మహిళా సర్పంచ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం వెలుగుచూసింది. స్థానిక యాదవ వీధిలో నివాసముంటున్న అరుణమ్మ(34) వెంకటతిమ్మాపురం గ్రామ సర్పంచ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా సర్పంచ్ ఆత్మహత్య
Published Thu, Mar 10 2016 9:20 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement