రాయణగుట్ట ఘటనా స్థలాన్ని సౌత్జోన్ డీజీపీ సత్యనారాయణ పరిశీలించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని, ప్రజలు భయాందోళనకు గురికావోద్దని తెలిపారు. ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంతత నెలకొందని తెలిపారు. మృతిచెందిన హిజ్రాను శంషాబాద్కు చెందినది గుర్తించారు. 25 మంది అనుమానితులని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. పోలీసులు ఎంత చెబుతున్నా.. ప్రజల్లో అవగాహాన రావడం లేదు. -
చేంగల్లో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, నిజామాబాద్ : భీమ్గల్ మండలం చేంగల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చేంగల్ గ్రామంలోకి ఎంజీ తండా, ధన తాండలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గిరిజనులు భారీగా తరలివస్తున్నారు. దీంతో గ్రామంపై దాడికి యత్నిస్తారని భావించిన పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆగ్రహంతో ఉన్న గిరిజనులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసులను గ్రామంలో మొహరించారు. తమ వారిపై చేంగల్ గ్రామ ప్రజల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేంగల్ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. పిల్లలు, మహిళలు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఅసత్య వార్తల కారణంగా చేంగల్కు గ్రామస్తులు ఎంజీ తాండా, ధనబండ తాండాలకు చెందిన ఇద్దరు గిరిజనులను బీహార్కు చెందిన దొంగలుగా అనుమాన పడి కర్రలతో చితకబాదారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆర్మూరు, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రులకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే నిమ్స్ లో చికిత్స పొందుతూ దేవ్యా అనే గిరిజనుడు మృతి చెందాడు. దీంతో ఆగ్రహంతో చేంగల్ గ్రామానికి తరలివచ్చి గిరిజనులు ఆందోళనకు దిగారు. -
తుందుర్రులో ఉద్రిక్తత
సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ పైప్లైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సీపీఎం నేతలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అయితే సీపీఎం నేతలను అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ కార్యకర్తలు, పార్క్ బాధితులు నిరసన తెలుపుతున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ వద్దంటూ 33 గ్రామాల ప్రజలు పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. -
ఏఎంయూలో జిన్నా ఫోటోపై రగడ
సాక్షి, లక్నో : అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో మహ్మద్ జిన్నా చిత్రపటంపై వివాదం రాజుకుంది. విద్యార్థి సంఘ కార్యాలయంలో జిన్నా ఫోటో ఉండటంపై వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోటోను తొలగించేందుకు విద్యార్థి నేతలు అంగీకరించలేదు. తమపై పోలీసుల చర్యకు నిరసనగా తరగతులు బహిష్కరించాలని విద్యార్థులు పిలుపు ఇచ్చారు. విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో రెండు రోజుల పాటు వర్సిటీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని జిల్లా మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేశారు. చరిత్రలో భాగం అయినందునే జిన్నా చిత్రపటాన్ని తాము తొలగించబోమని విద్యార్ధులు స్పష్టం చేశారు. జిన్నా తమకు స్ఫూర్తిప్రదాత కాకున్నా భారత చరిత్రలో ఆయన ఒక భాగమని వారు చెబుతున్నారు. అన్సారీ పర్యటన నేపథ్యంలో వర్సిటీలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని వారు అసంతృప్తివవ్యక్తం చేశారు. కాగా జిన్నా చిత్రపటం వివాదంపై జరిగిన ఘర్షణల్లో 40 మంది విద్యార్థులతో పాటు పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు.ఏఎంయూలో జిన్నా చిత్రపటం ఉంచడాన్ని హిందూ యువ వాహిని కార్యకర్తలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. -
ఆసిఫ్నగర్లో ఉద్రిక్తత
కొత్తపల్లి(కరీంనగర్) : కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో బీ.ఆర్.అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాల ఏర్పాటు వివాదానికి దారితీసింది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆసిఫ్నగర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గల రామాలయం పక్కన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఓవర్గం గద్దెను నిర్మించారు. గ్రామపంచాయతీ సమీపంలో మరోవర్గం గాంధీ విగ్రహ నిర్మాణానికి గద్దెను నిర్మించారు. అయితే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా గ్రామపెద్దలు సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. చివరికి గురువారం ఉదయం అంబేద్కర్ విగ్రహం గద్దెపై ప్రతిష్ఠించేందుకు ఒక వర్గం ప్రయత్నించగా, మరొక వర్గం వ్యతిరేకించడంతో వివాదం మొదలైంది. దీనికితోడు కరీంనగర్, బద్దిపల్లి, ఖాజీపూర్, ఎలగందులనుంచి ఒకవర్గం నాయకులు రావడంతో ఆసిఫ్నగర్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలతో డీసీపీ సంజీవ్కుమార్, తహసీల్దార్ వి.వినోద్రావు, కరీంనగర్రూరల్, టౌన్ ఏసీపీలు టి.ఉషారాణి, పి.వెంకటరమణ సమావేశమయ్యారు. వారి సూచనలపై సానుకూలంగా స్పందించిన ఇరువర్గాలు గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండు విగ్రహాల ఏర్పాటుకు అంగీకరించారు. దీంతో వివాదానికి తెరపడింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు భూమిపూజ చేశారు. -
అన్నదమ్ములు
స్కూలు టీచర్ బార్డ్. అతని తమ్ముడు ఆండర్స్. ఒకరంటే ఒకరికి ప్రాణం. పుట్టినప్పటి నుంచి అన్ని పనులూ కలిసే చేశారు. ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేదు. ఇద్దరూ ఒకేరోజు సైన్యంలో చేరారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఇద్దరికీ ఒకేరోజు కార్పొరల్గా ప్రమోషన్ వచ్చింది. ఒకేరోజు రిటైరయ్యారు. ఇంతవరకు వాళ్లనెవరూ విడివిడిగా చూడలేదు. కొంతకాలానికి వాళ్ల తండ్రి కాలం చేశాడు. ఆస్తి బాగానే సంక్రమించింది సోదరులకు. కానీ అది పంచుకుని విడిపోవడం వాళ్లకిష్టం లేదు. అందువల్ల ఉన్నదంతా వేలం వేసి ఎవరిక్కావల్సింది వాళ్లు కొనుక్కోవడం మేలనుకున్నారు. అలాగే చేశారు. అయితే, తండ్రికో ఖరీదైన గోల్డ్ వాచ్ ఉంది. ఆ రోజుల్లో అలాంటి వాచ్ ఆ ప్రాంతంలో మరెవరి దగ్గరా లేదు. అది వేలానికి వచ్చినప్పుడు చాలామంది ధనికులు పాట పాడటానికి ముందుకువచ్చారు. అయితే సోదరులిద్దరూ పోటీ పడి పాట పెంచటంతో మిగతావాళ్లు వెనక్కు తగ్గారు. తమ్ముడు తనకు వదిలేస్తాడని అన్నా, అన్న తనకు వదిలేస్తాడని తమ్ముడూ ఆశించారు. కానీ అది జరగకపోగా పాటలో ఎవరూ ఆగలేదు. ధర అనూహ్యంగా పెరిగింది. ఒకరివైపొకరు చిరాకుగా, కోపంగా చూసుకున్నారు. చివరికి ఇరవై డాలర్లకు చేరుకుంది పాట. తమ్ముడలా పట్టుపడతాడని అనుకోలేదు బార్డ్. ఇంక వెనక్కు తగ్గడమెందుకనుకుంటూ ముప్ఫై డాలర్లకు పెంచాడు. అయినా ఆండర్స్ ఆగలేదు. ‘తను చూపిన ప్రేమ, ఆప్యాయత, అనురాగమంతా మరచిపోయాడా తమ్ముడు?’ అనుకున్నాడు బార్డ్. పైగా తను పెద్దవాడు. పాట నలభైకి చేరుకుంది. ఇప్పుడొకరినొకరు చూస్కోడానికి కూడా ఇష్టపడలేదిద్దరూ. ఆక్షన్ హాల్లో టెన్షన్ పెరిగింది. ‘అన్న ఎందుకిలా పట్టుపడుతున్నాడు, అడిగితే తను నామమాత్రపు ధరకే వదులుకునేవాడే. అతని కోరికను తిరస్కరించటం, ఆజ్ఞను ధిక్కరించటం ఇంతవరకూ జరగలేదే’ అనుకున్నాడు ఆండర్స్. అవును మరి పెంచక తప్పదు. ఓడిపోతే అందరి ముందరా తనకెంత అవమానం? ధర మరింత పెరిగింది. బార్డ్కు వశం తప్పింది. ‘‘వంద డాలర్లు. మన సంబంధానిక్కూడా ఇదే చివరిరోజు’’ అన్నాడు ఉద్రేకంతో ఊగిపోతూ. హాలు నిండా నిశ్శబ్దం. ఇక అక్కడ నిల్చోలేక గుర్రమెక్కి ఇంటికి ప్రయాణమయ్యాడు. వెనక నుంచి ఆక్షన్ డీలర్ వచ్చి ‘‘ఆండర్స్ పాట నీకే వదిలేశాడు. వాచీ నువ్వు కొనుక్కో’’ అన్నాడు. అప్పుడు కానీ అతడిలో పశ్చాత్తాపం ప్రారంభం కాలేదు. తమ్ముడి మీద ప్రేమ పొంగి పొర్లింది. తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడు. ఒక వాచీ కోసం తన ప్రాణంలో ప్రాణమైన తమ్ముణ్ని వదులుకోవటమా? హాలు నుండి జనమంతా వెలుపలికొచ్చారు. ఆ గుంపులో ఆండర్స్ కూడా ఉన్నాడు. అన్న మనసులో ఘర్షణ అతడికి తెలియదు.‘‘నీ ప్రేమకు చాలా థ్యాంక్యూ అన్నయ్యా. నువ్వన్నట్టు మన సంబంధానికిదే చివరి రోజు. ఇక నీ ఇంటి గడప తొక్కితే ఒట్టు’’ అన్నాడు నిష్టూరంగా. ‘‘ఈ ఊరికారు అంతే దూరం. గుడ్బై’’ అన్నాడు బార్డ్ రుద్దకంఠంతో, ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి విఫలయత్నం చేస్తూ. ఆనాటి నుండి పుట్టిపెరిగిన ఇంటికి ఇద్దరూ దూరమయ్యారు. కొన్నాళ్లకు ఆండర్స్ పెళ్లి చేసుకున్నాడు. కానీ అన్నను రమ్మని కూడా పిలవలేదు. ఎంత తమ్ముడైనా ఆహ్వానించకపోతే బార్డ్ మాత్రం ఎందుకు పోతాడు. ఆండర్స్ పెంచుకున్న ఆవు చచ్చిపోయింది. కారణం ఎవరూ చెప్పలేకపోయారు. రోజులు బాగా లేనట్టుంది. కష్టాలు కట్టకట్టుకుని వచ్చాయి. అతడి పరిస్థితి దిగజారిపోయింది. ఒకనాడు ఇల్లు కూడా కాలి బూడిదైంది. ‘‘ఎవరో నామీద చేతబడి చేసుంటారు. నేను చావాలని కోరుకుంటున్నారు’’ అంటూ భోరున ఏడ్చాడు ఆండర్స్. ఉన్నదంతా పోయింది. బికారిగా మారాడు. పని చేసి సంపాదించాలనే కోరిక కూడా లేదు. అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు బార్డ్ తమ్ముణ్ని పరామర్శించటానికి వచ్చాడు. అప్పటిదాకా మంచం మీద ముడుచుకుని పడుకున్న ఆండర్స్ దిగ్గున లేచి కూర్చున్నాడు.‘‘ఎందుకొచ్చినట్టు? ఇక్కడ నీకేం పని!’’ అంటూ కటువుగా ప్రశ్నించాడు.‘‘నీకు సహాయం చెయ్యడానికి వచ్చాను ఆండర్స్’’ అన్నాడు బార్డ్ అనునయంగా.‘‘నా కష్టాలతో నీకేం పని? ఇంకా ఎందుకు చావలేదా అని చూడ్డానికొచ్చావా? నా తిప్పలు నేను పడతానులే, వెళ్లు వెళ్లు!’’‘‘నువ్వు అపార్థం చేసుకున్నావు’’‘‘వెళ్లు ముందు’’ అంటూ ఉరిమాడు ఆండర్స్. బార్డ్ ఒకడుగు వెనక్కు వేశాడు.‘‘వాచ్ కావాలంటే నువ్వే తీసుకో’’ అన్నాడు బార్డ్, తమ్ముణ్ని సముదాయించటానికి.‘‘వెళ్తావా? వెళ్లవా??’’ అంటూ ముందుకడుగు వేశాడు ఆండర్స్ ఆగ్రహంగా. బాధను అణుచుకుంటూ బార్డ్ వెనుదిరిగాడు. తమ్ముణ్ని ఎలాగైనా ఆదుకోవాలని మనసు పీకుతోంది. జరిగిందేదో జరిగింది. క్షణిక కోపంలో చేసిన పొరపాటుకు ఎన్నాళ్లు కుమిలిపోవటం? వాడన్ని కష్టాల్లో కూరుకుపోయుంటే తనకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? కానీ తనకై తాను మళ్లీ వెళ్లాలంటే అభిమానం అడ్డు వచ్చింది. పైగా పెద్దవాణ్ని అనైనా చూడకుండా తనను అవమానించి పంపాడు. తను స్నేహ హస్తం చాచినా జనం తననే చులకనగా చూస్తారు. ఆదివారం నాడు చర్చ్కి వెళ్లినప్పుడు అక్కడ ఆండర్స్ కనిపించాడు. మరింత చిక్కిపోయాడు. ఎముకలు తేలాయి. మొహం పీక్కుపోయింది. ఒంటిమీద చిరిగిన దుస్తులు మాటువేసి తొడుక్కున్నాడు. బార్డ్ ఉనికినైనా గమనించలేదు. శిలువ మీది ప్రభువువైపే భక్తి పారవశ్యంతో చూస్తూ మోకరిల్లాడు. బార్డ్కు బాల్యం జ్ఞాపకం వచ్చింది. ‘చిన్నప్పుడు ఆండర్స్ ఎంత చురుగ్గా ఉండేవాడు..? తమ్ముణ్ని వదిలి ఉండలేనిక, పాత రోజులు మళ్లీ రావాల’ని దేవుణ్ని మనసారా ప్రార్థించాడు. ఆ కోరిక రావడమేమిటి, తక్షణమే వెళ్లి ఆండర్స్ పక్కన కూర్చోవాలనుకున్నాడు. కానీ ఎవరో అడ్డొచ్చారు. పైగా వాడు తనవైపు చూడ్డానికి కూడా ఇష్టపడటంలేదు. పక్కన వాడి భార్య కూడా ఉంది. ఇక్కడెందుకు ఇంటికెళ్లడమే శ్రేయస్కరం అనుకున్నాడు. సాయంత్రమైంది. తమ్ముడి ఇంటిముందు నిలిచాడు. తలుపు తట్టడానికి భయంగా ఉంది. లోపల భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ‘‘చర్చిలో మీ అన్నగారు కనిపించారు. నీ గురించే ఆలోచిస్తున్నాడేమో!’’‘‘లేదులే. అతడిది మరొకరి గురించి ఆలోచించే స్వభావం కాదు. ఎంతసేపూ తన గొడవే’’తమ్ముడి మాటలకు బార్డుకు చెమట పట్టింది. చలిగా ఉంది. అయినా చాలాసేపు అక్కడే నిలుచున్నాడు. లోపల కెటిల్లో నీళ్లు మరుగుతున్నట్టుంది. ఆవిరి చప్పుడు వినిపిస్తోంది. చిన్నపిల్ల ఏడ్చింది.‘‘ఒప్పుకోవుగానీ నువ్వు కూడా అస్తమానూ మీ అన్నగారి గురించే ఆలోచిస్తుంటావులే. నాకు తెలియవా మీ స్వభావాలు’’ అంది భార్య.‘‘ఇంకేదన్నా మాట్లాడు’’ అంటూ విసుక్కున్నాడు ఆండర్స్.బార్డ్ ఇంక తిరిగి పోదామనుకున్నాడు. కానీ అంతలోనే తలుపు తెరుచుకుంది. చలి మంటకు కట్టెల కోసం ఆండర్స్ కొట్టం వైపుకు వచ్చాడు. ఇంట్లో వేసుకునే పైజమా, షర్ట్కు బదులు సైనిక యూనిఫాం వేసుకున్నాడు. ‘‘ఇది ఇక తొడుక్కోవద్దు. పిల్లలకు జ్ఞాపకంగా దాచిపెట్టాలి’’ అని సైన్యం నుంచి బయటకు వచ్చిన రోజున వాగ్ధానం చేసుకున్న మాటలు గుర్తుకొచ్చాయి బార్డ్కి. పైగా ఆండర్స్ దానిని రోజూ వాడటం వల్ల చిరిగినట్టుంది. అదే సమయంలో బార్డ్ జేబులోని గోల్డ్ వాచ్ టిక్టిక్మంటూ శబ్దం చేసింది. ఆండర్స్ కట్టెలు తీసుకుని వెళ్లటానికి బదులు ఆకాశం వైపు దీనంగా చూస్తూ ‘‘ఇంకెన్నాళ్లు ప్రభూ ఈ కష్టాలు’’ అంటూ చేతులెత్తి ప్రార్థించాడు. ఆ మాటల్ని చివరి రోజుదాకా మర్చిపోలేడు బార్డ్. ఆ క్షణానే వెళ్లి తమ్ముణ్ని గుండెలకు హత్తుకోవాలనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు. జబ్బు మనిషిలాగా దగ్గుతూ ఆండర్స్ కట్టెలు తీసుకుని వెళ్లాడు. మరో పది నిమిషాలదాకా అక్కణ్నుంచి కదల్లేదు బార్డ్. బహుశా రాత్రంతా అక్కడే ఉండేవాడేమో. కానీ చలి తీవ్రమైంది. అలా ఆరుబైట నిల్చుంటే మంచులో కూరుకుపోయేవాడే. తమ్ముణ్ని ఆ పరిస్థితిలో చూడటం కలచివేస్తోంది. చివరికి కట్టెల కొట్టంలో లాంతరు వెలిగించి కొక్కానికి తన గోల్డ్ వాచ్ తగిలించి, తన బాధ్యత నిర్వర్తించానన్న తృప్తితో చిన్నపిల్లాడిలా ఇంటికి పరిగెత్తాడు. ఆ రాత్రి కొట్టానికి నిప్పంటుకుంది. లాంతరు నుంచి నిప్పు రవ్వలు లేచి ఉంటాయి. పైనున్న గడ్డికప్పు కూడా కాలింది. బార్డ్ కుమిలి కుమిలి ఏడ్చాడు. ఈ ఘోర పాపానికి నిష్మృతి లేదు అనుకుంటూ రోజంతా మోకరిల్లి, ప్రార్థనా గ్రంథాలు చదువుతూ దైవస్మరణలో గడిపాడు. తెలియక చేసినా నేరం నేరమే. ఆ రాత్రి మసక వెన్నెల వెలుగులో తమ్ముడింటి పాక దగ్గరకెళ్లి వాచ్ కోసం వెతికాడు. గోళికాయంత బంగారం ముద్ద దొరికింది. కరిగి మిగిలిందదే. అది పట్టుకుని వెళ్లి తమ్ముడికి జరిగిందంతా చెప్పి గుండె బరువు దించుకుందామనుకున్నాడు. కానీ మొహమాటం, బెరుకు, భయం. బార్డ్ బూడిదలో వెతుకుతున్నప్పుడు ఓ చిన్న పిల్ల చూసింది. క్రితం రోజు కూడా అతడక్కడికి రావటం చూశారు అక్కడే ఆడుకుంటున్న మరికొంత మంది పిల్లలు. అన్నదమ్ములిద్దరూ బద్ధశత్రువులని ఊరంతా తెలుసు. ఇరుగుపొరుగు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభమైంది. ఎవరూ ఏం నిరూపించలేదు. కానీ అందరి అనుమానం బార్డ్ మీదే. ఏ ముఖం పెట్టుకుని పలకరించగలడిప్పుడు? అన్న దొంగ చాటుగా తనింటికి వచ్చాడని ఆండర్స్కి తెలిసింది. కానీ అతడు నోరు మెదపలేదు. ఇంటిని తగలపెట్టినందుకు పశ్చాత్తాపంతో ఏడ్చాడని కూడా చెప్పారు జనం. కానీ ఇంత నీచమైన పనికి దేవుడు కూడా క్షమించడు. నేరం రుజువు కాలేదు కానీ ఇంత దారుణానికి ఒడిగట్టింది బార్డేనని ఊరంతా అనుకుంది. దర్యాప్తు సందర్భంగా అన్నదమ్ములిద్దరూ ఎదురుపడ్డారు. ఖరీదైన కొత్త దుస్తుల్లో బార్డ్, చింకిపోయిన పాత దుస్తుల్లో ఆండర్స్. అన్న మొహంలోని దైన్యం ఆండర్స్ గమనించకపోలేదు. ‘‘బహుశా తనకు వ్యతిరేకంగా చెప్పవద్దని వేడుకుంటున్నట్టుంది’’ అనుకున్నాడు. అందువల్ల దర్యాప్తు అధికారి ‘‘మీ అన్నమీద నీకు అనుమానముందా?’’ అని అడిగినప్పుడు లేదన్నాడు ఆండర్స్. మిగిలిన ఒకే ఒక్క పాక కూడా అగ్నికి ఆహుతి కావటంతో ఆండర్స్కు నిలువ నీడ లేకుండా పోయింది. అన్నీ ఉన్నా బార్డ్ పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా మారింది. పశ్చాత్తాపాగ్ని అతణ్ని ప్రతిక్షణం దహించివేస్తోంది. నిద్రాహారాలు మాని నిరంతర దుఃఖంలో మునిగిపోయాడు.ఇప్పుడతణ్ని ఎవరూ గుర్తుపట్టలేరు. ఒక సాయంత్రం పేదరాలెవరో వచ్చి వెంటరమ్మంది. కాసేపటికి కానీ పోల్చుకోలేకపోయాడు. ఆవిడ ఆండర్స్ భార్య అని. సిగ్గుతో, అవమానంతో మరింత కుంగిపోయాడు. ఆమె ఎందుకు పిలిచిందో కూడా గ్రహించగలడు. ఆండర్స్ పూరిపాకలో దీపం వెలుగు కనిపించింది. అంతా ముళ్ల బాట. ఆ వెలుగే లేకపోతే అక్కడ నడవటం అసాధ్యం. చాలాసార్లు మంచులో దిగబడిపోయాయి కాళ్లు. పాక తలుపు వద్ద ఏదో వాసనేసింది. కడుపులో తిప్పినటై్టంది. లోపల పసి పిల్లాడు బొగ్గు తింటున్నాడు. మొహం కూడా నల్లబారింది. పళ్లు మాత్రం తెల్లగా మెరిశాయి. వాడు ఆండర్స్ కొడుకు. కుక్కి మంచం మీద ముడుచుకుని పడుకున్నాడు ఆండర్స్. చిరుగుపాత బొంతలు కప్పుకున్నాడు. కళ్లు పీక్కుపోయాయి. ఆస్తిపంజ రాన్ని చూసినట్టుగా ఉంది. తమ్ముడి మంచం మీద పడి వెక్కివెక్కి ఏడ్చాడు బార్డ్. కాసేపటికి బైటికి పొమ్మని భార్యకు సైగ చేశాడు ఆండర్స్. బార్డ్ ఆమెను ఉండమని అర్థించాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన విషయాలన్నీ వివరంగా మాట్లాడుకున్నారు. వేలంపాట నుంచి ఆనాటి దాకా. బార్డ్ జేబులోంచి బంగారు ముద్ద బైటికి తీసి చూపించాడు. తాము విడిపోయిన నాటి నుంచి ఏ ఒక్కరూ ఏ ఒక్క రోజు కూడా సుఖంగా గడపలేదు. ఆండర్స్ బాగా బలహీనంగా ఉన్నాడు. తమ్ముడి ఆరోగ్యం కుదుట పడిందాకా మంచం పక్కనుంచి కదల్లేదు బార్డ్. ‘‘ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంక మనమెప్పుడూ విడిపోకూడదు అన్నయ్యా!’’ అంటూ కౌగిలించుకున్నాడు ఆండర్స్. కానీ ఆ రోజే అతడు మరణించాడు. అతడి భార్యనూ, కొడుకునూ వెంట తీసుకెళ్లాడు బార్డ్. వాళ్ల సంరక్షణ, పోషణ బాధ్యత తనే తీసుకున్నాడు. ఆనాడు అన్నదమ్ములు మాట్లాడుకున్న విషయాలు క్రమంగా ఊరంతా తెలిశాయి. నిప్పుల్లో కాలిన బంగారం లాంటిదే బార్డ్ మనసు. అన్నదమ్ముల బంధమంటే అలాగే ఉండాలనుకున్నారందరూ. అందరి గౌరవాన్ని, ప్రేమాభిమానాల్ని అందుకున్న బార్డ్ స్కూల్ టీచర్గా మారి పిల్లలకు పాఠాలు చెబుతూ చిరకాలం జీవించాడు. అతడు నిజంగా అందరికీ బోధించింది సాటి మనుషుల పట్ల ప్రేమ చూపటం గురించి... సర్వ మానవ సౌభ్రాతృత్వమే నిజమైన నాగరికత అని. పిల్లలకు అతడు టీచర్ కాడు, తమలో ఒకడు. వృద్ధబాలుడు. నార్వేజియన్ మూలం : బ్యోర్న్స్టెర్న్ బ్యోర్న్సన్ అనువాదం : ముక్తవరం పార్థసారథి -
యురేనియం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
వైఎస్సార్ జిల్లా : వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు ప్రాజెక్టు వద్దకు చేరుకున్న రైతులు, ప్రాజక్టులోకి వెళ్లనివ్వకుండా అధికారులను అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ప్రాజెక్టులోకి వెళ్లనివ్వమనంటూ రైతులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యర్థాలతో భూగర్భ జలాలతో పాటు, త్రాగు నీరు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు, భూములకు నష్ట పరిహారం చెల్లిస్తే గ్రామాలు ఖాళీచేసి వెళ్లి పోతామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అనంత యాస్కే యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
-
ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఏపీఅసెంబ్లీ వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే న్యాయవాదుల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
భారత్సాల్ట్ కంపెనీ వద్ద ఉద్రిక్తత
మచిలీపట్నంసబర్బన్: భారత్ సాల్ట్ కంపెనీ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు కంపెనీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి యాజమాన్యం, కార్మికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. మండల పరిధిలోని పల్లెతుమ్మలపాలెం గ్రామంలో ఉన్న ఈ కంపెనీలో పల్లెతుమ్మలపాలెం, కోన, పాతేరు, పోలాటితిప్ప గ్రామాల్లోని 1500 మంది పనిచేస్తున్నారు. కొందరు టీడీపీ నాయకుల అండతో కంపెనీ యాజమాన్యం కొద్ది రోజులుగా నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కార్మికులు 48 గంటల రిలే నిరాహార దీక్షలకు దిగారు. డిమాండ్లను పరిష్కరించేందుకు యాజమాన్యం ససేమిరా అనడంతో కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. పేర్ని నాని చర్చలు విఫలం విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కార్మికుల తరుపున డిమాండ్ల సాధనపై యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దాదాపు 3 గంటలపాటు కార్మికుల సమక్షంలో చర్చలు జరిగాయి. కార్మికుల వేతనాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమచేయాలనే డిమాండ్ను మాత్రమే యాజమాన్యం అంగీకరించింది. మిగిలిన డిమాండ్లపై చర్చ జరుగుతుండగానే కంపెనీ మేనేజర్ వి.ప్రసాదరావు వెళ్లిపోవడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. మేనేజర్, యాజమాన్యం వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని పేర్ని నాని చెప్పారు. బుధవారం రాత్రి కంపెనీ వద్ద కార్మికులు, వైఎస్సార్ సీపీ నాయకులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేర్ని నానితోపాటు నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లంకే వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మాదివాడ రాము తదితరులు కార్మికులకు అండగా నిలిచారు. ముగిసిన దీక్ష భారత్సాల్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మోకా నాగరాజు, గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ, కార్యదర్శి కుమారస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల రిలే దీక్షలు బుధవారంతో ముగిసింది. కార్మికుల డిమాండ్లను యాజమాన్యం అంగీకరించకపోవడంతో తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. యాజమాన్యానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆందోళన నేపథ్యంలో మూడు రోజుల పాటు కంపెనీలో పనులు నిలిచిపోయాయి. -
తాళ్లపొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
మంత్రి ఆది అనుచరుల హంగామా
వైఎస్సార్ జిల్లా : మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించడంతో కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ వద్ద అదనపు బలగాలు మోహరించాయి. వివరాల్లోకి వెళితే.. ఓ వివాదం విషయమై స్థానికంగా ఉన్న ఓ బెల్టుషాప్ యజమానిని తాళ్లపొద్దుటూరు ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరుడు పవన్ కుమార్ ...నిన్న రాత్రి ఎస్ఐని అడ్డుకున్నాడు. దీంతో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పవన్ కుమార్ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నానా హంగామా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ వివాదానికి సంబంధించి మంత్రి ఆదినారాయణరెడ్డి ఇంకా స్పందించలేదు -
పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక గ్రామంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చిన గడువు ముగియడంతో పొలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు యత్నించారు. అయితే పంట చేతికొచ్చే వరకు గడువు ఇవ్వాలని గ్రామ రైతులు కోరారు. అందుకు అధికారులు గడువు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో అక్కడ ఉద్రిక్త వాతారణం ఏర్పడింది. అధికారులు పోలీసుల సాయంతో పొలాలను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. -
రాజమండ్రి జన్మ భూమి కార్యక్రమంలో రగడ
-
తూర్పు గోదావరి జన్మ భూమి కార్యక్రమంలో రగడ
-
ఆమంచి వర్గీయుల దాడిలో మహిళ మృతి
-
బ్రేకింగ్: చీరాలలో ఆమంచి వర్గీయుల రౌడీయిజం
సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేత ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీలైతే లొంగతీసుకోవడం, కుదరకపోతే బెదిరించడం, అదీ సాధ్యం కాకపోతే చంపడం పరిపాటిగా మారింది. రెండు రోజుల క్రితం తమకు ఎదురు తిరిగిందని గవినివారి పాలెంకు చెందిన దేవర సబ్బులు అనే మహిళపై ఆమంచి వర్గీయులు దాడికి పాల్పడ్దారు. ఈదాడిలో సుబ్బులు తీవ్ర గాయాలపాలైంది. దీంతో బాధితురాలిని కుటుంబ సభ్యులు చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే తీవ్రగాయలతో ఉన్న సుబ్బులు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా ఆస్పత్రి వద్ద ఆమంచి వర్గీయులు మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావడాన్ని అడ్డుకున్నారు. దీంతో సుబ్బులు కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. అయితే చేతిలో అంగబలం, అధికార బలం ఉన్న ఆమంచి వర్గం రెచ్చిపోయింది. ఆందోళనకు దిగిన వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. అంతేకాకుండా మృతదేహాన్ని గ్రామంలోకి రానీకుండా అడ్డుకోవడానికి అనుచరులను గవినివారిపాలెంలో పెద్ద ఎత్తున్న మొహరించారు. అధికారానికి పోలీసుల వత్తాసు : న్యాయంవైపు ఉండాల్సిన పోలీసులు కూడా ఆమంచి వర్గీయులకు వత్తాసు పలికారు. నాయకుల మెప్పు కోసం సుబ్బులు కుటుంబ సభ్యులను, వారికి మద్దతుగా వచ్చిన ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమ వారిని విడిచిపెట్టాలంటూ మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. -
ఏజెన్సీలో తగ్గని ఉద్రిక్తత!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఉట్నూర్: పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. భారీగా పోలీసుల మోహరింపు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నేరుగా పర్యవేక్షిస్తుండడంతో పరిస్థితి కొంతమేర అదుపులో ఉంది. పోలీసులు ఏజెన్సీలో 144 సెక్షన్ను విధించడంతోపాటు వదంతులు వ్యాపించకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించారు. అయితే శుక్రవారం నాటి ఘటనలపై ఇరువర్గాలు ఆగ్రహంగా ఉండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పటిష్టంగా భద్రతా చర్యలు ఆదివాసీ, లంబాడీ తెగల మధ్య కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడం, ప్రతిగా లంబాడీలు ఆదివాసీల జెండాలను ధ్వంసం చేయడంతో ఏజెన్సీ ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ఉదయం నుంచే ఏజెన్సీ గ్రామాలు, తండాల్లో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మీడియా ద్వారా ఈ విషయం విపరీతంగా ప్రచారమై ఉద్రిక్తతలను పెంచింది. శుక్రవారం రాత్రి వరకు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. భారీగా పోలీసు బలగాలను మోహరించి, తగిన చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. డీఐజీ రవివర్మ స్వయంగా శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని పోలీసులను రంగంలోకి దింపారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన తరుణ్జోషి ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ముగ్గురు ఐజీ ర్యాంకు అధికారులు, పలువురు ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఏజెన్సీ మండలాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏజెన్సీవ్యాప్తంగా బంద్ ఆదివాసీలు శనివారం ఏజెన్సీ బంద్కు పిలుపు నివ్వడంతో జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు ఆదిలాబాద్ పట్టణంలో ఆదివాసీలు ర్యాలీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూరు, సిర్పూర్ (యూ), లింగాపూర్ మండలాల పరిధిలోని గ్రామాలతోపాటు ఆదివాసీల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. శనివారం మధ్యాహ్నం గాజిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం రావడంతో పోలీసు బృందాలు హుటాహుటిన వెళ్లి పరిస్థితిని అదుపు చేశాయి. ఇక జైనూరు, సిర్పూరు (యూ), లింగాపూర్, నార్నూర్ మండలాల పరిధిలో రాత్రిపూట దాడులు జరగవచ్చన్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 144 సెక్షన్.. ఇంటర్నెట్ నిలిపివేత ఏజెన్సీలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించారు. ఏజెన్సీ ప్రభావం లేని మంచిర్యాల పట్టణంలోనూ మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో 2జీ మొబైల్ ఇంటర్నెట్ పనిచేసినట్లు తెలిసింది. కాగా శుక్రవారం ఉద్రిక్తతల సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించినట్లుగా భావిస్తున్న జితేందర్, ఎస్కే ఫారుఖ్ల మృతదేహాలకు ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం వారి స్వగ్రామం హస్నాపూర్కు తరలించారు. భూపాలపల్లి జిల్లాలో ఆదివాసీల ఆందోళన ఎస్ఎస్ తాడ్వాయి: ఆదివాసీల ఆందోళన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇతర ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరిస్తోంది. కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. పస్రా–తాడ్వాయి రహదారి మధ్యలో చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేసి.. రాస్తారోకో చేశారు. ఏటూరునాగారంలో బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వెంకటాపురం(కే), వాజేడు మండలాల్లో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ చేపట్టి.. బైక్ ర్యాలీ నిర్వహించారు. కాగా లంబాడీలు, ఆదివాసీల మధ్య గొడవల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నుంచి వారం పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ప్రకటించారు. 8 కేసులు నమోదు ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు ఇరువర్గాలపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను, 14 టెక్నికల్ బృందాలను ఏర్పాటు చేశారు. 16 చెక్పోస్టులు, 23 పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వదంతులు నమ్మద్దు ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఆదివాసీలు, లంబాడీలు సమన్వయం పాటించాలి. వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. వివాదాలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగాక జిల్లా కలెక్టర్, ఎస్పీల సమక్షంలో శాంతి కమిటీ సమావేశాలను ఏర్పాటు చేస్తాం.. – వై.నాగిరెడ్డి, ఐజీ ఉట్నూరు అల్లర్లపై సర్కారు సీరియస్ ♦ కరీంనగర్ డీఐజీ, ఆదిలాబాద్, ♦ఆసిఫాబాద్ కలెక్టర్లు, ఎస్పీలపై వేటు ♦తక్షణం వర్తించేలా ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీలు, లంబాడీల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మతోపాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్, ఎస్పీ ఎం.శ్రీనివాసులు.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.చంపాలాల్, ఎస్పీ సన్ప్రీత్ సింగ్లపై బదిలీ వేటు వేసింది. ఉట్నూరులో శుక్రవారం జరిగిన గొడవలను ముందుగా పసిగట్టలేకపోవడం, పరిస్థితులను త్వరగా అదుపు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై వీరందరినీ మూకుమ్మడిగా బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ ఎస్పీ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్రెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులతో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సమావేశమైన అనంతరం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివాసీలు, లంబాడీల మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్తత నెలకొన్నా స్థానిక అధికారులు సరైన విధంగా స్పందించలేదని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్పీగా పని చేస్తున్న పి.ప్రమోద్ కుమార్ను కరీంనగర్ రేంజ్ డీఐజీగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన అధికారులకు ఇంకా కొత్త పోస్టింగులు కేటాయించలేదు. -
వరంగల్ బాలికల హాస్టల్ వద్ద ఉద్రిక్తత
-
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లు ధ్వంసం తాడిపత్రిలో ఉద్రిక్తత
-
అమరావతిలో రోడ్డు ప్రమాదం, ఉద్రిక్తత
-
టీడీపీలో వైఎస్ జగన్ పాదయాత్ర టెన్షన్
-
జవహర్ నగర్ పోలీస్స్టేషన్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్స్టేషన్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సంవత్సరం ఆంధ్ర, ఒడిశా బోర్డర్ లో జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్లో ప్రభాకర్ అనే మావోయిస్టు మృతి చెందాడు. ప్రభాకర్ను స్మరించుకుంటూ అతని కుటుంబం నివాసం ఉండే యాప్రాల్ లో అభిమానులు స్థూపాన్ని కట్టేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇది తెలిసి అక్కడికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆ ఏడుగురూ ఠాణాలోనే ఆందోళనకి దిగటంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉత్తర కొరియాపై అమెరికా విమానాలు
న్యూయార్క్: ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించట్లేదు. బలప్రదర్శనలో భాగంగా ఉత్తరకొరియా తూర్పు తీరం మీదుగా తమ యుద్ధ విమానాలను పంపినట్లు అమెరికా రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. ఎలాంటి ముప్పునైనా దీటుగా ఎదుర్కొనే సత్తా అమెరికాకు ఉందన్న అధ్యక్షుడు ట్రంప్ మాటలు నిజమని చూపేందుకే ఈ కసరత్తు చేసినట్లు అమెరికా రక్షణ కార్యాలయ అధికార ప్రతినిధి డానా వైట్ చెప్పారు. అమెరికా వైమానిక దళానికి చెందిన బీ–1బీ లాన్సర్ బాంబర్లు, ఎఫ్–15సీ ఈగల్ ఫైటర్ విమానాలు ఉత్తరకొరియా జలాల మీదుగా అంతర్జాతీయ గగనతలంపై వెళ్లాయని చెప్పారు. -
మడకశిరలో టెన్షన్.. టెన్షన్
రోడ్ల విస్తరణతో ఆందోళన విస్తరణ చేసి తీరుతామంటున్న టీడీపీ నేతలు పరిహారం చెల్లించిన తర్వాతనే అంటున్న కాంగ్రెస్ వాదులు మడకశిర: మడకశిరలో రూ. 42.75 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు వివాదాలకు కారణమవుతోంది. మడకశిర–పావగడ, మడకశిర–హిందూపురం, మడకశిర–అమరాపురం, మడకశిర–పెనుకొండ రోడ్లను 66 అడుగుల మేర విస్తరణ చేయాల్సిందేనంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే ఇందుకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు చేపట్టాలంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో అందరి దృష్టి రోడ్ల విస్తరణపై పడింది. ఈ ప్రక్రియను ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చివరకు రాజకీయరంగు పులుముకుంది. పట్టణంలో రోడ్ల విస్తరణ పనుల ద్వారా 120 మంది వరకు నష్టపోనున్నారు. వీరిలో 40మంది హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం పట్టణ శివారులో రోడ్ల విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. విస్తరణ పనులను స్వాగతిస్తున్న వారు పట్టణంలోని తమ భవనాలను స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. మరికొందరు తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భవనాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలిచారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలంటూ ఆందోళనలు కూడా చేపట్టింది. రోడ్ల విస్తరణ కోసం ఇప్పటికే ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న 400 చెట్లను అధికారులు తొలగించారు. రింగ్ రోడ్డుతో సమస్య దూరం మడకశిర చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల మేర నిధులను మంజూరు చేసింది. ఈ పనులకు గత ఏడాది డిసెంబర్ 2న సీఎం చంద్రబాబు భూమి పూజ కూడా చేశారు. రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేటప్పుడు పట్టణంలో రోడ్ల విస్తరణతో పనేముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు కూడ వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోందని ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. నష్టపరిహారం చెల్లించాలి నష్టపరిహారం చెల్లించి రోడ్ల విస్తరణ పనులు చేపడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రోడ్ల విస్తరణ వలన పూర్తిగా నష్టపోతాం. – ఫణిశేఖర్, బాధితుడు, మడకశిర పునరావాసం కల్పించాలి రోడ్ల విస్తరణ ద్వారా నిలువ నీడ కోల్పోతున్న వారికి ముందుగా పునరావాసం కల్పించాలి. ఆ తర్వాతే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి. – సదాశివప్ప, బాధితుడు, మడకశిర రింగ్రోడ్డు ఏర్పాటు చేస్తే చాలు రింగ్ రోడ్డు ఏర్పాటుతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుతుంది. పట్టణంలో రోడ్ల విస్తరణ ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. –లక్ష్మి, బాధితురాలు, మడకశిర -
ఎవరి ధీమా వారిదే!
= ఉప ఎన్నిక ఫలితంపై నేతల్లో టెన్షన్ = గ్రామాల వారీగా లెక్కలు చూస్తున్న వైనం = రూ.కోట్లలో బెట్టింగ్ నంద్యాల: ఉప ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన ప్రధాన పార్టీల నాయకులు ప్రస్తుతం ఫలితంపై టెన్షన్గా గడుపుతున్నారు. గ్రామాల వారీగా లెక్కలు చూసుకుంటూ విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై కోట్లాది రూపాయల బెట్టింగ్ కాసిన వారు అభ్యర్థులను మించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా రు. ఈ క్రమంలో ఉప ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. గత బుధవారం పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించిన అధికారులు సోమవా రం కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అంచనాల్లో నిమగ్నమైన నేతలు.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్దుల్ఖాదర్తోపాటు మరో 13మంది ఎన్నికల్లో పోటీ చేశారు. పట్టణంలో 1,42,628 ఓటర్లకుగాను 1,05,629 మంది, రూరల్కు సంబంధించి 47,386 ఓటర్లకుగాను 41,514 మంది, గోస్పాడు మండలంలో 28,844 ఓటర్లలో 26,192 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. నియోజకవర్గ చర్రితలో ఎన్నడూ లేని విధంగా 79.20శాతం పోలింగ్ నమోదైంది. ఫలితం మిగిలి ఉండడంతో నాయకుల దృష్టి అటువైపు పడింది. గ్రామాల వారీగా నాయకులు, ఓటర్లకు పంపిణీ చేసిన నగదు, చీరలు, ముక్కుపుడకలు, దేవాలయాలకు అందజేసిన నగదు, వాటి కారణంగా తమకు వచ్చే ఓట్లను అంచనా వేస్తూ గడుపుతున్నారు నాయకులు. ఓటింగ్ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన... నియోజకవర్గంలోని 2,18,858 ఓటర్లలో 1,73,335 మంది ఓటు వేసి రికార్డు సృష్టించడంతో టీడీపీ నాయకులు ఆందోళ న చెందుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగింది కనుక ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తుందని లోలోన మధనపడుతున్నారు. నియోజకవర్గంలో 1,11,018 మంది మహిళలుండగా 88,503 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వీరు ఎవరికి ఓటు వేశారనేది అంతు పట్టడం లేదు. గ్రామాల్లో కూడా టీడీపీ నాయకుల అంచనా కన్నా పోలింగ్ శాతం పెరగడం ఆ పార్టీ నాయకుల్లో అలజడికి కారణమైంది. గోస్పాడు, నంద్యాల మండలాల్లోని గ్రామాలు మొదటి నుంచి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటం, వాటిలో ఓటింగ్ శాతం విపరీతంగా పెరగడం టీడీపీ నాయకులు కలవర పడుతున్నారు. పందెంరాయుళ్ల ఉత్కంఠ.. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫలితంపై నాయకులు, బెట్టింగ్ రాయళ్లు రూ.కోట్లలో పందాలు కాస్తున్నారు. ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే రూ.50కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. స్థానిక నాయకులు సైతం గ్రామాల వారీగా పందె కాస్తున్నట్లు తెలిసింది. విజయం ఎవరిని వరిస్తుందనే విషయం రేపటి సోమవారంతో బహిర్గతం కానుంది. -
నిర్మల్ ప్రజాభిప్రాయంలో ఉద్రిక్తత
పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలి: కాంగ్రెస్, బీజేపీ నిర్మల్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మల్ జిల్లాలో ప్యాకేజీ–27,28 పనులపై గురువారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనల మధ్య కొనసాగింది. పాలక, ప్రతిపక్షాల వాగ్వాదాలు, తోపులాటలతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.కలెక్టర్ ఇలంబరిది అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ఈఈ భిక్షపతి అభిప్రాయాలు స్వీకరించారు. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ నాయకులు వేదిక వద్ద ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న రైతులు, ప్రజలకు పరిహారం ఇవ్వకుండానే పనులు ఎలా చేపట్టారంటూ నిలదీశారు. ఇంతలో పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేస్తూ వేదిక దగ్గరికి వచ్చారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న సమ యంలో అధికార పక్ష నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మధ్య తోపులాట జరిగింది. గొడవ సద్దుమణగక పోవడంతో కలెక్టర్ పోలీసుల సాయంతో కాంగ్రెస్ నాయకులను బయటకు పంపించారు. బీజేపీ నాయకులు తమ వాణి వినిపించి సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపో యారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హాంకాంగ్లో హటో టైపూన్ టెన్షన్
-
వంశధార ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
-
ముస్తాబాద్లో ఉద్రిక్తత
సిరిసిల్ల: జిల్లాలోని ముస్తాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇసుక లారీలను నిలిపివేయాలని, రోడ్డు ప్రమాదానికి సంబంధించి అధికార పార్టే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. దీనికి కౌంటర్గా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన గన్నె శంకరయ్య కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ పార్టీ చెల్లించాలంటూ రాస్తారోకో నిర్వహించారు. పోటా పోటీ ధర్నాలతో ముస్తాబాద్ అట్టుడుకుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
టెన్షన్.. టెన్షన్..
- ముద్రగడ పాదయాత్రపై జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ - అణచివేసేందుకు ప్రభుత్వ వ్యూహం - జిల్లాలో 6 వేల మంది పోలీసుల మోహరింపు - పలు ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం - విస్తృతంగా డ్రోన్ కెమెరాల వినియోగం - నేతలపై కొనసాగుతున్న బైండోవర్ విచారణలు - నోటీసులు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు - అయినా పాదయాత్ర జరిపి తీరుతామని కాపు నేతల ప్రకటనలు సాక్షి, రాజమహేంద్రవరం / జగ్గంపేట : కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలన్న డిమాండుతో.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి జరుప తలపెట్టిన ‘చావో రేవో చలో అమరావతి’ పాదయాత్రపై జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగానే ముద్రగడ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్న ప్రభుత్వ వ్యూహం.. ఈసారి ఎలాగైనాసరే పాదయాత్ర జరిపి తీరాలన్న కాపు నేతల ప్రతివ్యూహాల నేపథ్యంలో.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం హీటెక్కుతోంది. గద్దెనెక్కిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. మూడేళ్లు దాటినా తూతూ మంత్రప్రకటనలతో కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబుపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని, చేసిన మోసాన్ని తలచుకుంటున్న కాపు సామాజిక యువత, మహిళలు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తామన్న కాపులను, పోలీసులతో అణచివేసేందుకు చేస్తున్న యత్నాలపై మండిపడుతున్నారు. పాదయాత్ర విజయవంతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా బలగాలు పాదయాత్రకు గడువు సమీపిస్తుండడంతో ప్రభుత్వం మరిన్ని పోలీసు బలగాలను జిల్లాకు రప్పించింది. మండలాల వారీగా పోలీసులను మోహరించింది. కడప, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 5 వేల మంది పోలీసులను రప్పించారు. జిల్లా పోలీసులు మరో వెయ్యి మందితో కలుపుకుని మొత్తం 6 వేల బలగాలు జిల్లాలో బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడి, పరిసరాలతోపాటు, సున్నిత ప్రాంతాలైన కోనసీమ, కాకినాడ, సామర్లకోట తదితర ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులు ఆదివారం కవాతు నిర్వహించారు. ఇప్పటికే కాపు నేతలు, వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలపై బైండోవర్ కేసులు పెట్టారు.. పెడుతున్నారు. పాదయాత్రలో పాల్గొనడం చట్టరీత్యా నేరమంటూ నోటీసులు జారీ చేశారు. బైండోవర్ చేసినవారు స్థానికంగా ఉండేలా తహసీల్దార్లు వారిని వాయిదాలకు తిప్పుతున్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 26 వరకు వారిని బైండోవర్ చేశారు. పరిస్థితిని బట్టి తరువాత కూడా బైండోవర్ కొనసాగింపు ఉంటుందని రెవెన్యూ, పోలీసులు అధికారులు పేర్కొంటున్నారు. మోగుతున్న పోలీసు సైరన్లు జిల్లాలో సున్నిత ప్రాంతమైన కోనసీమలో దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించారు. పోలీస్ పికెట్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సెక్షన్ 144 అమలులో ఉందంటూ మైకు ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, పాల్గొనరాదని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పోలీసు వాహనాల సైరన్ల మోతతో కోనసీమ హోరెత్తిపోతోంది. ఆదివారం డ్రోన్ కెమెరాలను కూడా అమలాపురం తీసుకువచ్చారు. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఉపయోగించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర జరిపి తీరుతామని కాపు జేఏసీ నేతలు ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో.. 26వ తేదీన పరిస్థితి ఎలా ఉండనుందన్న ఉత్కంఠ జిల్లా ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉండగా, ముద్రగడ పాదయాత్ర విజయవంతం కావాలని కాపు మహిళలు పలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని వేగులమ్మ అమ్మవారి ఆలయంలో మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. -
పరకాలలో ఉద్రిక్తత
► జిల్లా కేంద్రం ఏర్పాటుపై బంద్కు అఖిలపక్షం పిలుపు ► రోడ్లపైకి చేరిన అన్ని వర్గాల ప్రజలు ► ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లిన పట్టణం ► నాయకుల అరెస్ట్ను అడ్డుకున్న ఆందోళనకారులు ► లాఠీ ఝుళిపించి చెదరగొట్టిన పోలీసులు పరకాల: పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అఖిలపక్షం శనివారం ఇచ్చిన బందు పిలుపు ఉద్రిక్తంగా మారింది. వ్యాపార సంస్థలు స్వచ్ఛందగా బందులో పాల్గొనగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, మహిళలు రోడ్లపైకి చేరి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పాలకుల వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. యువకులు రోడ్లపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. దీంతో పట్టణంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ఆందోళనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నాయకులను తీసుకెళ్లకుండా జీపులకు మహిళలతో యువకులు అడ్డుతగలటంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. వాహనాలవైపు ఆందోళనకారులు దూసుకురావడంతో పోలీసులు రోడ్లపై జనం ఉండకూడదంటూ హెచ్చరిస్తూనే లాఠీలకు పనిచెప్పారు. అఖిలపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకారులు గొడవకు దిగారు. పరకాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతుంటే ఏందుకు అడ్డుకుంటున్నారని వాగ్వాదం చేశారు. నాయకుల అరెస్ట్.. విడుదల చివరకు ఆందోళనలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు కొలుగూరి రాజేశ్వర్రావు, చాడ రవీందర్రెడ్డి, పసుల రమేష్, పిట్ట వీరస్వామి, సారయ్య, దుప్పటి సాంబయ్య, నక్క చిరంజీవి, కక్కు రాజు, యాట నరేష్, శ్రీకాంత్, బొచ్చు భాస్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్టేషన్ ఎదుట ఆందోళకారులు నిరసన తెలపడానికి ప్రయత్నించగా నాయకులను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు పరకాలకు న్యాయం జరిగే వరు తమ పోరాటం ఆగదని అఖిలపక్ష నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్కుమార్, కొలుగూరి రాజేశ్వర్రావు, పసుల రమేష్, నక్క చిరంజీవి, బొచ్చు భాస్కర్ స్పష్టం చేశారు.పోరాటల గడ్డ పరకాలకు పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్తో పోరాడుతుంటే పోలీసులు లాఠీచార్జ్తో పాటు అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. మొగిలిచర్లలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, పరకాలలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
పరకాలలో ఉద్రిక్తత
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం చేపడుతున్న పరకాల బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. పరకాలను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉదయం నుంచి ర్యాలీ సాగుతుండగా.. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసు వాహనాలను అడ్డుకోవడానికి యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. ఒక సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరస్థితి నెలకొంది. -
టీచర్లలో గుబులు!
– వెల్లడికాని హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా – నేడు ఒక్కరోజే అభ్యంతరాల స్వీకరణకు గడువు – కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కేంద్రాలు – ప్రభుత్వ తీరుతో బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్ : బదిలీల ప్రక్రియతో ఉపాధ్యాయులకు కంటి మీద కునుకును ప్రభుత్వం దూరం చేసింది. దాదాపు రెన్నెళ్లుగా జీఓలు మీద జీఓలు, షెడ్యూలు మీద షెడ్యూలు, సవరణల మీద సవరణలు చేస్తూ టీచర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా షెడ్యూలు మార్చినా దాని ప్రకారం కూడా ముందుకు సాగడం లేదు. అన్ని కేటగిరీ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియార్టీ జాబితా మంగళవారం ప్రకటించాలి. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో పీఎస్హెచ్ఎం, ఎస్జీటీలు, పండిట్లు, పీఈటీల జాబితాలు మాత్రమే ఉంచారు. వీటిపై సుమారు 40కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితా బుధవారం రాత్రి వరకు ఆన్లైన్లో ఉంచలేదు. వీటిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు కేవలం ఒకరోజు మాత్రమే గడువు ఉంటుంది. కాగా, ప్రిపరెన్షియల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని ఫార్వర్డ్ చేసిన ఎంఈఓలపై చర్యలకు ఉపాధ్యాయ సంఘాలు పట్టుపడుతున్నాయి. స్పౌజ్ పాయింట్ల రద్దుకు అనుమతి ఎన్నడూ లేనంతగా ఈ సారి స్పౌజ్ కేటగిరీ పాయింట్లు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. స్పౌజ్ పని చేస్తున్న సమీపంలోకి వెళ్లాలనే నిబంధనను పక్కాగా అమలు చేస్తుండడం చాలామందికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. అయితే ఆ పాయింట్లను రద్దు చేసుకునేందుకు కూడా అనుమతివ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఎట్టకేలకు డీఈఓ లక్ష్మీనారాయణ స్పష్టత ఇచ్చారు. స్పౌజ్ పాయింట్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఆ పాయింట్ల రద్దుకు అనుమతులిస్తున్నామని, అయితే మళ్లీ చేర్చేందుకు అంగీకరించబోమంటూ స్పష్టం చేశారు. అది కూడా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లు ఎంఈఓలతో, ఉన్నత పాఠశాలల టీచర్లయితే హెచ్ఎంలతో ధ్రువీకరించుకుని స్వయంగా బాధిత టీచర్లే వస్తేనే ఆ పాయింట్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. -
నంద్యాల గాంధీచౌక్ వద్ద ఉద్రిక్తత
-
నెల్లూరు తడికల బజార్లో ఉద్రిక్తత
-
అట్టుడుకుతున్న దక్షిణ కర్ణాటక
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడూ శాంతియుత పరిస్థితులుండే దక్షిణ ప్రాంతం ఇప్పుడు మత ఉద్రిక్తలతో అట్టుడికిపోతోంది. బంట్వాల్ తాలూకాలో గత 50 రోజుల నుంచి కొనసాగుతున్న నిషేధాజ్ఞలను ఆదివారం నాడు మంగళూరుకు కూడా పొడిగించారు. 144వ సెక్షన్ కింద విధించిన ఈ నిషేధాజ్ఞలు మరో రెండు వారాలపాటు కొనసాగుతాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గత మూడు నెలలుగా కొనసాగుతున్న మత ఉద్రిక్తలలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. బంట్వాల్లో గత మే 26వ తేదీన ఓ ముస్లిం యువకుడిని కత్తితో పోడవడంతో మత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో మొదటిసారి బంట్వాల్లో నిషేధాజ్ఞలు విధించారు. జూన్ 21వ తేదీన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆటో డ్రైవర్ ఆష్రాఫ్ కలాయ్ (35)ని గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఆటో నుంచి బయటకులాగి హత్యచేశారు. జూలై 4వ తేదీన శరత్ మడివాలా అనే ఆరెస్సెస్ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా కట్టారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆయన గాయాలతో మరణించారు. ఈ మూడు సంఘటనల్లో ప్రతి సంఘటన కూడా మత ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆరెస్సెస్ కార్యకర్త హత్యానంతరం ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. జూలై 8 తేదీన ఆయన నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న హిందువులు రాళ్లు, సీసాలు విసిరారు. ఉత్తరప్రదేశ్లోలాగా కర్ణాటకలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని బీజేపీ, ఆరెస్సెస్ పార్టీలు రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు సష్టిస్తున్నాయని కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అల్లర్లతో సంబంధం ఉన్న ఆరెస్సెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగంగా పిలుపునివ్వడం, ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సవాల్ చేయడం తెల్సిందే. తాను అసలు సిసలైన హిందువునని, తన పేరు సిద్ద రాముడని, బీజేపీ దొంగ హిందూ సిద్ధాంతమని కూడా ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. వీరి సవాళ్లు, విమర్శలు ఎలా ఉన్నా అల్లర్లు ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా అల్లర్లకు దారితీసిన ఒక్క సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇంతవరకు ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు. నిందితులపై కేసులు దాఖలు చేయనప్పుడు, అరెస్ట్లు చేయనప్పుడు అల్లర్లు సమసిపోకపోవడమే కాకుండా మరింత పెరుగుతాయి. అల్లర్ల పేరిట సంఘ విద్రోహ శక్తులు మరింత పేట్రేగిపోయే ప్రమాదం ఉంటుంది. మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ నిర్వహించనున్న శాంతి ప్రదర్శనలో పాల్గొనాలంటూ కాంగ్రెస్, బీజేపీలకు జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు కుమార స్వామి పిలుపునిచ్చారు. శాంతి ప్రదర్శనలో పాలక, ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా పాల్గొని తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
అద్దంకిలో ఉద్రిక్తత
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని ఓ సీసీ రోడ్డు ప్రారంభోత్సవం వ్యవహారంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంలు ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యే తో ప్రారంభోత్సవం జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు శిలాఫలకం కూడా వేశారు. అయితే కరణం బలరాం వర్గం కూడా దాని పక్కనే మరో శిలాఫలకం ఏర్పాటుచేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువురు నేతలు పోటీగా ప్రారంభోత్సవం చేసేందుకు రెడీ కావడంతో పోలీస్ లు భారీగా మోహరించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా తన్నుకున్న రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీహెచ్డీ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు ఆందోళనకారులు వీసీ చాంబర్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
నాగర్ కర్నూల్లో ఉద్రిక్తత
-
మీరు బిగుసుకుపోయి ఉంటారా...?
సెల్ఫ్ చెక్ ప్రతికూల ఫలితాన్ని కొందరు తేలికగా తీసుకుంటే, మరికొందరు సీరియస్గా తీసుకుంటారు. ప్రత్యేకంగా ఉండాలనుకోవటం, బాగా పేరు తెచ్చుకోవాలనుకోవటం, ప్రయత్నించిన మొదటిసారే విజయాన్ని చేరుకోవాలనుకోవటం. ఇలా తమను తామే స్ట్రిక్ట్గా మలచుకుంటారు కొందరు. ఇక్కడ బాధ్యతలను విస్మరించమని చెప్పే ఉద్దేశం కాదు కాని అనవసరంగా టెన్షన్ పడకుండా ఉండటం అవసరం. మీరెలా ఉంటారు? ఫ్లెక్సిబుల్గా కాకుండా బిగుసుకుపోయి స్టిఫ్గా ఉంటారా? 1. నిర్ణయాలు మార్చుకోవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలవుతారు (ఉద్యోగవ్యవహారాలు మొదలైనవి). ఎ. కాదు బి. అవును 2. అతి శుభ్రత పాటించాలనుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. అంతగా ప్రాధాన్యం లేని పనులకు కూడ చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎ. కాదు బి. అవును 4. మీరనుకున్న పనులు పూర్తిచేయలేకపోతే (సమయం ఉన్నా కూడ) హడావిడి పడతారు. ఎ. కాదు బి. అవును 5. ఏదైనా కార్యక్రమం మీరు ఊహించిన విధంగా జరగకపోతే అప్సెట్ అవుతారు. ఎ. కాదు బి. అవును 6. మిమ్మల్ని ఎవరైనా అవసరానికి ఉపయోగించుకంటే (అడ్వాన్టేజ్) మనశ్శాంతి కోల్పోతారు. ఎ. కాదు బి. అవును 7. మీదగ్గర నుంచి ఇతరులు తీసుకున్న వస్తువులు సకాలంలో ఇవ్వకపోతే చాలా పెద్ద సీన్ చేస్తారు. ఎ. కాదు బి. అవును 8. ప్రతికూల పరిస్థితుల్లో కూడ మీ విధిని కాసేపు పక్కన పెట్టటం మీకు నచ్చదు. ఎ. కాదు బి. అవును 9. ఏదైనా తీసుకోవటమేకాని, ఇచ్చే మనస్తత్వం మీది కాదు. ఎ. కాదు బి. అవును 10. జరిగిపోయిన విషయాల గురించి పదేపదే ఆలోచిస్తారు. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఏడు దాటితే అవసరంలేనిదానికన్నా ఎక్కువగా స్పందించే తత్వం మీలో ఉంటుంది. దీనివల్ల ఎప్పుడూ టెన్షన్తో ఉంటారు. మీ చర్యలే మీకు విశ్రాంతిలేకుండా చేస్తుంటాయి. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే మీలో ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. పరిస్థితులకు తగినట్లు స్పందించటం వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. -
సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారసత్వ ఉద్యోగాల కోసం వారం రోజులుగా సింగరేణి కార్మికులు సమ్మే చేస్తుండగా.. విధులకు హాజరైన కార్మికులతో యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. రామగుండం ఓసిపి 3 లో డంపర్ ఢీ కొట్టడంతో కార్మికుడు ఓవర్ హెడ్ మెన్ రాజేంద్రప్రసాద్ మృతి చెందాడు. మృతికి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘమే కారణమంటూ సమ్మే చేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మెను విచ్చిన్నం చేయడానికి కార్మికులతో బలవంతంగా పని చేయిస్తూ కార్మికుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
జీఎస్టీ గుబులు
భీమవరం/తాడేపలి్లగూడెం : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యాపార వర్గాల్లో సెగ పుట్టిస్తోంది. జూలై 1నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను విధానం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపులు, మరికొన్ని వస్తువులకు శ్లాబ్ రేట్లు పెంచనున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు పన్నుల ద్వారా లభించే ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీపై జిల్లాలోని అన్నిరకాల వ్యాపారులకు అవగాహన కల్పించే పనిలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ధాన్యం, బియ్యం, గోధుమలు, వాటితో చేసే ఉత్పత్తులు, అపరాలు, పప్పులు, అగరుబత్తి, స్కూల్ బ్యాగ్లు, ప్యాకేజ్డ్ ఆహారం వంటి వాటికి జీఎస్టీ నుంచి మినహా యింపు ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయ చేతి పనిముట్లు, దివ్యాంగులు వినియోగించే వస్తువులు, ఆక్వా, పౌల్ట్రీ ఫీడ్, తమలపాకులు, బార్లీ, తృణ ధాన్యాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల పదార్థాలు, వంట చెరకు, కూరగాయలు, మరమరాలు వంటి వాటికీ మినహాయింపు లభించనుంది. మిర్చి, పత్తి, కాఫీ, టీ, ఖనిజాలు తదితర వస్తువులపై ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నులే జీఎస్టీలో కొనసాగుతాయని సమాచారం. జీఎస్టీ అమల్లోకి వస్తే స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. దీర్ఘకాలంలో వస్తు ఉత్పాదక వ్యయం తగ్గి స్థానికంగా తయారయ్యే వస్తువులు వినియోగదారులకు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్యకలాపాలు ఆన్లైన్ జీఎస్టీ కార్యకలాపాలు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. ఈ చట్టం కింద వ్యాపారులు దాఖలు చేసే రిటర్న్స్, చెల్లించే పన్నుల ఆధారంగా వారికి రేటింగ్ ఇస్తారు. దీనివల్ల వ్యాపార కార్యాకలాపాలు అభివృద్ధి చెందుతాయంటున్నారు. జీఎస్టీ వల్ల ప్రజలకు, వ్యాపారులకు, ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఒకే రకమైన పన్ను అమలు కావడం వల్ల పన్ను చెల్లించాలి్సన అవసరం నేరుగా వినియోగదారులకు ఉండదు. ఏకీకృత పన్నుల వ్యవస్థ వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. చిన్న వ్యాపార సంస్థలకు నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. పన్ను వసూలు సులభతరమై బకాయిలు, చట్టపరమైన వివాదాలు తగ్గుతాయనేది అధికారుల భావన. జీఎస్టీ అమల్లోకి వచ్చిన వెంటనే ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సరుకులపై కూడా ఇన్పుట్ టాక్స్లు పొందేందుకు వ్యాపారులకు అర్హత ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాట్ చట్టం ప్రకారం నిల్వ ఉన్న ఇన్పుట్ టాక్స్ను జీఎస్టీ చట్టం అమలు తరువాత తిరిగి పొందవచ్చు. ఇప్పటికే 90 శాతానికి పైగా వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి వచ్చారు. విదేశాలకు ఎగుమతి చేసిన సరుకులు, సేవలపై కట్టిన పన్ను వాపస్ ఇస్తారు. అదనంగా లేదా పొరపాటున చెల్లించిన పన్నును కూడా వ్యాపారులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే నడుస్తుంది. అనుమానాలెన్నో.. జీఎస్టీ విధానంపై వ్యాపారులను అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. తమ అనుమానాలను అవగాహన సదస్సుల్లో అడుగుతుంటే. అధికారులు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం సాగుతున్న జీరో వ్యాపారాన్ని అధికారులు జీఎస్టీ ద్వారా ఏవిధంగా నియంత్రిస్తారన్నది అర్థం కాని సమస్యగా ఉంది. ఇప్పటికీ అనేక వ్యాపార సంస్థల్లో వ్యాట్లో నమోదు చేయని సరుకుల నిల్వలు భారీగా ఉన్నాయి. జూలై 1నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తే వాటిని ఏ విధంగా చూపిం చాలనే సందేహం వ్యాపారుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పన్నుల శ్లాబులు జీఎస్టీ వల్ల మారనున్నాయి. అదనంగా పెరిగే పన్నులను ఏవిధంగా చెల్లించాలనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటివరకు మామూళ్లకు అలవాటు పడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీఎస్టీ అమలైతే తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆందోళనలో ఉన్నారు. జీఎస్టీ నాలుగు రకాలు జీఎస్టీ విధానంలో నాలుగు రకాలు ఉంటాయని చెబుతున్నారు. సీజీఎస్టీ (సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ) ఎస్జీఎస్టీ (స్టేట్ గవర్నమెంట్ జీఎస్టీ ) యూజీఎస్టీ (కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ) ఐజీఎస్టీ (ఇంటర్ స్టేట్ జీఎస్టీ)గా వీటిని పిలుస్తారు. ఈ నాలుగింటిలో ఐజీఎస్టీ ఆదాయం కేంద్రం వద్దే ఉంటుంది. ఉదాహరణకు ముంబైలో తయారైన వస్తువు ఆంధ్రప్రదేశ్లో విక్రయించగా వచ్చే పన్నును ఏ దామాషాలో అక్కడి తయారీదారుకు, ఇక్కడి విక్రేతకు విధించాలనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. మిగిలిన మూడు రకాల పన్నులను మార్గదర్శకాలకు అనుగుణంగా విధిస్తారు. రివర్స్ చార్జి మెకానిజం జీఎస్టీ లావాదేవీలన్నీ ఈ–ఇన్పుట్ ద్వారా సాగించాల్సి ఉంటుంది. దీనికోసం ఎన్నిరకాల ఆవర్జా పుస్తకాలు నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమ్మకాలు, కొనుగోలు విషయాలకు సంబంధించి పన్ను రాయితీకి కొన్ని విధివిధానాలు నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఒక రిటైల్ వ్యాపారి హోల్సేల్ వ్యాపారి నుంచి రూ.5 లక్షల విలువైన సరుకును కొనుగోలు చేస్తే.. అది హోల్సేల్ వ్యాపారి అమ్మకాల్లోకి వెళ్లి రూ.5 లక్షల అమ్మకాలకు సంబంధించి జీఎస్టీ పన్ను చెల్లింపుల్లోకి వెళుతుంది. రిటైల్ వ్యాపారి రూ.లక్ష విలువైన సరుకును వెనక్కి ఇస్తే ఎలక్ట్రానిక్ ఇన్పుట్లో ఆ విషయాన్ని పొందుపరిస్తే.. ఆ మేరకు జీఎస్టీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. రివర్స్ చార్జ్ మెకానిజమ్గా ఈ లావాదేవీలను చూపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సీజీఎస్టీగా అత్యధికంగా 20 శాతం పన్ను విధించవచ్చు. ఎస్జీఎస్టీగా కూడా 20 శాతం పన్ను వేయవచ్చు. ఐజీఎస్టీగా మాత్రం అత్యధికంగా 40 శాతం పన్ను వసూలు చేయవచ్చని సమాచారం. జీఎస్టీపై దఫదఫాలుగా వాణిజ్య పన్నుల విభాగం అధికారులకు, ఉద్యోగులకు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. అప్పటికి గాని జీఎస్టీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
‘వెలుగు’లో గుబులు!
– ‘బదిలీలల’కు చెక్పెట్టిన కలెక్టర్ వీరపాండియన్ – కౌన్సెలింగ్కు జేసీ–2ను పంపిన వైనం – సిబ్బంది వ్యవహారంపై డీఆర్డీఏ పీడీ ఆగ్రహం – తనకు ‘అవమానం’ జరిగిందంటూ నిర్వేదం! (సాక్షి ఎఫెక్ట్) అనంతపురం టౌన్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)–వెలుగులో బది‘లీలల’కు చెక్ పడింది. యూనియన్ల ముసుగులో కొందరు ఓ వైపు రాజకీయ సిఫార్సులు, మరోవైపు తమకు అనుకూలంగా ఉన్న వారిని అనుకున్న స్థానాలకు పోస్టింగ్లు ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. తాజాగా మరికొన్ని బదిలీల్లో కూడా చక్రం తిప్పుదామనుకున్నా అది నెరవేరలేదు. కలెక్టర్ వీరపాండియన్ రంగంలోకి దిగడంతో అడ్డుకట్టపడింది. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సీసీల బదిలీల్లో కొందరు ఉద్యోగులు అన్నీ తామై ‘లీలలు’ ప్రదర్శించారు. ఈ క్రమంలో ‘వెలుగులో బదిలీలలు’, వెలుగులో చీకటికోణం.. అనే శీర్షికలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై కలెక్టర్ ఆరా తీశారు. ఆదివారం డీఆర్డీఏ కార్యాలయంలో డీపీఎంలు, ఏపీఎంలు, కొందరు సీసీలకు బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ఉదయం 10 గంటలకు ఐదారుగురు సీసీలకు కౌన్సెలింగ్ చేసి, బదిలీ ఆర్డర్లు కూడా సిద్ధం చేశారు. ఈ సమయంలో కలెక్టర్ వీరపాండియన్ నుంచి డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లుకు ఫోన్ వచ్చింది. కౌన్సెలింగ్కు జేసీ–2 ఖాజామొహిద్దీన్ వస్తారని, ఆయన ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ చేపట్టాలని సూచించారు. దీంతో అప్పటికే కౌన్సెలింగ్ ముగించి సిద్ధం చేసిన ఆర్డర్లను బుట్టదాఖలా చేశారు. 12 గంటల సమయంలో జేసీ–2 వచ్చి మొదటి నుంచి కౌన్సెలింగ్ను ప్రారంభించారు. ఎనిమిది మంది డీపీఎంలు, ముగ్గురు ఏపీఎంలు, 30 మంది వరకు సీసీలకు కౌన్సెలింగ్ చేశారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు, స్పౌస్ కేసులు, అనారోగ్యంతో ఉన్న వారు, పనితీరు బాగాలేని వారికి ప్రాధాన్యత క్రమంలో సాయంత్రం 3 గంటల వరకు బదిలీలు నిర్వహించారు. ఉద్యోగుల తీరుపై పీడీ ఆగ్రహం : బదిలీల్లో కొందరు ఉద్యోగుల తీరు వల్ల వ్యక్తిగతంగా తన ప్రతిష్ట దిగజారడంతో పీడీ వెంకటేశ్వర్లు మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. తాను ఉండగానే జేసీ–2ను కౌన్సెలింగ్కు పంపడం పట్ల ఆయన తీవ్ర నిరాశకు లోనైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే బదిలీల్లో చక్రం తిప్పిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కౌన్సెలింగ్కు జేసీ–2 వచ్చే వరకు తన చాంబర్లోనే ఉన్న ఓ ఏపీఎంను ‘ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ బయటకు పంపించేసినట్లు సమాచారం. మరో ఏపీఎంపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా సదరు అధికారి కంటతడి పెట్టినట్టు తెలిసింది. ‘బిల్లుల’ రాజాకు చెక్ : డీఆర్డీఏలో కీలకంగా ఉన్న ఫైనాన్స్ విభాగానికొచ్చి చక్రం తిప్పాలనుకున్న ఓ అధికారి ఆశలపై జేసీ–2 నీళ్లు చల్లారు. కౌన్సెలింగ్ను ప్రాధాన్యత క్రమంలో చేపట్టడంతో ఈ విభాగానికి డీపీఎంగా రాధారాణికి ఆర్డర్స్ ఇచ్చారు. సదరు ‘బిల్లుల’ రాజా మరో విభాగానికి వెళ్లాల్సి వచ్చింది. తాజాగా జరిగిన బదిలీల్లో ధర్మవరం ఏరియా కో ఆర్డినేటర్ (ఏసీ)గా ఈశ్వరయ్య, బుక్కరాయసముద్రం ఏసీగా సత్యనారాయణ, ఉరవకొండకు రవీంద్ర, హిందూపురానికి ప్రసాద్, మడకశిరకు శ్రీదేవి నియమితులయ్యారు. ఓ డీపీఎం తనకు బుక్కరాయసముద్రం క్లస్టరే కావాలని పట్టుబడడంతో ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం కదిరి, తాడిపత్రి, ఓడీ చెరువు, రాయదుర్గం క్లస్టర్ల ఏసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని బదిలీలు ఇంకా జరగాల్సి ఉంది.