కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం
Published Sat, Dec 28 2013 2:26 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
లింగపాలెం, నూస్లైన్ : కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్పై ప్రయూణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చింతలపూడి మండలం ఊటసముద్రం పంచాయతీ ఖండ్రిగగూడేనికి చెందిన మాజీ సర్పంచ్ అప్పిరెడ్డి దుర్గారావు(54) సమీప బంధువైన సంకు మల్లయ్య(48)తో కలిసి శుక్రవారం మోటార్ బైక్పై చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తుండగా లింగపాలెం జూబ్లీనగర్ సమీపంలో ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో బైక్పై ఉన్న దుర్గారావు, మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కారు బైక్ను ఢీకొట్టి అనంతరం పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయింది. మల్లయ్య సీతానగరం గ్రామానికి చెందినవాడు. వీరిద్దరూ ఏలూరు ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ప్రమాద స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతులు దుర్గారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, మల్లయ్యకు భార్య, ఒక పాప ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మాజీగూడెం ఏఎస్సై కె.నాగేశ్వరావు తెలిపారు. కారు డ్రైవర్ పరారైనట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో కారు, బైక్ నుజ్జునుజ్జు అయ్యాయి.
Advertisement
Advertisement