హైదరాబాద్ : చిత్తూరు జిల్లా పుత్తూరు ఘటనపై డీజీపీ ప్రసాదరావు స్పందించారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఆక్టోపస్ బృందాన్ని పుత్తూరుకు పంపించినట్లు ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఆ ఇంట్లో దాక్కున్నది ఎవరో ఇంకా తేలలేదని డీజీపీ చెప్పారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తమిళనాడు పోలీసులు ఈరోజు తెల్లవారుజామున పుత్తూరు మేదర వీధిలోని ఓ ఇంటిని చుట్టుముట్టి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇంట్లో దాక్కున్నది ఎవరో ఇంకా తేలలేదు: డీజీపీ
Published Sat, Oct 5 2013 10:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement