సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామ సమీపంలో ఓ యువతిపై సోమవారం ఉదయం అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన విక్రమ్(27) అనే యువకుడు తనపై అత్యాచారం చేసినట్లు సదరు యువతి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఊరి చివరన గేదెలు మేపుతుండగా ఈ సంఘటన జరిగినట్లు యువతి తెలిపింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.