'చంద్రబాబు, ఆయన కేబినెట్ది పెద్ద మాయాజాలం' | Vasireddy Padma takes on Chandrababu Naidu and Cabinet | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు, ఆయన కేబినెట్ది పెద్ద మాయాజాలం'

Published Fri, Jul 25 2014 2:28 PM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM

'చంద్రబాబు, ఆయన కేబినెట్ది పెద్ద మాయాజాలం' - Sakshi

'చంద్రబాబు, ఆయన కేబినెట్ది పెద్ద మాయాజాలం'

రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం మెజీషియన్లను మించిన మాయాజాలం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం మెజీషియన్లను మించిన మాయాజాలం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్లో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ ఇచ్చిన నరకాసురవధ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. రైతులను మోసకారని... వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర చంద్రబాబుదని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు.

గత టీడీపీ ప్రభుత్వం రైతును 30 ఏళ్లు వెనక్కి నడిపించిందని ఆరోపించారు. రుణమాఫీ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు రైతులను తప్పు పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను బేషరతుగా అమలు చేయాలని వాసిరెడ్డి పద్మ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement