చిత్తూరు జిల్లాలో పిడుగు పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి
సత్యవేడు: చిత్తూరు జిల్లాలో పిడుగు పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో మంగళవారం పిడుగు పడింది.
ఈ ఘటనలో ఇళ అరుసు(31) అనే మహిళ మృతిచెందగా.. వసంత, ధ్యానమ్మ అనే మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరిపొలంలో నాట్లు వేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.