లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృత్యువాత | Two die in road accident | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృత్యువాత

Published Thu, Dec 10 2015 6:27 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Two die in road accident

కంచికచర్ల (కృష్ణా) : కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన వరికూటి స్వామి (55), విజయవాడ నగరం మాచవరం ప్రాంతానికి నరుకుల వేణుగోపాల్(23) బైక్‌పై విజయవాడ నుంచి కంచికచర్ల వైపు వస్తుండగా పరిటాలలోని కోల్డ్‌స్టోరేజి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంచికచర్ల పోలీసులు అక్కడికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement