2008లో ఇచ్చిన లేఖలో సమన్యాయం కోరాం:చంద్రబాబు | We requested equal justice in 2008 Letter: Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

2008లో ఇచ్చిన లేఖలో సమన్యాయం కోరాం:చంద్రబాబు

Published Mon, Feb 3 2014 9:16 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

చంద్రబాబు

చంద్రబాబు

ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి 2008లో ప్రణబ్‌ ముఖర్జీకి  ఇచ్చిన లేఖలో తాము సమన్యాయం కావాలనే కోరామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని  కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. విభజనపై ఇరు ప్రాంతాల వారిని పిలిచి మాట్లాడాలని కోరినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా, అంతకు ముందు చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వస్తే అనుకూలంగా ఓటేస్తారా? లేక వ్యతిరేకంగా ఓటేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన  జవాబు దాటవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement