పుట్టింటికి పంపించలేదని ఆత్మహత్య | Woman commits suicide | Sakshi
Sakshi News home page

పుట్టింటికి పంపించలేదని ఆత్మహత్య

Published Tue, Aug 4 2015 8:13 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Woman commits suicide

తిరుపతి : పుట్టింటికి పంపించలేదని మనస్తాపం చెంది ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతిలోని చంద్రగిరి రోడ్డు సాయిబాబ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వనజ(29), సతీష్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వనజ ఓ కాలేజీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. కాగా పుట్టింటికి వెళ్లి వస్తానని ఆమె ఇటీవల పలుమార్లు భర్తను కోరింది.

కానీ డబ్బులేకపోవడంతో అతడు పంపించలేదు. దీంతో మనస్తాపం చెందిన వనజ మంగళవారం ఇంట్లో భర్త లేని సమయంలో పిల్లలిద్దరినీ ఓ గదిలో పెట్టి బయట గడియపెట్టింది. తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిల్లల అరుపులు విని ఎదురింటి వారు వచ్చి చూసేలోపే ఆమె మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement