ఇన్ఫార్మర్ నెపంతో గిరిజన కళాకారుడి హత్య | Tribal artist's murder in Tummala | Sakshi
Sakshi News home page

ఇన్ఫార్మర్ నెపంతో గిరిజన కళాకారుడి హత్య

Published Mon, Mar 10 2014 9:13 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Tribal artist's murder in Tummala

ఖమ్మం: చింతూరు మండలం తుమ్మల గ్రామంలో మావోయిస్టులు ఓ గిరిజన కళాకారుడిని పోలీస్ ఇన్ఫార్మర్ అన్న నెపంతో కాల్చి చంపారు. సిపిఎం కార్యకర్త అయిన  ముత్యం అలియాస్ భిక్షం కొమ్ముడోలు కళాకారుడు. నిన్న కూడా సిపిఎం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముత్యం పాల్గొన్నాడు. శబరి ప్రాంతానికి చెందిన మావోయిస్టు దళాలు ముత్యంను తన కొడుకు ఎదుటే  హత్య చేశారు.

ఎంత చెప్పినా వినకుండా ముత్యం పోలీసులకు సమాచారం అందజేస్తున్నాడని మావోయిస్టులు ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రజాకోర్టులో గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు అతనిని చంపినట్లు ఆ లేఖలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement