![పదవులు కోసమే రాజీనామాలు చేయలేదు: బొత్స](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/61383734089_625x300_1.jpg.webp?itok=ZQjbcss5)
హైదరాబాద్: తనతోపాటు మిగిలినవారందరూ పదవులు కాపాడుకునేందుకే రాజీనామాలు చేయలేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంగీకరించారు. అప్పుడే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి వేరువిధంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు డిసెంబరు మొదటి వారంలో శాసనసభకు వస్తుందని బొత్స సత్యనారాయణ చెప్పారు.
అసెంబ్లీని సమావేశపరచడానికి ప్రోరోగ్ సమస్యకాదని చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్లో అందరూ అర్హులేనన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కొందరు కాంగ్రెస్ను ముద్దాయిని చేయాలని చూస్తున్నారన్నారు.