నల్గొండ జిల్లా: మునగాల మండలంలోని ముకుందాపుం గ్రామంలో శనివారం రాత్రి పశ్చిమ గోదవారి జిల్లా అత్తిలి నుంచి హైదరాబాదుకు వస్తున్న కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు రోడ్డుపై ఉన్న గుడిసెను ఢీకొని ఆ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటి గోడను ఢీకొనడంతో గోడ ధ్వంసమైంది. ఆ ఇంటికి చెందిన కుటుంబ సభ్యులు రెండో గదిలో నిద్రించడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనలో గుడిసెలోని ఒకరికి, బస్సు డ్రైవర్తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి
ఇంట్లోకి దూసుకెళ్లిన కావేరి ట్రావెల్స్ బస్సు
Published Sun, Jan 18 2015 7:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement
Advertisement