botsa satyanarayana
-
వైఎస్ జగన్కు భద్రతా వైఫల్యం.. కూటమి ప్రభుత్వానికి బొత్స వార్నింగ్
అమరావతి,సాక్షి: కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ తరుణంలో వైఎస్ జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లిన అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ జగన్ భద్రతపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాం. భద్రత విషయంలో కేంద్ర హోమంత్రి అమిత్షాను కలుస్తాం. వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవురామగిరిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. మాజీ సీఎం జగన్కు భద్రత చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్, ఆ సంగతి అధికారులకు తెలుసు. వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఆక్రోశం.ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారు. గేట్లు సరిగా కట్టకపోతే దానికి ప్రకాష్ రెడ్డిదా తప్పు. అధికారం ఎన్నడు శాశ్వతం కాదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ప్రభుత్వ తీరు ఇలానే ఉంటే ప్రజలు తిరగబడతారు. జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రతను గాలికి వదిలేస్తున్నారు.జగన్కు కావలసిన భద్రత కల్పించాలి. జగన్ భద్రత పట్ల మాకు ఆందోళన ఉంది. జగన్ భద్రత కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాము. ప్రధాని మంత్రి దగ్గరకు వెళ్ళి జగన్కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తాము.ఎంపీ కృష్ణదేవరాయలకు వారి తండ్రి సంస్కారం నేర్పలేదా. కూటమి ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది.కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ వర్గం ప్రజలు కూటమి పాలనలో సంతోషంగా లేరు. 1100 మందితో భద్రత కల్పిస్తే పోలీసులు ఎక్కడ ఉన్నారు.1100 మంది కాదు కదా 110 మంది కూడా లేరు. 1100 మంది పోలీసులు ఉండి ఉంటే అందరూ సివిల్ డ్రెస్లో ఉన్నారా. ఒక సెలబ్రిటీ వస్తేనే పోలీసులు ఎంతో హడావడి చేస్తారు. మాజీ సీఎం పరామర్శకు వెళ్తే భద్రత కల్పించలేరా. గతంలో చంద్రబాబు పోలీసులు గురించి మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి.రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలి.ఈ రోజు మేము అవ్వచ్చు, రేపు మీరు అవ్వొచ్చు. రాజకీయ నాయకులపై మాట్లాడడం పోలీసులకు ఫ్యాషన్ అయింది. మాన్యువల్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటే మళ్ళీ మాట్లాడరు’ అని వ్యాఖ్యానించారు. -
Botsa : కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం ఆదాయం తగ్గింది
-
‘ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరిగింది చంద్రబాబు?
విశాఖ: ఏపీ రాష్ట్ర వృద్ధిరేటు 8.2 శాతం ఉందని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పడం, దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు(సోమవారం) మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ‘ ప్రజలను మభ్య పెట్టే విధంగా వార్తలు రాయడం ఏమిటి?. వార్తలు రాయడంలో వాస్తవికత ఉండాలి. కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32 శాతం తగ్గింది. 10 నెలల కాలంలో లక్ష 40 వేల కోట్లకు పైగా అప్పు చేశారు. అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది. ఆదాయం లేకుండా జీడీపీ ఎలా పెరుగుతుంది.తప్పుడు రాతలు వలన ప్రజలకు ఉపయోగం ఏమిటి?, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా?, అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అన్నారు.. ఇప్పుడు సిక్స్ లేదు సెవెన్ లేదు.ప్రతి సారి చెవిలో పూలు పెడితే ఎవరు నమ్ముతారు. చెత్త పన్ను తీయడం కాదు. వీధుల్లో టన్నుల్లో ఉన్న చెత్త తీయంచాలి. వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేని రాష్ట్రం వృద్ధిరేటులో రెండో స్థానంలో ఉందట. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్నది వైఎస్సార్సీపీ విధానం. జగన్ పాలనలో 2.78 కోట్లు ప్రజలకు ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్తలు జిల్లా పేపర్ లో వేస్తున్నారు.చంద్రబాబు తప్పుడు వార్తలను మెయిన్ పేజీలో వేస్తున్నారు. డిప్యూటీ సీఎంపై వివక్ష ఎందుకు చంద్రబాబు? అని ప్రశ్నించారు. -
ఆదాయం అడుగంటినా.. అభివృద్ధి గొప్పలు
సాక్షి, అమరావతి: ఒకపక్క రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం తగ్గిపోతున్నట్లు గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నా.. 2024–25లో ఫిబ్రవరి వరకు 2.16 శాతం వార్షిక వృద్ధి మాత్రమే నమోదైనా.. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 8.21 శాతంగా ఉంటుందని టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించుకోవడంపై ఆర్థిక రంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35% తగ్గిపోగా మూలధన వ్యయం 42.78% తగ్గిందని.. ఏ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్ర ఆదాయాలు బాగా తగ్గాయని విశ్లేషిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదు.. పరిశ్రమలు రాలేదు.. ఉద్యోగాలు రాకపోగా ఉన్నవే ఊడుతున్నాయి.. రాష్ట్రం సొంత పన్నులు, రిజిస్ట్రేషన్ల ఆదాయాలు అడుగంటాయి..! మరి వృద్ధి ఎలా సాధ్యం..? ఎక్కడి నుంచి వచి్చనట్లు? అని ప్రశి్నస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్డీపీలో ఏపీ బలమైన వృద్ధి నమోదు చేసిందంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంపై ఆరి్థకవేత్తలు విస్తుపోతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన సమాచారాన్ని మాత్రమే వెబ్సైట్లో పొందుపరిచారని, ఇంకా 15 రాష్ట్రాలు వివరాలు పంపలేదని పేర్కొంటున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని.. చేతిలో చిల్లిగవ్వ లేదని.. గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఆదుకున్న సంక్షేమ పథకాలు ఆగిపోవడంతో దిక్కు తోచని పరిస్థితిల్లో ఉన్నారని.. ఇలాంటి తరుణంలో వృద్ధి రేటు పెరుగుదల ఎలా సాధ్యమని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. సర్కారు సొంత నివేదికే: బొత్స2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35% తగ్గగా, మూలధన వ్యయం 42.78% తగ్గిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇలాంటప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 8.21%గా ఉంటుందని మీ ప్రభుత్వం అంచనా వేయడం సమర్థనీయమేనా? అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. నిరుత్సాహకరమైన పనితీరు కనబరిచినప్పటికీ జీఎస్డీపీ వృద్ధి రేటు 8.21%గా ఉంటుందని అంచనా వేయడం పాలనలో మీ సామర్థ్యాన్ని సూచిస్తుందా? లేక రాజకీయ కుట్రలలో మీ ప్రతిభను సూచిస్తుందా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో ఏపీ బలమైన వృద్ధి నమోదు చేసిందని ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేయడాన్ని బొత్స తిప్పికొట్టారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నివేదికే గానీ మరొకటి కాదన్నారు. ఈ గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకున్న ముందస్తు అంచనాలు మాత్రమేనని, వాటికి ఎలాంటి హేతుబద్ధత ఉండదన్నారు. -
బడుగు బలహీన వర్గాలపై కూటమికి ప్రేమ లేదు: బొత్స
-
రోజూ ఆవు కథ చెబితే ఎలా? కూటమిపై బొత్స సెటైర్లు
-
రోజూ ఆవు కథ చెబితే ఎలా?.. కూటమి సర్కార్పై బొత్స ఫైర్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్కు నిధులు కేటాయించకుండా కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని.. కానీ ప్రభుత్వం.. మార్షల్స్ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని మండిపడ్డారు.‘‘ఓటేశారు.. మేం గెలిచాం...ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రజల ఆంకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత వైఎస్ జగన్ది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని బొత్స పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో కనీస చర్చలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. వైఎస్ జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం’’ అని బొత్స దుయ్యబట్టారు.గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారు. రోజూ ఆవుకథ చెబితే ఎలా?. ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు, హామీలు మర్చిపోయారా?. కూటమి మాదిరి మోసం దగా వైఎస్సార్సీపీకి అలవాటు లేదు. అదే అలవాటు వైఎస్సార్సీపీకి ఉంటే మేం కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం’’ అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ బడులపై నారా లోకేష్ చెప్పిన కాకిలెక్కలకు బొత్స ఖండన
-
వాకౌట్ చేయడానికి మాకేమైనా సరదానా బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
నిన్న నన్ను.. ఇవాళ మండలి చైర్మన్ను అగౌరవపరిచారు: బొత్స
సాక్షి,గుంటూరు: శాసన మండలిలో చైర్మన్ సహా వైఎస్సార్సీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. తాజాగా మండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్పై వివక్ష చూపించారని అన్నారాయన. శాసన మండలిలో బొత్స మాట్లాడుతూ..క్రీడా పోటీలు రెండు సభల సభ్యులకు నిర్వహించారు. శాసన మండలిని అవమానించారు. సీఎం, స్పీకర్ ఫొటోలు వేసి మండలి చైర్మన్ ఫొటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారు. వ్యక్తిగతంగా మండలి చైర్మన్ను ఇలా కించపరచడం సమంజసం కాదు.నిన్న ఉమ్మడి ఫొటోకు పిలిచి అక్కడ నాకు కుర్చీ వెయ్యలేదు. నాకు కుర్చీ వేయకుండా ప్రోటోకాల్ పాటించలేదు.వేరే వాళ్ల కుర్చీలో కూర్చోమని చెప్పారు. ఇప్పుడు ఏకంగా మండలి చైర్మన్ను ఇప్పుడు అగౌరవ పరిచారు.బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై బొత్స అభ్యంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆమోదించారు. రేపు శాసన మండలిలో చర్చించాలి. కానీ అజెండాలో లేకుండా ఈరోజే పాస్ చేయాలనుకోవడం సమంజసం కాదు. ఈ బిల్లు పై చర్చ జరగాలన్నది మా అభ్యంతరం. రేపు సభ లేకపోతే ఈరోజు ఆమోదించాలి. కానీ ఇప్పుడే ఆమోదించేంత అత్యవసరం ఏముంది. మీకు నచ్చినట్టు చేసుకుంటాం అంటే మాకేమి అభ్యంతరం లేదు. ఉద్యోగులకు జీతాలు రేపు ఇస్తారా..?. యనమల చెప్పినట్టు బిల్లుపై చర్చ జరగాలి.బీఏసీలో రెండు రోజులు రిజర్వ్ పెట్టింది. అలాంటప్పుడు అసలు బిల్లు చూసుకునే అవకాశమే లేకుండా చర్చ పెట్టేస్తే ఎలా..?’ అని ప్రశ్నించారు. -
లోకేష్ కు బొత్స దిమ్మతిరిగే కౌంటర్
-
APLC: మేమెందుకు క్షమాపణలు చెప్పాలి?
అమరావతి, సాక్షి: శాసనమండలిలో ఇవాళ మరోసారి మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ(Botsa Satyanaraya) మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి లోకేష్ ఆరోపించగా.. బొత్స ఆ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఏపీలో 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం(Drop Outs) సరికాదు. మంత్రి నారాలోకేష్(Nara Lokesh)కు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భమూ లేదు. .. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు. కావాలంటే మండలి సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి...2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం(English Medium) కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం. .. ప్రాధమిక విద్యనుంచి టోఫెల్ విద్యను నేర్పించడం. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం. సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను ప్రవేశపెట్టడం లాంటివి చేశాం. మొన్న 80% మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చాం. రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరాం. ఈ రోజు ఉద్యోగుల సమస్యల పై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. నేను తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి నా మాటలను తొలగించండి. మేం క్షమాపణ చెప్పాలనడమేంటి... ఎందుకు మేము క్షమాపణ చెప్పాలి అని లోకేష్ వ్యాఖ్యలను ఉద్దేశించి బొత్స తీవ్రంగా ధ్వజమెత్తారు.అంతకుముందు.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు , ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ,ఐఆర్ ,డీఏ ,ఉద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అనంతరం.. ప్రశ్నోత్తరాలు జరిగాయి. -
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై YSRCP సభ్యుల ఆగ్రహం
-
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అభ్యంతరం
AP Assembly And Council Updates11:05 AMశాసనమండలికి స్వల్ప విరామంశాసనమండలి కేంద్రం నుంచి వచ్చే వ్యవసాయ పథకాల్లో కేంద్రం వాటా ఉందా లేదా అని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సభ్యులువైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడుమంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యల పై వైఎస్సార్సీపీ అభ్యంతరంశాసనమండలి విపక్ష నేత,బొత్స సత్యనారాయణవ్యవసాయానికి పేటెంట్ ఎవరిదో...వ్యవసాయం సుద్ధ దండగ అని ఎవరు చెప్పారో అందరికీ తెలుసువ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చించుకుమదామంటే మేం రెఢీసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదుకేంద్రం ఇచ్చిన క్లస్టర్ల పై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం10:45AMపెన్షన్ల పై మండలిలో ప్రశ్నోత్తరాలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్ లు ఉన్నాయికూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయిఇప్పుడు పెన్షన్లు తొలగిస్తే ...ఎన్ని తొలగించారువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు మంజూరు చేసిందికూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మంది పెన్షన్లు తగ్గించారుబడ్జెట్ లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదు50 ఏళ్లకే ఇస్తామన్న పెన్షన్లు ఇస్తారా.. లేదా..పెన్షన్ల పరిశీలన అంటూ తగ్గిస్తూ వెళ్తున్నారుకూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అర్హులకు పెన్షన్లు ఇవ్వాలివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు..కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఏ ప్రతిపాదన చేయలేదు. నిన్నటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలుఎస్సీల వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదంరాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పురాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు వైఎస్సార్ జిల్లా.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్పు‘నిరుద్యోగ భృతి’.. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’పథకం అమలుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్న సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన మంత్రి ‘ఆ పథకాన్ని తమ శాఖ అమలు చేయడం లేదంటూ’ జవాబు ఎప్పటిలోగా అమలు చేస్తారన్నదానికి ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ పథకం ఎప్పటినుంచి అమలు అన్నదానిపైనా దాటవేత చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ⇒ ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు, రూ.37.97 కోట్లతో బుడమేరు డైవర్షన్ చానల్ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి పరిపాలన ఆమోదం.⇒ గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (వీవీఐటీయూ)ని బ్రౌన్ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతించేందుకు చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.⇒ సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రుల బృందం సిఫార్సుల ఆమోదానికి సీఆర్డీఏ కమిషనర్ను అనుమతిస్తూ నిర్ణయం. రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్ 1 బిడ్లను ఆమోదించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ తదితర ఆర్ధిక ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేసేందుకు సీఆర్డీఏ ఎండీకి అధికారం. -
ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం కాదని, వాటిపై విచారణ జరిపిస్తే ఆ నివేదికతో సభలో చర్చించాలే తప్ప.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ప్రభుత్వం సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్చించాలని ప్రభుత్వం అనుకొంటే 2014 నుంచి ఇప్పటివరకు చర్చించాలని మరోసారి స్పష్టం చేశారు.సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత గురువారం వాయిదా వేసిన ‘2019–24 మధ్య జరిగిన కుంభ కోణాలపై’ లఘు చర్చలో ప్రభుత్వ సమాధానానికి చైర్మన్ మోషేన్ రాజు అనుమతించారు. దీనిపై ప్రతిపక్ష నేత అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఒక పక్కన విచారణకు ఆదేశించామంటూనే, సభలో ఎలా మాట్లాడుతుందని ప్రశ్నించారు. ఇదే లఘు చర్చపై మంత్రి సమాధానానికి గత వారం అవకాశం ఇచ్చారని, 2014 నుంచి చర్చిద్దామని తాము అప్పుడే చెప్పామని అన్నారు. ప్రతిపక్షంపై బురద జల్లేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.పైగా విచారణ అని చెప్పి దాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో 6 నుంచి 10 నెలల్లో విచారణ నివేదికలు తీసుకొచ్చి సభలో చర్చించాలని చెప్పారు. 2014–19 మధ్య జరిగిన కుంభకోణాల మీద కేసుల దర్యాప్తు పూర్తయిందని, నివేదికలూ వచ్చాయని, వాటి మీదా చర్చ జరగాలని స్పష్టంచేశారు. అయినప్పటికీ మంత్రి సమాధానం ఇవ్వాలనుకొంటే.. ఇలాంటి ఏకపక్ష చర్చలో మేము పాల్గొనలేమని స్పష్టం చేశారు. సభ నుంచి వెళ్లిపోతున్నాం అంటూ వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పాలనలో పలు కుంభకోణాలు జరిగాయని, వాటిపై కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు కూడా పూర్తయిందని తెలిపారు. వాటిపై మాత్రం చర్చకు ప్రభుత్వం అంగీకరించడం లేదని బొత్స మీడియా పాయింట్ వద్ద విమర్శించారు. ఇది కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా అని నిలదీశారు. చీఫ్ విప్పై చైర్మన్ ఆగ్రహం ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న సమయంలో చీఫ్ విప్ అనురాధ సమాధానం చెబుతానంటూ లేచి నిల్చోగా చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఉండగా మీరు క్లారిఫికేషన్ ఎలా ఇస్తారని, మీకు సంబంధం లేదు కూర్చోవాలని చెప్పారు. ఇలాంటి సంప్రదాయాలు తీసుకొచ్చి మంత్రులు సభను తప్పుదోవ పట్టించొద్దని హితవుపలికారు. మార్షల్స్తో సభ్యులను సభలోకి తీసుకురండి! ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోవడంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కుంభకోణాలపై చర్చకు బీఏసీలో ప్రతిపక్షం ఆమోదించిందని, కానీ సభలో 2014–19 ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసి వాకౌట్ చేసిందని అన్నారు. చర్చకు సిద్ధంగా ఉంటే రమ్మనండని అన్నారు. గతంలో మార్షల్స్ను పెట్టుకుని సభను అవమానించారని, ఇప్పుడు మార్షల్స్కు చెప్పి బయట ఉన్న సభ్యులను లోపలికి తీసుకురావాలని అన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. లఘు చర్చపై ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ.. సుమారు 1.70లక్షల ఎకరాల్లో భూములు అన్యాక్రాంతం అయినట్టు గుర్తించామన్నారు. వీటిపై సీఐడీ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
కూటమి ప్రభుత్వం ఉద్యోగుల అంశంపై చర్చను పక్కదారి పట్టిస్తోంది: బొత్స
-
ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఆగ్రహం
సాక్షి,విజయవాడ : ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు చూపించడంలో చంద్రబాబు దిట్ట అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల్ని పక్కన పెట్టి స్కాముల పేరుతో కాలయపన చేస్తోంది. ఉద్యోగుల అంశాలపై చర్చ పక్కన పెట్టి ..మొన్న జరిగిన 2019- 2024 స్కామ్స్ మీద చర్చ పెట్టారు. 2019 నుండి 2024 కాదు.. 2014 నుండి 2024 వరకు చర్చకి సిద్ధం అని చెప్పాం. 2019 నుండి 2024 అంటూ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చి 9నెలల కాలంలో కొన్ని ఆరోపణలు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ జరగకుండానే ఆరోపణలు చేస్తున్నారు. .. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు చేయాలనే ప్రయత్నం చేస్తోంది. ఫలితంగా కోర్టులో ఉన్న కేసులు కూడా విత్డ్రా చేసుకుంటున్నారు’అని అన్నారు. -
రాజ్యాంగబద్ధ పదవిలో చంద్రబాబు మాటలు సరికాదు : బొత్స
-
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, తక్షణం జోక్యం చేసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గురువారం గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం రాజ్భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇటీవల గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు టీడీపీ వారికే చేయాలని, వైఎస్సార్సీపీ వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా సమ దృష్టితో పాలన అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు, దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమాన్ని అందుకునే లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపజేస్తారని, చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరిపట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని బొత్స మండిపడ్డారు. ఇలా ఏ నాయకుడూ మాట్లాడలేదు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబులా మాట్లాడలేదని బొత్స తప్పుబట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా వ్యక్తిగత ఎజెండాతో పనిచేయదని, కానీ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలపైనా రాజకీయమా? సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ రంగు పులమడం దారుణమని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి సర్కారు మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. జర్నలిస్టులనూ వదలరా? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, చివరికి జర్నలిస్టుల పైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు బి.విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు విడదల రజిని, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు. -
గవర్నర్ ను కలవనున్న బొత్స సత్యనారాయణసహా పలువురు నేతలు
-
విపక్ష సభ్యులను కించపరచడమే కూటమి నేతల పనా?: బొత్స
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మంత్రులు చెప్పిందే చెప్తుతున్నారని.. కూటమి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. 2019-24 మధ్య స్కామ్లు జరిగితే ఎంక్వైరీ వేసుకోమని చెప్పాం. మేం 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నారు’’ అని బొత్స ధ్వజమెత్తారు.‘‘వైజాగ్ భూముల సిట్ రిపోర్ట్ బయటపెట్టమని కోరాం. విపక్ష సభ్యులను కించపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధానం లేదు. డిజిటల్ కరెన్సీ అనేది మ్యాండేట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ సేల్స్ డిజిటల్ కరెన్సీలోనే నడుస్తున్నాయా? సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు. ప్రత్యేకించి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడంపై మేం అభ్యంతరం తెలిపాం. మా మీద, మా నాయకుల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’’ అని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. -
పెద్దల సభలో ఇలాంటి సాంప్రదాయం ఏంటి: బొత్స
-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స
-
బుడమేరు వరద సాయంలో చంద్రబాబు సర్కార్ విఫలం: బొత్స
సాక్షి, అమరావతి: వరద సహాయంలో కూటమి సర్కార్ విఫలమైందని విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని బొత్స తెలిపారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వరద బాధితుల్లో అనేక మందికి ఇంకా పరిహారం అందలేదని మండిపడ్డారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ.. బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు. అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధమని రుహుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు’
చోడవరం: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, రాష్ట్రంలోని రైతుల సమస్యలు కూడా పట్టించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాదా? అని బొత్స నిలదీశారు. ఈ రోజు(సోమవారం) చోడవరంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని బొత్స సందర్శించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేస్తాం. శాసనమండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలి. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు బకాయిలు చెల్లించలేదు. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో క్రసింగ్ జరిగేది. కానీ ఇప్పుడు సంక్రాంతి దాటిన క్రసింగ్ జరగ లేదు. జనవరిలో క్రాసింగ్ జరగడం వలన చెరుకు ఎండిపోతుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులను వైఎస్ జగన్ రూ. 90 కోట్లతో ఆదుకున్నారు.షుగర్ ఫ్యాక్టరీ కష్టాల నుంచి తక్షణం గట్టెక్కాలంటే 35 కోట్లు అవసరం. ప్రభుత్వం వెంటనే రూ. 35 కోట్లు విడుదల చేయాలి. ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి. టన్ను చెరుకుకు రూ. 2500 ఇస్తే ఏమి సరిపోతుంది?, రైతులు మన రాష్ట్ర ప్రజలు కాదా?, దివంగత నేత వైఎస్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నతమైన దశలో ఉన్నాయి. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి. రాజకీయాలు కోసం నేను రాలేదు.. రైతుల బాధలు చూసి మాట్లాడుతున్నాను.’ అని బొత్స స్పష్టం చేశారు. -
Super Six Schemes: కూటమిపై ఎమ్మెల్సీ బొత్స ఆగ్రహం
-
పవన్ కూటమి నుంచి బయటకు రావాలి: బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి వేదికగా వాస్తవాలను వివరిస్తుంటే టీడీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా?. మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు అస్సలు అవగాహన లేదు. ప్రతిపక్ష హోదా మా హక్కు. సంఖ్యాపరంగా తమకే సీట్లు ఎక్కువ వచ్చాయని పవన్ అంటున్నారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు.. పవన్ కూటమి నుంచి బయటికి రావాలి.. అని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగంపై నేను మాట్లాడాను. మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ప్రజల కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టే నిలదీస్తున్నాం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.1500 ఇస్తామన్నారు. బడ్జెల్లో ఆ ప్రస్తావనే లేదు. ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా?. మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి?. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలపైనే మేము ప్రశ్నిస్తున్నాం.సూపర్ సిక్స్ నిధులేవి..రూ.322 కోట్ల బడ్జెట్ లోటు, విధ్వంసం అనే పదంపైన నేను అసెంబ్లీలో మాట్లాడాను. విద్యుత్ చార్జీలు పెంచమని, ట్రూ ఆఫ్ చార్జీలు వేయమని చెప్పారని తప్పులు మాట్లాడితే మాట్లాడానని చెప్పం. రూ.2400 కోట్లు ఉపాధి హామీ పథకం నిధుల బకాయిలు గురించి చెప్పం. వాస్తవాలు తట్టుకోలేక పోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పథకాల కంటే ఎక్కువ ఇవ్వలేమని మా నాయకుడు వైఎస్ జగన్ ముందే చెప్పారు. ప్రస్తుతానికి సూపర్ సిక్స్లో ఒక్కటి అమలు చేస్తున్నారు.తల్లికి వందనంకి 9400 పెట్టి.. డిమాండ్లో 8200 కోట్లు చూపించారు.. మరి మిగిలింది ఎక్కడ నుండి తెస్తారు. రైతు భరోసాకి 20వేల రూపాయలు కేంద్రం ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పారు.. అలా చూసినా 6300 కోట్లు కేటాయించారు.. కావాల్సింది 7500 కోట్లు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.. అడిగితే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ భృతి ఊసే బడ్జెట్ లేదు.. ఆడబిడ్డ నిధి లేదు. 50 ఏళ్లకు పెన్షన్ లేదు. బుల్డోజర్ ప్రభుత్వం.. మాట్లాడితే లాక్కొని వెళ్ళిపోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెడితే ప్రభుత్వానికి 30 శాతం మాత్రమే భారం.. అది కూడా పెట్టలేకపోయారు.అప్పులే సంపద సృష్టి..చిత్తశుద్ధి, కమిట్మెంట్, చేద్దామనే ఉద్దేశ్యం కూడా లేదు. 93వేల కోట్లు 10 నెలల కాలంలో అప్పులు చేశారు.. మార్క్ఫెడ్ నుండి 13వేల కోట్లు అప్పులు చేశారు. సత్యదూరమైన మాటలు, కించపరిచే మాటలు, ఏం మాట్లాడకపోయిన మధ్యలో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. 25వేల కోట్లు బకాయిలు, ఐఆర్, పీఆర్సీ ఇస్తామని చెప్పారు.. ఒక్కటీ అమలు చేయలేదు. జీతాలు కూడా ఒకటో తేదీన పడడం లేదు. సంపద సృష్టి చేస్తామని ఎక్కడ చేస్తున్నారు.చెత్తపన్ను రద్దు చేశారు.. కానీ చెత్త ఎత్తడం లేదు. 80 వేల టన్నులు చెత్త పేరుకుపోయింది. రైతుల సమస్యలపై మాట్లాడితే భరించే పరిస్థితి లేదు. కూటమి సభ్యుల మాదిరిగా అనుకూలంగా మాట్లాడాలి.. భజన చేయాలి అనుకొంటున్నారు. సభలో జరిగిన తీరును ఖండిస్తున్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి మేము ఉండాలి. కోటి 15లక్షల లబ్ధిదారులు ఉంటే 85 లక్షల మందికి కేటాయించారు. వాళ్ళు చెప్పిన అప్పులు అన్ని కూడా కూటమి ప్రభుత్వం లో చేసిందే. మా ప్రభుత్వ హయంలో 59వేల కోట్లు అత్యధికంగా చేసింది. పది నెలల కాలంలో లక్ష కోట్లు అప్పులు చేశారు. మేము విధ్వంసం చేస్తే అప్పు ఎలా పుట్టింది?. ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలపైనే మేము ప్రశ్నిస్తున్నాం’ అని తెలిపారు. -
మద్యాపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు
-
ఏపీ అసెంబ్లీ: బెల్టు షాపులపై వాడీవేడి చర్చ.. బొత్స కౌంటర్
AP Assembly Sessions Updates..👉ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో పలు అంశాలపై అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ నేతలు. ఈరోజు సమావేశాల్లో భాగంగా మద్యం బెల్టు షాపులపై చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర అంగీకరించారు.శాసన మండలి..మండలిలో మద్యం బెల్టు షాపులపై వాడి వేడి చర్చమద్యం బెల్టు షాపులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వరుదు కల్యాణి, తోట త్రిమూర్తులు ఆగ్రహం 👉ఎమ్మెల్సీ బొత్స కామెంట్స్..గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టబట్టే మద్యం అమ్మకాలు తగ్గాయిమరి ఈ పది నెలల కాలంలో ఎందుకు కేసులు పెట్టలేదుగతంలో ఉన్న బ్రాండ్లే ఇప్పుడూ అమ్ముతున్నారుఆ బ్రాండ్లను ఎందుకు బ్యాన్ చేయలేదు?సభలో మాట్లాడటానికి మాకు హక్కు లేదని మంత్రి అచ్చెన్న మాట్లాడటం సరికాదుఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెచ్చారుమద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది ఎవరు?.సతివాడలోని ఒక బెల్ట్ షాపును 50 లక్షలకు వేలం పాడారురాత్రి 9 నుంచి ఉదయం 10 వరకూ అమ్ముకోవడానికి వేలం పెట్టారు👉ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మద్యం బెల్టు షాపులు వల్ల మహిళలపై నేరాలు పెరుగుతున్నాయిమద్యం అమ్మకాలు బెల్టు షాపులు వల్ల విపరీతంగా పెరిగాయిచంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు 18 శాతం, బీర్ల అమ్మకాలు 40 శాతం పెరిగాయిస్కూల్స్, కాలేజీల దగ్గర లోనే బెల్టు షాపులు పెట్టారుబెల్టు షాపులు పెడితే 5 లక్షలు జరిమానా అన్నారు.మరి ఎంత మందికి వేశారు?బెల్టు షాపులు పెడితే మద్యం షాపులు రద్దు చేస్తామన్నారు..ఎన్ని లైసెన్స్ లు రద్దు చేశారు?.👉ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్సీఎం చంద్రబాబు బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తాం అన్నారుఎంతమందికి బెల్టు తీశారు చెప్పండిమద్యం బెల్టు షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఐదు లక్షల ఫైన్ వేస్తామన్నారుఎన్ని బెల్టు షాపులకు ఐదు లక్షలు ఫైన్ వేశారుఎన్ని బెల్ట్ షాపులు మూయించారు 👉పీడీఎఫ్ ఎమ్మెల్సీ, ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలలో ప్రభుత్వం ఉందిమద్యాన్ని నియంత్రించాలని ఆలోచన చేయడం లేదు -
రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు
-
బొత్స Vs అచ్చెన్న: ‘రైతు భరోసా కేంద్రాలకు తాళం వేయలేదా?’
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, చంద్రబాబు రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదని ఘాటు విమర్శలు చేశారు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. రైతులకు మంచి జరగాలన్నదే వైఎస్సార్సీపీ డిమాండ్ అని తెలిపారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవపై మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, బొత్స మాట్లాడుతూ..‘వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు సరైనవి కాదు. ప్రతీ అంశానికి ఆవు కథ చెప్పడం అలవాటైపోయింది. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇస్తున్నారో చెప్పమని మేం అడిగాం. రైతుల సమస్యలపై చర్చించమని బీఏసీ మీటింగ్లో మేం కోరాం. రైతుల పట్ల మాకు అంకితభావం ఉంది.గత ఐదేళ్లలో రైతులకు మేం చేసిన మేలును నీతి ఆయోగ్ మెచ్చుకుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ వ్యవసాయ విధానాలు పాటించాలని సూచించింది. రైతుకు, వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతీ అంశాన్ని రైతు భరోసా కేంద్రంలో మేం అందుబాటులో ఉంచాం. కావాలంటే రికార్డులు చూసుకోండి. రైతుభరోసా కేంద్రాలకు ఈ ప్రభుత్వం తాళాలేసింది. గత ఐదేళ్లలో రైతులకు మేం ఏమీ చేయలేదని రివ్యూ చేసి నిరూపించండి.మేం మొత్తం 53 లక్షల మందికి రైతుభరోసా అందించాం. అంత మందికీ మీరు ఇస్తామన్నారు.. ఆ మాటకు కట్టుబడి ఉండండి. బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా రైతులకు సాయం చేయండి.. మేం కోరుకునేది కూడా అదే. రైతులకు మంచి జరగాలన్నదే మా డిమాండ్. రైతుకు ఇన్స్యూరెన్స్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇవ్వండి. 2014-19లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదు?. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. అధికార పార్టీ సభ్యుల వైఖరిని నిరసిస్తూ ఈ ప్రశ్నకు సభనుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. -
మండలిలో బొత్స ప్రశ్నలకు చేతులెత్తేసిన లోకేష్
-
ఇవిగో ఆధారాలు.. విచారణకు ఆదేశించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల మూకుమ్మడి రాజీనామాలపై శాసన మండలి మరోసారి అట్టుడుకింది. వీసీల రాజీనామాలపై విచారణకు మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేయడంతో ఆధారాలిస్తే విచారణ జరిపిస్తామని ఇటీవల విద్యా శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. బెదిరింపులు, మౌఖిక ఆదేశాలతోనే వీసీలు రాజీనామా చేశారని వైఎస్సార్సీపీ మంగళవారం సభలో ఆధారాలు సమర్పించి.. ‘ఇవిగో ఆధారాలు.. చిత్తుశుద్ధి, ధైర్యం ఉంటే నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేయడంతో అధికారపక్షం కంగుతింది. మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘వీసీలను ఉన్నత విద్యా మండలి నుంచి బెదిరించి రాజీనామా చేయమని చెప్పారనడానికి ఆధారాలిస్తున్నాం. వీసీల కార్యాలయాలకు వెళ్లి ఎలా దౌర్జన్యం చేశారో వీడియోలు కూడా ఇస్తున్నాం. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. వారు తప్పు చేయలేదని అనుకుంటే విచారణకు ఆదేశించాలి. కథలు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేయొద్దు’ అని సూటిగా డిమాండ్ చేశారు. దీనికి మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. బెదిరించి, భయపెట్టి రాజీనామాలు చేయించినట్టు ఎక్కడా వీసీల రాజీనామా పత్రాల్లో లేదని చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై తాము ప్రవేశపెడుతున్న ప్రివిలేజ్ మోషన్ను స్వీకరించాలని మండలి చైర్మన్ను కోరారు. గత ప్రభుత్వంలోనూ వీసీలు రాజీనామా చేశారంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తాము ఉన్నత విద్యావంతులను వీసీలుగా నియమించామని, అంతర్జాతీయ వర్సిటీల నుంచి కూడా ఏపీ వర్సిటీల్లో వీసీల పోస్టులకు క్యూ కడుతున్నారంటూ గొప్పలు చెప్పుకొన్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖను ఏటీఎంగా వాడుకున్నారని లోకేశ్ అనడంతో బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉన్నత విద్యా మండలి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలతోనే వీసీలు రాజీనామాలు చేసినట్టు తామూ చెప్పామని, అందుకే విచారణ అడుగుతున్నామని బొత్స అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటిది జరగలేదని చెప్పారు. వారు చెబుతున్నట్టుగానే 2014 నుంచి వీసీల రాజీమాలపై విచారణ చేయాలని బొత్స డిమాండ్ చేశారు.మీ నియామకాల్లో తప్పులతోనే రాజీనామా!2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం వీసీల నియామకాల్లో తప్పులు చేసిందని, వాటిని కోర్టులు తప్పుపట్టాయని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 2019 జూలై 15న కోర్టు ఆదేశాలివ్వడంతో కొందరు వీసీలు రాజీనామా చేశారని, మరికొందరు చేయలేదని వివరించారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నర్ నియమించిన వీసీలను రాజీనామా చేయమని చెప్పే హక్కును ఉన్నత విద్యా మండలి అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 4 రోజుల్లోనే 17 మంది వీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయలేకపోతున్నారని నిలదీశారు.లోకేశ్ నోటి దురుసు!వీసీల రాజీనామాలపై ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేశ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. వ్యక్తిగత విమర్శలు, సభలో లేని మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ‘సాక్షి’లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా విచారణ చేస్తామని బుకాయించారు. ఇంగ్లిష్ రాని వారిని వీసీలుగా నియమించారని హేళన చేశారు. చివరికి మంత్రి లోకేశ్ సమాధానం చెప్పకుండానే చైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు.విచారణపై ప్రభుత్వం తోకముడిచింది: బొత్స రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణ జరిపిస్తామని సవాల్ చేసిన ప్రభుత్వం.. మండలిలో తాము ఆధారాలు చూపగానే తోక ముడిచిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన అసెంబ్లీ బయట మాట్లాడుతూ.. ఆధారాలు చూపిస్తే విచారణకు సిద్ధమంటూ సవాల్ చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడెందుకు వెనక్కి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నియమించిన వీసీలను రాజీనామా చేయాలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. తాము సభలో సమర్పించిన ఆధారాలకు సమాధానం చెప్పలేక లోకేశ్ దబాయింపులు, బుకాయింపులు, దూషణలకు తెగబడ్డాని చెప్పారు. న్యాయ విచారణపై ఎందుకంత భయమని అన్నారు. వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించడం మొత్తం విద్యా వ్యవస్థకే కళంకమని చెప్పారు. -
ప్రభుత్వం తప్పు లేకుంటే విచారణ చేయాలి : బొత్స
-
ఆధారాలు ఇచ్చాం.. ‘కూటమి’ తోక ముడిచింది: బొత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణకు సవాల్ చేసిన ప్రభుత్వం తీరా మండలిలో ఆధారాలు చూపగానే తోకముడిచిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ వీసీలతో బలవతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలపై విచారణకు సిద్దమంటూ సవాల్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపగానే ఎందుకు వెనక్కివెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఎక్కడా, ఎప్పుడూ ఇలా వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించిన ఘటనలు లేవని అన్నారు.బొత్స ఇంకా ఆయన ఏమన్నారంటే..గవర్నర్ నియమించిన విసిలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఏ విధంగా రాజీనామాలు చేయమని ఆదేశిస్తారు? ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. తీరా సభలో అన్ని వివరాలను ముందుంచడంతో, దానిపై సమాధానం చెప్పలేక దబాయింపులు, బుకాయింపులకు దిగారు. పరుష పదజాలంతో దూషణలకు తెగబడ్డారు. వీసీలు తప్పు చేస్తే విచారించండి, వారిపై చర్యలు తీసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మారగానే వైస్ ఛాన్సలర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం దారుణం. ఇది మొత్తం విద్యా వ్యవస్థకే కళంకంపోలవరం ఎత్తు తగ్గింపుపై వివరణ ఇవ్వాలిపోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. ఈ ప్రాజెక్ట్ను 45.72 మీటర్లతో నిర్మించిప్పుడే విద్యుత్ ఉత్పత్తి, విశాఖ స్టీల్ ప్లాంట్కు నీరు, ఉత్తరాంధ్రకు తాగునీరు అందుతాయి. కానీ ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. కానీ చంద్రబాబు మాత్రం తన స్వలాభం కోసం కాంట్రాక్టర్ల కోసం తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకున్నారు. చివరికి పోలవరం ఎత్తుపైన కూడా చంద్రబాబు రాజీ పడుతున్నారు. రికార్డులను పరిశీలిస్తే ఇందులో వాస్తవాలు బయటపడతాయి. దీనిపై వివరణ ఇవ్వాలని మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై సూటిగా సమాధానం రాలేదు. పోలవరం ఎత్తును తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని అర్థమవుతోంది. వైఎస్సార్సీపీగా దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.చేనేత కార్మికులను మోసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేనేత కార్మికులను గాలికి వదిలేసింది. దీనిపై మండలిలో ప్రశ్నిస్తే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారంటూ మాపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. బీసీల గురించి మాట్లాడితే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తారా? చేనేత కార్మికుల కోసం రూ.వెయ్యి కోట్ల నిధిని పెడతానని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. 2019-24 మధ్య వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.960 కోట్లు నేతన్నలకు ఇచ్చాం. రూ.1396 కోట్లు వారి పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అంటూ అంకెల గారడీతో ప్రచారం చేసుకుంటోంది. తమకు అనుకూలమైన మాధ్యమాల్లో లేనిది ఉన్నట్లుగా చాటుకుంటోంది. బలహీనవర్గాల విషయంలో న్యాయం చేయకపోగా వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..సంక్షోభంలో ఉన్న విద్యుత్ డిస్కామ్ లు వాటిని కాపాడటానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 47వేల కోట్లు ఖర్చు పెట్టింది. ట్రూఅప్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన రూ.15 వేల కోట్ల ప్రభారాన్ని ప్రభుత్వమే భరించాలి. 2014-19 లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పుల్లో కనీసం మూడోవంతు కూడా మా హయాంలో చేయలేదు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. కూటమి నిలబెట్టిన అభ్యర్ధులకు మేం వ్యతిరేకమని మాత్రమే చెప్పాం. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. రిగ్గింగ్లు, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగంతో కూటమి అభ్యర్ధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఉత్తరాంధ్రలో రఘువర్మ తమ అభ్యర్థి అంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనక బదులు గెలిచిన శ్రీనివాసులు నాయుడిని తమ అభ్యర్థి అంటూ చెప్పుకోవడం దారుణం. ఎవరికో పుట్టిన పిల్లవాడిని తమ కొడుకు అని చెప్పుకుంటున్నట్లుగా ఉంది. -
మండలిలో లోకేష్ను ఏకిపారేసిన బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చుక్కలు చూపించారు. ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై సభలో చర్చ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలతో సహా ప్రశ్నించడంతో మంత్రి లోకేష్ సైలెంట్ అయ్యారు. శాసనమండలి వేదికగా ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై నేడు సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్పించారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ..‘వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి. 17 మంది వీసాలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.మరోవైపు.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..‘మూకుమ్మడిగా నాలుగు రోజుల్లో 17 మంది ఎందుకు రాజీనామా చేశారు. ఒకే సారి అంత మంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ ఎదురుదాడికి దిగారు. దీంతో, మండలి చైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు. -
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా? లేదా : బొత్స
-
AP Assembly: పోలవరంపై చర్చ.. టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో పోలవరంపై చర్చ జరిగింది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా? లేదా? అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘సభలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వాళ్ల(కూటమి నేతలు) గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్లే సమాధానాలు చెప్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? మాకు స్పష్టమైన సమాధానం చెప్పండి. మీరు చెప్పే సమాధానాల్నే మేము ప్రశ్నిస్తున్నాం. పోలవరం అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పోలవరం గురించి మాట్లాడాలంటే వైఎస్సార్సీపీనే మాట్లాడాలన్నారు. దీనికి సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. -
ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025 అప్డేట్స్.. సమావేశాల్లో భాగంగా కూటమి హామీల ఎగవేతను, అరాచక పాలనను, గత ప్రభుత్వంపై చేస్తున్న విషప్రచారాన్ని శాసన మండలిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్సీపీ 👉 శాసన మండలి రేపటికి వాయిదావీసీల బలవంతపు రాజీనామాలపై చర్చ..వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలు ఇస్తే విచారణ చేస్తామని గతంలో మంత్రి లోకేష్ ప్రకటనసభకు ఆధారాలను అందజేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై విచారణ జరిపించాలని డిమాండ్చేనేతపై చర్చ..చేనేత రంగానికి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని కోరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుసమాధానం దాటవేస్తూ వైఎస్సార్సీపీపై మంత్రి సవిత విమర్శలుబొత్స సత్యనారాయణను మాట్లాడకుండా అడుగడుగునా అడ్డుపడిన టీడీపీ సభ్యులువైఎస్ జగన్ నేతన్న ద్రోహి అంటూ తీవ్ర విమర్శ చేసిన మంత్రి సవితమంత్రి సవిత వ్యాఖ్యలపై బొత్స ఫైర్శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కామెంట్స్గత 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతలను మోసం చేసిందినేతతన్నలకు రుణమాఫీ చేస్తామని చేయలేదుచేనేతల సమస్యలపై అధ్యయనం చేస్తామని చేయలేదు.1000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తామని ఇవ్వలేదు.వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకానికి 969 కోట్లు ఇచ్చాం.మేము తప్పు మాట్లాడితే మాపై చర్యలు తీసుకోవచ్చు.మా సభ్యులు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పటం లేదుచేనేతల వ్యవహారంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం.దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా?ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాలిపనిచేసే చోట మహిళలు అనేక వేధింపులకు గురవుతున్నారుదిశ యాప్ ఉంటే ఎంతో ఉపయోగపడేదిదిశ యాప్ను కొనసాగిస్తారా లేదా?దిశ యాప్ స్థానంలో మరొక యాప్ తీసుకొస్తారా లేదా సమాధానం చెప్పాలి.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కామెంట్స్.. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రశ్నోత్తరాలుఛార్జీలు పెంచబోమని చెప్పి యూనిట్ పై 2 రూపాయలు భారం వేశారుసర్దుబాటు ఛార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలు భారం వేశారుగత టీడీపీ ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది2014 నుంచి 19 వరకూ 13 వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే2019 నుంచి 24 వరకూ 47 వేల కోట్ల రూపాయల సబ్సిడీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం భరించిందిరేట్లు పెంచకుండా ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే భరించాలిఉన్నదానిని తగ్గిస్తామని మాటిచ్చారుఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..విద్యుత్ చార్జీలు పెంచమని టీడీపీ రకరకాలుగా ప్రచారాలు చేసిందిట్రూ అప్ తో పాటు సర్దుబాటు ఛార్జీలు.. టైమ్ ఆఫ్ ది డే ఛార్జ్ పేరుతో వసూలు చేస్తున్నారుమీరిచ్చిన మాటేంటి.. ఇప్పుడు మీరు చేస్తున్నదేంటిటారిఫ్, సర్ధుబాటు, ట్రూ అప్ ఛార్జీలు పెంచుతున్నారా.. ఇది మాటతప్పడం కాదా? YSRCP ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభంమండలి లో వైస్సార్ర్సీపీ వాయిదా తీర్మానంనిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై చర్చించాలని శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చిన YSRCP ఎమ్మెల్సీ లుఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ కేలండర్ హామీ ఇచ్చిన కూటమి9 నెలలు కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్ పూర్తి కాని వైనంమెగా డీస్సీపైనా జాప్యం ఏది విధ్వంసం.. ఎవరిది విధ్వంసం?అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలుఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలు అధికారంలోకి వచ్చాక ఎప్పటిలాగే చెత్తబుట్టకు చేరిన మేనిఫెస్టో పైగా గత ప్రభుత్వ విధ్వంసం అంటూ ప్రజల్లో కాలకూట విషం నింపే ప్రయత్నం ఏడు పోర్టులు నిర్మించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయడం విధ్వంసమా? ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవడమే విధ్వంసమా? కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.32వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక వసతులు కల్పించడం విధ్వంసమా? నవరత్నాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.2.70 లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాలకు నేరుగా జమ చేయడం విధ్వంసమా?ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి ధాన్యం సేకరణ వరకు సేవలు అందించడం విధ్వంసమా?ఏకంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మాణం చేపట్టడం విధ్వంసమా? 2.36 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే అందించడం విధ్వంసమా?.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బడ్జెట్లో కోతలు పెట్టిన చంద్రబాబు చేసేది విధ్వంసమా? ఎవరిది విధ్వంసం? ఎవరు విధ్వంసకారుడు? ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారో అనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారు.జగన్ది ప్రగతి రథం.. బాబుదే విధ్వంసం:::కూటమి తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు నిప్పులుఇదీ చదవండి: సీఎం పదవిలో ఉన్నవాళ్లెవరైనా అలా మాట్లాడతారా? -
అవి సీఎం పదవిలో ఉన్న వారు మాట్లాడే మాటలేనా?
సాక్షి, అమరావతి: రెండ్రోజుల క్రితం సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు పర్యటనలో మాట్లాడిన మాటలు సోమవారం శాసనమండలిలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే వ్యవస్థలే సిగ్గుపడాలి అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తలకు చిన్న పనిచేసి పెట్టినా ఊరుకునేది లేదు. అది అధికారులైన సరే ప్రజాప్రతినిధులైన సరే. వైఎస్సార్సీపీ వాళ్లకు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ ఉపకారమూ చెయ్యొద్దు.వాళ్లకు ఉపకారం చేస్తే పాముకు పాలుపోసినట్లే..’ అంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మండలి’లో సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొడుతున్న సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. ‘మా ప్రభుత్వంలో మా సీఎం ఎప్పుడు మా పార్టీ వాడికే సహాయం చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే ఈ వ్యవస్థ సిగ్గుపడాలి.లబ్ధిదారులకు పార్టీలు అంటగడతారా? అర్హులందరికీ ప్రతి పథకం దక్కేలా చూడాల్సిన బాధ్యత గలవారు.. రాజ్యాంగబద్ధంగా, రాగద్వేషాలకు, పార్టీలకతీతంగా, కార్యక్రమాలు చేస్తామని చెప్పాల్సిన వారు మాట్లాడే మాటలేనా ఇవి? పార్టీ మీటింగ్లో సీఎం మాటలు వైరల్ అవుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదా. మంత్రిని (అచ్చెన్నాయుడ్ని ఉద్దేశించి) కోరుతున్నా.. లబ్ధిదారుల విషయంలో రాజకీయాలు ఉండకూడదని చెప్పండి. ఇదేమన్నా మన సొంత ఆస్థా? ప్రజల డబ్బు, వారి మద్దతుతో ప్రభుత్వాలను నడుపుతున్నాం. సీఎం ఆ మాటలు ఎలా మాట్లాడతారు? గత ఐదేళ్లూ రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలతో సంబంధంలేకుండా, అర్హులందరికీ సాయం చేశాం.అంతేగానీ.. పార్టీల గురించి ఆలోచించలేదు’ అంటూ బొత్స మాట్లాడారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. తమ ప్రభుత్వానికి పేదలే ప్రాతిపదిక అని చెప్పారు. అర్హులెవరికైనా పథకాలు అందకపోతే, అది తమ దృష్టికి తీసుకొస్తే వారికీ ఇస్తామన్నారు. బొత్స మళ్లీ జోక్యం చేసుకుంటూ.. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు వారి మాటలా? లేక పార్టీ తరఫున లేదా సీఎం తరఫున మాట్లాడుతున్నారా స్పష్టం చేయాలన్నారు.దీనిపై అచ్చెన్నాయుడు మళ్లీ వివరణ ఇస్తూ.. తాను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు.. టీడీపీ తరఫున కాదు.. ఎన్డీయే ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నా అని చెప్పగా బొత్స మళ్లీ స్పందిస్తూ.. అయితే, సీఎం మాటలు అబద్ధమా అని ప్రశ్నించారు. ఇంతలో మండలి చైర్మన్ మరో మంత్రి పార్థసారథికి అవకాశం ఇవ్వడంతో ఈ అంశానికి అక్కడితో బ్రేక్ పడింది. అనంతరం.. మీడియా పాయింట్ వద్ద కూడా బొత్స మాట్లాడారు.అమరావతిపై ఒక విధానం లేదుఅమరావతి రాజధాని విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదని, 2014–19 మధ్య ఇదే టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లకు పైగా అవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లే ఖర్చుచేసిందని.. పైగా అవి తాత్కాలిక భవనాలని చెప్పారని, ఇప్పుడు శాశ్వత భవనాలంటూ టెండర్లు పిలిచారని శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.బడ్జెట్పై చర్చ సందర్భంగా సోమవారం ‘మండలి’లో టీడీపీ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బొత్స మంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని స్మశానం అన్నారంటూ విమర్శించారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాజధానిని చూడటానికి రావాలని కొందరు కోరడంతో.. అమరావతి నిర్మాణానికి నాటి టీడీపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లతో భవనాలు కట్టారని, అంతకుమించి అక్కడ చూడడానికి ఏం అభివృద్ధి జరిగిందని మాత్రమే అన్నానని బదులిచ్చారు.వాస్తవానికి.. అమరావతిలో కట్టింది తాత్కాలిక భవనాలేనని అప్పటి టీడీపీ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిందని, పైగా దానికి కూడా ఏకంగా అడుగుకి ఏకంగా రూ.10,500 వెచ్చించారన్నారు. ఇప్పుడు మళ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఇది చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు తంతు కాదు కదా అని బొత్స ఎద్దేవా చేశారు. అవి తాత్కాలికమని చెప్పలేదుమంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ఇవి తాత్కాలిక భవనాలు అని తామెక్కడా చెప్పలేదని, కొత్తగా శాశ్వత భవనాలు కట్టేవరకు వీటిని వాడుకుంటామని మాత్రమే చెప్పామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని వదిలేశారని, విశాఖ రుషికొండ నిర్మాణాల్లో ఎంతో దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. రుషికొండ కాంట్రాక్టర్కు వేరే పనులకు సంబంధించిన బిల్లులు ఇచ్చామన్నారు.ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ.. అప్పట్లో మూడు రాజధానులనేది తమ ప్రభుత్వ విధానంగా తీసుకున్నామని.. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పామన్నారు. వాస్తవాలను మరుగుపరిచి మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్నారని విమర్శించారు. రుషికొండలో నిర్మించిన భవనాలు ఎవరివని.. ప్రభుత్వానికి ఆ భవనాలను వాడుకోవడం చేతగాక విమర్శలు ఎందుకని బొత్స ప్రశ్నించారు.రుషికొండలో టూరిజానికి చెందిన పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించామని, అందులో అవినీతి, అక్రమాలు అంటూ గగ్గోలు పెట్టిన ఇప్పుడా కాంట్రాక్టర్కు బిల్లులు ఎలా చెల్లించారని కూడా ఆయన నిలదీశారు. ఇదే విషయం వారి గెజిట్ వచ్చిందని.. అంటే రుషికొండ నిర్మాణాలు సక్రమమే కదా అని అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతామని బొత్స ఘాటుగా బదులిచ్చారు. -
కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ టీచర్లు బాగా బుద్ది చెప్పారు: బొత్స
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు.కూటమి ప్రభుత్వ ఓటమిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు.ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి టీడీపీ, జనసేన,బీజేపీ కూటమికి చెంపదెబ్బ. టీడీపీ,జనసేన కూటమి పార్టీలకు చావుదెబ్బ తగిలింది. ఎల్లవేళలా మోసం పనిచేయదని తేలిపోయింది. అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన,బీజేపీ సహా కూటమి పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు గట్టి గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు.ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేశారు. చంద్రబాబు చేసిన మోసాలను తిప్పికొడుతూ ఇవాళ గట్టి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖపట్నం..మూడు జిల్లాల నుంచి టీచర్లు పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేసింది’అని వ్యాఖ్యానించారు. -
సీఎం చంద్రబాబుపై బొత్స ధ్వజం
-
అచ్చెన్నాయుడుకు కౌంటర్ ఇచ్చిన బొత్స సత్యనారాయణ
-
శాసన మండలిలో అధికారపక్షం కుప్పిగంతులు : బొత్స ధ్వజం
సాక్షి,విజయవాడ: దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.‘దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదు. రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారు? అని ప్రశ్నించారు. రుషికొండ నిర్మాణలపై విచారణకు సిద్ధం ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. శాసన మండలిలో అధికారపక్షం కుప్పిగంతులేసింది. సచివాలయ భవనాలపై మంత్రి అచ్చెన్నాయుడికి క్లారిటీ లేదు. తాత్కాలిక భవనాలు అని ఎప్పుడూ చెప్పలేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అలాంటప్పుడు కొత్తగా నిర్మాణాలకు టెండర్లు పిలవడమెందుకు. వైఎస్సార్సీపీ వాళ్లకు పనిచేయొద్దని ముఖ్యమంత్రి ఎలా చెబుతారంటే సమాధానం లేదు. చంద్రబాబు మాదిరి ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. లబ్ధిదారుల్లో పార్టీలు చూడటమేంటి.రుషికొండ భవనాల్లో అక్రమాలు జరిగితే ఎందుకు బిల్లులు చెల్లించారు.నిజంగా అవినీతి జరిగితే ఎంక్వైరీ వేయండి. రాజధాని కోసం సుమారు మూడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రాజధానికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. బడ్జెట్ పై చర్చను డైవర్ట్ చేయడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నం చేశారు.ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయాల్సిన అవసరం మాకేంటి. అధికారంలో ఉన్నది వాళ్లా..మేమా. ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుంది కూటమి నేతల తీరు’అని మండిపడ్డారు. -
దోపిడీ జరిగిందన్నారు.. మరి బిల్లులెందుకు చెల్లించారు?: బొత్స
అమరావతి, సాక్షి: రుషికొండ భవనాలపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చ రేగింది. నిర్మాణాలపై అడ్డగోలు ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఆపై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమిని నిలదీశారు. రుషికొండ భవనాలు వాడుకోకపోవటం ప్రభుత్వం చేతకానితనం. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే రూ. 80 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించారు?. తప్పు జరిగిందని చెప్పినప్పుడు చెల్లింపులు చేయడం ఎందుకు? అని బొత్స ప్రశ్నించారు. రుషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగుంటే విచారణకు చేయించండి. తప్పు జరిగినపుడు ఎందుకు విచారణకు జంకుతున్నారు. మేం సభలో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. మేము ఏదైతే మాట్లాడతామో దానికే కట్టుబడి ఉంటాం అని అన్నారాయన. అయితే.. బొత్స ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించింది రుషికొండ నిర్మాణాలకు కాదని, వేరే పనులకు అని చెప్పారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన పనులకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని ఆరోపించారాయన. -
నా పేరు ఎత్తారు కనుకనే... బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
వైఎస్ జగన్ ఆ మాట ఏనాడూ చెప్పలేదు: బొత్స
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. .. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. ఇదిలా ఉంటే.. సాక్షి టీవీ సహా నాలుగు ఛానెల్స్కు మండలి లైవ్ ప్రసారాలను సమాచార శాఖ నిలిపివేయడం గమనార్హం.మండలిలో అచ్చెన్న vs బొత్సమంత్రి అచ్చెన్నాయుడు👇2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందిగత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదుకట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసు..కేంద్రం డబ్బులతోనే కథ నడిపారురాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం.మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి?విపక్ష నేత బొత్స సత్యనారాయణ👉🏼.. 2014 - 19 ఇళ్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం. అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు. కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో ఇవ్వలేదని చెప్పటం సరికాదు. గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని మా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. .. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాల పై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. .. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం. -
Botsa Satyanarayana: ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్ డకౌట్
-
‘కూటమి’ వంచన.. బడ్జెట్పై వైఎస్సార్సీపీ రియాక్షన్
సాక్షి, అమరావతి: బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు’’ అని బొత్స నిలదీశారు.‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆత్మ స్తుతి, పరనిందాగానే బడ్జెట్ సాగింది. గత ప్రభుత్వాన్ని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్ని పొగడడం తప్ప ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదు. షూరిటీ కాదు.. ప్రజల మోసం అనాలి. మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలి.. కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు. ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదు. 50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘అన్నదాత సుఖీభవ ఇస్తే రూ.12 వేల కోట్లు కావాలి. మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదు. ఉచిత బస్సు మాట లేదు.. ఉలుకు పలుకే లేదు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో 3వేల కోట్లు మార్కేట్ ఇంటర్వెన్షన్ కోసం పెడితే.. ఇప్పుడు సున్నా తీసేసి 300 కోట్లు పెట్టారు. మిర్చి రైతుల సమస్య పై పోరాటం చేస్తే జగన్పై కేసు పెట్టారు. ఒక్కో కిలో, ఒక్క క్వింటా, ఒక్క బస్తా అయినా కొన్నారా?. ఎంతసేపు పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ పై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా. ప్రజలనిమాటలతో గారడి చేసి మోసం చేసే బడ్జెట్ ఇది.’’ అంటూ బొత్స ధ్వజమెత్తారు.అంకెలే తప్ప అభివృద్ధి కానరాలేదు: ఎమ్మెల్సీ రవిబాబుచంద్రబాబు, లోకేష్ ని పొగిదేందుకే సరిపోయింది. వెనుక బడిన తరగతుల అభివృద్ధి కి కేటాయింపులు లేవు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారు. నిరుద్యోగులకు 3వేల హామీ బడ్జెట్లో లేదు. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేకుండా సంపద సృష్టి అంటే కేవలం మోసం చేయడమే.బడ్జెట్ పేరుతో మోసం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణిఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మోసం చేశారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ అమలు చేయలేదు. మహాశక్తికి కేటాయింపులే లేవు. నిరుద్యోగులను రూపాయి కూడా కేటాయింపు చేయకుండా నిట్టనిలువునా ముంచారు. 12 వేల కోట్లు తల్లికి వందనంకి కావాలి.. కానీ కేటాయింపులు అరకొరగా కేటాయించారు. రైతుల్ని మోసం చేశారు. కోటి 55 లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే.. 95లక్షల కి కుదించారు..4వేల కోట్లు అవసరం ఐయితే రెండున్నర వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, లోకేష్ని పొగడడం పనిగా పెట్టుకున్నారు. లోకేష్ని పోగిడే దానిపై పెట్టిన శ్రద్ధ.. బడ్జెట్పై పెడితే బాగుండేది. బడ్జెట్పై చర్చలో హామీల అమలు గురించి ఒత్తిడి తీసుకొస్తాంబడ్జెట్పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిఆడబిడ్డ నిధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. వైఎస్ జగన్ ఐఆర్ ప్రకటించడంతో ఉద్యోగులను హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఒక్క ఐఆర్ కూడా ప్రకటించలేదు. మెగా డీఎస్సీ అన్నారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5 లక్షల మంది కోచింగ్స్ తీసుకొంటున్నారు. నిరుద్యోగ భృతి గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బడ్జెట్పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం.. వీసీలు 17 మందిని బలవంతంగా రాజీనామాలు చేయించారు. అన్ని ఆధారాలు బయట పెడతాం.. ఉన్నత విద్య మండలిలో తప్పులపై ఎంక్వయిరీ చేయిస్తాం.అంకెల గారడీ మాత్రమే: ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో పేదలకు ఒరిగేదేమీ లేదు. లక్ష కోట్ల అప్పులు తెచ్చిన మీరు అవి ఏం చేశారో చెప్పాలి. తల్లికి వందనం లో కోత పెట్టారు. చేనేతలను ఆదుకునే ఒక్క పథకం లేదు. గృహ నిర్మాణ కేటాయింపులు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం మోసం చేసింది. గట్టిగా అడిగితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కేసులు పెడుతున్నారు’’ అని బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. -
దశ, దిశ లేకుండా గవర్నర్ ప్రసంగం
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంలో దశ, దిశ లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. మంగళవారం శాసన మండలి సమావేశాల నుంచి వాకౌట్ చేసిన తరువాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. గవర్నర్తో రాజకీయ విమర్శలు, గత ప్రభుత్వ విధ్వంసం వంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేయించడం దారుణమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా 2047 నాటికి అమలు చేయబోయే సూపర్ టెన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. అంటే ఇప్పుడు చెప్పిన సూపర్ సిక్స్కు నీళ్లొదిలినట్లేనని వారు చెబుతున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. శాసన సభలోని రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు అధికార పక్షంగా ఉన్నాయని, మిగిలింది వైఎస్సార్సీపీనే కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామని తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజున సభకు హాజరైనా లెక్కకు రాదన్న వాదనలను తాము పట్టించుకోవడం లేదని తెలిపారు. తాము హాజరు కోసం సభకు రాలేదని, తమకున్న హక్కును గవర్నర్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే అసెంబ్లీకి వచ్చామని చెప్పారు. స్పీకర్ పిలిచి అడిగినా ఇదే చెబుతామన్నారు. తమది రాజకీయ పార్టీ అని, అన్ని అంశాలపైనా సందర్భం, సమయాన్ని బట్టి తయారుగా ఉంటామన్నారు.వీసీల మూకుమ్మడి రాజీనామాలపై విచారణ జరగాలికూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు (వీసీలు) అందరితో మూకుమ్మడిగా చేయించిన రాజీనామాలపై విచారణ జరగాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. వీసీలను అధికార బలంతో బెదిరించి రాజీనామాలు చేయించి, వారికి నచ్చిన వారితో భర్తీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై సభలోనే విద్యా శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పామన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించామని అన్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని బొత్స మండిపడ్డారు. వారి ఆందోళనలను పరిశీలిస్తామని, న్యాయం చేస్తామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా చెప్పినా, న్యాయం జరగలేదన్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని సీఎం కార్యాలయం నుంచి లేఖ పంపినా ఏపీపీఎస్సీ ఖాతరు చేయలేదని వారే చెప్పారని అన్నారు. సీఎం కార్యాలయం లేఖకే విలువ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవమానం కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తోట త్రిమూర్తులు, కపిలవాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
లోకేష్ వ్యాఖ్యలకు బొత్స దిమ్మతిరిగే కౌంటర్
-
మంత్రి నారా లోకేష్పై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు.మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.‘‘రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశలేదు .. మీడియాతో బొత్సగవర్నర్ ప్రసంగంలో దశ లేదు.. దిశలేదు.. ఓ క్లారిటీ లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్లో బొత్స మీడియాతో మాట్లాడారు. గవర్నర్ చాలా శ్రమించి ప్రసంగం కొనసాగించారు. ఆయన ప్రసంగంలో దశలేదు.. దిశలేదు. ఓ క్లారిటీ లేదు. సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేసిన వ్యక్తితో అబద్దాలు, అసత్యాలు చెప్పించారు.19 మంది వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. వీసీలు తమ రాజీనామాల లేఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ నుండి ఫోన్స్ వచ్చాయని, అందుకే రాజీనామా చేశామని పేర్కొన్నారు. వీసీలు రాజీనామాలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశాం.. వేస్తామన్నారు. తర్వాత మాట మార్చారు. 19 మంది వీసీల రాజీనామా లేఖల్ని బయట పెట్టాలి. ఒకేసారి అంతమంది వీసీలు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి.. మారుతుంటాయి. అది వ్యవస్థ.. దాన్ని మార్చితే ఎలా?ప్రజా వ్యతిరేక, ప్రజలకు మేలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. సందర్భం, సమయం కానీ అంశాలు సభలో మాట్లాడం సమంజసం కాదు. విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతున్నారు. మంత్రి లోకేష్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. గ్రూప్ 2 మెయిన్స్పై లోకేష్ ట్వీట్ చేశారు.. మేం మా అభిప్రాయం చెప్పాం. వాకౌట్ చేయడానికి రెండు కారణాలు.ప్రసంగంలో దశ ,దిశ లేదు. గవర్నర్తో విధ్వంసం అనే మాట మాట్లాడించొచ్చా? మాట్లాడిన దాంట్లో కూడా అద్భుతాలు ఉన్నాయా అంటే అది లేదు.2047కి సూపర్ టెండర్ అంట..అంటే సూపర్ సిక్స్ పోయిందా?’ అని ప్రశ్నించారు. -
హోదా ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా.. చట్టసభలో ప్రజల గళాన్ని వినిపించనివ్వకుండా చేయాలనే కుట్రతో కూటమి సర్కారు వ్యవహరిస్తోందని విపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టి.చంద్రశేఖర్, వరుదు కళ్యాణి బయట మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పాలనా వైఫల్యాలను చట్టసభ సాక్షిగా నిలదీస్తారనే భయంతోనే కూటమి సర్కారు ఇలాంటి దుర్మార్గ పోకడలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.ప్రజా గొంతుక వినిపించడానికి వీల్లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న ఏౖకైక విపక్షం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సభ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యారు. ఆయన వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.సభలో ఉన్నవి రెండే పక్షాలు: బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో ప్రతిపక్షనేతరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజల వాణిని వినిపించేది, వారి కష్టాలపై ఎలుగెత్తేది ప్రతిపక్షమే. అలాంటి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సభలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు... మరొకటి ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్సీపీ. సభలో మేం ఒక్కరమే విపక్షంలో ఉన్నాం కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం.మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాల గురించి సభలో ప్రస్తావించాం. వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డు వద్దకు వెళ్లిన తరువాతే ఈ ప్రభుత్వం మేలుకుని రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. అయినా నేటికీ మిర్చి కొనుగోళ్లు చేయడం లేదు. కేంద్రం స్పందించాలని, కేంద్రమే కొనుగోలు చేయాలని అంటున్నారు. మార్క్ఫెడ్ ద్వారా మిర్చి ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఇటువంటి అంశాలపై మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి. అప్పుడే మాకు తగినంత సమయం లభిస్తుంది. మిర్చి రైతులను కలిసిన మా నాయకుడిపై కేసులు పెట్టారు.మ్యూజికల్ నైట్ కోసం హంగూ ఆర్భాటంగా వెళ్లిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు లేవు. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా మాకు సరైన సమయం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు. నేటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ కేటాయింపులు లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సర్కారు వైఖరిని ఎండగడుతూ ప్రజల సమస్యలను మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం.ప్రభుత్వ వైఫల్యాలను చొక్కా పట్టుకుని నిలదీస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఇబ్బందుల్లో ఉన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ జోక్యంతో ఆదుకోకుండా కేంద్రం ఎప్పుడో కొనుగోలు చేస్తుందని మిర్చి రైతులను గాలికి వదిలేయడం సరికాదు. అప్పటి వరకు రైతులు తట్టుకునే పరిస్థితిలో లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పించవద్దు. ప్రభుత్వం వెంటనే దీనిపై ఆలోచన చేయాలనేది మా డిమాండ్. అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై ప్రభుత్వ ప్రతిస్పందన చూసి నిర్ణయం తీసుకుంటాం.సభలో నిలదీస్తామనే భయంతోనే: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిటీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ బురద చల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ప్రజల గళాన్ని వినిపిస్తుందనే భయంతోనే వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్ సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలి. ఇప్పటికే దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం.వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని గవర్నర్ని కోరాం. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశాం. దేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చాం. గతంలో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే తాలిబన్ల పాలనలో కేవలం అధికార పక్షం మాత్రమే పని చేస్తుంది. ప్రతిపక్షం లేకుండా టీడీపీ మన రాష్ట్రంలో తాలిబన్ పాలన సాగిస్తోంది. దేశంలో మరెక్కడా లేదు: వరుదు కళ్యాణి ఎమ్మెల్సీరాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. సభలో మూడు పార్టీలు అధికార పక్షంగానే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రతిపక్షం. కాబట్టి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ఒక్క ఏపీ మినహా దేశంలో ఎక్కడా ఇలా లేదు. గతంలో ఢిల్లీలో బీజేపీ తరఫున కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలను ఎక్కడ సభలో నిలదీస్తారోననే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.కూటమి పాలన చూశాక ఇటువంటి పార్టీలకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారు. ప్రతిపక్ష హోదాపై కోర్టులో పిటిషన్ వేస్తే స్పీకర్ కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం దారుణం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? వైఎస్సార్ సీపీకి అప్పు రత్న అవార్డు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబుకు అంతకంటే గొప్ప బిరుదు ఏం ఇవ్వాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి.11 మందిని ఎదుర్కొనే సత్తా లేదా?పదకొండు మందిని ప్రతిపక్షంగా ఎదుర్కొనే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదా? ప్రజలు వైఎస్సార్ సీపీకి 41 శాతం ఓట్ షేర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో మా గళం వినిపించేందుకు తగిన సమయం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. తమ వైఫల్యాలను సభలో ఎండగడతారనే భయంతో ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీని గుర్తించేందుకు నిరాకరిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదా? అధికార మదంతో ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్కు లేదా? ప్రజాస్వామిక విలువలను కాపాడి ప్రజల పక్షాల పాలన సాగేలా ఆయన చొరవ తీసుకోవాలి. కూటమి సర్కారు నిరంకుశ పాలనకు పరాకాష్ట నాలుగు మీడియా సంస్థలను నిషేధించడం. దేశ చరిత్రలో నోటీస్ ఇవ్వకుండా నాలుగు చానెళ్లను బహిష్కరించిన ఘటనలు ఎప్పుడూ లేవు. – ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్విపక్షం వాకౌట్చట్ట సభలో ప్రజల గొంతుక వినిపించాలంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందేనని పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పట్టుబట్టారు. శాసనసభ సభలోకి గవర్నర్ ప్రవేశించి ప్రసంగిస్తుండగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో సేవ్ డెమోక్రసీ.. ఉయ్ వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించండి... అంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ.. మోసం, బాదుడు గ్యారంటీ!మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. ధరల బాదుడు గ్యారంటీ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనలను పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్ చేసింది. వైఎస్ జగన్ వెంట నినాదాలు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి నిష్క్రమించారు. -
ఏబిఎన్ రిపోర్టర్ కు బొత్స స్ట్రాంగ్ పంచ్
-
‘ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం’
సాక్షి, విశాఖపట్నం: గ్రూపు–2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకవైపు పరీక్ష వాయిదా వేయిస్తున్నామని చెప్పి.. మరో వైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ‘అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు విద్యా శాఖ మంత్రి లోకేశ్ శుక్రవారం ట్వీట్ చేశారు. తాము వాయిదా వేయమనే చెప్పామంటూ సీఎం పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఆడియోను ప్రజలంతా విన్నారు. గ్రూప్–2 పరీక్ష వాయిదా అంటూ వార్తలు వేసిన ఛానెళ్ల మీద కేసులు పెట్టారు.ఇంత అయోమయం, గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు. చివరిదాకా వాయిదా వేస్తున్నామని నమ్మించి ఈ ప్రభుత్వం గ్రూప్–2 అభ్యర్థులను మోసం చేసింది. ప్రభుత్వ వైఖరిని, ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతటి గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. సీఎం వెంటనే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించి పరీక్ష వాయిదా వేయాలి. అభ్యర్థుల ఆందోళనపై స్పష్టతనిచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. -
ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది: Botsa
-
‘మద్దతు ధర ఆలోచన అప్పుడే ఎందుకు చేయలేదు?’
విశాఖ : మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నెలల క్రితమే ఎందుకు చేయలేదని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మిర్చి రైతులను పరామర్శించే వరకూ మీరు స్పందించ లేదంటే ఏమనుకోవాలని బొత్స నిలదీశారు.‘కేంద్ర మంత్రి ఢిల్లీ లో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చెప్పడం ఎంత వరకు సమంజసం. వైఎస్ జగన్మోహన్రెడ్డి మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసింది. మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన రెండు నెలల క్రితమే ఎందుకు చేయలేదు..రైతులు, వ్యవసాయం దండగ అనే భావన చంద్రబాబు మనసులో ఇంకా పోలేదు. మిర్చి రైతులను కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లడం ఇల్లీగల్ యాక్టివిటీ అయితే అట్టహాసంగా విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్ లీగల్ అవుతుందా...? .విశాఖలో జరిగిన భూ కుంభకోణాల పై విచారణ నివేదికల ను బహిర్గతం చెయ్యాలి. బురదజల్లడం కాదు ఆరోపణలు నిరూపించాలి...ఆ బాధ్యత ప్రభుత్వానిదే. జెడ్ కేటగిరీలో వున్నమాజీ ముఖ్యమంత్రి భద్రత ఎందుకు కుదిరించారు అని గవర్నర్ ఆశ్చర్య పోయారు. జగన్ భద్రత తనకు సంబంధం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి.....మిర్చి యార్డ్ సందర్శనకు వెల్లడం ఇల్లీగల్ అని ఎలా చెబుతారు’ అని బొత్స సూటిగా ప్రశ్నించారు. -
షర్మిల వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
-
జగన్ ను ఇబ్బందిపెట్టాలని ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు: బొత్స
-
కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు: బొత్స
విజయవాడ, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎంగా వైఎస్ జగన్(YS Jagan Security) కు జెడ్ ఫస్ల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది. మా ఆందోళనను గవర్నర్కు తెలియజేశాం. ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరాం. మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. .. చట్టం తను పని తాను చేసుకునేలా చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు. జగన్ను ఇబ్బందిట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు. మా హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా?’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స నిలదీశారు. ఎన్నికల కోడ్ల్లే భద్రతల్పించలేకపోయామన్న ప్రభుత్వ వాదనను బొత్స తప్పుబట్టారు. జెడ్ ఫ్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ఎన్నికల కోడ్తో సంబంధం లేదని అన్నారాయన. ఒకవేళ, ఎన్నికల కోడ్ ఉంటే జడ్ ప్లస్ భద్రత కల్పించడం కుదరదు అని ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?. ఇదే ఎన్నికల కోడ్ విజయవాడలో జరిగిన సంగీత విభావరీ సందర్బంగా ఎందుకు అమలు చేయలేదు? రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మిర్చియార్డ్ కు వైయస్ జగన్ వెడితే ఎన్నికల కోడ్ పేరుతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు అని బొత్స మండిపడ్డారు. దయనీయంగా రాష్ట్ర రైతాంగంవైఎస్సార్సీపీ హయాంలో రైతులకు మేలు జరగలేదన్న కూటమి నేతల ఆరోపణలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. దాదాపు రూ.20 వేలు ఉన్న క్వింటా మిర్చి నేడు రూ.10 వేల దిగువకు పడిపోయింది. రైతులకు అండగా ఉండేందుకు వెడితే దానిని రాజకీయం చేస్తారా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుభరోసాను క్రమం తప్పకుండా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయ్యింది. రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చింది కూడా రైతులకు ఇవ్వలేదు. ఆర్బీకేల ద్వారా మా హయంలో విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఉన్నాం. నేడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. నేడు దళారీలు రైతులను దోచుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదని.. వీటన్నింటి వల్ల రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.బాబు వక్రబుద్ధి బయటపడింది: మేకపాటివైఎస్ జగన్ భద్రతా వ్యవహారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు తన వక్ర బుద్దిని బయట పెడుతున్నారని మండిపడ్డారాయన. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము భద్రత ఇవ్వకపోయి ఉంటే.. అయన కనీసం బయట తిరిగే వారు కాదు. జెడ్ ఫ్లస్ కేటగిరి ఉన్న ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యింది. జగన్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అయన క్రేజ్ తగ్గదు. దేశ రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నేత జగన్. -
కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలవడం లేదు
-
బాబూ.. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పుకుంటారు?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్ట్ను ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే, కూటమి సర్కార్ పాలనపై సెటైర్లు వేశారు. ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్సీ బొత్స(Botsa Satyanarayana) విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదు. ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఒకొక్క డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం లేదు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు. విద్యార్థులు తల్లిదండ్రులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై శాసన మండలిలో నిలదీస్తాం.వైఎస్సార్సీపీ హయాంలో చిత్తశుద్ధితో హామీలు అమలు చేశాం. వైఎస్ జగన్ మాటలతో పరిపాలన చేయలేదు. చేతలతో పరిపాలన చేశారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాలు అందించారు. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పి బతుకుతారు. కూటమి పాలనలో ఏ తప్పు జరిగినా వైఎస్సార్సీపీపై తోసేస్తున్నారు. ఇష్టారీతిన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. హైకోర్టు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వేసిన సీట్ నివేదికను విడుదల చేయాలి. ఫ్రీ హోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయన్న కూటమి నేతలు ఎప్పుడు వాటిని బయటపెడతారు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు పెంచుతున్నారు. కూటమి సర్కార్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు’ అంటూ కామెంట్స్ చేశారు. -
టీడీపీకి చట్టం అంటే గౌరవం లేదు: బొత్స సత్యనారాయణ
-
కూటమి నేతలది అభద్రతాభావం: బొత్స సత్యనారాయణ
సాక్షి,తాడేపల్లి:టీడీపీకి చట్టం అంటే గౌరవం లేదని,వాళ్ళు చేసిందే చట్టం అనుకుంటున్నారని మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లిలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.‘తిరుపతి లో మా వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు అద్దాలు పగులగొట్టారు. పోలీసులు ఎన్నికలను పట్టించుకోలేదు. కోరం ఉంటే ఎన్నిక వాయిదా పడేది కాదు. చట్టాన్ని చేతిలో తీసుకొని అన్యాయంగా గెలవాలని చూస్తున్నారు. టీడీపీ కూటమికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వచ్చాయి. అయినా సరే చిన్న పదవుల కోసం తాపత్రయ పడుతున్నారు.మేయర్,డిప్యూటీ మేయర్ పదవులు ఉంటే ఏంటి..లేక పోతే ఏంటి..? ఎన్నికలు పెట్టడం ఎందుకు. నామినేటెడ్ చేసుకుంటే సరిపోయేది.కూటమికి ఎన్నికల్లో అన్ని సీట్లు వచ్చినా ఇంకా అభద్రతా భావంతోనే ఉన్నారు.ముద్రగడ ఇంటిపైనా దాడి జరిగింది.పోలీసు వ్యవస్థ అంటే భయం లేక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.ఎన్నికల కమిషన్ నిస్సహాయ స్థితిలో ఉంది’అని బొత్స అన్నారు. -
16 మంది ఎంపీలున్నా టీడీపీ నిధులు సాధించడంలో విఫలమైంది
-
టీడీపీ ప్రయోజనాలు వేరు.. ఏపీ అవసరాలు వేరు: బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాలు వేరు అనేది స్పష్టమైందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బడ్జెట్ సందర్భంగా గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్తో బీహార్ ప్రయోజనం పొందిందని తెలిపారు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది అంటూ ఆవేదన వ్యకం చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘బడ్జెట్లో రాష్ట్రానికి ఏదో కేటాయిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. మహాకవి గురజాడ పేరును తలుచుకోవడం మనందరికీ గర్వకారణం. గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్లో రాష్ట్రానికి నిరాశ, నిస్పృహ కనిపించాయి. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనమేమీ రాష్ట్రానికి కనిపించలేదు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు ఆత్మ ఘోష మిగిలింది.కేంద్రంలో 12 మంది నితీష్ కుమార్ ఎంపీలు, 16 మంది టీడీపీ ఎంపీల సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది. బడ్జెట్తో బీహార్ రాష్ట్రం ప్రయోజనం పొందింది. ఏపీకి ఎటువంటి ప్రయోజనం పొందలేదు. రాష్ట్రంలో టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాల వేరు అనేది స్పష్టమైంది. 45.72 మీటర్లు నుంచి 41.15 మీటర్ల ఎత్తుకు కుదిస్తూ నిధులు కేటాయించడం బాధాకరం. పోలవరం ఎత్తు తగ్గించడం వలన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది.మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము. పోలవరం ఎత్తు తగ్గించడం తీవ్ర అభ్యంతరకరం. ప్రత్యేక హోదాను కాదని ప్యాకేజీని చంద్రబాబు తీసుకున్నారు. నేడు అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నష్టం జరిగేలా చర్యలు ఉండకూడదు. కూటమి పాలనలో కంటే వైఎస్ జగన్ పాలనలో జీడీపీ, వృద్ధిరేటు అభివృద్ధి ఎక్కువగా జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?. ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసు అన్నారు. ఎన్నికల తర్వాత డబ్బు సంపాదించడం ఎలాగో నా చెవిలో చెప్పాలని చంద్రబాబు చెప్పడం ధర్మమా.?స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు ఎందుకు చెప్పలేక పోయారు. ప్లాంట్పై బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు. రైతుభరోసా, అమ్మఒడి ఇవ్వలేదు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. చంద్రబాబు ఇచ్చే హామీలు సాధ్యం కాదని ముందే వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. వైఎస్ జగన్ పాలనలో ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం అనేక సార్లు సంప్రదింపులు జరిపాము. వైఎస్ జగన్ వలనే ప్రైవేటీకరణ అగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి స్వయంగా చెప్పారు అని గుర్తు చేశారు. -
‘పవన్.. బాబు సూపర్ సిక్స్కు గ్యారంటీ నువ్వే కదా’
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడని వ్యాఖ్యలు చేశారు. అలాగే, అప్పులు చేసి కూడా పేదలకు చంద్రబాబు పథకాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరుతో మోసం చేసిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రజల నిలదీయాలని పిలుపునిచ్చారు.అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నేడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజ గుణం. చెప్పింది చెయ్యడం.. చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజ గుణం. ఎన్నికలకు ముందు ఒక్క అబద్దం చెప్పడానికి కూడా జగన్ ఒప్పుకోలేదు.. హామీల అమలు కోసం అడిగితే మొన్నే అధికారంలోకి వచ్చాం అంటున్నారు. మరి మొన్నే అధికారంలోకి వచ్చిన మీరు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు ఎలా తీసుకొచ్చారు?. బల్క్ డ్రగ్ పార్క్ ఎలా తీసుకొచ్చారు?. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చాం అంటారా?. ప్రాజెక్టులు మాత్రం మేమే తీసుకొచ్చాం అంటారా?. ఇదెక్కడి న్యాయం’ అని ప్రశ్నించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీ లక్కు.. అంబటి రాంబాబు అంటే వైఎస్సార్సీపీలో కిక్కు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడు. మోసం చేసిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి. నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు. అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందని నూకాంభిక అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ కావాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి చేసిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది.రాష్ట్రంలో వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది వైఎస్ జగన్. వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు మంచి జరిగింది. కానీ, పార్టీకి కేడర్కు మధ్య గ్యాప్ పెరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకర్తల ద్వారానే అన్ని సేవలు అందుతాయి. ఇది పార్టీ మాటగా హామీ ఇస్తున్నాను. అన్ని వైఎస్ జగన్ను ప్రజలు ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు మంచిగా బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కి డబ్బులు వేయలేకపోతున్నాడు. ప్రజలకు రెండు లక్షల 80వేల కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని జగన్ నిర్ణయించారు. ఓటమి నుంచే పట్టుదల పెరుగుతుంది. ఎనిమిది నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం లేదు. చంద్రబాబు సూపర్ సిక్స్కు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన భార్య, కొడుకు ఒప్పుకునేలా లేరు. వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడానికి లోకేష్ ఒక్కడు చాలు. లోకేష్కు దండం పెట్టిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు’ అని కామెంట్స్ చేశారు. -
ముద్దాయిలకు 4 లక్షల చెక్కులు ఇదేనా మీ ప్రభుత్వ సంస్కారం బొత్స సూటి ప్రశ్న
-
మొన్న విజయవాడ.. నిన్న తిరుపతి బాబుపై బొత్స ఫైర్
-
రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి ఐదు లక్షలా?: బొత్స
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వం హామీల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి.. అది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట మానవ తప్పిదమే అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాలి. హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిందే. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలు. విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట ఇవ్వన్నీ.. మానవ తప్పిదాలే. రాష్ట్రంలో పేద విద్యార్థికి ఇంగ్లీష్ వద్దా? సంపన్నులకే ఇంగ్లీష్ మీడియమా? అని ప్రశ్నించారు.ఇదే సమయంలో.. మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన (తల నరికిన) కేసులో నిందితుడి(ఏ2)గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆరోజు ఘటన జరిగినప్పుడు మా ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్టు మీరు భావించి ఉంటే, మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది. తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా, ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయనిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు. నిందితుడిని డబ్బులివ్వడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?.బహుమానంగా ఇచ్చారా?ఈ ఘటన జరిగినప్పుడు దేవుడు మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన మీరు నానా హంగామా చేసి.. అదే కేసులో నిందితుడికి సాయం చేయడం చూస్తుంటే.. ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనలో రాజకీయంగా టీడీపీకి మేలు చేసినందుకు బహుమానంగా ఇచ్చారా?. ఒకవేళ అదే జరిగితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మాత్రం గుర్తుంచుకోవాలి. వారెందుకు నోరు మెదపడం లేదు?:ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్, హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేసుకునే బీజేపీ ఏం చేస్తున్నాయి?. వారెందుకు నోరు మెదపడం లేదు?. ప్రభుత్వ చర్యను వారెలా సమర్థిస్తున్నారు?.ప్యాకేజీ మతలబ్ ప్రైవేటీకరణ..విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ, ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్యాకేజీ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు. అందుకే ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఏ ఒక్కరూ చెప్పడం లేదు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని, కేంద్ర హోంమంత్రితో ఆ మాట చెప్పించకపోవడం వెనుక మతలబ్ కూడా ప్రైవేటీకరణ చేయడమేనని స్పష్టంగా తెలుస్తోంది. కూటమి నాయకుల అబద్ధపు హామీలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఎవ్వరినీ వదలకుండా అందరినీ కూటమి నాయకులు వంచించారు’ అని కామెంట్స్ చేశారు. -
కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స ఆగ్రహం
-
స్టీల్ ప్లాంట్ను ఏం చేస్తారో చెప్పండి: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:స్టీల్ప్లాంట్కు కేంద్రం ఇటీవల ఇచ్చిన ప్యాకేజీపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం(జనవరి19) బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టంగా ఎందుకు చెప్పలేదు. దీపం పథకంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి కుమార్ స్వామి చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పట్లో ఆపడం వల్లే ప్రైవేటీకరణ జరగలేదని ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రధాని,అమిత్షా, సీఎం చంద్రబాబు ప్రయివేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేదు. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్పై ముసుగులో గుద్దులాట వద్దు.మీ వైఖరి స్పష్టంగా చెప్పాలి. ఇచ్చే 11 వేల కోట్లకు ఎన్నో షరతులు పెట్టారు. ప్యాకేజీ వెనుక ఏదో మతలబు ఉంది.కోట్లాది మంది వచ్చిన కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తిరుపతి సంఘటనపై కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చెయ్యాలి. సొంతగా గనులు కేటాయించాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. లేదంటే కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తాం.మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం. కేంద్రహోం మంత్రి వస్తే రాష్ర్ట ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఏమి చేస్తున్నాడు అని మట్లాడుకుంటున్నారా. రుషి కొండ భవనాల కోసం డిన్నర్ మీటింగ్ పెట్టరా. వైఎస్ జగన్కు ఎన్ని బెడ్ రూములు, ఎన్ని బాత్ రూములు ఉన్నాయన్న దాని మీద చర్చిస్తారా. రాష్ట్రానికి ఇదేం ఖర్మ. చంద్రబాబు ప్రచారం కోసం దుబారా ఖర్చులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చుకుంటారో వారి ఇష్టం’అని బొత్స అన్నారు. -
ఇప్పుడు ఏ దీక్ష చేస్తావ్? ఎవరు చేస్తారు? పవన్ కళ్యాణ్ కు బొత్స అదిరిపోయే కౌంటర్
-
పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి: బొత్స
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ((Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు. టీటీడీ ఛైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపంతోనే ఘటన జరిగిందని పత్రికలు, డిప్యూటీ సీఎం చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తులు ప్రాణాలు తిరిగి రావని, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ కోరారు.బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే..:ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవదేవుడి దర్శన టోకెన్ల కోసం వచ్చిన భక్తుల్లో ఆరుగురు చనిపోయిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగానే తొక్కిసలాట జరిగి ఆరు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 40 మంది క్షతగాత్రులయ్యారు. భక్తులు చనిపోవడం దైవ నిర్ణయం అంటూ.. ఈ దుర్ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించిన తీరు మరింత బాధ కలిగించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు ఇచ్చే కార్యక్రమం విషయంలో ప్రభుత్వం, టీటీడీ అధికారులు కనీసం రివ్యూ మీటింగ్ నిర్వహించి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు. 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్న సీఎం చంద్రబాబు కానీ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా టికెట్ల పంపిణీపై కార్యక్రమంపై సమీక్ష చేసి ఉండాల్సింది.హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి:ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరిగినట్టు కాదు. ఏపీ హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గత రెండు రోజులుగా పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకుని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ జరపాలి. తిరుమల దేవస్థానం విశిష్టతను కాపాడాలన్నా, భక్తుల్లో ఉన్న అభద్రతను పోగొట్టాలన్నా పటిష్టమైన విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పవన్కళ్యాణ్ క్షమించమని చెప్పినంత మాత్రాన సరిపోదు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తున్నారో చెప్పాలి.ఆ ఇద్దరిపై ఏ చర్యలుండవా?:టీటీడీ ఛైర్మన్, ఈవోల మధ్య సమన్వయం లేదని, క్షతగాత్రుల పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి ఎదుటే వారిద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారని టీడీపీ అనుకూల పత్రిక బ్యానర్ వార్త ప్రచురించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయం చెప్పారు. కానీ వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?. తొమ్మిది కేంద్రాల్లో దర్శనం టికెట్ల పంపిణీ చేపడితే మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక సంఘటనలోనే డీఎస్పీని బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. మూడు చోట్ల జరిగిన తొక్కిసలాటల్లో 40 మంది వరకు క్షతగాత్రులయ్యారు. మరో కౌంటర్లో ఒకరు చనిపోయారు. వాటి విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. ఎవరిది బాధ్యత?:పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే తప్పు అన్నట్టు నిన్న చంద్రబాబు చెప్పడం, తమ ప్రభుత్వ చేతకానితనాన్ని ఒప్పుకోవడమే. వైఎస్సార్సీపీ హయాంలో నిర్వహించినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. భక్తులు ప్రశాంతంగా దేవదేవుణ్ని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావుడి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడెందుకు క్షమాపణలు చెప్పేసి ఊరుకున్నారు. టీటీడీ ఛైర్మన్, ఈఓ ప్రెస్మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని ఆయన చెబుతున్నాడు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన వారు చేసిన పాపం కరిగిపోతుందా, పోయిన భక్తుల ప్రాణాలు తిరిగొస్తాయా?. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవోలలో ఎవరు బాధ్యత వహిస్తారు?.పరామర్శకు వెళితే క్షుద్ర రాజకీయాలు:తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ఆ కుటుంబాలకు అండగా నిలవాలని మా నాయకుడు శ్రీ వైయస్ జగన్ బయలుదేరితే అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. నడిరోడ్డుపై కాన్వాయ్ నిలిపి వేయడంతో, ఆయన కొంత దూరం నడిచి వెళ్లారు. ఆయన ఆస్పత్రికి రాకముందే తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని బలవంతంగా డిశ్చార్జ్ చేయాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ, వారు ప్రతిఘటించడంతో ఏమీ చేయలేకపోయారు.ఇదీ చదవండి: తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు హైడ్రామా: అంబటివైఎస్ జగన్ తొక్కిసలాట బాధితులతో అన్ని వివరాలు ఆరా తీసి, పరామర్శిస్తే.. దానిపైనా విషం చిమ్ముతున్నారు. జగన్ పరామర్శకు వెళితే క్షతగాత్రులకు కవర్లు ఇచ్చి మాట్లాడించారని కూటమి పార్టీలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా? పవిత్ర స్థలంలో అపశృతి జరిగినప్పుడు చింతించాల్సింది పోయి ఇంతలా దిగజారిపోయి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ హర్షించరు. ప్రమాదం జరిగినప్పుడల్లా అధికారులను బాధ్యులను చేస్తూ వారు వైయస్సార్సీపీ అనుకూలురంటూ వ్యాఖ్యలు చేయడం ఫ్యాషనైంది. వారు మీరు నియమించుకున్న అధికారులన్న విషమం మర్చిపోవద్దు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగింది
-
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..
-
ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బొత్స
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం వేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మండిపడ్డారు. పోరుబాటలో పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల హామీలను చంద్రబాబు(chandrababu) వెంటనే అమలు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది. ఇప్పటివరకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల్లోనే 74 వేల కోట్లు అప్పులు చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి 15 వేల కోట్లు అప్పు చేశారు. మొత్తంగా ఈ ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేసింది. సంక్షేమ పథకాలు ఇవ్వకుండానే 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమయ్యారా?. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’ అని బొత్స చెప్పారు.పోరుబాట విజయవంతం:ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైయస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు.ప్రభుత్వంలో చలనం లేదు:పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతుల తరపున కూడా ఆందోళన చేపట్టి వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం కళ్లబొల్లి మాటలతో కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏడు నెలల్లో లక్ష కోట్లు:ఎన్నికలకు మందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని తెలుగుదేశం పార్టీ బాకా పట్టుకుని అబద్దాలు ప్రచారం చేసిందని బొత్స ఆక్షేపించారు. వైయస్సార్సీపీ హయాంలో అన్ని రకాల అప్పులు కలుపుకున్నా రూ.6 లక్షల కోట్లు మించలేదని.. అయినా రూ.14 లక్షల కోట్లు అప్పు అని విపరీతంగా దుష్ప్రచారం చేయడాన్ని తప్పు బట్టారు.మరో వైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు తిరక్క ముందే దాదాపు రూ.74 వేల కోట్లు అప్పు చేసిందన్న బొత్స.. అవీ కాకుండా మార్క్ ఫెడ్, సివిల్ సఫ్లైస్, ఏపీఎండీసి వంటి కార్పొరేషన్ల నుంచి కూడా అప్పులు చేస్తున్నారని వెల్లడించారు. వీటికి అదనంగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15 వేల కోట్ల అప్పులు కలుపుకుంటే, ఇప్పటికే కూటమి ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని గుర్తు చేశారు. ఆ రోజు వైఎస్సార్సీపీ అప్పులు చేసినా, అందులో కీలక భాగం ప్రజలకు పంచిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. వివిధ పథకాల ద్వారా ఆ 5 ఏళ్లలో ఏకంగా రూ.2.74 లక్షల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.మరి ఈ అప్పు అంతా ఏమైంది?:ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిన లక్ష కోట్ల అప్పు ఏం చేశారని మాజీ మంత్రి నిలదీశారు. పెన్షన్ రూ.1000 పెంచినా, ఇప్పటికే వాటిలో 3 లక్షలు కోత పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా, యూనిట్ విద్యుత్కు పేదవాడి మీద రూ.1.20 అదనపు భారం వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు ఉచితంగా ఇస్తున్న 200 యూనిట్లు విద్యుత్ కూడా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా గతంలో దశల వారీగా ఇచ్చే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల రిజిష్ట్రేషన్లు కూడా నిలిపివేశారని ఆక్షేపించారు. ఈ విధంగా అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయం చేస్తూ.. తిరిగి ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోయడం అధికార పార్టీకి అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు.ఇప్పటికే లక్ష కోట్ల అప్పు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక్క మంచి కూడా చేయలేదని చెప్పారు. ఈ ఆరు నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం.. ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేయాడనికి సన్నద్ధమయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడుందని నిలదీసిన బొత్స సత్యనారాయణ, సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా? అని ప్రశ్నించారు.అన్నింటా కూటమి ప్రభుత్వం విఫలం:అధికారంలోకి వ్చచిన ఆరునెలల్లోనే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కూటమి ప్రభుత్వం కనీసం కొత్త సంవత్సరంలోనైనా ప్రజలను సుభిక్షంగా ఉంచేలా పాలన చేయాలని హితవు పలికారు. ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు లాంటి చిన్న చిన్న హామీలను కూడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అవగాహన లేకుండానే అన్ని హామీలను ఎలా ఇచ్చారన్న బొత్స.. కేవలం అధికారం కోసమే అబద్దాలు ఆడి ప్రజలను గాలికొదిలేయడం న్యాయమేనా? అని నిలదీశారు.కనీసం డిస్కమ్లకు ఇవ్వాల్సిన డబ్బులైనా ప్రభుత్వం చెల్లించి ఉంటే.. సామాన్యులకు ట్రూఅప్ ఛార్జీల మోత తగ్గేదని చెప్పారు. కానీ, ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్కో వినియోగదారుడి మీద రూ.2 వేల నుంచి రూ.3 వేల భారం పడుతుంటే సామాన్యుడు ఎలా బ్రతుకుతాడని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లులోనూ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని బొత్స గుర్తు చేశారు. ఒకవైపు 24 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెపుతుంటే.. తేమ శాతం ఎక్కువగా ఉందని.. 20 శాతం వరకు డబ్బులు మినహాయించుకుంటున్నారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను కొత్త ఏడాదిలో ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మీడియా అండదండలున్నాయని కల్లిబొల్లి మాటలతో కాలం వెల్లదీయాలని చూస్తే ఎల్లకాలం సాగదని తేల్చి చెప్పారు.మీడియా ప్రశ్నలకు సమాధానంగా..అందులో తప్పేముంది?: విశాఖ విమానాశ్రయంలో తనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలవడంపై మాట్లాడుతూ.. తాను గతంలో లోకేష్ను, పవన్కళ్యాణ్ను కూడా కలిశానన్నారు. అందులో తప్పేముందన్నారు. కేవలం అభద్రతా భావంతో ఉన్న వాళ్లే ఇలాంటి విషయాలకు భయపడి అనవసర రాద్ధాంతం చేస్తారని చెప్పారు. ఈ వివాదాన్ని సృష్టించిన వారే దీనికి సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీ అనుకూల ఛానల్లో ఈ వార్త వచ్చిందన్న బొత్స.. మంత్రి శ్రీనివాస్ మీద ఆ పార్టీలోనే కుట్ర జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.ఫోన్ చేస్తే ఎత్తడం లేదు:డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడంపై బొత్స సత్యనారాయణ విస్మయం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే తొక్క తీస్తానని తరచూ మాట్లాడే పవన్కళ్యాణ్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీన్ని కూడా జగన్గారి ప్రభుత్వ వైఫల్యం అంటారేమోనని ఎద్దేవా చేశారు. డీజీపీ అన్నా, ఆ పదవి అన్నా తనకు చాలా గౌరవమన్న మాజీ మంత్రి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తాను డీజీపీ అన్న విషయాన్ని ప్రస్తుత డీజీపీ మర్చిపోయినట్టున్నారని, అందుకే తాము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు.పవన్ ఆ పని చేస్తే బాగుండేది:ఎంపీడీఓ పై దాడి జరిగిందని పరామర్శకు కడప వెళ్లిన పవన్, అదే జిల్లాలో బీరు బాటిల్ తో టీడీపీ నేతల దాడిలో గాయపడిన చంద్రమౌళి అనే వీఆర్వోనూ కూడా పరామర్శిస్తే బాగుండేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. అందరికీ ఒకటే అని చెప్పుంటే బాగుండేదని సూచించారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చొద్దని బొత్స హితవు పలికారు. సినీ హీరోలను జగన్ నాడు అవమానించారనేది అవగాహన రాహిత్యమన్న మాజీ మంత్రి.. తనను వైఎస్ జగన్, ఎంతో గౌరవించారని చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. -
మన్మోహన్కు వైఎస్సార్సీపీ నేతల నివాళులు..
సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలో మన్మోహన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశం గొప్ప నేతను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఆయన సంస్కరణలు దేశానికి, రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు.విశాఖలో మన్మోహన్ సింగ్ మృతిపై వైఎస్సార్సీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, రవీంద్ర బాబు, కుంభ రవిబాబు, బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, జడ్పీ చైర్మన్ సుభద్ర సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.అనంతరం, బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..‘దేశం గొప్ప నేతను కోల్పోయింది. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. సంస్కరణల వారధి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరం అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘దేశానికి మన్మోహన్ సేవలు మరువలేము. స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా కాపాడారు. ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ..‘ఇండియాను గ్లోబల్ పవర్గా చేసిన ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుంది. అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ గొప్ప దేశ భక్తుడు అని తెలిపారు.కుంభ రవిబాబు మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే అణు ఒప్పందం జరిగింది. గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన తన సంస్కరణలతో మార్చారు అని చెప్పుకొచ్చారు. -
2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధమవ్వాలి: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరాటానికి విశేష స్పందన లభించింది. కూటమికి దోచుకోవడమే కావాలి.. ప్రజలతో సంబంధం లేదన్నారు.విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు , ధర్మశ్రీ, వదురు కళ్యాణి, ఎంపీ తనూజ రాణి, కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్, కాయల వెంకట రెడ్డి, చెంగల వెంకట్రావు, కొండ రాజీవ్, తైనల విజయ కుమార్, చొక్కాకుల వెంకట రావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.అనంతరం, ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషం. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్ళీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరితో కలిసి ముందుకు సాగాలి. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు. నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి.జమిలి ఎన్నికలు వస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది. మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ..‘పార్టీ జిల్లా కార్యాలయం ఎండాడలో ఉంది. నగర పార్టీ కార్యాలయం మద్దిలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నగర కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెడుతుంది. రైతు పోరాటానికి విశేషమైన స్పందన లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైఎస్ జగన్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ఆరు నెలల్లో చంద్రబాబు 72వేల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా సంతోషం. పార్టీ చేసే పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. 27వ తేదీన కరెంట్ చార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమం ఉంది. కూటమికి ప్రజలతో సంబంధం లేదు. మీడియాను పట్టుకొని హడావుడి చేస్తోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.అరకు ఎంపీ తనూజ రాణి మాట్లాడుతూ..అందరం కష్టపడి పని చేద్దాం. వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. కూటమి పాలనలో నిత్యవసర ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ బలం కార్యకర్తలే అని చెప్పారు. -
పార్టీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా బొత్స సెటైర్లే సెటైర్లు
-
Botsa Satyanarayana: చంద్రబాబుకు చట్టం వర్తించదా..?
-
రిపోర్టర్ కి బొత్స దిమ్మతిరిగే కౌంటర్
-
పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ మంత్రి బొత్స
-
ప్రజల తరఫున గొంతెత్తాలి.. సర్కార్పై ఒత్తిడి తేవాలి: బొత్స
సాక్షి, కాకినాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తాం’’ అని బొత్స తెలిపారు. -
రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది
-
ప్రజలకు అర్థమైంది.. బాబు, పవన్కు థ్యాంక్స్: బొత్స
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కంటైనర్ షిప్లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు అని కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్ వర్షాలు కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈనెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తాము. తగ్గిస్తామని చెప్పి కరెంట్ చార్జీలు కూటమి ప్రభుత్వం పెంచింది. ఆరు స్లబ్స్లో చార్జీల భారం ప్రజలపై మోపింది. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి వెంటనే చెల్లించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తాం.కంటైనర్ షిప్లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారు. ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారు. వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషం. సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోం మంత్రికి లేఖల రాస్తాను. లేనిపోని ఆరోపణల కారణంగా దేశం పరువుపోతుంది కదా?. టీడీపీ హయాంలో వేసిన సిట్ బహిర్గతం చేయాలి. ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాలి.చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చూపించారు. నాడు-నేడు ద్వారా స్కూల్స్లో మిగతా పనులను పూర్తి చేస్తామని చెబితే బాగుండేది. ధాన్యం కొనుగోలుపై పరుచూరి బ్రదర్స్లా నాదెండ్ల మనోహర్ మాట్లాడటం సరికాదు, వాస్తవాలు మాట్లాడాలి’ అంటూ సూచనలు చేశారు. -
రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశారు ?: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్నాథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు.యూనిట్కు 1రూపాయి20పైసలు పెంచారు.ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసంఅన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలిప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాంరూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వంఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాంఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాంప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదుపేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారురూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారుప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాంపథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారుమా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారుమీ సోకులకు వాడుకుంటున్నారా..?గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాంప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందిగతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేదిజీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..వ్యాపారాలు ఏమి జరగడం లేదువాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారుదానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటిప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయిబెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారుమా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారుఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నానుపవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించిందిపీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండిఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారుపక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?ఆయన చేతకాని వాడా..?పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండిరెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలిబియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారునిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి.. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించింది
-
డయేరియా బాధితులకు అండగా YSRCP
-
గుర్ల బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్సీపీ.. చెక్కులు అందజేత
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని చెప్పారు.విజయనగరంలోని గుర్ల మండలంలో డయేరియాతో మృతి చెందిన 13 కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ఒక్కొక్కరికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘డయేరియాతో మరణించడం బాధాకరం. అసెంబ్లీలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా సమాధానం చెప్పింది. ప్రభుత్వాన్ని ఎన్ని అడిగినా వాళ్లు సక్రమంగా సమాధానం చెప్పలేదు. సీఎం చంద్రబాబు.. ఎనిమిది మంది అని, డిప్యూటీ సీఎం పది మంది మృతి చెందారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కరే అని చెప్పిందని మండిపడ్డారు.గతంలో నేను ఎప్పుడూ విజయనగరంలో ఇంత మంది డయేరియాతో చనిపోవడం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించడం లేదు. డయేరియా బాధితుల విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. ప్రజల పట్ల బాధ్యత వహించారు. బాధితులకు అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు. గుర్ల మండలానికి మేము వచ్చి చూసే వరకు ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
విశాఖ ఉక్కుపై కూటమిని నిలదీసిన వైఎస్సార్సీపీ
-
సంప్రదాయానికి తూట్లు
సాక్షి, అమరావతి: పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి రాకుండా చేసి శాసనసభ వ్యవహారాల్లో అనాదిగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారు. పారదర్శకత ఉండాలంటే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు ఉండటం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఇవ్వాల్సిన పదవిని కూడా తమ కూటమికే దక్కేలా అన్ని స్థానాలకు తమ సభ్యులతో నామినేషన్లు వేయించి ఎన్నిక జరిగేలా చేశారు. దీంతో శాసనసభ చరిత్రలో తొలిసారి పీఏసీ కమిటీకి ఎన్నిక అనివార్యమైంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులకు అవకాశం ఉండగా.. 9 ఎమ్మెల్యేల తరఫున, మూడు ఎమ్మెల్సీల తరఫున ఎన్నికవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీల తరఫున ఉన్న మూడు స్థానాలకు కేవలం మూడు నామినేషన్లు రావడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 స్థానాలకు 10 నామినేషన్లు దాఖలవడంతో ఎన్నిక తప్పనిసరైంది. 9 స్థానాలకు కూటమి తరఫున 9 నామినేషన్లు, వైఎస్సార్సీపీ తరఫున ఒక నామినేషన్ (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) దాఖలవడంతో శుక్రవారం ఎన్నిక నిర్వహించనున్నారు.ఆనవాయితీకి చెల్లుచీటీపీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్ష పార్టీకి వదిలిపెట్టాలనే సంప్రదాయం పార్లమెంటు నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ కొనసాగుతోంది. అప్పుడే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి వస్తుందని ఈ సంప్రదాయాన్ని తెచ్చారు. ప్రతిపక్షానికి పీఏసీ కేటాయించాలనేది ప్రజాస్వామిక స్ఫూర్తి. కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా, పీఏసీ కూడా వారికి ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రజల గొంతు ఏమాత్రం వినపడకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా తామే చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లే పీఏసీ తీసుకుంటే ఇక ప్రజల తరఫున మాట్లాడేవాళ్లే ఉండరనే దుర్బుద్ధితోనే దాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది. పీఏసీ అనే దానిలోనే పబ్లిక్ అనే పదం ఉంది. అంటే ప్రజలకు సంబంధించిన పదవి అని అర్థం. ప్రతి అంశం పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరిగింది. నామినేషన్ దాఖలులో హైడ్రామా మరోవైపు పీఏసీ సభ్యత్వాలకు వైఎస్సార్సీపీ సభ్యులు నామినేషన్లు వేసే సమయంలోనూ హైడ్రామా నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సివుండగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆ సమయంలో అందుబాటులో లేకుండాపోయారు. పీఏసీ సహా ఇతర రెండు కమిటీల సభ్యత్వాలకు నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు సెక్రటరీ జనరల్ చాంబర్కి వెళ్లారు. కానీ.. ఆ సమయంలో ఆయన కావాలని అసెంబ్లీలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల అధికారి (సెక్రటరీ జనరల్) తన చాంబర్లో అందుబాటులో ఉండాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరొకరిని నియమించాలి. కానీ.. సమయం దాటిపోయే వరకూ నామినేషన్లు తీసుకోకుండా ఉండేందుకే ఆయన దురుద్దేశంతో అసెంబ్లీలో ఉండిపోయినట్టు సమాచారం. గంటన్నరపాటు ఎదురుచూసినా ఆయన రాకపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. సెక్రటరీ జనరల్ దురుద్దేశపూర్వకంగా చాంబర్లోకి రావడంలేదనే విషయం తెలుసుకుని ఆయన కూడా చాంబర్ వద్దకెళ్లారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు తీసుకోకుండా ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న మరో చాంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటంతో ఆయన్ను కూడా ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. దీంతో అచ్చెన్నాయుడు వెంటనే అసెంబ్లీలోకి వెళ్లి సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ను బయటకు పంపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కొద్ది నిమిషాలు ఉందనగా.. సెక్రటరీ జనరల్ హడావుడిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నుంచి నామినేషన్లు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ సభలోనే ఉంటే నామినేషను దాఖలుకు అవకాశం ఇవ్వకుండా చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా చేసి ఉంటే.. 2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి అప్పట్లో ఈ పదవి ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించారు. సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సంప్రదాయాలకు గండిపడింది. -
ఏపీలో సీఎం సంతకానికి కూడా విలువ లేదా : బొత్స
-
పెద్దిరెడ్డి నామినేషన్ టైంలో హైడ్రామా.. బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు. ‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. -
స్టీల్ ప్లాంట్ రచ్చ.. మండలిలో గందరగోళం
-
‘స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు. -
ఏపీ అసెంబ్లీలో తప్పుడు లెక్కలు.. అనవసర ప్రసంగాలు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తప్పుడు లెక్కలతో, అసత్య ఆరోపణలతో, అనవసరమైన ప్రసంగాలతో ఎనిమిదో రోజుకి చేరింది. ఓవైపు వైఎస్సార్సీపీ బహిష్కరణతో శాసనసభ ఏకపక్షంగా నడుస్తుండగా.. శాసనమండలిలోనైనా కనీసం వైఎస్సార్సీపీ అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు పొంతన లేని వివరణలతో నెట్టుకొస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా.. ఇవాళ.. అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది. శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయగా.. దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది. అటు శాసనసభలోనూ చంద్రబాబు సైతం వ్యక్తిగత గొప్పలతో సభలో కాలయాపన చేశారు.ఏపీ అప్పులపై మండలిలో కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని ప్రకటించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 2024 జూన్ నాటికి 4,91,734 కోట్లు బడ్జెట్ అప్పులు ఉన్నాయని, కార్పొరేషన్ ల ద్వారా 1,54,797 కోట్లు అప్పులయ్యాయని అన్నారాయన. అదే టైంలో.. గత ప్రభుత్వం 9 లక్షల 74 వేల కోట్లు చేసిందంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. ఆ వెంటనే..ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘‘ ప్రశ్నోత్తరాల సమయం అంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ, మంత్రి సభలో ఆవు కథ చెప్తున్నారు. అప్పుల పై అన్ని పార్టీల తో కమిటీ వెయ్యండి. అప్పుడు.. ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుస్తాం. అంతే కానీ ఈ ఆరోపణలు సమంజసం కాదు. వాస్తవాలు చెబితే అభ్యంతరం లేదు. మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. మంత్రులు ఏం చెప్తే అది చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలా?’’ బొత్స మండిపడ్డారు.నేను బుడమేరు బాధితుడ్నే: ఎమ్మెల్సీ రుహుళ్లశాసన మండలి బుడమేరు వరదల పై మండలి లో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ.. బుడమేరు కి 4 సార్లు వరద వస్తే 3 సార్లు చంద్రబాబు హయాంలో నే వచ్చింది. బుడమేరు ఆధునికీకరణ కోసం 2014 నుండి 2019 వరకు ఏమైనా ఖర్చు చేశారా?. బుడమేరు వరదల పై కేంద్ర బృందాలు ఎంత నష్టం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసింది, ఎంత ఖర్చు చేశారు..?ఆపరేషన్ బుడమేరు నెల రోజుల్లో ప్రారంభిస్తాం అన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలి?. నష్టపరిహారం సక్రమంగా చేస్తే బాధితులు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రాహుళ్ల ప్రసంగిస్తూ.. నేను కూడా వరద బాధితుడిని. వరద వచ్చేముందు ప్రజలు కనీసం ప్రజలను అప్రమత్తం చెయ్యలేదు. అధికారులు ఏం చేస్తున్నారు. సింగ్ నగర్ ప్రజలను ముంచేశారు. మజీద్ వెళ్లి వచ్చే లోపే మా ప్రాంత ప్రజలంతా ముంపుకి గురయ్యారు అని అన్నారు.అయితే బుడమేరు పరిధిలో ఆంధ్ర జ్యోతి రాధ కృష్ణ పవర్ ప్లాంట్ ఉందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గుర్తు చేశారు.ప్రభుత్వ ఉద్యోగాల లెక్క ఏది?శాసన మండలి.. ప్రభుత్వ ఉద్యోగ ల భర్తీ పై మండలి లో చర్చ జరిగింది. రాష్ట్రంలో మొత్తం శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో చెప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. ‘‘గత ప్రభుత్వం లో లక్ష 34 వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం.2014 నుండి 2019 మధ్య లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలి’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్రంలో అన్ని శాఖల ఖాళీల పై.మదింపు చేస్తున్నాం. ఇంకా ఖాళీల వివరాలు రావాల్సి ఉందన్నారు. వైఎస్సార్సీపీ వాకౌట్శాసన మండలి ట్రూ అప్ చార్జీల భారంపై వాడీవేడీ చర్చ జరిగింది. రాష్ట్ర ప్రజల పై విద్యుత్ చార్జీల భారం వేయం అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ట్రూ అప్ చార్జీలు ఎందుకు పెంచుతున్నారు? అని ఎమ్మెల్సీ రవిబాబు ప్రశ్నించారు. దానికి మంత్రి మంత్రి గొట్టిపాటి రవి సమాధానమిస్తూ.. ఈఆర్సీ ఆమోదించిన మేరకు ట్రూ అప్ చార్జీలు పెంచుతున్నామని చెప్పారు. అయితే..ప్రజలకు చార్జీలు తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఈఆర్సీలో అఫిడవిట్ వెయ్యొచ్చు కదా అని ప్రశ్నించిన బొత్స.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు. ప్రజల పై విద్యుత్ చార్జీలు మోపినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ మండలి నుంచి వాకౌట్ చేసింది.హామీలపై సమీక్షలు జరుపుతున్నాం: చంద్రబాబుగత ప్రభుత్వం అప్పులు.. ఈ ప్రభుత్వానికి సవాల్గా మారాయని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘ఇచ్చిన హామీలపై అనునిత్యం సమీక్షలు జరుపుతున్నాం. ఏదీ రాత్రికి రాత్రే సాధ్యం కాదు’’ అని అన్నారాయన. అలాగే.. అధికారం తనకేం కొత్త కాదని.. సీఎం పదవి అంతకంటే కొత్త కాదని చెబుతూ.. నాలుగోసారి సీఎం కావడం అరుదైన అనుభవమని చెప్పారు. గత ప్రభుత్వమే రోడ్లకు గుంతలు పెట్టి వెళ్లిపోయిందని, దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. పోలవరం గేమ్ ఛేంజర్ అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. బాబు పాలనపై సంతృప్తి: పవన్విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకు ముందు.. ప్రభుత్వ వ్యవస్థలు వెనకబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. చంద్రబాబు 150 రోజుల పాలన సంతృప్తిగా ఉంది. చంద్రబాబు పాలనపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. -
శాసనమండలి నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
-
వాలంటీర్ వ్యవస్థే లేకపోవడం ఏంటి అద్యక్ష.. బొత్స కౌంటర్
-
‘‘వలంటీర్ వ్యవస్థే లేదు’’.. భగ్గుమన్న శాసనమండలి
సాక్షి, అమరావతి: వలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంటలు చేగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల టైంలో వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని లేవనెత్తగా.. ప్రభుత్వం నుంచి దిగ్భ్రాంతికి గురి చేసే సమాధానం వచ్చింది. ‘‘రాష్ట్రంలో వలంటీర్లు పని చేయడం లేదు. అసలు వలంటీర్ వ్యవస్థే లేదు. లేనివ్యవస్థ ను అసలు ఎలా కొనసాగిస్తాం. ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతాం అన్నాం. అసలు కొనసాగించలేదు.. కాబట్టి జీతాలు పెంచం’’ అని ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయులు బదులిచ్చారు. దీంతో మండలిలో మంటలు చెలరేగాయి. మంత్రి సమాధానంపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. ‘‘ఎన్నికల్లో మీరు వలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం. రెన్యూవల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా!’’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.‘‘వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 5 వేలు వేతనాన్ని 10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయ్యాక వాలంటీర్ల ను మోసం చేశారు’’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు.వలంటీర్ వ్యవస్థ విషయంలో వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను దారుణంగా మోసం చేస్తారని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మంత్రి సమాధానంతో ఆ కుట్రే నిజమని తేలింది. -
రుషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్హౌస్లుగానో లేక వేరే విధంగా వినియోగించుకుంటారా... అన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది.ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి భవన్ను నిర్మించారని, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా రుషికొండ భవనాలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకొని వివరణ ఇస్తున్నానని తెలిపారు.మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు వారు రూ.6,500 ఖర్చు చేస్తే, రుషికొండలో ఏకంగా రూ.25,000 ఖర్చు చేశారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స అన్నారు. 2015లో శాసనసభ నిర్మాణానికి ఫర్నిచర్తో కలిపి చదరపు అడుగుకు రూ.14,000 ఖర్చు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భనాలను చూసి తాజ్మహల్ కంటే చాలా బాగున్నాయని పొగిడిన సందర్భాన్ని గుర్తు చేశారు.వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే çసంయమనం పాటించకుండా ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రండి చూసుకుందాం.. దమ్ముంటే రండి... అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈ పదాలను తక్షణం రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అంతకముందు మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయిన మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా.. అంటూ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో వైఎస్సార్సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఎప్పుడిస్తారు?రబీ అయిపోయి ఖరీప్ వచ్చినా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేల నగదు సాయంలో ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ 52 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేటాయించిన రూ.4,500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో కూడా రూ.3,500 కోట్లు పీఎం కిసాన్ కింద ఇచ్చే కేంద్ర నిధులని, కేవలం రూ1,000 కోట్లే రాష్ట్ర నిధులను కేటాయించారన్నారు.కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం విధివిధానాలు తయారు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ–క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అందించి ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు జూలై, ఆగస్టు నెలల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు విమర్శించారు.ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారు?: బొత్సమదనపల్లి ఫైళ్ల దగ్ధంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తప్పు జరిగితే విచారణ చేసి దోషులపై కఠిన చర్య తీసుకోవచ్చని, కానీ విచారణ జరుగుతుండగానే కొంతమంది పేర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ప్రస్తావిస్తారని నిలదీశారు. ఆ పేర్లను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చినజీయర్ స్వామి, ఈషా ఫౌండేషన్లకు చంద్రబాబు ఇచ్చిన విధంగానే వేద పాఠశాల నిర్మాణం కోసం ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. -
Botsa Satya Narayana: కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు
-
మదనపల్లి ఫైల్స్ దగ్ధంపై మండలిలో రగడ
సాక్షి, గుంటూరు: మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై శాసన మండలి ఇవాళ అట్టుడుకింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును మంత్రి అనగాని సత్యకుమార్ ప్రస్తావనవకు తేవడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రికార్డుల నుంచి పెద్దిరెడ్డి తొలగించాల్సిందేనని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు.మంగళవారం ఏడో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. శాసన మండలిలో.. మదనపల్లి ఘటన ప్రస్తావించిన మంత్రి అనగాని.. పెద్దిరెడ్డి పేరు లేవనెత్తారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించడంపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ‘‘కావాలని బురద చల్లే ప్రయత్నం చేయొద్దు. మీకు చేతనైతే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోండి. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదు. రికార్డుల నుండి పెద్దిరెడ్డి పేరును తొలగించాలి’’ అని బొత్స అన్నారు. ఈ క్రమంలో పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలంటూ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు మంత్రి అనగానికి సూచించారు. -
విద్యుత్ ఛార్జీలపై సర్కార్ ను మండలిలో నిలదీసిన విపక్ష YSRCP
-
ప్రజలకు షాక్లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. -
Botsa: కూటమి సభ్యులు సభను తప్పు దోవ పట్టిస్తున్నారు
-
దీపం-2 పథకంపై శాసనమండలిలో వాడీవేడి చర్చ
-
ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా?
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలు విషయంలో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం శాసన మండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారాయన.‘‘దీపం-2 పథకాన్ని తప్పు దోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలిచ్చారు. ఎన్నికలయ్యాక అధికారంలో వచ్చి ఇప్పుడు మెలిక పెడుతున్నారు. ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా దీపం2 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చింది. ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు వెంటనే అమలు చేయాలి.చేతిలో అధికారం ఉందని విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతామంటే కుదరదు. మా ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంలకు సబ్సిడీ ఇచ్చాం. తల్లికి వందనం 18 వేలు ఇస్తామన్నారు? ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? అని బొత్స ప్రశ్నించారు. నేరస్తుల్లో భయం పోయిందినేరస్తులకు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై భయం పోయింది. నేరస్తులు రాష్ట్రంలో తీవ్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. మా హయాంలో పెట్టుబడి వ్యయం చేయలేదని అన్నారు. మరి నాలుగు పోర్టులు, ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎలా జరిగాయి? అవి క్యాపిటల్ వ్యయం కాకుండా హాం ఫట్ అంటే వచ్చాయా? ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ -
ఫ్రీ గ్యాస్ పథకంలో మోసాన్ని బయటపెట్టిన ఎమ్మెల్సీ బొత్స
-
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని పవనే అన్నారు
-
మంత్రి సత్యకుమార్ ఇచ్చిన సమాధానంపై బొత్స అసంతృప్తి
-
ప్రశ్నించిన వైఎస్సార్సీపీ.. సమాధానం చెప్పలేక ఊగిపోయిన మంత్రి సత్యకుమార్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ మంత్రులు అన్నట్టుగా చర్చ నడుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం లేకపోవడంతో సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా మంత్రి సత్య కుమార్ సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కానీ, ఏపీ శాసన మండలిలో మాత్రం మంత్రులు దీనికి విరుద్దంగా ప్రవరిస్తున్నారు. సమావేశాల సందర్బంగా నేడు మండలిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేస్తారా? లేదా?. సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములాని అనుసరిస్తున్నారు. గుజరాత్ ఫార్ములాని అమలు చేస్తున్నారా?. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లను నీట్ కౌన్సెలింగ్ ద్వారా చేయాలన్నారు.ఎమ్మెల్సీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సత్య కుమార్ ఆవేశంతో ఊగిపోయారు. సమాధానం చెప్పకుండా.. డైవర్ట్ చేసే విధంగా కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పాలి. మెడికల్ కాలేజీలకు నాబార్డు నుండి లోన్ తెచ్చాం. 50శాతం కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదు. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే విమర్శించడం ఏంటి?. అందరిని రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడటం కరెక్ట్ కాదు. మంత్రి సత్య కుమార్ సభని తప్పుదోవ పట్టించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతున్నాం. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని తెలిపారు. -
బడ్జెట్పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీగా మారింది. మండలిలో బడ్జెట్పై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడికి దిగారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నలు కురిపించారు. 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. రూ. 5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.అయితే వరుదు కల్యాణి ప్రసంగిస్తుండగా హోంమంత్రి అనిత అడ్డుతగిలారు. వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మంత్రులు అనిత, సవిత, బాల వీరంజనేయులు ఆటంకం కలిగించారు. ఎమ్మెల్సీ కల్యాణిని సభలో మాట్లాడకుండా అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా మంత్రులే అభ్యంతరం తెలపడం ఏంటని ఆగ్రహించించారు.వైస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలు పెట్టగా.. సంబంధం లేని సబ్జెక్ట్ను ఎందుకు తీసుకొచ్చారని బొత్స ప్రశ్నించారు. సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ ఆయన సూచించారు. దీంతో గందరగోళం నడుమ సభను చైర్మన్ రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారు. -
మంత్రి సత్యకుమార్ సమాధానంపై ఎమ్మెల్సీ బోత్స ఫైర్
-
డయేరియా మరణాలపై నవ్వుతూ మాట్లాడిన ఏపీ మంత్రి
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. డయేరియా మరణాలపై చర్చ సందర్భంగా ఆయన నవ్వుతూ.. మండలి సభ్యులను హేళన చేసేలా మాట్లాడారు. డయేరియా మరణాలపై శాసనమండలి చర్చలో భాగంగా తొలుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్గా మాట్లాడే క్రమంలో మంత్రి సత్యకుమార్ నోరు జారారు. ‘‘డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయి’’ అని చిరునవ్వుతో మాట్లాడారాయన.వెంటనే బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలి’’ అని అన్నారాయన. అనంతరం.. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. -
కేంద్రమంత్రి అమిత్ షాకు బొత్స సత్యనారాయణ లేఖ
-
స్టీల్ ప్లాంట్ లో పరిణామాలపై చంద్రబాబు వైఖరేంటి : బొత్స
-
ఉచిత ఇసుక అంటూ ప్రభుత్వం దగా చేస్తోంది: బొత్స
-
చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్నారా?: బొత్స
విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ విధానం ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. శనివారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర మంత్రులు చెప్తున్నది వేరు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు. స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు వైఖరి ఏమిటి?. కేంద్ర ప్రభుత్వ విధానాలను బాబు సమర్థిస్తున్నారా?. ఈ ప్రాంత మనోభావాలను గౌరవించాలి. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చేయోద్దు. ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్పై ద్వంద్వ వైఖరితో వెళ్తే ప్రజలు ఉపేక్షించరు. ఉన్న స్టీల్ ప్లాంట్ను కాపాడాలి. ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తే సంతోషమే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగాలి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఒక్క నిర్ణయం కూడా జరగలేదు...పాల డైరీల చరిత్రలో ఎన్నడూ పాల సేకరణ ధర తగ్గించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పాల సేకరణ ధర తగ్గించింది. చంద్రబాబు వెంటనే పాడి రైతులకు న్యాయం చెయ్యాలి. అమూల్ వచ్చాక రాష్ట్రంలో పాల సేకరణ ధర పెరిగింది. విశాఖ డెయిరీలో పాల సేకరణ ధర ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలి. పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. చట్టం ఒక పక్షం వహిస్తుంది. చట్టం నాలుగు పాదాలపై ఉండాలి. ఏకపక్షం వహించడం మంచిది కాదు. ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలను మోసం చేశారు. గతంలో ఇసుక పాలసీ చాలా సులభంగా ఉండేది.నాడు విశాఖలో ఇసుక రూ రూ. 13వేలకు వచ్చేది. -
కలరాతో 15 మంది చనిపోవడం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు
-
డయేరియా మరణాలపై సీఎం,డిప్యూటీ సీఎం రాజకీయాలా?.. బొత్స ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని శాసన మండలి విపక్ష నేత, బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. డయేరియాతో మృతి చెందిన 16 మందికి వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధిత గ్రామాలను తక్షణమే రెడ్ జోన్గా ప్రకటించి, యుద్ధ ప్రాతిపదికన పరిస్థితులన్నీ చక్కదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.డయేరియా మృతులపై ప్రభుత్వం గందరగోళ లెక్కలు చెబుతోందన్న మండలి విపక్షనేత, మరణాల సంఖ్యతో సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. జిల్లా కలెక్టర్ లెక్క మేరకు ఒక్కరు చనిపోగా, చంద్రబాబు లెక్క 8 మంది అని, పవన్కళ్యాణ్ లెక్క 10 మంది అని తెలిపారు. ఎందుకీ గందరగోళం? ఎందుకింత అస్పష్టత? అన్న బొత్స, పాలన చేతకాక, అధికారులపై పట్టు లేకనేనా? అని గట్టిగా నిలదీశారు.రుషికొండ నిర్మాణలపై పవన్కు బొత్స సవాల్గుర్ల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, రుషికొండ ఎందుకెళ్లారని.. రుషికొండ భవనాలకు, డయేరియా వ్యాప్తికి ఏమిటి సంబంధం అని మండలి విపక్షనేత ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పవన్కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని, రుషికొండ నిర్మాణాలపై అనుమానాలు ఉంటే, నిరభ్యరంతంగా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై షర్మిల అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న బొత్స, నాడు ఆ మొత్తం పిల్లల తల్లుల ఖాతాల్లో వేసేందుకు (డీబీటీ) ప్రభుత్వం సిద్ధమైతే, కోడ్ పేరుతో కోర్డును ఆశ్రయించింది ఇప్పటి పాలకులే అన్న విషయం షర్మిలకు తెలియదా? అని చురకలంటించారు.ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా?గుర్ల మండంలో కలుషిత నీటి సరఫరాకు కూటమి ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోందన్న మండలి విపక్షనేత.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయక నిర్వహణ లోపం అని ఒకసారి, ఫిల్టర్ పాయింట్స్ మార్చలేదని మరోసారి చెబుతూ, ఆ మరణాలపైనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గుర్తు చేశారు. డయేరియా వ్యాప్తి చెందిన ఆ ఏడెనిమిది గ్రామాల్లో వెంటనే ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయడంతో పాటు, మెడికల్ క్యాంప్లు నిర్వహించి పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఏ చర్యలు తీసుకోబోతున్నారో సీఎం చెప్పాలని కోరారు. డబ్బుల వసూళ్లకు కక్కుర్తిపడి నీటి సరఫరా పర్యవేక్షణను పూర్తిగా వదిలేశారన్న మండలి విపక్షనేత.. కూటమి నేతలు, అధికారులు వస్తే, నాలుగు నెలలుగా అక్కడి దారుణస్థితిని చూపిస్తానని సవాల్ చేశారు.మేం అడుగుతున్నదేంటి? మీరు చెప్పే సమాధానం ఏంటి?డయేరియా మరణాలపై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఈరోజు రుషికొండలో పర్యటించి, అక్కడి భవనాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేశామంటూ విమర్శిస్తున్నారని బొత్స గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే, హైదరాబాద్లో సీఎం ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తే, ఆ తర్వాత వచ్చిన వారు అక్కడి నుంచే పాలించారని ప్రస్తావించారు. అదే తరహాలో విశాఖ రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తే తప్పేమిటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. -
అవి సహజ మరణాలు కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం: బొత్స
సాక్షి, విజయనగరం: జిల్లాలో డయేరియా తీవ్రత తగ్గడం లేదు. ఇవాళ మరో ఇద్దరు డయేరియా బారినపడ్డారు. ఆసుపత్రిలోనే ఇంకా 145 మంది బాధితులు ఉన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుర్లలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలతో గుర్ల వైద్య శిబిరంలో 3 బెడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం ఖాళీ చేసి రోగులు లేరంటూ అధికారులు చూపిస్తున్నారు.డయేరియా బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడూతూ, డయేరియాతో జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వాన్నం గా ఉంది. తాగునీరు సరఫరా బాగులేకే డయేరియా వ్యాప్తి అయింది’’ అని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'? -
ఎమ్మెల్సీ జకియా ఖానం టీడీపీలో ఉన్నారు: బొత్స సత్యనారాయణ
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్సీ జకియా ఖానంకు వైఎస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదన్నారు శాసనమండలిలో ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఆమె టీడీపీలోకి వెళ్లినట్టు చెప్పారు.శాసనమండలిలో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పుడు వైఎస్సార్సీపీలో లేరు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. పలు సందర్భాలలో మంత్రి లోకేష్తో ఆమె భేటీ అయ్యారు. తిరుమలలో వీఐపీ టిక్కెట్లు ఆమె అమ్ముకున్నట్టు వచ్చిన ఆరోపణలతో మాకు సంబంధం లేదు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, జాకియా ఖానం తిరుపతిలో వీఐపీ టికెట్లు విక్రయిస్తున్నారు. ఆరు టికెట్లను రూ.65వేలకు అమ్మారు. ఈ నేపథ్యంలో భక్తులు ఈ విషయాన్ని టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎమ్మెల్సీ సహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను చేర్చారు. అయితే, ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆమె టీడీపీలో చేరారు. మంత్రులు లోకేష్, ఫరూఖ్ను కలిసి తన మద్దతు ప్రకటించారు. -
ఇసుకుపై చంద్రబాబు పిచ్చి మాటలు.. బొత్స కౌంటర్
-
హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?
ఎంవీపీకాలనీ(విశాఖ): రాష్ట్ర ప్రజలకిచ్చిన మోసపూరిత హామీలు ఎప్పుడు అమలు చేస్తారని వైఎస్సార్సీపీ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం చంద్రబాబుని నిలదీశారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్ల కోసం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ, తల్లికి వందనం రూ.15 వేలు, 50 ఏళ్లకే పింఛన్, యువతకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు నెలకు రూ.1500 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.హామీల అమలుపై ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు. ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ఇసుకే దొరకని దుస్థితి తెచ్చారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 10 టన్నుల ఇసుక విశాఖలో రూ.13 వేలుకు లభిస్తే.. ఇప్పుడు రూ.19 వేలు పైనే చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇసుకపై చంద్రబాబు ప్రకటనలన్నీ మాటల గారడినే అని అన్నారు. మద్యం రేట్లు తగ్గిస్తానన్న చంద్రబాబు.. ఎమ్మార్పీకంటే ఎక్కువకు అమ్ముతున్నారని తెలిపారు. నాసిరకం మద్యం అమ్ముతున్నారని గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఇప్పుడు ఆవే బ్రాండ్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పారు.మద్యం ద్వారా కూటమి నాయకులకు సంపద సృష్టించడం మినహా చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అగ్గిపెట్టెలకు రూ.కోట్లు ఖర్చు చేసినట్లు చూపించిన ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. చంద్రబాబు దోపిడీ విధానాలకు ఇది పరాకాష్ట అని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే చంద్రబాబు ప్రభుత్వం కనీస నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు 5 ఏళ్లు నిర్విరామంగా రైతు భరోసా అందజేసి అండగా నిలిస్తే బాబు సర్కారు కనీస సాయం చేయడంలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పాల్గొన్నారు. -
ప్రజలు ‘సూపర్సిక్స్’ కోసం చూస్తున్నారు: బొత్స
సాక్షి,విశాఖపట్నం: సూపర్సిక్స్ హామీల అమలుకు ముహూర్తం ఎప్పుడని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం(అక్టోబర్ 19) మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీల అమలును కూటమి ప్రభుత్వం విస్మరించింది. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు’అని బొత్స మండిపడ్డారు.బొత్స ఇంకా ఏమన్నారంటే..ప్రభుత్వానికి హామీలపై ఆరు నెలలు సమయం ఇద్దమనుకున్నాం.ఆరు నెలల తర్వాత కూడా ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు.రెండున్నర ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని చంద్రబాబు చెపుతున్నారు.వైఎస్సార్సీపీ పాలనలో పది వేల రూపాయాలకు వచ్చే ఇసుక నేడు 15 వేల లభిస్తుంది.ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పినా కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు.గత ప్రభుత్వ హయాంలో సినరేజ్ చార్జీలు రూ.375 వసూలు చేసేవారు.సినరేజ్ డబ్బులు ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వచ్చేవి.కూటమి ప్రభుత్వం టన్నుకు 375 రూపాయలు సినరేజ్ వసూలు చేయకపోయినా టన్ను ఇసుక రేటు తగ్గలేదు.ట్రాక్టర్తో ఉచిత ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో కూడా ఇచ్చేవారు.టీడీపీ ప్రభుత్వం హయంలో కొత్తగా ఏమీ ఇవ్వలేదు.మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు, ఎక్కడ తగ్గించారు.నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి.తల్లికి వందనం, రైతు భరోసా ఒక్కరికైన ఇచ్చారా.ఖరీఫ్ ముగుస్తున్నా ఒక్క పైసా రైతు ఖాతాల్లో పడలేదు.అగ్గిపెట్టెలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.ప్రభుత్వ అవినీతిపై వార్తలు రాస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు.అగ్గి పెట్టె లెక్కలు మీ గెజిట్ పేపర్లోనే వచ్చాయి.టీడీపీ నేతల కుమ్ములాటలు వల్ల గుర్లలో పది మంది చనిపోయారు.నాలుగు నెలల నుంచి మంచి నీటిపై పర్యవేక్షణ లేదు.మంచినీటి సరఫరా కాంట్రాక్టు తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని కుమ్మూలడుకుంటున్నారు.ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ నిర్లక్ష్యం వలన డయేరియా మరణాలు సంభవించాయి.పరిశుభ్రమైన మంచి నీటిని అందించలేదు.డయేరియాతో చనిపోయిన పది మందికి నష్ట పరిహారం చెల్లించాలి.ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి -
పార్టీ కోసం కష్టపడే వారిని జగన్ గుర్తుపెట్టుకుంటారు..
-
పురందేశ్వరి పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
-
ఉచిత ఇసుక వట్టిదే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సంక్షోభం నెలకొందని, 4 నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటికీ ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతోందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. లాసన్స్బే కాలనీలోని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్మాణ రంగం కుదేలు కాగా, దానిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా, వాస్తవానికి గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితం అని ప్రకటిస్తున్న నేపథ్యంలో సీనరేజ్ చార్జీలు రూ.3,500 తగ్గించి, 10 టన్నుల ఇసుకను రూ.10 వేలకే సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ భాగస్వాములు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసుపై సీఎం, డీజీపీ, సీబీఐకి లేఖ రాస్తామన్నారు. -
బాబూ.. విశాఖ డ్రగ్స్ కేసు ఏమైంది?: ఎమ్మెల్సీ బొత్స
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు. ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.ఎమ్మెల్సీ బొత్స సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి మంత్రులు అక్కడ పర్యటించారు. నిన్నటి వరకు మంత్రులు ఎందుకు పుంగనూరు వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి. అధికారంలో భాగస్వాములు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆపాలి. రైల్వే జోన్ పనులు వెంటనే ప్రారంభించాలి. వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. చంద్రబాబు ప్రత్యేక హోదాపై కూడా ప్రశ్నించాలి.రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు పని లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇసుక కొరత 26 రంగాలకు చెందిన కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో టన్నుకు 370 సీనరేజ్ చార్జీ ఉండేది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయనగరంలో సీనరేజ్ చార్జీతో 10 టన్నుల ఇసుక 10 వేలకు దొరికేది. ప్రస్తుతం విజయనగరంలో 13 నుంచి 14 వేలకు దొరుకుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వైజాగ్లో ఇసుక 14 నుంచి 15 వేలకు దొరికేది. కూటమి పాలనలో విశాఖలో 21 వేయి నుంచి 22 వేలకు దొరుకుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇసుక అన్న తరువాత సీ ఫేజ్ లేక పోయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కంటే ఎక్కువ రేటుకు వసూళ్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.ఏపీలో కూటమి పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో ధరలు పెరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ రేటుకు అందించేది. కూటమి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలి. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాస్తాను. విశాఖలో 25వేల కేజీల డ్రగ్స్ సంధ్యా ఆక్వాకు గతంలో వచ్చాయి. అవి పురంధరేశ్వరి బంధువులకు సంబంధించినది అనే ప్రచారం జరిగింది. మరి 25 వేల కేజీల డ్రగ్స్ కేసు ఏమైందో తెలియదు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలో దీనిపై ప్రస్తావిస్తాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
TV5 రిపోర్టర్ కి బొత్స అదిరిపోయే కౌంటర్
-
స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దామనుకుంటున్నారు?: ఎమ్మెల్సీ బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, ఉద్యోగాలు ఇస్తామని స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగించడమేంటని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారా? అని అడిగారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో కూటమి నేతలను గెలిపిస్తే నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఉద్యోగాలు ఇచ్చారా?. కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తున్నారు. స్టీల్ప్లాంట్లో కార్మికులను తొలగించడం కరెక్ట్ కాదు. అసలు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దామనుకుంటున్నారు?. నాలుగు వేల మంది స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడానికి ఒప్పుకోము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్, బీజేపీ నిలబెట్టుకోవాలి.నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారా?. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీకు చీమ కుట్టినట్టు అయినా లేదు. రూ.99కే మద్యం అందిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మద్యం షాపుల్లో ఉన్న 15000 మందిని రోడ్డున పడేశారు. మందు మీద రేటు తగ్గిస్తున్నారు.. నిత్యవసర వస్తువుల ధరల సంగతి ఏంటి?. ధరల స్థిరీకరణ కోసం గత ప్రభుత్వం 2000 కోట్లు ఏర్పాటు చేసి ధరలను అదుపులో పెట్టింది. పండగకు పప్పన్నం కాదు చారు అన్నం కూడా తినే పరిస్థితి లేదు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగితే తక్కువ ధరలు ఉన్న రాష్ట్రాల నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూరగాయలను తెప్పించేది. ధరలను అదుపులో పెట్టింది. రెండున్నర లక్షల మంది వాలంటీర్లను తొలగించారు. వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.లులూ కంపెనీ.. ప్రభుత్వం నుంచి రూ.1300 కోట్ల స్థలం తీసుకొని 600 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం రేటు కంటే పది రెట్లు పెట్టుబడి పెడితే ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే స్థలం రేటులో సగం కూడా పెట్టుబడులు లేకపోతే ఎలా?. అందుకే గతంలో లులూ కంపెనీ పెట్టుబడులు వద్దని చెప్పాము అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: బాదుడుపై బాబు ఫోకస్.. ఇదేనా సంపద సృష్టి: వైఎస్సార్సీపీ -
మాజీ ముఖ్యమంత్రి తిరుమల వెళ్తామంటే అడ్డుకోవడం చాలా దారుణం
-
నెయ్యి కల్తీపై థర్డ్పార్టీ విచారణ చేయించండి: బొత్స
సాక్షి,విశాఖపట్నం:నెయ్యికల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోందని మాజీమంత్రి,వైఎస్ఆర్సీపీసీనియర్నేత బొత్ససత్యనారాయణ అన్నారు.విశాఖపట్నంలో శనివారం(సెప్టెంబర్28)బొత్స మీడియాతో మాట్లాడారు.‘నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని బాబు చెప్తున్నాడు.నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలి. సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలి. కల్తీ చేసిన వారిని శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధిఉంటే థర్డ్పార్టీతో విచారణ జరిపించాలి. సీబీఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు?చంద్రబాబు తన అబద్ధాలను నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్ వేసుకున్నారు.కల్తీ జరిగి ఉంటే ఎందుకు న్యాయవిచారణకు వెనుకాడుతున్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని స్వార్థరాజకీయలు చేస్తున్నారు.ఇంతటి దుర్మార్గానికి ఎవరైనా పాల్పడతారా..ఇది న్యాయమా..మాజీ సీఎం తిరుమల వెళ్తానంటే అడ్డుకోవడం దారుణం. చంద్రబాబేమో ఎవరూ అడ్డుకోలేదంటున్నారు.తిరుమల వెళ్తామంటే నోటీసులు ఇచ్చారు.తిరుమల వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది.చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. 20లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నారు. పరిపాలన చేయాల్సిందిగా అవకాశమిస్తే మీరు చేస్తున్నదేంటి. స్టీల్ప్లాంట్లో నాలుగు వేల మంది కార్మికులను తొలగిస్తే దానికి సమాధానం చెప్పే వారు లేరు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్పారు. బియ్యం కూడా కొనుక్కొనే పరిస్థితి ప్రజలకు లేదు.చారు అన్నం కూడా తినే పరిస్థితి కూడా ప్రజలకు లేదు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 వేల కోట్లు అప్పు చేశారు. అప్పులు చేయడమేనా సంపద సృష్టి అంటే.సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో సమాధానం చెప్పాలి.వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో రాజకీయం చేయడం ధర్మనేనా.చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశాం ’అని బొత్స తెలిపారు.ఇదీ చదవండి: పాపం చంద్రబాబుదే..సీబీఐ విచారణకు భూమన డిమాండ్ -
న్యాయ విచారణ చేపట్టాలి
సాక్షి, విశాఖపట్నం: తిశ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై న్యాయ విచారణ చేపట్టాలని, అవసరమైతే సీబీఐకి అప్పగించాలని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయడం çసరి కాదని స్పష్టం చేశారు. విశాఖ లాసన్స్బే కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.చట్టాల్లో లొసుగులు ఆసరాగా చేసుకుని చట్టానికి అతీతంగా ప్రవర్తించినట్లు.. దేవుడితో అలాంటి రాజకీయాలు చేస్తే కచి్చతంగా ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా పత్రికలు, పారీ్టలు ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. ప్రసాదాలకు వాడే పదార్థాల నాణ్యతను పరీక్షించిన తర్వాతే అనుమతిస్తారని, లేదంటే తిరస్కరించడం టీటీడీ ఆనవాయితీ అని గుర్తుచేశారు. అలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 18 ట్యాంకర్లు, అంతకు ముందు చంద్రబాబు హయాంలో 14 ట్యాంకర్లను వెనక్కు పంపారని తెలిపారు. ఐవైఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశం లేదన్న మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాటలతో తాను ఏకీభవిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని.. కల్తీ జరిగినట్లు విచారణలో తేలితే నిందితులను శిక్షించాలన్నారు. లేని పక్షంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ 100 రోజుల పాలనలో ఏం చేశామో చెప్పలేక గత ప్రభుత్వంపై బురద చల్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.సూపర్ సిక్స్ హామీల అమలు సంగతి ఏంటి? కనీసం గతంలో అమలైన అమ్మఒడి, రైతుభరోసా లాంటి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినా ఇవ్వాలి కదా అని నిలదీశారు. ప్రసాదంపై ఈవో ఒకటి చెపుతుండగా, చంద్రబాబు మరొకటి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. విజయవాడ వరదల్లో ప్రభుత్వ వైఫల్యం గురించి అడిగితే.. బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర చేశారని అబద్ధాలతో ఎదురు దాడి చేయడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, పండుల రవీంద్ర, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు. -
దేవుడితో రాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదు
-
కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అట్టర్ ప్లాప్
-
దేవుడి మీద రాజకీయం చంద్రబాబుకే చెల్లింది: ఎమ్మెల్సీ బొత్స
సాక్షి, విశాఖపట్నం: దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల లడ్డూ వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలి. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొత్స శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన అట్టర్ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు విష ప్రచారం చేస్తున్నారు. దేవుడి మహా ప్రసాదంపై తప్పుడు ప్రచారం మంచి పద్దతి కాదు. దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. దేవుడితో రాజకీయాలు చేయడం ఎందుకు?. దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించండి. విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయండి. కొన్ని పత్రికలు తప్పుగా వార్తలు రాస్తున్నాయి. ఇంతటితో ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు ఆపాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, టీటీడీ ఈవో మాటలకు మధ్య పొంతనలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీరే కదా అధికారంలో ఉన్నారు. తిరుమల లడ్డూ విషయంపై విచారణ చేసి నిజాలు తేల్చండి. విచారణలో తప్పుచేసినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోండి. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది. లడ్డూ ప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడినది. దైవ ప్రసాదంపై చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం. నెయ్యి వస్తే టీటీడీ టెస్టులు చేసిన తరువాతే ప్రసాదానికి తీసుకుంటుంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచంలోనే కోట్లాది మంది భక్తులు వేంకటేశ్వర స్వామికి ఉన్నారు. అటువంటి దేవుని ప్రసాదంపై రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారు. వాస్తవాలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీపై బురదజల్లడం ఎంత వరకు న్యాయం. మీ రాజకీయాల కోసం దేవుడిని బయటకు తీసుకువస్తారా?. కృష్ణారావు లాంటి వారు ప్రసాదంలో తప్పు జరగలేదని చెప్పారు. జరిగితే వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది నిరూపించ లేకపోతే చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కృష్ణారావు మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.రాష్ట్రంలోని సమస్యలను డైవర్ట్ చేసేందుకే కుట్ర రాజకీయం చేస్తున్నారు. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో బడ్జెట్ ఎందుకు పెట్టలేదు?. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా?. సూపర్ సిక్స్లో ఎన్ని హామీలు అమలు చేశారు. ఎంత మంది తల్లికి వందనం ఇచ్చారు. ఎంత మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చారు. మీరు హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మార్చేందుకు చూస్తున్నారు. వరదల్లో ఎంతమంది చనిపోయారో నిజంగా చెప్పండి. మీరు చెప్పక పోయినా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెలుసు. మూడు రోజుల పాటు తిండి నీళ్ళు లేక చనిపోయిన ఘటన దేశంలో ఎక్కడ జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందిని చంపారో చెప్పండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బాబు గారూ.. మీ ఎమ్మెల్యే నుంచి కాపాడండి! -
కూటమి ప్రభుత్వానికి బొత్స వార్నింగ్
-
విశాఖ స్టీల్ప్లాంట్పై ‘కూటమి’ కుట్ర: బొత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని బొత్స ధ్వజమ్తెతారు.‘‘విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ చెప్పారు. స్టీల్ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్పై కూటమి ప్రభుత్వం వైఖరీ చెప్పాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. 32 మంది త్యాగ ఫలంతో ఏర్పడింది. 32 వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు.. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం11 వేల కోట్ల ఖర్చు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సందర్భంలో విశాఖను స్టీల్ ప్లాంట్ పైవేటికరణ చేయొద్దని వైఎస్ జగన్ అడిగారు. ప్రధానికి రెండు సార్లు లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు వలన ఒరిగేది లేదు. ఇదీ చదవండి: చంద్రబాబూ.. ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యమెందుకు?: వైఎస్ జగన్..కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్పై టీడీపీ విధానం ఏమిటో చెప్పాలి. కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చారు.. రెండవ బ్లాస్ట్ ఫర్నిచర్ మూసివేశారు. మా పార్టీ విధానమే ప్లాన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్. మేము వ్యతిరేకించాము కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది’’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు. -
వరద బాధితుల కోసం వైఎస్సార్ సీపీ భారీ విరాళం
-
‘మీ విజన్, అనుభవం ఏమైంది చంద్రబాబూ?’
విజయవాడ, సాక్షి: వరద బీభత్సం ముమ్మాటికీ మానవ తప్పిదమేనని, నష్టనివారణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ వరద బాధితులకు అండగా నిలిచే క్రమంలో.. వైఎస్సార్సీపీ ఇవాళ భారీ విరాళం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం.. విజయవాడలో బొత్స మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సర్కార్ను నిలదీసిన బొత్స.. ‘‘భారీ వర్షాలు వస్తాయని మీకు తెలుసా? తెలియదా?. వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అసలు ఇరిగేషన్ శాఖ ఏం చేస్తోంది?. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వరద బాధితులకు కనీసం భోజనం కూడా అందించడ లేదు. బాధితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా? అధికార యంత్రాగం అసలేం చేస్తోంది?. మీరు, మీ సలహాదారులు ఏంచేస్తున్నారు. మా లాగా ఎందుకు చేయలేకపోతున్నారు.. గతంలోనూ ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పుడు మేమంతా వారం రోజులు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాం. ఇప్పుడు వరదలు వస్తున్నా ఎందుకు మానిటరింగ్ చేయలేకపోయారు. అసలు ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు.. ఎంత మందిని తరలించారు.. బయటకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.మాపై బురదా?.. రిటైనింగ్ వాల్ లేకుంటే ఎంత నష్టం జరిగి ఉండేది. గోడ కట్టాం కాబట్టే నష్టం తగ్గింది. కరకట్టకు గండి పడితే కుట్ర కోణం అంటున్నారు. బ్యారేజీని బోట్లు ఢీ కొడితే కుట్ర కోణం అంటున్నారు. బాధ్యత ఉన్నవాళ్లు అలా మాట్లాడతారా?. బాబు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. మేం ప్రశ్నిస్తుంటే మాపై బురద జల్లుతున్నారు. జగన్ చేసిన మంచి.. రిటైనింగ్ వాల్ పై సిగ్గు లేని టీడీపీ ప్రచారంపాల ప్యాకెట్లతో మొదలుపెట్టి.. మూడు రోజులుగా వరదకి విజయవాడ అతలాకుతలం అయ్యింది. ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కనీసం నీళ్లు, పాలు కూడా అందక అవస్థలు పడుతున్నారు. ఈరోజు వరకు కనీస అవసరాలు అందలేదు. అందుకే వరద బాధితులకు పార్టీ తరఫున కోటి రూపాయల సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రేపు ఉదయం నుంచే పార్టీ నుంచి సహాయక చర్యలు పప్రారంభం అవుతాయి. లక్ష పాల ప్యాకెట్లను పంపిణీ చేస్తాం. బాధితులకు ఏం సాయమో తెలుసుకుని అందజేస్తాం అని బొత్స అన్నారు. హెరిటేజ్ నుంచి పాలివ్వలేరా?.. సీఎం చంద్రబాబే ఆహారం ఇవ్వలేకపోయాను అన్నారు. వరదకి తగ్గట్టుగా ఎందుకు ఆహారం సిద్ధం చేయలేకపోయారు. హెరిటేజ్ నుండి, ఇతర డైరీల నుండి పాలు ముందు తెప్పించలేరా?. చంద్రబాబు అనుభవం, విజన్ అని మాట్లాడతారు. మాటలే కానీ పని ఏది?. అసలు ముందుగా ఎందుకు స్పందించలేదు?. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నీటిని, వరద ని అంచనా వేసి నీరు వదిలితే ఈ ఉపద్రవం వచ్చేది కాదు. బుడమేరుకి బ్యాక్ వాటర్ వస్తుందని తెలియదా?. సీఎం ఒక్క సమావేశం అయినా పెట్టారా?. పోనీ ఒక్క మంత్రి అయినా సమావేశం పెట్టారా..? చెప్పండి. బస్సులో బస! ఎవరొద్దన్నారు.. చంద్రబాబు తాను బస్లో పడుకుని పని చేస్తున్నాం అంటున్నారు. బస్ లో పడుకున్నా.. ఆఫీస్ లో పడుకున్న..ఏం లాభం?. ఆయన నివాసం ఎంత దూరం?. అది మునిగింది కాబట్టే కదా మీరు కలెక్టరేట్ కి వెళ్ళింది. కరకట్టలోపల కట్టడాలు మునిగిపోతాయని, ఎప్పటికైనా అది ప్రమాదమని మేం ఎప్పుడో చెప్పాం. పడవల్లో జనం రావడానికి వేలకు వేలు వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలను ఆదుకోండి. వరద తగ్గుతుంది కాబట్టి ప్రజలను ఆదుకోండి. అధికారులు మాట వినకపోతే చర్యలు తీసుకోండి.. ఎవరోద్దన్నారు!.వరదలతో రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి. అమరావతి గ్రామాల్లో మూగజీవాలు వరదకు కొట్టుకు వెళ్లాయి. కరకట్టకి వరద వచ్చిందా? లేదా?. నాకు అనుమతి ఇవ్వండి.. చూసొద్దాం పదండి. దాచేస్తే వాస్తవాలు దాగిపోవు అని చంద్రబాబును ఉద్దేశించి బొత్స అన్నారు. -
రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇదే నిదర్శనం : బొత్స
సాక్షి,అమరావతి : గుడివాడలో పేర్నినాని కారుపై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు బొత్స పోలీసు అధికారులు ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ ఎస్పీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు బొత్స.కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యంగంరాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. గుడివాడలో పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు జరిగాయి. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ వెళ్లారు పేర్నినాని,కైలే అనిల్. ఇంటూరిని విడిపించిన తర్వాత స్నేహితుడి ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వారి ఇంటికి వెళ్లారు పేర్ని నాని. దీంతో రెచ్చి పోయిన జనసేన, టీడీపీ కార్యకర్తలు పేర్నినాని కారుపై రాళ్ల దాడి చేశారు. అద్దాలు పగుల గొట్టారు.పోలీసుల సమక్షంలోఇక ఈ ఏపిసోడ్ మొత్తం పోలీసుల సమక్షంలో జరగడం గమనార్హం. పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. అటు దాడులు గురించి సమాచారం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారును ఉంచారు పేర్ని నాని కారు డ్రైవర్. అయితే, అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడి చేశారు. -
ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. చాలాచోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అంటూ బొత్స ప్రశ్నించారు.బాత్రూమ్లో కెమెరాలు కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు. కెమెరాలు బాత్ రూమ్లో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు.. వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ అక్కడ ఏమి జరగలేదని చెప్పగలరా?. వైఎస్సార్సీపీ పాలనలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. విశాఖలో లోకేష్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. 47 వేల క్లాస్ రూమ్లను గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. 20 వేల క్లాస్ రూమ్ల్లో టీవీలు ఏర్పాటు చేశాం’’ అని బొత్స తెలిపారు.‘‘విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వసతులను చూసి లోకేష్ మెచ్చుకున్నారు. ఇది గత ప్రభుత్వ ఘనత. విద్యార్థుల చదువు కోసం వైఎస్ జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క విద్యార్థికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు.’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
టీడీపీ తప్పులను ఎండగట్టిన బొత్స..
-
అచ్యుతాపురం ఘటనపై టీడీపీకి బొత్స కౌంటర్..
-
18 మంది చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం
-
అచ్యుతాపురం ఘటన బాధితుల కన్నీళ్లు.. చలించిపోయిన బొత్స
-
పాలక పార్టీ తీరు బాధాకరం.. ఇంత నిర్లక్ష్యం తగదు: బొత్స
విశాఖపట్నం, సాక్షి: ‘‘ఒక్కరోజులో మా బతుకులు తలకిందులైపోయాయి. మా వాళ్ల శవాల్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. ప్రమాదం జరిగాక.. మా లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరూ వచ్చింది లేదు. ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నుంచి స్పందన లేదు’’ అంటూ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి.గురువారం వైఎస్సార్సీపీ నేతలు కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన విని.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చలించిపోయారు. ‘‘అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం. కానీ, పాలక పార్టీ తీరు బాధాకరం. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇంత నిర్లక్ష్యం తగదు. బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఘటనకు బాధ్యులు అయిన యాజమాన్యం మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. .. సీఎం చంద్రబాబు కేజీహెచ్కు ఎందుకు రాలేదు?. మా పార్టీ డిమాండ్ను ఇప్పటికే అధినేత వైఎస్జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. మా ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ ఘటనలో కోటి రూపాయల పరిహారం ఇచ్చింది. కానీ, ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఎన్ని కోట్లు ఇచ్చినా.. పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ, బాధిత కుటుంబాలకు పరిహారంతోనే ఆదుకోవాలి. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదు. రేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు’’ అని బొత్స తెలిపారు. -
ప్రమాణస్వీకారం తర్వాత బొత్స ఫస్ట్ రియాక్షన్