పగిడాల (కర్నూలు) : ప్రమాదవశాత్తూ కేసీ కెనాల్లో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పగిడాల మండలంలోని కెనాల్ ప్రాతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్లో పనిచేయడానికి వచ్చిన ప్రకాశం జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రసన్నాంజనేయులు(20) ఈ రోజు ప్రమాదవశాత్తూ కాలు జారి పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.