పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా... | Two killed, Four Injured in road accident at prakasam district | Sakshi
Sakshi News home page

పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా...

Published Thu, Jun 18 2015 9:08 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Two killed, Four Injured in road accident at prakasam district

ఒంగోలు : ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీని జీపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

పెళ్లి చూపుల కోసం కడప నుంచి కాకినాడ వెళ్లి... తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement