విజయనగరం: వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా కురుపాం మండలంలో జరిగింది. వివరాలు..కురుపాం మండలం జోగిరాజుపేట గ్రామానికి చెందిన కొత్తర గంగమ్మ(45) ఆటోలో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారి పడింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(కురుపాం)
ఆటోలో నుంచి జారీ పడి మహిళ మృతి
Published Fri, Apr 10 2015 12:50 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement