వ్యాన్ - బైక్ ఢీ : ముగ్గురు మృతి | Three killed in road accident in krishna district | Sakshi

వ్యాన్ - బైక్ ఢీ : ముగ్గురు మృతి

Published Fri, Dec 25 2015 8:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three killed in road accident in krishna district

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామానికి చెందిన సీతారామయ్య, పినపాక గ్రామానికి చెందిన వెంకటశివరామకృష్ణ, ఇబ్రహీంపట్నంనకు చెందిన విజయ్‌కుమార్ ముగ్గురు బైక్‌పై విజయవాడ వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓమ్ని వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ రాంగ్‌రూట్లో రావడం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓమ్ని వ్యాన్‌ను, డ్రైవర్‌ను కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement