missing
-
సుదీక్ష మిస్సింగ్.. కిడ్నాపైందా?
న్యూఢిల్లీ: కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్లో తెలుగు విద్యార్థిని (Telugu Student) అదృశ్యం మిస్టరీగా మారింది. 20 ఏళ్ల సుదీక్ష కోణంకి (Sudiksha Konanki) కుటుంబం అమెరికాలో వర్జీనియాలోని లౌడౌన్ కౌంటీలోని చంటిల్లీలో నివసిస్తోంది. సుదీక్షకు అమెరికా శాశ్వత నివాస హోదా ఉంది. పిట్స్బర్గ్ వర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు తోటి విద్యార్థినులతో వారం క్రితం డొమినికన్ రిపబ్లిక్లోని పుంటా కానాకు వెళ్లింది. అక్కడి రియు రిపబ్లికా రిస్టార్టులో వారికి మరో ఇద్దరు అమెరికా టూరిస్టులు కలిశారు. అంతా మార్చి 5న రాత్రి స్థానిక నైట్ క్లబ్కు వెళ్లారు. 6వ తేదీ తెల్లవారుజామున నాలుగింటి సమయంలో అక్కడి బీచ్కు చేరుకున్నారు. ఉదయం 5.50 సమయంలో మిగతా వాళ్లు రిసార్టుకు వచ్చేయగా టూరిస్టుల్లో ఒకరైన జాషువా స్టీవెన్ రిబే (24), సుదీక్ష బీచ్లోనే ఉండిపోయారు. ఆ తరువాత ఆమె కనిపించలేదు. ఉదయం 9 గంటలప్పుడు రిబే ఒక్కడే బీచ్ నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యింది. సాయంత్రమైనా సుదీక్ష ఆచూకీ లేకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలు, స్కూబా డైవర్లు, ఏటీవీలను మోహరించి తీరం, పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు రోజులైనా ఆమె ఆచూకీ దొరకలేదు. చదవండి: మనిషిని కుక్క షూట్ చేసింది!దీనికి తోడు ఆమె అదృశ్యంపై స్నేహితుల నుంచి విరుద్ధ కథనాలు వస్తుండటంతో కుటుంబీకులు మరింత ఆందోళన చెందుతున్నారు. సుదీక్ష తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవి (Sridevi) కూడా పుంటా కానా వెళ్లారు. ఆదివారం వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘కుమార్తె సెల్ఫోన్, బ్యాగ్, ఇతర వస్తువులన్నీ స్నేహితుల వద్దే ఉన్నాయి. ఆమెనెవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు’’ అని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సుదీక్ష ఆచూకీ కోసం తాజాగా ఎఫ్బీఐ (FBI) కూడా రంగంలోకి దిగింది. స్థానిక భారత రాయబార కార్యాలయం కూడా దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. సుదీక్ష అదృశ్యంపై ఇంటర్పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది.భిన్న కథనాలు సుదీక్షను చివరిసారిగా చూసిన జాషువా ఆమె అదృశ్యంపై భిన్న కథనాలు చెబుతున్నాడు. పెద్ద అలలు రావడంతో బీచ్ నుంచి వెళ్లిపోయానని ఓసారి, సుదీక్ష మోకాలి లోతు నీటిలో ఉండగా చివరగా చూశానని మరోసారి చెప్పాడు. ఆమె తీరంలో నడుస్తుండగా తాను నిద్రపోయానని మరోసారి చెప్పుకొచ్చాడు. పోలీసులు మాత్రం అతన్ని అనుమానితుడిగా భావించడం లేదు. బీచ్ లాంజ్లో ఆమె దుస్తులు కనిపించాయి. బహుశా బికినీలో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె తండ్రి మాత్రం జాషువానే అనుమానిస్తున్నారు. -
డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. -
తుంగభద్రలో నగర వైద్యురాలి గల్లంతు
సాక్షి, బళ్లారి: సరదాగా విహారయాత్రకు వచ్చిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో మునిగిపోయింది. ఈ సంఘటన బుధవారం కర్ణాటకలోని హంపీ వద్ద చోటుచేసుకుంది. డాక్టర్ అనన్యరావు (27), స్నేహితుడు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్కి వచ్చారు. నది ఒడ్డున సణాపురలో ఓ రిసార్టులో మకాం వేశారు. బుధవారం మధ్యాహ్నం నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు దూకి ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి నదిలో కొట్టుకుపోసాగింది. స్నేహితులు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. నీటి ప్రవాహంలో కనుమరుగైపోయింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి బండరాళ్ల మధ్య గాలించారు. రాత్రి అయినప్పటికీ అనన్యరావు జాడ కానరాలేదు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనన్యరావు తండ్రి డా.మెహన్రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది. కొప్పళ జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ ఆమె కోసం గాలిస్తున్నామని, ప్రాణాలతో ఉందో లేదో తెలియదని అన్నారు. గంగావతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కీలక ఫైళ్ల గల్లంతు.. గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్!
న్యూఢిల్లీ: పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ గల్లంతు అయిన వ్యవహారం గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)ను కుదిపేస్తోంది. మరోవైపు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ను బదిలీ చేయాల్సిందేనంటూ తోటి జడ్జిలు, అడ్వొకేట్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమర్శల నేపథ్యంలో ఆమెను సెలవులపై వెళ్లగా.. జస్టిస్ అనిరుధ్ వైష్ణవ్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.గుజరాత్ హైకోర్టు పరిధి నుంచి పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ మాయం(Files Missing) కావడంపై జడ్జి సందీప్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థలోని పారదర్శకతను, నమ్మకాన్ని దెబ్బ తీసే అంశమని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో న్యాయ ప్రక్రియలకు సత్వర సంస్కరణలకు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఫైళ్ల మాయంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి పాత్రపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఊహించని పరిణామానికి దారి తీసింది.జస్టిస్ సందీప్ భట్ రోస్టర్ను మార్చేస్తూ చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్(Chief Justice Sunitha Agarwal) ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరాలకు కారణం కావడం మాత్రమే కాదు పలు అనుమానాలకూ దారి తీసింది. గుజరాత్ హైకోర్టు అడ్వొకేట్ అసోషియేషన్స్ సోమవారం అత్యవసరంగా సమావేశమై చీఫ్ జస్టిస్ నిర్ణయంపై చర్చించాయి. మరోవైపు.. హైకోర్టు జడ్జిలు, లాయర్లు జస్టిస్ సందీప్ భట్కు సంఘీభావం ప్రకటించారు. అయితే.. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ ఇలా జడ్జిల విధులకు అడ్డుపడడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు.. నలుగురు జడ్జిల విషయంలోనూ ఆమె ఇలాగే ప్రవర్తించారు. అలాగే.. న్యాయవాదులతోనూ ఆమె వ్యవహరించే తీరుపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయితాజాగా.. మొన్న శుక్రవారం(ఫిబ్రవరి 14)న అక్రమ కట్టడాలకు సంబంధించిన దాఖలైన పిల్పై వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిల్ను విచారించింది. ఆ టైంలో జీహెచ్సీఏఏ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ బ్రిజేష్ త్రివేదికి చీఫ్ జస్టిస్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలు పూర్తిగా వినాలంటూ తీవ్ర స్వరంతో ఆయన చీఫ్ జస్టిస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఆమె అవేం పట్టనట్లు గాల్లో చూస్తూ ఉండిపోయారు. దీంతో ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె మందలించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా దీంతో ఆమెను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ జడ్జిలు, లాయర్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ అంశంపై మంగళవారం మరోసారి జీహెచ్సీఏఏ జనరల్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఈలోపు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ సెలవులపై వెళ్లగా.. ఆమె స్థానంలో జస్టిస్ బీరెన్ అనిరుధ్ వైష్ణవ్ను తాత్కాలిక చీఫ్ జస్టిస్గా నియమించింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 2వ తేదీదాకా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు న్యాయ విభాగం(నియామకాల) కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.ఆ పెద్దావిడ పిటిషన్తో..జయశ్రీ జోషి(71) 2020లో రాధాన్పూర్ కోర్టులో ఓ కేసు నమోదు చేసింది. అయితే అందుకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిందని హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ సందీప్ భట్ బెంచ్ విచారణ జరిపి.. కనిపించకుండా పోయిన ఆ ఫైల్స్ ఆచూకీ కనిపెట్టాలంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో..2024 డిసెంబర్లో ఈ పిటిషన్కు సంబంధించి సమగ్రమైన నివేదిక అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పుడే.. సూరత్ కోర్టుకు సంబంధించిన 15 కేసుల ఫైల్స్ కనిపించకుండా పోయాయనే విషయం వెలుగు చూసింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ టైంలో సంబంధిత అధికారిగా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి ఉండడం గమనార్హం. సూరత్ కోర్టులో ఆరేళ్లపాటు పని చేసి.. బదిలీ మీద కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఫైల్స్ మాయం అయిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.ఎవరీ సునీతా అగర్వాల్ఉత్తర ప్రదేశ్కు చెందిన జస్టిస్ సునీతా అగర్వాల్.. గతంలో అలహాబాద్ కోర్టులో జడ్జిగా పని చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో మానవ హక్కుల గురించి చర్చ ద్వారా ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆహారం పంచుతున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వాళ్లందరినీ విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. అంతేకాదు.. యూపీలో పని చేసే చోట్ల లైంగిక వేధింపుల కట్టడికి ఏర్పాటు చేసిన కీలక కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా పని చేశారు. -
Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే..
‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడ స్వర్ణమేలే’ అని పాడుకుంటూ ప్రేమికులు నిన్నటివరకూ వాలంటైన్స్ వీక్ను ఎంతో అద్భుతంగా చేసుకున్నారు. అయితే దీనికి భిన్నంగా భగ్నప్రేమికులు వాలంటైన్స్ వీక్లో ఆక్రోశానికి,ఆవేదనకు గురయ్యుంటారు. అందుకే వారంతా నేటి నుంచి (ఫిబ్రవరి15)నుంచి వారం రోజుల పాటు యాంటీ-వాలెంటైన్ వీక్ను ఉత్సహంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరి.. ఈ వారం రోజుల్లో వారు ప్రేమను ద్వేషిస్తూ ఏమేంపనులు చేస్తారంటే..యాంటీ-వాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 15 నుండి మొదలవుతుంది. ఫిబ్రవరి 21 వరకు భగ్నప్రేమికులు ఒక్కోరోజును ఒక్కోథీమ్తో జరుపుకుంటారు. ఇలా చేయడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. వాలెంటైన్స్ వీక్లో ప్రేమను పొందలేని వారు, మనసు విరిగిపోయిన వారు ఈ యాంటీ-వాలెంటైన్స్ వీక్ను జరుపుకుని తమలోని దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే మొదలైన థీమ్లతో ఒక్కోరోజును ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు.స్లాప్ డే యాంటీ-వాలెంటైన్ వీక్లో ఫిబ్రవరి 15న స్లాప్ డే జరుపుకుంటారు. మాజీ ప్రియుడు లేదా ప్రియురాలిని మరచిపోయేందుకు స్లాప్ డే జరుపుకుంటారు. ప్రేమలో మోసపోయినవారు తమ ఒత్తిడిని, దుఃఖాన్ని మరచిపోయేందుకు స్లాప్ డే చేసుకుంటారు. చేదు జ్ఞాపకాలు, చేదు అనుభవాల నుంచి బయటపడేందుకు స్టాప్డే సహకరిస్తుందని భగ్నప్రేమికులు చెబుతుంటారు.కిక్ డే యాంటీ-వాలెంటైన్ వీక్లో రెండవ రోజు కిక్ డే. దీనిని ఫిబ్రవరి 16న కిక్ డే జరుపుకుంటారు. మాజీ జీవిత భాగస్వామితో వచ్చిన చేదు జ్ఞాపకాలను జీవితం నుండి తరిమికొట్టే మార్గంగా కిక్డేను జరుపుకుంటారు.పెర్ఫ్యూమ్ డే పెర్ఫ్యూమ్ డే ఫిబ్రవరి 17న వస్తుంది. ఈ రోజున భాగస్వామి మిగిల్చిన పాత జ్ఞాపకాలను మరిపోయి, కొత్తగా మలుచుకునేందుకు ఇష్టమైన పెర్ఫ్యూమ్ను అప్లై చేసుకుంటారు.ఫ్లర్ట్ డేయాంటీ-వాలెంటైన్ వీక్లోని నాల్గవ రోజున ఫ్లర్ట్ డే జరుపుకుంటారు. ఈ రోజున తెగిపోయిన బంధాలను పక్కనపెట్టి, కొత్త స్నేహాలను ప్రారంభిస్తారు. ఫ్లర్ట్ డేను ఎవరికీ హాని చేయని విధంగా జరుపుకోవాలని పలువురు సూచిస్తుంటారు.కన్ఫెషన్ డే దీనిని ఫిబ్రవరి 19న జరుపుకుంటారు. ఈ రోజున భగ్నప్రేమికులు గతాన్ని మరచిపోయి స్నేహితుడు, లేదా స్నేహితురాలికి క్షమాపణలు చెబుతారు. భవిష్యత్తులో అలాంటి తప్పు పునరావృతం చేయనని హామీనిస్తారు.మిస్టింగ్ డే ఇది ఫిబ్రవరి 20న వస్తుంది. ఎవరినైనా మిస్ అవుతుంటే ఆ విషయాన్ని ఆరోజున వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తారు. మిస్ అవుతున్న ప్రియుడు లేదా ప్రియురాలికి ఫోన్ చేసి, మనసులోని భారాన్నంతా దించుకునే ప్రయత్నం చేస్తారు.బ్రేకప్ డేఫిబ్రవరి 21న బ్రేకప్ డే జరుపుకుంటారు. ఎవరితోనైనా సంబంధం ఇక కొనసాగించలేనని అనిపిస్తే వారికి ఆరోజున బ్రేకప్ చెబుతారు. సంతోషంగా లేని సంబంధం కొనసాగించకూడదనే ఉద్దేశంతో బ్రేకప్ డేను జరుపుకుంటారు. బ్రేకప్ డే తరువాత విడిపోయిన ప్రేమికులు సానుకూలంటా ఉంటూ, ముందుకు సాగాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు -
అమెరికాలో మరో విమానం ఆచూకీ గల్లంతు
వాషింగ్టన్ : అమెరికాలో మరో విమానం గల్లంతయ్యింది. 10 మంది ప్రయాణికులతో సెస్నా 208బీ విమానం అలస్కా మీదిగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో రాడార్ నుంచి జాడ అదృశ్యమైనట్లు సమాచారం. విమాన అదృశ్యంపై సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు సెస్నా 208బీ విమానం ఉనల్కలేట్ నుంచి నోమ్కు వెళుతుంది. ఆ సమయంలో రాడార్ నుంచి విమానం జాడ అదృశ్యమైంది. విమాన అదృశ్యంపై సమాచారం అదుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. విమానం జాడ కోసం శోధించాయి. అయితే నార్టోన్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన సహాయ బృందాలు అక్కడి చేరుకున్నాయి. ❗️Bering Air plane VANISHES over Alaska with ten people on board — rescue crews desperately hunt for missing aircraft#AlaskaRT pic.twitter.com/YosTNTRbrV— Moh Musthafa Hussain (@musthafaaa) February 7, 2025 -
Iran: ముగ్గురు భారతీయులు అదృశ్యం
ఇరాన్లో ముగ్గురు భారత పౌరులు అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్కు వెళ్లారు. తరువాత అదృశ్యమయ్యారు. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ సమస్యను ఇరాన్ ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ ఉదంతంలో మరింత సమాచారం కోసం ఇరాన్లో అదృశ్యమైన భారత పౌరుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం గతఏడాది డిసెంబర్ నెలలో ముగ్గురు భారతీయ పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్కు వెళ్లారు. అయితే వారు అక్కడికి చేరుకున్నాక వారికి వారి కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. దీనిపై దర్యాప్తు కోసం భారత్.. ఇరాన్పై ఒత్తిడి తీసుకువచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.ఈ విషయాన్ని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంతో పాటు టెహ్రాన్లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేశామని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం దీనిపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం -
శ్రీవల్లి అదృశ్యం
నాగోలు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోలు ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన గౌరు రోజు జయప్రద కుమార్తె శ్రీవల్లి (18) ఇంటర్లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం కొన్ని రోజుల క్రితం నాగోలు డివిజన్ పరిధిలోని బండ్లగూడలోని లక్ష్మి బాలికల హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నది. సంక్రాంతి సెలవులకు ఈనెల 11న ఇంటికి వెళ్లి ఈనెల 17న హాస్టల్కు వచ్చింది. 23న కూతురు కోసం హాస్టల్ వారికి ఫోన్ చేసి శ్రీవల్లి 20న ఇంటికి పంపినట్లు సమాచారం తెలిపారు. అయితే తమ కుమార్తె ఇంటికి రాలేదని వారు బదులిచ్చారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బండ్లగూడ హాస్టల్కు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా పంపినట్లు తెలిపారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు
బరేలీ: యూపీలోని బరేలీ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇద్దరు విదేశీయులకు గూగుల్ మ్యాప్ చుక్కలు చూపించింది. జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి, వారి విచారణను ఎదుర్కోవలసి వచ్చింది.వివరాల్లోకి వెళితే ఇద్దరు విదేశీ పర్యాటకులు గూగుల్ మ్యాప్ సాయంతో నేపాల్ వెళ్తుండగా దారి తప్పారు. ఢిల్లీ నుండి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళుతున్న ఈ ఫ్రెంచ్ పర్యాటకులు దారి తప్పి, యూపీలోని చురైలి ఆనకట్ట దగ్గరకు చేరుకున్నారు. కొందరు గ్రామస్తులు వీరిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిద్దరినీ చురైలి పోలీస్ స్టేషన్కు తరలించి, విచారించారు.ఈ ఘటన గురించి సర్కిల్ ఆఫీసర్ (సీఓ) బహేరి అరుణ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్రెంచ్ పౌరులు బ్రియాన్ జాక్వెస్ గిల్బర్ట్, సెబాస్టియన్ ఫ్రాంకోయిస్ గాబ్రియేల్ జనవరి 7న ఫ్రాన్స్ నుంచి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. వారు పిలిభిత్ నుండి తనక్పూర్ మీదుగా నేపాల్లోని ఖాట్మండు వెళ్ళవలసి ఉంది. అయితే గూగుల్ మ్యాప్ వారికి బరేలీలోని బహేరికి రూటును చూపించింది. దీంతో ఆ విదేశీయులు ఇద్దరూ దారితప్పి బరేలీలోని చురైలి ఆనకట్టకు చేరుకున్నారు.గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు విదేశీయులు నిర్మానుష్య ప్రదేశంలో సైకిల్పై వెళ్లడాన్ని గమనించిన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తరువాత గ్రామస్తులు ఆ విదేశీయులను ఆపి, వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.అయితే వారు చెప్పేది గ్రామస్తులకు అర్థం కాలేదు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరు విదేశీయులను చురైలి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య సైతం ఆ ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులను విచారించి,వారిని నేపాల్కు సురక్షితంగా పంపించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్ షో -
Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో..
అందరినీ ఆకట్టుకునే సోషల్ మీడియా ఇప్పుడు కుంభమేళా ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. వీటిలోని కొన్ని వీడియోలు అమితంగా అలరిస్తుండగా, మరికొన్ని ఆశ్చర్యపరిచేవిగా, తెగ నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇదేకోవలోని ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చి, కుటుంబ సభ్యులు తప్పిపోతారేమోనని భయపడేవారికి మంచి సలహా ఇస్తున్నట్లుంది ఈ వీడియో..మహా కుంభమేళాలో జనసమూహం అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయం పర్యాటకుల్లో ఉంటుంది. అయితే దీనికి ఒక వ్యక్తి చక్కని పరిష్కారం కనుగొన్నాడు. దీనిని చూడగానే నవ్వు వచ్చినప్పటికీ, ఓమారు ఆలోచింపజేస్తుంది.भारत एक जुगाड़ प्रधान देश है, पूरे परिवार को रस्सी से बांध लिया ताकि महाकुंभ में खो ना जाये 🤣🤣 #MahaKumbh pic.twitter.com/WJXU4EYCwO— Raja Babu (@GaurangBhardwa1) January 15, 2025సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ముందుకు నడుస్తుండగా, అతని వెనుక అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఉండటాన్ని గమనించవచ్చు. అయితే వాళ్లెవరూ దారితప్పికోకుండా ఉండేందుకు వారందరి చుట్టూ ఒక తాడుతో కట్టినట్లు చూడవచ్చు. వారంతా ఆ తాడులోపలే ఉంటూ ముందుకు కదులుతుండటాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియోను @GaurangBhardwa1 అనే ఖాతా ద్వారా ఎక్స్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు. ‘మహా కుంభమేళాలో తప్పిపోకుండా ఉండటానికి కుటుంబాన్నంతటినీ తాడుతో కట్టేశారు' అని ఆ వీడియో కింద క్యాప్షన్ ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 42 వేలకు పైగా జనం వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ‘ఆడవాళ్లు ఇక్కడకు అక్కడకు వెళ్లిపోతారు. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు సరైన పని చేశారు’ అని రాశారు. మరొక యూజర్ ‘ఈ టెక్నిక్ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు’అని రాశారు. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు -
HYD: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
ఖరతాబాద్: ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.... ఖైరతాబాద్ డివిజన్ మహాభారత్నగర్లో నివాసముండే తలారి ఎల్లయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా వీరి కుమార్తె తలారి రేణుకాదేవి (22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో రేణుకాదేవి తల్లి విజయలక్ష్మి ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తితో వెళ్లి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొండపొచమ్మ సాగర్ డ్యామ్లో పడి ఐదుగురు మృతి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాలు తీసింది. మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్లో యువకులు గల్లంతయ్యారు. ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు.మృతులను హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17)గా గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే. మృగాంక్(17), ఇబ్రహీం(20) ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతిఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు విద్యార్థుల గల్లంతుపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలన్నారు.మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: హరీష్రావుకొండపోచమ్మ సాగర్ ఘటనపై మాజీ మంత్రి హరీష్రావు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదీ చదవండి: సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు -
కుర్రాడిగా అదృశ్యమై.. 23 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ప్రత్యక్షమై.. వింత ఘటన
సరిగ్గా 23 ఏళ్ల క్రితం మాయమైన కుర్రాడు ఇప్పుడు వివాహితునిగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటికి తిరిగివస్తే, ఆ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది? అది ఊహకు అందదు. ఇటువంటి ఘటన గురించి విన్నవారు తెగ ఆశ్చర్యపోతారు. సరిగ్గా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.యూపీలోని సీతాపూర్(Sitapur)లో 23 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఒక కుర్రాడిని అతని జ్ఞాపకాలు ఇంటికి తిరిగివచ్చేలా చేశాయి. ఆ కుర్రాడు వివాహితునిగా మారి భార్య, ఇద్దరు పిల్లలలో పాటు గ్రామానికి తిరిగిరావడంతో అందరూ ఆశ్యర్యపోయారు. అతనిని చూసిన తల్లి షాక్నకు గురయ్యింది. అతనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కడుతున్నారు. బాల్యంలో అతని తలకు తగిలిన గాయం ఆధారంగా ఆ తల్లి అతను తన కుమారుడేనని గుర్తించింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని గుర్తించారు. 23 ఏళ్ల క్రితం ఆ బాలుని తల్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్నాళ్లకు కుమారుడిని కలుసుకున్న ఆ తల్లి భావోద్వేగానికి గురయ్యింది. ఈ ఉదంతం రెయుసా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రేవాన్ గ్రామానికి చెందిన అరవింద్ మౌర్య(Arvind Maurya) 2002లో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. అప్పుడు అరవింద్ వయసు దాదాపు 18 ఏళ్లు. ఆ సమయంలో అరవింద్.. సోంపు విక్రయించేవాడు. కొడుకు అదృశ్యం కావడంతో తల్లి చంపకళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు తెలిసిన అన్నిచోట్లా వెదికింది. పలుదేవాలయాల చుట్టూ తిరుగుతూ, తన కుమారుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పూజలు చేసింది.ఇప్పుడు ఇంటికి తిరిగివచ్చిన అరవింద్.. పోలీసులకు తాను ఇన్నాళ్లూ ఎక్కడున్నదీ, ఏం చేసినదీ తెలిపాడు. తాను ఇంటి నుంచి వెళ్లిపోయిన తరువాత పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాలలో ఉంటూ, ఏవో పనులు చేసుకుంటూ కాలం గడిపానని తెలిపాడు. అదేసమయంలో తనకు వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని తెలిపాడు. ఇప్పుడు తన భార్య, పిల్లల కోరిక మేరకు పంజాబ్ నుంచి తన ఇంటికి తిరిగివచ్చానని తెలిపాడు. అరవింద్ను, అతని కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పోలీసులు ఈ మిస్సింగ్ కేసు(Missing case)ను ముగించారు. అరవింద్ భార్య పూనమ్ మాట్లాడుతూ తన అత్తమామలను కలుసుకున్నానని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకంటూ ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా అరవింద్, పూనమ్లు 2014లో పంజాబ్లో వివాహం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం
ఇబ్రహీంపట్నం: వారం రోజుల్లో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. మిస్సింగ్ అయిన వారిలో ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. స్థానిక ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, మోమిన్పేట మండలం రాంనాథ్గుడపల్లికి చెందిన కొత్తగాడి బాల్రాజ్ కుమారుడు (17) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్యాసంస్థల్లో బీటెక్ (సీఎస్సీ) ప్రథమ సంవత్సరం చదువుతూ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నాడు.14న హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. తండ్రి బాల్రాజ్ విష్ణుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మరుసటి రోజు నేరుగా కాలేజ్కి వచ్చి ఆరా తీయగా.. సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఇదిలా ఉండగా యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం, కాప్రాయిపల్లికి చెందిన మరో విద్యార్థిని(17) గురునానక్ కాలేజ్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఇదే కళాశాల హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 17న సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయింది. అలాగే వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన 19 సంవత్సరాల విద్యారి్థని ఈనెల 20న అదృశ్యమైంది. ఈమె కూడా కాలేజ్ హాస్టల్లో ఉంటూ బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాలేజీ నిర్వాహకులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ్ కుమార్ ను బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
-
అశ్వాపురం మండలం మొండికుంటలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
-
తిరుపతిలో మిస్సింగ్ కలకలం
-
తిరుపతిలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్
-
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్కు యార్క్షైర్ కౌంటీలో ఒక పబ్తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్స్టా గ్రామ్లో పోస్ట్చేశారు. ‘‘ చిన్న వ్యాన్లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్నట్ స్క్వాష్ పై, కేక్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
Nigeria: పడవ ప్రమాదం.. 100 మంది గల్లంతు
అబుజా: ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పడవలో వ్యాపారులు నేషనల్ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ (ఎన్ఐడబ్ల్యూఏ)ప్రతినిధి మకామా సులేమాన్ మీడియాతో మాట్లాడుతూ పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్కు వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ తెలిపారు. ప్రయాణికులెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం కారణంగానే ప్రాణనష్టం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.తరచూ ప్రమాదాలుఘటనా స్థలంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. బోటులో ఎక్కువగా మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బోటులో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు తదితర అంశాలు ఇటువంటి ఘటనలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
సైనిక శిబిరంలో పనిచేస్తున్న కార్మికుడు అదృశ్యం
ఇంఫాల్: మణిపూర్లోని ఆర్మీ క్యాంప్లో పనిచేస్తున్న మెయిటీ కమ్యూనిటీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. లోయిటాంగ్ ఖునౌ గ్రామానికి చెందిన లైష్రామ్ కమల్బాబు సింగ్.. లిమాఖోంగ్ ఆర్మీ క్యాంపులో పని కోసం ఇంటి నుండి వెళ్లి, ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుందన్నారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా లైష్రామ్ కమల్బాబు సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.లైష్రామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను లిమాఖోంగ్ సైనిక శిబిరంలో కూలి పనులు చేసేవాడు. రాజధాని మణిపూర్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న 57 మౌంటైన్ డివిజన్లోని సైనిక శిబిరంలోని ఈ ప్రాంతంలో కుకీ జనాభా అధికంగా ఉంటుంది. జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి లిమాఖోంగ్ సమీపంలో నివసిస్తున్న మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసలో 250 మందికి పైగా జనం మృతిచెందారు.జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకేసులో ప్రమేయం ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీఎం బీరెన్సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, పలువురిని గుర్తించామన్నారు. గత నవంబర్ 11న భద్రతా బలగాలు- అనుమానిత కుకీ-జో తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ జిల్లాలోని సహాయ శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు
కైరో:ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదశాత్తు మునిగిపోయింది. ఈజిప్టు తీరానికి దగ్గరలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. మునిగిపోయినపుడు బోటులో మొత్తం 44 మంది ఉన్నారు. వీరిలో 31 మంది టూరిస్టులు కాగా 13 మంది సిబ్బంది.ప్రమాదం నుంచి 28 మందిని కాపాడినట్లు రెడ్సీ గవర్నరేట్ వెల్లడించింది.వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది.సముద్రంలో బోటును ఒక్కసారిగా అల వచ్చి బలంగా ఢీకొట్టడంతో బోటు మునిగినపోయినట్లు అధికారులు వెల్లడించారు.అల బలంగా తాకినపుడు కొంత మంది ప్యాసింజర్లు వారి క్యాబిన్లలో ఉండడం వల్ల తప్పించుకోలేకపోయారని తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు జరుగుతోందని చెప్పారు. -
మనసున్న కుక్క దొంగలు
-
పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
-
పిఠాపురం: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్యర్ చదువుతోంది.తొలుత గొల్లప్రోలు పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్కు లేఖ రాశారు. -
ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి,కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్ మండలం సోమిని సమీపంలో ప్రాణహిత నదిలో శనివారం(అక్టోబర్ 26) ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి నదిలో స్నానానికి వెళ్లగా ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు.గల్లంతైన వారిని బెజ్జూరుకు చెందిన జహార్ హుస్సేన్(24), ఇర్షద్ (20), మోయిసిధ్(22)గా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోదావరిలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు
తాళ్లరేవు: ఇంజినీరింగ్ విద్యార్థుల విహారయాత్ర విషాదాంతమైంది. యానాం సందర్శనకు వచ్చిన విద్యార్థుల్లో ఒక యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. శశి వేలివెన్ను ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఎల్లిన శివరామ్, మల్లిపూడి నిఖిల్ లక్ష్మణ్, మండా వంశీ, వెంపటి సంతోష్, కుతాని సాయిచంద్ర, కార్తిక్, మిజోన్స్ అనే యువకులు కారులో బుధవారం విహారయాత్రకు బయలుదేరారు. ఉదయమే రాజమహేంద్రవరం వచ్చి అక్కడ అన్నీ ప్రదేశాలను చూశారు. మధ్యాహ్నం కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి వచ్చారు. యానాంలోని పలు ప్రదేశాలు సందర్శించిన అనంతరం తిరిగి వెళుతూ గౌతమి గోదావరి చెంతన గల గోపులంక పుష్కరఘాట్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆగారు. వీరిలో కుతాని సాయిచంద్ర ఫొటోలు తీసుకుంటూ అదుపు తప్పి గోదావరిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన శివరామ్ కూడా గోదావరిలో కొట్టుకుపోసాగాడు. మిగిలిన విద్యార్థులు వెంటనే స్పందించి వారిని రక్షించడానికి ప్రయత్నించారు. శివరామ్ను కాపాడారు గానీ గోదావరి ప్రవాహానికి సాయిచంద్ర (21) కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరానికి చెందిన సాయిచంద్ర శశి వేలివెన్ను కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. శివరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.గతేడాది ఇదే నెలలో..ఇదే ప్రదేశంలో గతేడాది అక్టోబరు 21న ఇలాంటి ఘటనే జరిగింది. తణుకు పట్టణంలోని సజ్జాపురానికి చెందిన ఏడుగురు యువకులు పుట్టినరోజు వేడుకల కోసం యానాం వచ్చి తిరిగి వెళుతూ గోపులంక వద్ద స్నానానికి దిగారు. వారిలో నలుగురు యువకులు గల్లంతై మృతి చెందారు. -
వ్యాపారి అదృశ్యం కలకలం.. బిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన కారు
బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.ముంతాజ్ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
12 ఏళ్లయినా వీడని ఆశ.. నవరాత్రుల్లో కొడుకు దొరుకుతాడని..
వారణాసి: ఆశ అనేని మనిషిని ముందుకు నడిపిస్తుందని అంటారు. మహారాష్ట్రకు చెందిన ఒక జంట 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని కోసం ఏళ్ల తరబడి ఆశగా అన్నిచోట్లా వెదుకుతోంది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన విక్రమ్ మేఘ్వానీ 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ విక్రమ్ తల్లిదండ్రులు నాడు తప్పిపోయిన కొడుకు కోసం కాశీలోని దేవాలయాలలో వెదుకులాట సాగిస్తున్నారు. నవరాత్రులలో అమ్మవారు తప్పకుండా తమ వినతి వింటుందని, అందుకే కాశీలోని అమ్మవారి ఆలయాలలో తిరుగున్నామని వారు చెబుతున్నారు.తప్పిపోయిన కొడుకు ఫోటోను పట్టుకుని తిరుగుతున్న రణోమల్ సమనోమల్ మేఘ్వానీ, ఆయన భార్య లక్ష్మీబాయి రణోమల్ మేఘ్వానీలను చూసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు కాశీలోని వివిధ ఆలయాల వెలుపల తమ కుమారుని ఫొటోను, వివరాలతో కూడిన పోస్టర్ను అతికిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని ఆచూకీ లభిస్తుందని విక్రమ్ తల్లి లక్ష్మీబాయి ఆశాభావం వ్యక్తం చేశారు.2012, ఆగస్టు 29న తన కుమారుడు దుకాణం నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యాడని లక్ష్మీబాయి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఇప్పటి వరకు తమ కుమారుని ఆచూకీ లభించలేదన్నారు. ఈ వృద్ధ దంపతులు నవరాత్రులలో కాశీలో ఉంటూ, తప్పిపోయిన తమ కుమారుని కోసం వెదుకుతున్నారు.ఇది కూడా చదవండి: 16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్ -
మారేడుమిల్లి జలపాతంలో ముగ్గురు గల్లంతు
మారేడుమిల్లి: విహారయాత్ర కోసం ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది మెడికోలు అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని జల తరంగిణి జలపాతం వద్దకు రాగా.. విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా భారీవర్షం కురిసి ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో స్థానికులు రక్షించగా.. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది విద్యార్థులు వ్యాన్లో ఆదివారం విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జలపాతం పొంగింది. దీనిని గమనించిన 9 మంది విద్యార్థులు వెంటనే బయటకు వచ్చేశారు. జలపాతం మధ్యలో చిక్కుకుపోయి.. జలపాతం మధ్యలో ఉండిపోయిన సీహెచ్.హరిదీప్, కె.సౌమ్య, బి.అమృత, గాయత్రీ పుష్ప, హరిణిప్రియ కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రీపుష్ప, హరిణిప్రియ 6 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు ఒడ్డుకు చేర్చారు. మిగతా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో మార్కాపురానికి చెందిన సీహెచ్ హరిదీప్, విజయనగరానికి చెందిన కె.సౌమ్య, బి.అమృత ఉన్నట్టు ఎస్ఐ రాము తెలిపారు. -
ముగ్గురు గురుకుల విద్యార్థుల అదృశ్యం
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి0ది. గుమ్మడవెళ్లికి చెందిన అబ్దుల్ రహమాన్, హుజూర్నగర్కు చెందిన ముజీబ్, జాన్ పహాడ్కు చెందిన తౌఫిక్ ఈనెల 17న పాఠశాలలో అల్పాహారం తిన్న అనంతరం సమాచారం ఇవ్వకుండా గోడ దూకి వెళ్లిపోయారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్చార్జ్ ప్రిన్సిప ల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గోడదూకి వెళ్లినట్లు గుర్తించారు.వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు, గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ విష్ణుమూర్తికి సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు దేవరకొండ పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ము గ్గురు విద్యార్థులు ఈ నెల 16న పాఠశాల ప్రహరీ గోడవైపు నుంచి ఓ ప్యాకెట్ తీసుకుంటుండగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు గమనించి అడిగారు. అందులో కల్లు ప్యాకె ట్లు ఉండటంతో విద్యార్థులను మందలించారు. అయితే సద రు విద్యార్థులు తమకెలాంటి సంబంధం లేదని తెలిపారు. అందులో ఓ విద్యార్థి తమకు ఆ ప్యాకెట్లకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఏ తప్పూ చేయలేదని లేఖ రాసిపెట్టాడు. తమను ఎవరూ వెతకవద్దని లేఖలో పేర్కొని ఉంది. ఈ నెల 17న వారు అదృశ్యమయ్యారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీని వాస్ పాఠశాలకు చేరుకొని ఆరాతీశారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, రెండు రోజు లు గడుస్తున్నా పిల్లల ఆచూకీ తెలియక పోవడంతో విద్యార్థు ల తల్లిదండ్రులు పాఠశాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. -
ఆ పిల్లల ఆచూకీ కోసం 500 కెమెరాల్ని జల్లెడ పట్టిన పోలీసులు
పరీక్షల్లో తక్కువ మార్కులు.. తల్లిదండ్రులు తిడతారనే భయం. ఫలితం ఇద్దరు విద్యార్థులు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. చివరికిఢిల్లీ నోయిడా సెక్టార్-56లోని ఆర్యన్ చౌరాశ్యా, నితిన్ ద్యాన్లు ఉత్తరాఖండ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. అయితే గత వారం స్కూల్లో జరిగిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు మార్క్లు తక్కువ వచ్చాయి.‘ఇటీవల జరిగిన పరీక్షల్లో మీ ఇద్దరికి తక్కువ మార్కులు వచ్చాయి. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద మీ తల్లిదండ్రులతో సైన్ చేయించి.. రేపు ఉదయం స్కూల్కు రండి. మీ పేరెంట్స్ని వెంట తీసుకుని రండి. వారితో మాట్లాడాలి ’ అంటూ క్లాస్ టీచర్ ఆదేశాలతో ఇద్దరు విద్యార్ధులు బయపడిపోయారు. అదే రోజు సాయంత్రం తల్లిదండ్రులు తమని తిడతారేమోనని అటు స్కూల్.. దూరంగా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం స్కూల్ ముగిసిన వెంటనే పారిపోయారు.ఇదీ చదవండి : రంగంలోకి ఇండియన్ జేమ్స్ బాండ్స్కూల్ వెళ్లిన పిల్లలు సమయం మించిపోతున్నా.. ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు పిల్లల కోసం గాలించారు. 500 సీసీ కెమెరాలను తనిఖీలు చేయగా.. వారి ఇంటి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని ఆనంద్ విహార్లో ఆచూకీ లభించింది. పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. -
రష్యాలో హెలికాప్టర్ గల్లంతు
మాస్కో: తూర్పు రష్యాలోని కమ్చత్కాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతయింది. హెలికాప్టర్లో ఉన్నవారిలో 19 మంది ప్రయాణికులు కాగా ముగ్గురు సిబ్బంది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ రవాణా ఏజెన్సీ తెలిపింది. ఎంఐ-8టి శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ శనివారం(ఆగస్టు31) కమ్చత్కాలోని వచ్కజెట్స్ అగ్నిపర్వతం వద్ద నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరలేదని సమాచారం. హెలికాప్టర్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానం చేరిన తర్వాత పైలట్ల వద్ద నుంచి రావాల్సిన సమాచారం రాలేదు. హెలికాప్టర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన హెలికాప్టర్ 1960లో తయారైన డబుల్ ఇంజిన్ హెలికాప్టర్. ఈ మోడల్ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ వీటిని రష్యాతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. -
మలేషియా కౌలాలంపూర్ లో తెలుగు మహిళ గల్లంతు
-
కేదార్నాథ్ విపత్తు: 18 రోజులు దాటినా లభించని 17 మంది ఆచూకీ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో భారీ వర్షాల కారణంగా ఘోర విపత్తు సంభవించింది. ఈ ఘటన జరిగి 18 రోజులు దాటినా ఈ విపత్తులో చిక్కుకున్న 17 మంది జాడ ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీమ్కు ఇప్పటి వరకూ ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. కాగా ఈ విపత్తులో 23 మంది గల్లంతైనట్లు సోన్ప్రయాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.నేటికీ ఆచూకీ తెలియని 17 మందిలో యాత్రికులతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వీరి ఆచూకీ కోసం గౌరీకుండ్-కేదార్నాథ్ కాలినడక మార్గంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 31న రాత్రి భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో కేదార్నాథ్ నడక మార్గం రాళ్లతో మూసుకుపోయింది. ఈ సమయంలో చాలా మంది ఆ రహదారిలో చిక్కుకుపోయారు. నాటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా లించోలిలో శిథిలాలు, రాళ్ల కింద ముగ్గురు మృతదేహాలను కనుగొన్నారు. వీరిని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నివాసితులు సుమిత్ శుక్లా (21), చిరాగ్ గుప్తా (20), న్యూ మాండ్లోయ్ నివాసి నిఖిల్ సింగ్ (20)గా గుర్తించారు. ఈ మృతదేహాలకు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. -
వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయులు
పార్వతీపురం మన్యం: వృత్తి రీత్యా రాష్ట్రాలు దాటి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించి ఎస్ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సరాయివలస ఏకలవ్య మోడల్ స్కూల్లో వార్డెన్గా మహేష్, సోషల్ టీచర్గా ఆర్తి పనిచేస్తున్నారు. వీరిది హరియాణ రాష్ట్రం. ఎప్పటివలే శుక్రవారం విధులు ముగించుకుని స్థానికంగా గురివినాయుడుపేట గ్రామంలో తమ నివాసాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ద్విచక్రవాహనంపై మహేష్, ఆర్తి ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో గురివినాయుడుపేట వైపు వస్తుండగా, మార్గమధ్యంలోని రాయిమానువాగు దాటే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా.. మహేష్ ఆచూకీ దొరకలేదు. మహేష్ వాగులోని చెట్టుకొమ్మ సాయంతో బయటపడి వాగు అంచును పట్టుకొన్నప్పటికీ.. ఆ అంచు జారిపోవడంతో మళ్లీ వాగులో పడి కొట్టుకుపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
నా భర్త ఆచూకీ తెలపండి
హుజూరాబాద్: నెల రోజుల క్రితం నా భర్త సెంట్రింగ్ పని కోసం వెళ్లాడు.. తిరిగి రాలేదు.. పిల్లలు నాన్న ఎక్కడని ఏడుస్తున్నరు.. ఆయన ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి అంటూ ఓ మహిళ వేడుకుంటోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. హుజూరా బాద్ పట్టణంలోని కుమ్మరివాడకు చెందిన మోతె రమ్య–రఘుపతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రఘుపతి గత నెల 3వ తేదీన సెంట్రింగ్ పని కోసం సైదాపూర్ మండలంలోని రాయికల్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు రాయికల్ చెరువు కట్ట వద్ద అతని ద్విచక్రవాహనం కనిపించింది. ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రమ్య గత నెల 5న సైదాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, అతని కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు రఘుపతి జాడ తెలియలేదు. పిల్లలు నాన్నపై బెంగతో ఏడుస్తున్నారని రమ్య కన్నీరు పెట్టుకుంటోంది. రఘుపతికి అప్పుడప్పుడు చలి తీవ్రతకు మతిస్థిమితం సరిగా ఉండదని, దారితప్పి వెళ్లి ఉంటాడని చెబుతోంది. కొన్ని రోజుల క్రితం చిగురుమామిడి మండలంలోని సుందరగిరిలో కనిపించాడని, రేకొండ గ్రామంలో కనిపించాడని స్థానికులు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కానీ, ఆయా ప్రాంతాల్లో వెతికినా దొరకలేదని వాపోయింది. బ్లూ కలర్ షర్టు, నైట్ ప్యాంట్ ధరించాడని, 5.7 సెంటీమీటర్లు ఎత్తు, చామనఛాయ రంగులో ఉంటాడని, గుండు చేయించుకున్నాడని పేర్కొంది. మంచం పట్టిన అతని తండ్రి, వృద్ధురాలైన తల్లి ఆందోళన చెందుతున్నారని, ఎవరికై నా కనిపిస్తే సైదాపూర్ పోలీసులకు గానీ, తమకు గానీ సమాచారం ఇవ్వాలని కోరుతోంది. రఘుపతిని తమకు అప్పగిస్తే తగిన ప్రోత్సాహకం అందిస్తామని కుటుంబసభ్యులు అంటున్నారు. -
స్కూటీ లిఫ్ట్ అడిగి.. బస్సు, రైలెక్కి
మీర్పేట: ట్యూషన్కు వెళ్తున్నాని ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీకి చెందిన మధుసూదన్రెడ్డి, కవిత దంపంతుల కుమారుడు మహిధర్రెడ్డి(13) స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతన్నారు. రోజుమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు తన అన్నతో కలిసి సర్వోదయనగర్లో ట్యూషన్కు బయలుదేరాడు. వీరు నిత్యం లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. ఓ బైక్ ఆపగా.. అన్నను వెళ్లమని చెప్పిన మహిధర్ తాను తర్వాత వస్తానన్నాడు. అనతరం మరో స్కూటీని లిఫ్ట్ అడిగి మీర్పేట్ బస్టాండ్ వద్ద దిగి అక్కడ నుంచి మిథాని డిపోకు చెందిన ఉమెన్స్ కాలేజీ బస్లో మలక్పేట్ రైల్వే స్టేషన్ బస్టాప్లో దిగాడు. రైల్వే స్టేషన్కు వెళ్లి టికెట్ తీసుకుని రైలు ఎక్కాడు. ముందుగా కిడ్నాప్ అనుకుని.. ట్యూషన్కు వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవంతో కంగారుపడిన తల్లిదండ్రులు కిడ్నాప్ అనుకుని మీర్పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు రూ.2 వేలు తీసుకెళ్లిన్నట్లు గుర్తించారు. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా బాలుడు తనంతట తానే లిఫ్ట్ అడిగి.. బస్ ఎక్కి, అనంతరం రైలులో వెళ్లిన్నట్లు గుర్తించారు. సొంతూరు కర్నూల్ వెళ్లి ఉంటాడని భావించి అక్కడి పోలీసులు, బంధువులను అప్రమత్తం చేశామని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఏసీపీ కాశిరెడ్డి మీర్పేటకు వచ్చి సీసీ పుటేజీ పరిశీలించారని.. నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి వెతుకుతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా గోవా టికెట్ తీసుకున్న బాలుడు రైలెక్కి అక్కడకు వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
వయనాడ్ : ప్రాణాలకు తెగించి ఎంతోమందిని కాపాడిన ‘దేవుడు’ మాయం!
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలోని వయనాడ్లో ప్రకృతి ప్రకోపం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. వందలాదిమందిని పొట్టన పెట్టుకుంది. సర్వం కోల్పోయిన అభాగ్య జనం బిక్కుబిక్కు మంటున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే, తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంతోమంది బాధితులను రక్షించిన యువకుడు మరిన్ని ప్రయత్నాల్లో ఉండగానే కనిపించకుండా పోవడం ఆందోళన రేపుతోంది. దీంతో మా సూపర్ హీరో, మా రక్షకుడు, మా దేవుడు ఏమయ్యాడు అంటూ స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.వయనాడ్లోని కొండచరియలు విరిగిపడటంతో స్థానిక కుర్రాడు ప్రజీష్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. తనజీపులో రెండుసార్లు ప్రమాదకరమైన కొండ మార్గం గుండా వెళ్లి కొంతమందిని ప్రాణాలతో కాపాడాడు. ఈ క్రమంలోనే మూడో సారి వెళ్లి కనిపించకుండా పోయాడు. మరోవైపు చూరల్మల వద్ద పాడైపోయిన అతని జీప్ కనిపించింది. దీంతో మరింత ఆందోళన రేపింది. వరద నీరు , బురద , దొర్లి పడిన భారీ బండరాళ్ల మధ్య ఎక్కడ చిక్కుకుపోయాడో అని బాధపడుతున్నారు. పలుమార్లు తమ కష్టనష్టాల్లో తోడుగా నిలిచి "సూపర్ హీరో"గా పేరుతెచ్చుకున్న తమ ప్రజీష్ క్షేమంగా తిరిగి రావాలంటూ బరువెక్కిన హృదయంతో, కన్నీటితో ఆ దేవుడ్ని వేడుకుంటున్నారు.కొండపైకి వెళ్లవద్దని ఎంత హెచ్చరించినా, అక్కడ ఎంతోమంది చిక్కుకుపోయారు, వాళ్లని రక్షించాలన్న ప్రయత్నాల్లో అవన్నీ పట్టించుకోలేదని ప్రజీష్ స్నేహితులు తెలిపారు. ముండక్కై కుగ్రామంలో కొండ చరియలు విరిగిపడటం గురించి విన్న తర్వాత, ప్రజీష్ రెండుసార్లు కొండపైకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన చాలా మందిని రక్షించాడని గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లబోతుండగా మరో ఫోన్ కాల్ రావడంతో మళ్లీ కొండపైకి వెళ్లాడు. ఈసారి మాత్రం తిరిగి రాలేదని వాపోతున్నారు.పెళ్లి, చావైనా మొదటి నుంచి చివరి వరకూ అండగా ఉండేవాడని, గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉండేవాడు, తలలో నాలుకలో ఉండేవాడు, అందరికీ ఇష్టమైన వ్యక్ అంటూ తి మరో గ్రామస్థుడు గుర్తు చేసుకున్నారు. "ప్రజీష్ మా భూమికి సూపర్ హీరో.. కానీ ఇప్పుడు అతడే కనిపించడం లేదు" అని ఒక గ్రామస్థుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఏ క్షణానఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని వణికిపో తున్నారు.ఇదీ చదవండి : వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్ -
కేరళలో విరిగిపడ్డ కొండచరియలు. 123 మంది మృతి. వందలాది మంది జాడ గల్లంతు
-
దుబాయ్లో సిరిసిల్ల యువకుడి అదృశ్యం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు దుబాయ్లో అదృశ్యమయ్యాడు. పది రోజులుగా అతని ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సిరిసిల్ల పట్టణం శాంతినగర్కు చెందిన ఆకెన రవి(36) పెట్రోల్ బంక్లో పని చేసేవాడు. దుబాయ్లో మెరుగైన ఉపాధి లభిస్తుందనే ఆశతో సిరిసిల్లకు చెందిన మరో యువకుడు వేముల శ్రీనివాస్తో కలిసి విజిటింగ్ వీసాపై ఈనెల 17న అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులు, లేబర్ క్యాంపులు చూసి, పని దొరికే అవకాశం లేక పోవడంతో ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రవి కాటగలిశారు. అతని కోసం శ్రీనివాస్ తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో సిరిసిల్లలోని అతడి భార్య రూపకు సమాచారం ఇవ్వడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాశారు. రవి మిస్ అయినట్లు కేసు నమోదు చేయించిన ఎంబసీ అధికారులు అతడి కోసం పోలీసుల ద్వారా గాలించారు. సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షులు, సామాజిక సేవకులు గుండెల్లి నర్సింహులకు విషయం తెలియడంతో ఆయన తెలంగాణకు చెందిన వలస కార్మికుల ద్వారా ఆరా తీశారు. మొత్తంగా ఆదివారం షార్జాలో రవి ఉన్నట్లు గుర్తించారు.ఐదు రోజులుగా తిండిలేక.. నడవలేని స్థితిలో ఉన్న రవిని పోలీసులు గుర్తించి ఎంబసీ అధికారులకు అప్పగించారు. అతడి పాస్పోర్టును దుబాయ్ నుంచి రికవరీ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో రవికి విమాన టిక్కెట్ సమకూర్చి ఇండియాకు పంపించారు. బుధవారం ఉదయం అతడు హైదరాబాద్ రానున్నారు. మరో యువకుడు వేముల శ్రీనివాస్ సోమవారం ఉదయం సిరిసిల్లకు చేరాడు. రవిని స్వదేశానికి రప్పించడానికి చొరవ చూపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
మాయమైన తండ్రి.. ప్రభుత్వ ప్రకటనలో కనిపించగానే..
అది 2021 డిసెంబర్ నాటి ఘటన. మహారాష్టలోని పూణేలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. 63 ఏళ్ల దత్తాత్రేయ విష్ణు తాంబే ఇంటికి దూరమయ్యాడు. అతను ఎక్కడకు వెళ్లాడనే విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. అతనికోసం తెలిసిన అన్నిచోట్లా గాలించారు. విసిగివేసారి ఏదోఒక రోజు అతనే ఇంటికి తిరిగి వస్తాడని భావిస్తూ, కుటుంబసభ్యులు కాలం గడుపుతున్నారు.అయితే తాజాగా విష్ణు తాంబే కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించే వార్త వినిపించింది. దత్తాత్రేయ విష్ణు తాంబే అధికార శివసేన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని ఒక ప్రకటనలో కనిపించడం అతని కుటుంబ సభ్యులకు ఆనందం కలిగింది. శివసేన ఇన్స్టా ఖాతాలోని ప్రకటనలో కనిపిస్తున్నది దత్తాత్రేయ విష్ణు తాంబే అని అతని కుటుంబం తెలిపింది.వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ‘మహాయుతి’ ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి తీర్థ దర్శన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్లకు రూ.30,000 వరకు సబ్సిడీ అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై జోరుగా ప్రచారం సాగిస్తోంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం దత్తాత్రేయ విష్ణు తాంబే కుమారుడు భరత్ ఇటీవల శివసేన ప్రకటనను చూసి షాక్ అయ్యాడు. దానిని ఒక స్నేహితుడు తనకు వాట్సాప్లో పంపాడని తెలిపారు. షిక్రాపూర్లో తినుబండారాల దుకాణం నడుపుతున్న భరత్ మాట్లాడుతూ ‘ఆ స్క్రీన్షాట్ చూశాను. నేను వెంటనే నమ్మలేకపోయాను. ప్రభుత్వ తీర్థ దర్శన్ పథకం ప్రకటనలో మా నాన్న కనిపించారు’ అని అన్నారు.కాగా తమ తండ్రిని తమను కలపాలని భరత్ సీఎం షిండేను కోరారు. తమ తండ్రి సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నాడని తెలుసుకుని తామంతా సంతోషపడుతున్నామన్నారు. షిక్రాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దీపారాతన్ గైక్వాడ్ మాట్లాడుతూ భరత్ తమను సంప్రదించి, తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. డీఎస్పీ ప్రశాంత్ ధోలే మాట్లాడుతూ తాము దత్తాత్రేయ విష్ణు తాంబే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు, వారు గతంలో చాలాసార్లు దత్తాత్రేయ విష్ణు తాంబే తమకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయేవాడని, తరువాత తనంతట తానే తిరివచ్చేవారని పేర్కొన్నారన్నారు. దత్తాత్రేయ విష్ణు తాంబే చివరిసారిగా 2021, డిసెంబర్లో కరోనా సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయాడు. అతను ఏదో ఒకరోజు తిరిగివస్తాడని భావించి కుటుంబ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. -
ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై వీడని మిస్టరీ
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఎనిమిది రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించడం లేదు. బాలిక ఆచూకీలో ప్రభుత్వం వైఫల్యంపై వాల్మీకి, ప్రజాసంఘాలు,మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత ఇద్దరు పది, ఒకరు ఆరో తరగతి విద్యార్థులు చెబుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.మరోవైపు బాలిక మిస్సింగ్పై పోలీసులు సంఘమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నారు. ముచ్చమర్రిలో కేసును దర్యాప్తు చేసేందుకు భారీ మొత్తంలో పోలీసులు మొహరించారు. -
టెస్లాలో కాఫీ కప్పుల దొంగలు.. 65 వేల కప్పులు మాయం!
టెస్లా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బిలియనీర్ ఇలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఫ్యాక్టరీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీలో కాఫీ మగ్లు మాయవుతున్నాయట.కాఫీ మగ్ల దొంగతనం గురించి స్వయంగా టెస్లా ప్లాంట్ మేనేజర్ తెలిపారు. ప్లాంట్ మేనేజర్ ఆండ్రీ థిరిగ్ ఒక స్టాఫ్ మీటింగ్లో ఈ విషయాన్ని వెల్లడించారని జర్మనీకి చెందిన హ్యాండెల్స్బ్లాట్ వార్తాపత్రిక నివేదించింది.బెర్లిన్కు ఆగ్నేయంగా ఉన్న ఒక విశాలమైన కాంప్లెక్స్లో దాదాపు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో "నేను మీకు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నాను" అని థిరిగ్ చెప్పారు. "మేం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి మేము 65,000 కాఫీ మగ్లను కొనుగోలు చేశాం. మరిన్ని కాఫీ కప్పులు కొనడానికి ఆర్డర్లను ఆమోదించడంలో నేను విసిగిపోయాను" అంటూ నవ్వుతూ పేర్కొన్నారు. దొంగతనాలు ఆపకపోతే బ్రేక్ రూమ్లలో పాత్రలేవీ మిగలవు అంటూ చమత్కరించారు.ఇటీవల టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా ఫ్యాక్టరీలలో 10% ఉద్యోగులను తొలగించారు. దీంతో అనేక మంది తాత్కాలిక, పార్ట్టైమ్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. -
నదిలో పడ్డ బస్సులు.. 65 మంది గల్లంతు
ఖట్మాండు: నేపాల్లో కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం జరిగింది. మడన్-ఆశ్రిత్ హైవేపై శుక్రవారం(జులై 12) తెల్లవారుజామున కొండ చరియలు విరిగి పడ్డాయి. హైవేపై ప్రయాణిస్తున్న రెండు బస్సులపై భారీ కొండ రాళ్లు పడ్డాయి. దీంతో బస్సులు నదిలో పడిపోయాయి. బస్సులు నదిలో పడిపోయి మొత్తం 65 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరిలో ఏడుగురు భారతీయులున్నట్లు సమాచారం.గల్లంతైన వారి కోసం గాలింపు ఆపరేషన్ కొనసాగుతోందని, అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రధాన మంత్రి పుష్ఫ కమాల్ ప్రచండ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. -
ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?
సారిక ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం ఆమెకు మానుకోలేని అలవాటుగా మారింది. తన ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ పెట్టిన వెకేషన్ పోస్టులు, కెరీర్ సక్సెస్ పిక్స్ లాంటివి చూసి ఆందోళన చెందుతోంది, అసంతృప్తికి లోనవుతోంది.కెరీర్లో అవకాశాలు పోతాయనే భయంతో విపరీతంగా పనిచేస్తోంది. అయినా వెనుకబడిపోతాననే ఆందోళన. కొలీగ్స్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే ఉత్సాహంగా వెళ్లేది. ఈ మధ్య ఇతరుల ప్రెజెంటేషన్లతో పోల్చుకుని ఆందోళన చెందుతోంది. తరచుగా బిజినెస్ మీటింగ్స్కు డుమ్మా కొడుతోంది. అది ఆమె ఒంటరితనాన్ని మరింత పెంచుతోంది.ఏదో మిస్ అవుతున్నాననే బాధతో గిటార్ను, పెయింటింగ్ను పక్కన పడేసింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూంటుంది. అలా అర్ధరాత్రి వరకూ మేల్కొంటోంది. ఆ తర్వాత కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. పగలంతా చికాకుగా ఉంటోంది. ఇవన్నీ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఫ్రెండ్ సలహాతో కౌన్సెలింగ్కు వచ్చింది.‘నేను తప్ప అందరూ నాకంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ మిస్ అవుతున్నాను’ అని చెప్పింది. సారిక ‘ఏదో మిస్ అవుతన్నాననే భయం (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–ఫోమో)తో బాధపడుతోందని అర్థమైంది. సారికలానే ఈ జనరేషన్లో చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు.కారణాలు..– ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం ఉంటాయి. జయాపజయాలు ఉంటాయి. కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లాంటి ప్లాట్ఫామ్స్లో ఆనందకరమైన అంశాలను మాత్రమే పంచుకుంటారు. ఇవి వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఫోమోకు కారణమవుతాయి. – సారిక తన జీవితాన్ని ఆన్లైన్లో చూసే పర్ఫెక్ట్ లైఫ్లతో పోల్చుకుంటోంది. తనకలాంటి జీవితం లేదని అసంతృప్తి, తానలా సాధించలేకపోతున్నాననే అసమర్థతా భావనలతో కుంగిపోతోంది. – నిజ జీవితంలో కంటే కూడా సోషల్ మీడియాలో అందరూ తనను ఆమోదించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటోంది. తన పోస్ట్లకు, ఫొటోలకు లైక్స్ రాకపోతే తీవ్ర నిరాశ చెందుతోంది.లక్షణాలు..– సోషల్ మీడియా అప్డేట్స్ను నిరంతరం చెక్ చేయాలనే ఆలోచన, చెక్ చేయకుండా ఉండలేకపోవడం ఫోమో ప్రధాన లక్షణం..– ఏదో మిస్ అవుతున్నాననే భయం, ఆందోళన..– సోషల్ మీడియా సెలబ్రిటీలతో పోల్చుకోవడం వల్ల తానలా లేననే దిగులు, డిప్రెషన్..– ఇంటి పనులు, ఆఫీసుపనులపై దృష్టి పెట్టలేకపోవడం..– తనకన్నా మంచి జీవితం గడుపుతున్నట్లు కనిపించే ఇతరుల పట్ల అసూయ..– అర్ధరాత్రి వరకూ సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రలేమి..సెల్ప్ హెల్ప్ టిప్స్..– సోషల్ మీడియాను చెక్ చేయడానికి నిర్దిష్ట సమయాలను పెట్టుకోండి. – చెక్ చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి మీ స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్ను తొలగించండి. కనీసం నోటిఫికేషన్స్ను ఆపేయండి. – మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలను రాయండి. – మీకు స్ఫూర్తినిచ్చే, ఆనందాన్ని అందించే అకౌంట్స్ను మాత్రమే అనుసరించండి. ఆందోళన కలిగించే అకౌంట్స్ను అనుసరించవద్దు. – స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, సానుకూల భావాలను పెంపొందించే అర్థవంతమైన పరిచయాలను పెంచుకోండి. – ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే హాబీలను అలవాటు చేసుకోండి. – మైండ్ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయండి. ఆ వ్యాయామాలు.. ఏదో కోల్పోతున్నామనే ఆందోళనను తగ్గించేందుకు, వర్తమానంలో బతికేందుకు సహాయపడతాయి.– అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా, భయపడకుండా సారికలా సైకాలజిస్ట్ను కలవండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) ఆందోళన తగ్గించేందుకు సహాయ పడుతుంది. మీ విలువను, బంధాల విలువను గుర్తిస్తారు. మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
బీహార్ రాజధాని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగా నదిలో ప్రయాణీకులతో నిండిన పడవ బోల్తా పడింది. ఉమానాథ్ ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.పడవ బోల్తా పడిన వెంటనే 11 మంది ఈదుకుంటూ బయటికి రాగా, ఆరుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.గంగా దసరా సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన 17 మంది స్నానం చేయడానికి డయారా వైపు పడవలో వెళుతుండగా, గంగా నది మధ్యలో పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న ఎస్డీఎం శుభం కుమార్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. -
మలావీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సింగ్ విషాదాంతం.. ఉపాధ్యక్షుడి దుర్మరణం
లిలాంగ్వే: మలావీ ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సింగ్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్ నుంచి ఆ ఎయిర్క్రాఫ్ట్ సంబంధాలు తెగిపోయింది. దీంతో.. భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్క్రాఫ్ట్ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సోమవారం ఎంజుజు నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియల కోసం ఈ బృందం బయల్దేరింది. ఇందులో ఉపాధ్యక్షుడు సావులోస్తో పాటు మానవ హక్కుల సంఘం నేత, మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. కాసేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే అన్ని దళాలు చికంగావా అడవుల్లో ఎయిర్క్రాఫ్ట్ కోసం గాలింపు చేపట్టగా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని మరీ ఈ సెర్చ్ ఆపరేషన్ను పర్యవేక్షించారు. -
మలావీ ఉపాధ్యక్షుడి ఎయిర్క్రాఫ్ట్ గల్లంతు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదం ఘటన మరువక ముందే.. మరొ విమానం మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా (Saulos Chilima)తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని సావులోస్ విమానం సెర్చ్ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం ఇతర దేశాల సహాయం కోరుతున్నారాయన. మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు వెళ్లింది. సరిహద్దు దేశంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై అనుమానాల నేపథ్యంలో.. ఇంకా తుది వెలువడాల్సి ఉంది. -
ట్రెక్కింగ్కు వెళ్లి నలుగురు మృతి..?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో ట్రెక్కింగ్(పర్వతారోహణ)కు వెళ్లిన 22 మంది సభ్యుల టీమ్లో నలుగురు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల వారు దారితప్పి మిస్సయినట్లు తెలుస్తోంది. వీరంతా సహస్రతాల్ ప్రాంతంలో మే29న ట్రెక్కింగ్ ప్రారంభించారు. వీరంతా సాహస యాత్ర ముగించుకుని జూన్7న తిరిగి రావాల్సి ఉంది. అయితే యాత్ర మధ్యలోనే నలుగురు దారితప్పి కనిపించకుండా పోవడంతో మిగిలిన వారిని వెనక్కి తీసుకురావాల్సిందిగా ట్రెక్రింగ్ ఏజెన్సీ ఎస్డీఆర్ఎఫ్ను కోరింది. 4100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతాల్ ప్రాంతంలో మొత్తం ఏడు సరస్సులుంటాయి. ఇక్కడి నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు. -
అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
అమెరికాలో వరుస హత్యలు, రోడ్డు ప్రమాదాలు, అదృశ్యం, అనూహ్యమరణాలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో అదృశ్యం కావడం ఆందోళన రేపింది. ఎన్నో కలలతో ఉన్నత చదువులకోసం అమెరికా పయనం కాబోతున్న భారతీయ యువతకు, అందులోనూ తెలుగు విద్యార్థులకు, తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.హైదరాబాద్కు చెందిన కందుల నితిషా (23) మే 28 నుంచి కనిపించకుండా పోయింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలోని శాన్ బెర్నార్డినోకు చెందిన విద్యార్థిని నితిషా కనిపించడం లేదన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కందుల నితిషా కాలిఫోర్నియాలోని లాసె ఏంజెల్స్ నుంచి కనిపించ కుండా పోయిందని, ఆమె ఆచూకీ లభిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటించారు. కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్తో 2021 టయోటా కరోలాకారులో వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని CSUSB చీఫ్ ఆఫ్ పోలీస్ జాన్ గుట్టీరెజ్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటన జారీ చేశారు.ఆచూకీ తెలిసినవారు (909) 537-5165 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. కాగా ఇటీవల క్లీవ్ ల్యాండ్ నగరంలో అదృశ్యమైన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ (25) తర్వాత శవమై కనిపించాడు. అలాగే చికాగోలో తెలంగాణకు చెందిన విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం లాంటి అనేక ఘటనలు అమెరికాలో మన విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. -
ఆయుధంతో సహా మహిళా కానిస్టేబుల్ అదృశ్యం
బీహార్లోని సమస్తిపూర్లో ఓ మహిళా కానిస్టేబుల్ అదృశ్యమయ్యారు. సీతామర్హిలో మే 20న జరిగిన ఐదో విడత పోలింగ్లో ఈ మహిళా కానిస్టేబుల్కు విధులను కేటాయించారు. అయితే ఆమె ఆయుధంతో పాటు అదృశ్యమయ్యారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ ఉదంతంపై స్థానిక పోలీసుశాఖలో చర్చలు జరుగుతున్నాయి.మహిళా కానిస్టేబుల్ సుభంతి కుమారి ఘాటో పోలీస్ స్టేషన్లోని డయల్ 112లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సీతామర్హిలో ఎన్నికల విధులలో కొన్ని భాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరారయ్యారు. ఆమె మొబైల్ ఫోన్ కంటిన్యూగా స్విచ్ ఆఫ్ చేసి ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ విషయమై సీతామర్హి ఎస్పీ సమస్తిపూర్ ఎస్పీకి లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి సమాచారం లేకుండా అదృశ్యమైన ఈ మహిళా కానిస్టేబుల్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా సమాచారం ప్రకారం ఈ మహిళా కానిస్టేబుల్ సమస్తిపూర్ పోలీస్ సెంటర్లో తన దగ్గరున్న ఆయుధాన్ని సమర్పించారు. ఉన్నతాధికారులు ఈ మహిళా కానిస్టేబుల్పై చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది. -
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్లైన్లో ఉన్నాడు" రూపేష్ తండ్రి సదానందం తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు. -
బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
బ్రెజిల్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 57కి చేరింది. స్థానిక అధికారులు మీడియాకు పలు వివరాల తెలిపారు.ఉరుగ్వే, అర్జెంటీనా సరిహద్దుల్లోని రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల కారణంగా 67 మంది గల్లంతైనట్లు పేర్కొన్నారు. 32 వేల మందికి పైగా జనం నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలోని 497 నగరాల్లో మూడింట రెండొంతుల మందిపై తుఫాను ప్రభావం పడింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో ఒక జలవిద్యుత్ ప్లాంట్లోని ఆనకట్ట పాక్షికంగా దెబ్బతింది. బెంటో గోన్సాల్వ్స్ పట్టణంలోని ఆనకట్ట కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.పోర్టో అలెగ్రేలోని గైబా సరస్సులో నీరు పెరిగింది. వీధులను వరద నీరు ముంచెత్తింది. పోర్టో అలెగ్రే అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిరవధికంగా నిలిపివేసింది. రాగల 36 గంటల్లో రియో గ్రాండే దో సుల్ ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. -
దురదృష్టం అంటే ఈమెదే.. కూటమికి కూడా!
భోపాల్: మధ్యప్రదేశ్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఖజురహో అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎన్నికల కమిషన్కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో 'సిగ్నేచర్ మిస్సింగ్' అభ్యర్థి పోటీ నుండి నిష్క్రమించడానికి దారితీసింది. రాష్ట్రంలోని నివారి అసెంబ్లీ స్థానం నుంచి 2008లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై ఒకసారి గెలిచిన మీరా యాదవ్.. తర్వాత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ఖజురహో లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ తొలుత మనోజ్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత ఈ సీటును మీరా యాదవ్కు ఇచ్చింది. దీంతో ఆఖరి రోజున గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈమె నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఆమె పత్రాలను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించారని మీరా యాదవ్ భర్త, ఉత్తర ప్రదేశ్నుంచి రెండుసార్లు సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయిన దీప్ నారాయణ్ యాదవ్ చెప్పారు. తర్వాత రోజు సవరించిన ఓటరు జాబితాను సమర్పించకపోవడంతో పాటు ఒక చోట అభ్యర్థి సంతకం లేదని అధికారులు చెప్పారని ఆయన వివరించారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. కాగా ఈ ఖజురహో స్థానంలో బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్, ప్రస్తుత ఎంపీ వీడీ శర్మను పోటీకి దింపింది. 2019 ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 4.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మీరా యాదవ్ నామినేషన్ను తిరస్కరించడం "ప్రజాస్వామ్య హత్య"గా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. -
విశాఖ సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం సముద్రంలో ఆరుగురు మత్య్సకారులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సోమవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V 1-MO -2736 నెంబర్ బోట్లో వేటకు వెళ్లారు. రాత్రి గడిచినా వారు ఇంటికి చేరకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మంగళవారం కోస్ట్గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫిషింగ్ బోట్లు, కోస్ట్గార్డు సాయంతో మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన మత్సకారుల స్వస్థలం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారిగా సమాచారం. చదవండి: చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా! -
అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్ : క్లీవ్ల్యాండ్ డ్రగ్స్ ముఠా పనేనా?
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల రక్షణకు సంబంధించి వరుస ఘటనలు ఆందోళన రేపు తున్నాయి. తాజాగా అమెరికాలో మాస్టర్స్ చదువుతున్నహైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. క్లీవ్ల్యాండ్లో డ్రగ్స్ అమ్మే ముఠానే ఈ కిడ్నాప్కు పాల్పడినట్టు తెలుస్తోంది. క్లేవ్ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అబ్దుల్ మహ్మద్ మార్చి 7 నుంచి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు అందోళనకు గురయ్యారు. ఇంతలో అయితే కిడ్నాపర్ల నుంచి డబ్బులుచెల్లించాల్సిందిగాలు గుర్తు తెలియని వ్యక్తులనుంచి ఫోన్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహ్మద్ సలీమ్ వెల్లడించారు. అబ్దుల్ను విడుదల చేయాలంటే 1,200 డాలర్లు డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో వారు మార్చి 8న క్లీవ్ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ నుండి సహాయం కోరారు. మరోవైపు మార్చి 7న తన కొడుకుతో చివరిసారిగా మాట్లాడానని అంటూ అబ్దుల్ తల్లి అబేదా ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఆచూకీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. క్లీవ్ల్యాండ్ పోలీసులు ప్రస్తుతం అబ్దుల్ అదృశ్యంపై విచారణ చేపట్టారు. -
కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి!
ఇండోనేషియాలోని సుమత్రా దీవులు ప్రకృతి విలయానికి అతలాకుతలమవుతున్నాయి. కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 19 మంది మృతి చెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఇండోనేషియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమత్రా దీవుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఘటనా స్థలంలో సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ప్రమాద ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, నేలకూలిన చెట్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి డోనీ యుస్రిజల్ తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లోని పెసిసిర్ సెలాటాన్ జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి గ్రామాల్లో విధ్వసం సృష్టించాయి. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 19 కి చేరుకుంది. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడినకారణంగా 14 గృహాలు నేలమట్టమయ్యాయి. 80 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
‘మా కొడుకు ఎక్కడ?..’ ప్రధాని మోదీకి అభ్యర్థన
భారత నౌకా దళానికి చెందిన సాహిల్ వర్మ ఈ ఫిబ్రవరి 27 నుంచి ఆదృశ్యం అయ్యారు. ఆయన ఆచూకీ కోసం భారత నేవీ ఎయిర్ క్రాఫ్ట్, నౌకలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తమ కొడుకు ఆచూకీ ఇంకా తెలియకపోవటంపై సాహిల్ వర్మ తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి, సీబీఐ, రక్షణ శాఖమంత్రి, హోం శాఖ మంత్రి, జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్గవర్నర్ మనోజ్ సన్హా జోక్యం చేసుకొని తన కుమారుడిని క్షేమంగా వెతికి తీసుకురావాలని కోరుతున్నారు. సాహిల్ తల్లిదండ్రులు జమ్ములోని గౌ మన్హాసన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ‘మా కుమారుడు ఎక్కడ ఉన్నాడు’ అంటూ సాహిల్ వర్మ తల్లిదండ్రులు సుభాష్ చందర్, రామా కుమారి కన్నీరుమున్నీరవుతున్నారు. ‘మేము ఫిబ్రవరి 29న మా కుమారుడు రెండు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడనే సమాచారాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలుకున్నాం. మేము సాహిల్ వర్మతో ఫిబ్రవరి 25న చివరిసారి మాట్లాడాము’ అని సాహిల్ తండ్రి సుభాష్ చందర్ తెలిపారు. తమ కుమారుడి ఆచూకీని తొందరగా తెలుసుకోని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉండగా అదృశ్యమైన తమ కుమారుడి కేసును సీబీఐకీ అప్పగించాలన్నారు. 400 మంది నౌకలో ఉండగా తమ కుమారుడు మాత్రమే అదృశ్యమయ్యాడని అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి సాహిల్ వర్మ (సీమ్యాన్-2) కనిపించకుండా పోవడం దురదృష్టకరమని భారత నేవీకి చెందిన వెస్ట్రన్ కమాండ్ వెల్లడించింది. సాహిల్ భారత నేవీ షిప్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది. సాహిల్ వర్మ ఆచూకీ తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి బోర్డును ఏర్పాటు చేసినట్లు వెస్ట్రన్ కమాండ్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు బోర్డును ఆదేశించింది. -
గూగుల్లో వెతికి మరీ..
హైదరాబాద్: ఒకవేళ ఎవరైనా మిస్ అయితే..పోలీసులు ఎలా కనుక్కుంటారని 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గూగుల్లో సెర్చ్ చేశాడు. సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీఫుటేజీల ఆధారంగా పోలీసులు ట్రేస్ చేసి పట్టుకుంటారని గూగుల్ నుంచి సమాధానం దొరికింది. అంతే..సెల్ఫోన్ను ఇంట్లో పడేశాడు..సీసీ కెమెరాలకు దొరక్కుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుని..చాకచక్యంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తనను ఎప్పటికీ కనుక్కోకూడదన్న ఆలోచనతో వెళ్లిపోయిన ఆ విద్యార్థి ఆచూకీ కనుగొనాలంటూ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ కమలాపురికాలనీ ఫేజ్–2కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శైలేష్ కొనోడియా కుమారుడు జయేష్ కొనోడియా (17) ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. గత నెల 17వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అయితే వెళ్లే సమయంలో సెల్ఫోన్ను ఇంట్లో వదిలేశాడు. కుటుంబ సభ్యులు సెల్ఫోన్ను చెక్ చేయగా మిస్ అయితే పోలీసులు ఎలా ట్రేస్ చేస్తారనే విషయాలను గూగుల్ ద్వారా తెలుసుకున్నట్లు గుర్తించారు. ఆ మేరకే సెల్ఫోన్ను ఇంట్లో వదిలేసి, సీసీ కెమెరాలకు చిక్కకుండా వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. శైలేష్ సోదరుడు నీలేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రెండు దశాబ్దాల ఎదురుచూపు ఫలించింది: అంతలోనే ట్విస్ట్
కొంగట్టుకు తిరుగుతూ కబుర్లు చెప్పే బిడ్డ కళ్లముందునుంచి అదృశ్యమైతే, ఆ వేదన వర్ణనాతీతం. ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియక ఆ తల్లిపేగు అల్లాడిపోతుంది. కానీ రెండుదశాబ్దాల తరువాత ‘అమ్మా’ అంటూ తిరిగొస్తే.. కలో మాయో తెలియని అయోమయంలో అకస్మాత్తుగా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఎన్డీవీటీ కథనం ప్రకారం ఢిల్లీలో నివసించే రతీపాల్ సింగ్, భానుమతి కుమారుడు పింకు. పింకు 2002లో దాదాపు పదకొండేళ్ల వయస్సులో తండ్రితో చిన్న తగాదాపడటంతో తల్లి మందలించింది. అంతే క్షణికావేశంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఎంతవెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎప్పటికైనా రాకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నారు. వారి ఆశలు ఫలించి 22 ఏళ్ల తరువాత అమేథిలోని తన అమేథీలోని ఖరౌలిగ్రామానికి వచ్చాడు పింకు. అతణిని గుర్తించిన స్థానికులు, బంధువులు ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పరుగున పరుగున వచ్చి కన్నవాళ్లు పింకూ శరీరంపై ఉన్న మచ్చను చూసి పింకూని గుర్తుపట్టారు. ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సన్యాసిలా మారిపోయిన తమ కుమారుడి పరిస్థితి చూసి ఆవేదనకు లోనయ్యారు. ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి సంపన్నమైన రాజ్యాన్ని విడిచిపెట్టి సన్యాసిగా మారిన రాజు లాంటి జానపద కథలు చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. చివరికి పుట్టిన ఊరును, కన్నతల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. కన్నతల్లి గుండెలు పగిలే మరో ట్విస్ట్ ఏంటంటే.. తల్లిదండ్రులను ఓదార్చుతూనే, మళ్లీ తాను వెళ్లిపోవాలని తేల్చి చెప్పాడు పింకూ. వారు ఎంత మొర పెట్టుకున్నా వినకుండా, మీతో కలిసి జీవించలేనంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంతేకాదు ఒక సన్యాసిగా తప్పనిసరిగా తల్లి నుండి భిక్షను స్వీకరించే కర్మను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు చెప్పాడు. ఈ పరిణామంతో వారు ఆవేదనలో మునిగిపోయారు. అయితే తమ కుమారుడికి చెందిన మతపరమైన విభాగం పింకూని విడిచిపెట్టడానికి రూ.11 లక్షలు అడుగుతోందని పింకు తండ్రి ఆరోపించాడు. రూ.11లు కూడా లేని తాము సొమ్ము ఎక్కడనుంచి తేవాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #Delhi | Boy, who went missing 22 years ago, returns to mother as a monk. Read here: https://t.co/YWDMh5u9aT pic.twitter.com/HQeEA78XCY — NDTV (@ndtv) February 7, 2024 -
పోలింగ్లో గందరగోళం.. పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు మాయం!
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభించే ముందు బ్యాలెట్ పేపర్లు కలిగిన బ్యాగులను అధికారులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు ఎన్నికల కేంద్రాల వద్ద ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ పత్రాలు ఉన్న బ్యాగులను తెరిచి చూడగా వాటిలో కొన్ని చిరిగిపోయి ఉండగా, మరికొన్ని బ్యాలెట్ పత్రాలు కనిపించకుండా పోయాయి. కరాచీ ఎన్నికల అధికారి దీనిపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేసేందుకే ఈ బ్యాలెట్ పత్రాలను ఎవరో మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ ప్రారంభించేముందు పాక్ ఎన్నికల సంఘం ఈ బ్యాలెట్ పత్రాలను వివిధ ఎన్నికల కేంద్రాలకు పంపింది. వాటిని పంపే సమయంలో బ్యాలెట్ పేపర్లు చినిగిపోయిన విషయాన్ని పాక్ఎన్నికల సంఘం గమనించలేదా? లేక దారిలో ఎవరైనా ఇలా చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కాగా ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. -
యులిప్.. లోతుగా తెలుసుకున్నాకే!
ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేద్దామని బ్యాంక్కు వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్డీ కాదని అతడికి తెలిసొచ్చింది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి. బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది. యులిప్లు – మ్యూచువల్ ఫండ్స్ యులిప్లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యులిప్ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్లను మ్యూచువల్ ఫండ్స్కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి. సంక్లిష్టత.. పారదర్శకత లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్లు, ఫండ్స్లో పూర్తిగా భిన్నం. యులిప్లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది. ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు. రాబడులపై గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్లలో ఉంటుంది. పైగా ఎఫ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు. యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణలు కాదు.. అవసరాలు కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు. మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం. మార్గమేంటి..? అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్ఎస్ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్ఎస్ఎస్ఎస్లో అది లేదు. కాకపోతే యులిప్తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్లలో కంటే ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన. -
టెక్ ప్రపంచాన్ని శాసించిన బ్యాంకర్! ఇన్నాళ్లకు తెరపైకి..
ఒకప్పుడు చైనా టెక్ ప్రపంచాన్ని శాసించిన ప్రముఖ టెక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బావో ఫాన్ (Bao Fan) గురించి వినే ఉంటారు. అవినీతి నిరోధక చర్యల నేపథ్యంలో ఏడాది క్రితం అదృశ్యమైన ఆయన తాజాగా తెరపైకి వచ్చారు. తాను స్థాపించిన సంస్థకు అధికారికంగా బావో ఫాన్ రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఆరోగ్య కారణాలు, కుటుంబ వ్యవహారాలపై ఎక్కువ సమయం గడపడానికి బావో ఫాన్ ఛైర్మన్, సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు చైనా రినయ్సెన్స్ (China Renaissance) హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీకి శుక్రవారం ఒక ఫైలింగ్లో వెల్లడించింది. ఆయన రాజీనామాకు సంబంధించి ఇంతకు మించి కంపెనీ షేర్హోల్డర్ల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొంది. కంపెనీలోని ఇతర ఉన్నత స్థానాలతో పాటు ఛైర్మన్, సీఈవో పదవులను సైతం పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు చైనా రినయ్సెన్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా బావో ఫాన్ స్థానంలో కంపెనీ సహ-వ్యవస్థాపకుడు జీ యీ జింగ్ను కొత్త ఛైర్మన్గా నియమించనున్నట్లు, అలాగే ఆయనకు ప్రస్తుతమున్న యాక్టింగ్ సీఈవో హోదాను సీఈవోగా మార్చనున్నట్లు కంపెనీ ఫైలింగ్ పేర్కొంది. ఇన్నాళ్లూ ఏమైపోయాడో.. బావో ఇప్పుడు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు.. ఆయనతో ఎవరైనా టచ్లో ఉన్నారా అనే విషయాలకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అందించలేదు. ఆడిటర్లు బావోను చేరుకోలేకపోయినందున, ఏప్రిల్లో కంపెనీ వార్షిక ఫలితాల విడుదలను ఆలస్యం చేయవలసి వచ్చిందని వివరించింది. బావో 2023 ఫిబ్రవరిలో అదృశ్యమైనప్పటి నుంచి దేశంలోని అగ్రశ్రేణి యాంటీ గ్రాఫ్ట్ నియంత్రణ సంస్థ నిర్బంధంలో ఉన్నట్లు గత వేసవిలో ఒక ప్రభుత్వ ఆర్థిక ప్రచురణకు చెందిన ఎకనామిక్ అబ్జర్వర్ నివేదించారు. కార్పొరేట్ లంచం అనుమానిత కేసులో ఆయన్ను విచారిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. తిరుగులేని బ్యాంకర్ చైనా టెక్ పరిశ్రమలో ప్రముఖ బ్యాంకర్ అయిన బావో ఫాన్ 2005లో బీజింగ్లో చైనా రినయ్సెన్స్ను స్థాపించారు. చైనీస్ టెక్ సంస్థల కోసం అగ్ర డీల్మేకర్లలో ఒకడిగా పరిశ్రమను శాసించారు. ఆ దేశంలోని రెండు ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీసులైన మీటువాన్, డయాన్పింగ్ మధ్య 2015 విలీనానికి ఆయనే మధ్యవర్తిత్వం వహించారు. ఆ రెండు కంపెనీల “సూపర్ యాప్” నేడు చైనా అంతటా విస్తరించింది. -
బెంగళూరులో మిస్ అయిన బాలుడు..హైదరాబాద్లో ప్రత్యక్షం
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులో మిస్సయిన 12 ఏళ్ల బాలుడు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాడు. బుధవారం నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఏడుస్తూ కనిపించిన బాలుడిని మెట్రో సిబ్బంది గమనించి పోలీసులకు అప్పగించారు.. కాగా హైదరాబాద్, బెంగళూరు మధ్య దూరం 570 కి. మీ. బెంగళూరు నుంచి రైలులో మైసూర్ మీదుగా బాలుడు హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాబు ఆచూకీ తెలియడంతో అతడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ అసలేం జరిగిందంటే.. బెంగుళూరుకు చెందిన బాలుడు ప్రణవ్(12) డీన్స్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కోచింగ్ సెంటర్కు వెళ్లిన పిల్లవాడు తిరిగి ఇంటికి చేరుకోకఅతడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. వారికి చిక్కుకుండా విద్యార్ధి తప్పించుకుంటూ వచ్చాడు. బాలుడిని గుర్తించిన ప్రదేశాలకు పోలీసులు చేరుకునే సమయానికి, అతను అప్పటికే మరొకచోటుకి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఉదయం 11 గంటలకు వైట్ఫీల్డ్లోని కోచింగ్ సెంటర్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు యెమ్లూర్ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద కనిపించాడు. అదే రోజు సాయంత్రం బెంగళూరులోని మెజెస్టిక్ బస్ టెర్మినస్లో బస్ దిగుతుండగా చివరిగా కనిపించాడు. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కుమారుడి ఆచూకి తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నాడు. బాలుడు రోడ్డు మీద నడుస్తున్న సీసీటీవీ ఫుటేజీని షేర్ చేశారు. అంతేగాక కొడుకును ఇంటికి రావాంటూ అతడి తల్లి ఓ వీడియో కూడా పోస్టు చేశారు. దీంతో బాలుడి ఫోటోన ఆన్లైన్లో పోస్టు చేస్తూ ప్రచారం చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు హైదరాబాద్లో గుర్తించడంతో ప్రణవ్ మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. అతడి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు హైదరాబాద్ బయల్దేరారు. -
ప్రైవేటు టీచర్ అదృశ్యం.. చివరిసారి కాల్ చేసిన యువకుడు
కర్ణాటక: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకా మేలుకోటె దగ్గర మాణిక్యనహళ్ళికి చెందిన వి. దీపిక గౌడ (28) అనే ప్రైవేటు స్కూలు టీచర్ అదృశ్యమై, ఆపై హత్యకు గురికావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మేలుకోటెలో ప్రసిద్ధ యోగ నరసింహ స్వామి కొండ కింద పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం సోమవారం సాయంత్రం బయటపడింది. ఫోన్ రాగానే స్కూలు నుంచి వెళ్లి.. వివరాలు.. మానిక్యనహళ్ళిలో వెంకటేష్ కుమార్తె అయిన దీపికకు అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకునితో పెళ్లయింది, వారికి 8 ఏళ్ల కూతురు ఉంది. మేలుకోటెలోని ఎస్ఈటి పబ్లిక్ స్కూల్లో టీచర్గా ఆమె పనిచేసేది. గ్రామం నుంచి రోజూ తన డియో స్కూటర్లో స్కూలుకు వెళ్లి వచ్చేది. ఈ నెల 20వ తేదీన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్కూలు అయిపోగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రావడంతో స్కూటర్లో వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె జాడ లేదు. ఆమె శవం దొరికిన చోటుకు కొంతదూరంలో స్కూటర్ పార్క్ చేసింది. సోమవారం కూడా స్కూటర్ అక్కడే ఉండడం చూసి స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి స్కూటర్ వివరాలను బట్టి దీపకదిగా గుర్తించి ఆమె తండ్రి వెంకటే‹Ùను కలిసి మాట్లాడారు. ఈ నెల 20వ తేదీనే తమ కూతురు మిస్సింగ్ అని మేలుకోటె పీఎస్లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పాడు. చివరకు స్కూటర్ చుట్టుపక్కల ప్రజలతో కలిసి గాలించగా పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం లభ్యమైంది. టిక్టాక్ వీడియోలు దీపిక సినిమా హీరోయిన్కు తీసిపోని అందంతో ఆకట్టుకునేది. ఇన్స్టా, యూట్యూబ్తో పాటు గతంలో టిక్టాక్లో సినిమా పాటలు, డైలాగుల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేది. ఆమెకు ఎంతోమంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. దీంతో ఆమె టిక్టాక్ దీపికగా స్థానికంగా ఎంతో పేరుపొందింది. పరారీలో యువకుడు పోలీసులు మృతదేహాన్ని వెలిసితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శవంపై ఎలాంటి గాయాలు లేవని, ఎవరో దుండగులు చంపి పూడ్చిపెట్టారని తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఆమెకు చివరిసారి కాల్ చేసింది నితిన్ అనే యువకుడు అని, అతడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆర్మీ ఉద్యోగి అదృశ్యం
ప్రకాశం: ఓ ఆర్మీ జవాన్ విధులకు హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్కు వెళ్లి అక్కడ అదృశ్యమయ్యాడు. 10 రోజులు దాటినా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొమరోలు మండలలోని ఎర్రపల్లె గ్రామానికి చెందిన మారంరెడ్డి వీరబ్రహ్మానందరెడ్డి పదేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని న్యూజల్పాయ్గురి క్యాంప్లో ఉంటున్నాడు. కాగా, డిసెంబరు 8వ తేదీన వీరబ్రహ్మానందరెడ్డి సెలవుపై స్వగ్రామానికి వచ్చి నెల రోజుల తర్వాత తిరిగి జనవరి 8వ తేదీన విధుల్లో చేరేందుకు స్వగ్రామం నుంచి బయలుదేరి వెళ్లాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఎల్జీపీటీ రైల్వేస్టేషన్లో దిగిన వీరబ్రహ్మానందరెడ్డి అక్కడే అదృశ్యమయ్యాడు. జనవరి 10వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీరబ్రహ్మానందరెడ్డి ఎల్జీపీటీ రైల్వేస్టేషన్లో అదృశ్యం కావడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంధుమిత్రులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి వీరబ్రహ్మానందరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుని విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరబ్రహ్మానందరెడ్డికి సంబంధించిన మొబైల్ ఫోన్, లగేజీ ఎల్జీపీటీ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరబ్రహ్మానందరెడ్డికి ఏడాది క్రితమే ఒంగోలుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. -
Manipur: మణిపూర్లో మళ్లీ కాల్పులు
ఇంఫాల్: మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో మళ్లీ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ మధ్య కాల్పుల ఘటన జరిగింది. గల్లంతైన నలుగురిని ఓయినమ్ రోమెన్ మైతేయి (45), అహంతేమ్ దారా మైతేయి (56), తౌడమ్ ఇబోమ్చా మైతేయి (53), తౌడం ఆనంద్ మైతేయి (27)గా గుర్తించారు. ఘటన తర్వాత కుంబి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. కాల్పులు జరగడానికి ముందు ఆరు రౌండ్ల మోర్టార్ కాల్పులు జరిగాయని స్థానిక నివేదికలు తెలిపాయి. అంతకుముందు జనవరి 1న, తౌబల్స్ లిలాంగ్ ప్రాంతంలో గుర్తుతెలియని సాయుధ దుండగులు, స్థానికుల మధ్య ఘర్షణలు చెలరేగింది. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరుసటి రోజే గస్తీలో ఉన్న సాయుధ బలగాలపై దుండగులు కాల్పులు జరిపారు. మణిపూర్లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
సమ్మక్క– సారలమ్మకు జాతరకు వెళ్తూ కోడిపుంజు ఇలా..
ప్రస్తుతం సమ్మక్క– సారలమ్మ జాతర సీజన్ సందర్భంగా వరంగల్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులు కూడా కిక్కిరిసి పోతున్నాయి. వరంగల్ నుంచి వేములవాడ వెళ్లిన ఓ బస్సు అక్కడ ప్రయాణికులను దింపి కరీంనగర్ బస్టాండుకు వచ్చింది. అందులో ఓ కోడిపుంజును డ్రైవర్ గుర్తించాడు. బస్సులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోగా.. ఒక సంచిలో ఈ కోడి పుంజు కనిపించింది. దీంతో తప్పిపోయిన ఆ కోడిని డ్రైవర్ కంట్రోలర్కు అప్పగించాడు. ఆయన ఇలా ఓ జాలీలో బంధించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
భోపాల్: షెల్టర్ హోం నుంచి 26 మంది బాలికల మిస్సింగ్!
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోపాల్లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్ శివారు ప్రాంతంలో అంచల్ బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనుంగో .. ఈ చిల్డ్రన్స్ హోమ్ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే రిజిస్టర్ను తనిఖీ చేయగా.. అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్ అయిన వారిలో గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు. అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పాడు. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్ హోంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వీధుల్లో ఒంటరిగా కనిపించిన పిల్లలను ఒక చోట చేర్చి, ఎలాంటి లైసెన్స్ లేకుండా ఓ మిషనరీ( మత గురువు) ఈ షెల్టర్ హోమ్ను నడుపుతున్నట్లు కనుంగో ట్వీట్ చేశారు. రక్షించిన పిల్లలకు రహస్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించేలా చేశారని ఆరోపించారు. హాస్ట్లో ఎక్కువమంది అమ్మాయిలు ఆరు నుంచి 18 సంవత్సరాల వారేనని.. వీరిలో అధికంగా హిందువులే ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్కు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక షెల్టర్ హోంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు. చదవండి: రామమందిర ప్రారంభం.. ఆలయానికి వెళ్లి మహా హారతి ఇస్తా: ఉద్ధవ్ -
హయత్ నగర్ లో విద్యార్థి మిస్సింగ్
-
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత బలన్మరణం!
కల్వకుర్తి టౌన్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలన్మరణానికి పాల్పడిన ఘటన కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్, కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. పట్టణంలోని హనుమాన్ నగర్కు వెళ్లే దారిలో నివాసముండే ఫిరోజ్కు హైదరాబాద్కు చెందిన రజియా (30)తో మూడేళ్ల కిందట వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం రజియాపై అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. పలుమార్లు పెద్దలు నచ్చజెప్పినా వారి తీరు మారలేదు. దీంతో మనస్తాపానికి గురైన రజియా.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి నిప్పంటించుకొంది. గమనించిన చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేసి, పోలీసులతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆమెను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. రజియా ఆత్మహత్యకు భర్త ఫిరోజ్తో పాటు అతడి తల్లిదండ్రుల వేధింపులే కారణమని మృతురాలి తల్లి బీబీ ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మృతురాలికి మూడేళ్ల బాబుతో పాటు ఏడాది వయసు గల మరో బాబు ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చికిత్స పొందుతూ యువకుడు.. భూత్పూర్: భూత్పూర్ మండలంలోని కర్వెనకు చెందిన హన్మంత్రెడ్డి (20) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. ఇటీవల హన్మంత్రెడ్డి బైక్పై వెళ్తుండగా.. కర్వెన సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. అతడి అవయవాలను తల్లిదండ్రులు దానం చేసినట్లు వివరించారు. ఈ మేరకు హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్ఐ వెల్లడించారు. పురుగు మందు తాగి మహిళ బలవన్మరణం చారకొండ: పురుగు మందు తాగి ఓ మహిళ అత్మహత్యకు పాల్పడిన ఘటన చారకొండ మండలం సారంబండతండాలో చోటుచేసుకుంది.హెడ్కానిస్టేబుల్ నాగయ్య వివరాల మేరకు.. సారంబడ తండాకు చెందిన వడ్త్యావత్ బుజ్జి (48) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చెరువులో పడి వ్యక్తి మృతి భూత్పూర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భూత్పూర్ మున్సిపాలిటీలోని సిద్ధాయిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. వికారాబాద్ జిల్లా మరుపల్లి మండలం వీర్లపల్లికి చెందిన ఎన్.రాములు (35) తన భార్య లలితతో కలిసి ఎనిమిదేళ్లుగా భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్కు చెందిన రమేష్ వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నాడు. పంటల సాగు నిమిత్తం సిద్ధాయిపల్లి రాందాస్ చెరువులో విద్యుత్ మోటార్ బిగించి నీటిని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పొలానికి నీరు పెట్టడానికి రాములు వెళ్లగా.. మోటార్ పనిచేయలేదు. దీంతో చెరువులో నుంచి మోటార్ను బయటికి తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెక్డ్యాంలోయువకుడి గల్లంతు కోస్గి: చెక్డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతైన ఘటన కోస్గి మండలం ముశ్రీఫా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ముశ్రీఫాకు చెందిన బుడగజంగం వెంకటయ్య (32), శ్రీనివాస్ సోమవారం గ్రామ సమీపంలోని చెక్డ్యాంలో చేపల వేటకు వెళ్లారు. వాగు లోతు గమనించకుండా నీటిలోకి దిగిన వెంకటయ్యకు ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. అతడి కోసం శ్రీనివాస్ గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయాన్ని గ్రామస్తులతో పాటు పోలీసులకు తెలియజేయడంతో చెక్డ్యాం వద్దకు చేరుకొని రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. -
మేజిక్లో ఏ టెక్నిక్ వాడుతున్నారో కాస్త చెబుతారా సార్!
మేజిక్లో ఏ టెక్నిక్ వాడుతున్నారో కాస్త చెబుతారా సార్! -
తప్పిపోయి రెండేళ్లు దాటింది! ప్రస్తుతం..
నిజామాబాద్: రెండేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతంలోని ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఓ బాలికను వదిలి వెళ్లాడు. రోదిస్తున్న బాలికను చూసి స్థానికులు సమాచారం అందించగా పోలీసులు సదరు బాలికను అమీన్పూర్లోని మహిమ మినిస్ట్రీలో చేర్పించారు. బాలికను విచారించగా తన పేరు శ్వేత అలియాస్ రేణుక అని తన తల్లిదండ్రుల పేర్లు సంధ్య, ప్రభాకర్రెడ్డి అని, తమది దోమకొండ గ్రామం అని చెప్పింది. అంతే కాకుండా తన అక్క పేరు సరిత, బావ పేరు వెంకటరెడ్డి, వారు కామారెడ్డిలో ఉంటారని పోలీసులతో చెప్పింది. రెండేళ్లుగా అక్కడే ఉన్న సదరు బాలికను అధికారులు రెండు నెలల క్రితం కామారెడ్డి బాలరక్ష భవన్కు అప్పగించారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతున్నట్లు ఐసీడీఎస్ పీడీ బావయ్య, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి స్రవంతి తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ప్రియా థియేటర్ రోడ్డులో ఉన్న బాల రక్ష భవన్కు వచ్చి సంప్రదించాలని కోరారు. ఇవి చదవండి: ఉద్యోగం రావడంలేదని యువకుడి బలవన్మరణం -
మిస్సింగ్ కేసుని చేధించిన ఆ 'ఎమోషనల్ ఫేస్బుక్ సందేశం"
ఈ రోజుల్లో పొరపాటున పిల్లలు తప్పిపోతే దొరకడం చాలా కష్టం. పోలీసులు చుట్టు తిరిగినా దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పిల్లలను ఎత్తకుపోయే ముఠాలు, మానవ అక్రమ రవాణ తదితరాల కారణంగా ఆచూకి అంత ఈజీ కాకుండా పోయింది. ఐతే ఈ ఆధుననిక టెక్నాలజీ ఈ విషయంలో సహకరిస్తుందని చెప్పాలి. ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ సెకన్లలో చేరి ఏదో రకంగా వాళ్ల ఆచూకీ లభించి కుటుంబ చెంతకు చేరిన ఎన్నో ఉదంతాలు చూశాం. అలాంటి ఆశ్చర్యకర ఉదంతమే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యూకేకి చెందిన అలెక్స్ బట్టీ ఆరేళ్ల వయసులో తప్పిపోయాడు. స్పెయిన్లో ఉండగా సెలవుల్లో తన అమ్మ, తాతయ్యలతో కలిసి ఊరికి వెళ్తుండగా తప్పిపోయాడు. అప్పటి నుంచి అతడి మిస్ కేసింగ్ కేసు పరిష్కారం కానీ కేసుగా ఉండిపోయింది. ఇంటర్నెట్లో అతడి ఆచూకీ కోసం ఓ ప్రకటన కూడా ఉంది. అయితే ఆ చిన్నారి అలెక్స్ ఇప్పుడూ అనూహ్యంగా 17 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ పర్వాతాల్లో ఓ వాహనదారుడికి కనిపించాడు. దీంతో అతను ఆ టీనేజర్ని ఇక్కడ ఎందుకు ఉన్నావని ఆరా తీయగా నాలుగు రోజుల నుంచి ఈ పర్వతాల నుంచే నడుచుకుంటూ వస్తున్నట్లు తెలిపాడు. వెంటనే అతడు ఆ బాలుడి పేరుని ఇంటర్నెట్లో టైప్ చేసి చెక్చేయగా అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. దీంతో అతను వెంటనే ఆ టీనేజర్ని పోలీసులకు అప్పగించాలనుకున్నాడు. అంతేగాదు అలెక్స్ ఆ వాహనదారుడి ఫోన్ సహాయంతో ఫేస్బుక్లో యూకేలో ఉన్న తన అమ్మమ్మ తాతయ్యల కోసం ఓ సందేశం పెట్టాడు. ఆ సందేశంలో "హలో అమ్మమ్మ నేను అలెక్స్. నేను ఫ్రాన్స్ టౌలౌస్లో ఉన్నాను. మీకు సందేశం చేరుతుందని ఆశిస్తున్నాను. ఐ లవ్ యూ, నేను ఇంటికి రావాలనుకుంటున్నా".అని ఉద్వేగభరితంగా సందేశం పెట్టాడు. ఇది వారికి రీచ్ అవ్వడమే గాక ఒక్కసారిగా ఆ కుటుంబం సంతోషంతో మునిగిపోయింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఆ టీనేజర్ తొలిసారిగా తన అమ్మమ్మను కలుసుకోనున్నాడు. ప్రస్తుతం ఆ టీనేజర్ టౌలౌస్లోని ఒక యువకుడి సంరక్షణలో ఉన్నాడని ఏ క్షణమైన నగరానికి రావొచ్చని పోలీసులు తెలిపారు. అదృశ్యమయ్యే సమయానికి అలెక్స్ వసయు 11 ఏళ్లు కాగా ఆరేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోనున్నాడు. ఐతే ఈ ఆరేళ్లలో ఎక్కడ ఉన్నాడు, ఎలా మిసయ్యాడు అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: 220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!) -
ఆ ఎంపీ అదృశ్యం అంటూ పోస్టర్లు.. ఆచూకీ చెబితే రూ. 50 వేలు!
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పంజాబ్లో ఆయన అదృశ్యం అయ్యారంటూ పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు సన్నీ డియోల్ ఆచూకీ చెప్పినవారికి రూ.50 వేలు రివార్డు కూడా ప్రకటించారు. సన్నీ డియోల్ అదృశ్యమయ్యారంటూ పోస్టర్లు వేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నిజానికి సన్నీ డియోల్ గురుదాస్పూర్-పఠాన్కోట్ లోక్సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ. సన్నీడియోల్ ఎంపీ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పఠాన్కోట్ జిల్లాలోని హల్కా భోవాకు చెందిన జనం సర్నా బస్టాండ్లో సన్నీ డియోల్ అదృశ్యంపై పోస్టర్లపై అతికించి, అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలోని హల్కా, పఠాన్కోట్, సుజన్పూర్లలో సన్నీ డియోల్ అదృశ్యానికి సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. ఇంత జరుగుతున్నా సదరు ఎంపీ స్థానికుల బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తన లోక్సభ నియోజకవర్గానికి ఎప్పుడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిరసనకు దిగిన జనం బస్సులకు ఈ పోస్టర్లను అతికించారు. ఎంపీగా ఎన్నికయిన తర్వాత సన్నీ డియోల్ తన లోక్సభ నియోజకవర్గానికి ఏనాడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారికి 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో సన్నీ డియోల్ విజయం సాధించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని నిరసనకారులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు! -
TS: మాసబ్ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం?
సాక్షి, హైదరాబాద్: మాసబ్ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమైనట్లు సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్లో ఫైల్స్ మాయం కావడంపై కలకలం రేగుతోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్కు అధికారులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను డీసీపీ సేకరించారు. ఆ శాఖ డైరెక్టర్ను సెంట్రల్ జోన్ డీసీపీ.. ప్రశ్నించగా, ఫైల్స్ మాయంపై ఎలాంటి సమాచారం లేదంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కాగా, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సచివాలయం ప్రారంభమై 9 నెలలు కావొస్తుందని, మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని రెండో అంతస్తులోకి తరలించి కార్యకలాపాలు నిర్వహించామని తెలిపారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్ను నిర్దిష్టమైన విధానంలో ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేయడం జరిగిందని వివరించారు. శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని తెలిపారు. ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కళ్యాణ్ తెలిపారు. ఇదీ చదవండి: TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో.. -
ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్కీ డబ్బులు అడుగుతారేమో?
ఇండిగో విమానంలో ఒక ప్యాసింజర్కి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రయాణీకులు తక్కువగా ఉన్నారని ప్రయాణికులను దించేసి వెళ్లి పోయిన ఘటన మరువకముందే విమానంలో సీటు కుషన్ మిస్ అయిన ఘటన నెటిజనుల ఆగ్రహానికి కారణమైంది. ఇండిగో ఫ్లైట్ 6E6798లో నాగపూర్కు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అనుకున్న సమయనికి విమానం ఎక్కి, విండో సీట్ నెం 10A ఎంజాయ్ చేయాలన్న ఉత్సాహంతో దగ్గరికి వెళ్లి చూసి ఒక్కసారి షాక్ అయ్యారు. సీటులోని కుషన్ మిస్ అయింది. కేవలం స్టీల్ ఫ్రేమ్ మాత్రమే కనిపించింది. ఇండిగో విమానంలో పూణె నుంచి నాగ్ పూర్ వెళ్తున్న సాగరిక పట్నాయక్కు ఈ చేదు అనుభవం ఎదురైంది. దీంతో వెంటనే క్యాబిన్ సిబ్బందిని సంప్రదించారు. సీటు కింద ఉంటుంది చూడండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా కూడా లేకపోవడంతో మళ్లీ సిబ్బందిని అడిగే అప్పుడు తీసుకొచ్చి కుషన్ అమర్చారు. అప్పటివరకు ఆమె నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. సాగరిక భర్త సుబ్రత్ పట్నాయక్ దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. లాభాలను పెంచుకునే మార్గం ఇదేనా.. చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బోర్డింగ్కు ముందు గ్రౌండ్ స్టాఫ్ , సిబ్బంది నిర్లక్ష్యాన్ని సుబ్రత్ ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ట్రయల్ కావచ్చు. త్వరలోనే ఇండిగో సీట్ కుషన్ల కోసం 250-500 వసూలు చేస్తుందేమో అంటూ ఒకరు సెటైర్లు వేశారు. మరోవైపు దీనిపై ఇండిగో స్పందించింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. సీటు కుషన్ దాని వెల్క్రో నుండి కొట్టుకుపోతుంది.దాన్ని సిబ్బంది రీప్లేస్ చేస్తుంది. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలను అందిస్తామంటూ ఇండిగో ఎయిర్ లైల్స్ వివరణ ఇచ్చింది. #Indigo !! #Flight 6E 6798 !! Seat no 10A ! Pune to Nagpur!!! Today’s status … Best way to increase profit 😢😢…Pathetic … pic.twitter.com/tcXHOT6Dr5 — Subrat Patnaik (@Subu_0212) November 25, 2023 -
గ్రీస్ సమీపంలో సరకు నౌక మునక
ఏథెన్స్: గ్రీస్ పరిధిలోని లెస్బోస్ ద్వీపం సమీప మధ్యదరా సముద్ర జలాల్లో ఒక సరకు రవాణా నౌక మునిగిన ఘటనలో నలుగురు భారతీయుల ఆచూకీ గల్లంతైంది. సిబ్బందిలో ఒక్కరిని మాత్రమే కాపాడగలిగామని గ్రీస్ తీర గస్తీ దళాలు వెల్లడించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. దాదాపు 6,000 టన్నుల ఉప్పుతో ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నుంచి బయల్దేరిన నౌక తుర్కియేలోని ఇస్తాంబుల్కు వెళ్తోంది. మార్గమధ్యంలో గ్రీస్కు చెందిన లెస్బోస్ వద్ద మునిగిపోయింది. నౌకలోని 14 మంది సిబ్బందిలో నలుగురు భారతీయలు, ఎనిమిది మంది ఈజిప్ట్పౌరులు, ఇద్దరు సిరియన్లు ఉన్నారు. ఆదివారం ఉదయం ఏడింటపుడు మెకానికల్ సమస్య తలెత్తిందంటూ ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిన నౌక తర్వాత కనిపించకుండా పోయింది. ఒక ఈజిప్ట్ పౌరుడిని మాత్రం రక్షించగలిగారు. ఎనిమిది వాణిజ్య నౌకలు, రెండు హెలికాప్టర్లు, ఒక గ్రీస్ నావికా యుద్ద నౌక గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఘటన జరిగన చోట్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. -
'పోస్టల్ బ్యాలెట్' మిస్సింగ్.. ఉద్యోగుల్లో కలవరం..!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్ బ్యాలెట్ మిస్సింగ్ అవ్వడం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ద్వారా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. దీని దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీన ముగిసింది. అయితే పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు 15 మంది కార్యాలయాలకు వెళ్లగా మీ దరఖాస్తులు అందలేదని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. తాము ఇదివరకే దరఖాస్తు చేసుకున్నా ఎందుకు అందలేదని అధికారులను ప్రశ్నించగా, వారినుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమని చెప్పే అధికారులు ఇలా తాము చేసుకున్న దరఖాస్తులను ఇంత నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. ఎన్ని గల్లంతయ్యాయనే సమాచారం కోసం కలెక్టరేట్ పర్యవేక్షకురాలు జాడి స్వాతిని సంప్రదించగా.. ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ మిస్ అవ్వలేదని పేర్కొన్నారు. అయితే ఇంకా దరఖాస్తులు అందాల్సి ఉందని, అవి పూర్తిస్థాయిలో వస్తే తప్పా ఎన్ని వచ్చా యి.. ఎన్ని రాలేదనే సమాచారం చెబుతామని పేర్కొనడం గమనార్హం. ఇవి చదవండి: ‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అందరు మూడు తోవల పోతున్నరు! -
రోదసీలో టూల్బ్యాగ్ చక్కర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది. అసలేం జరిగిందంటే? ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్స్టేషన్లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు. అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్ఎస్కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్బ్యాగ్ జాడను ఎర్త్స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. ‘ టూల్బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్బ్యాగ్లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి. -
వికారాబాద్: అవ్వ మిస్సింగ్, చివరకు..
సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు. సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
పురుగుల మందుతాగిన యువకుడు.. చికిత్స పొందుతూ
నల్లగొండ: పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన నున్న వీరయ్య, సరిత దంపతుల కుమారుడు నున్న సాయిరాం(27) డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. శనివారం ఉదయం వీరయ్య గోదాంలో హమాలీ పనులకు, సరిత వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సాయిరాం ఇంట్లో గడ్డి మందు తాగాడు. స్థానికులు గమనించి నకిరేకల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా సాయిరాం ఆత్మహత్యకు గల కారాణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు మేళ్లచెరువు: పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన యాంపంగు సందీప్(19) తన స్నేహితులు పాష, వెంకటేష్, నవీన్, సాయితో కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జడపల్లి తండా సమీపంలోని పుష్కరఘాట్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి నదిలోకి దిగగా సందీప్ గల్లంతైనట్లు అతడి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు అక్కడకు చేరుకొని కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపినట్లు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి కేతేపల్లి: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ గ్రామానికి చెందిన చెవుగాని జానయ్య(52) వృత్తిరిత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ సమీపంలోని చెరువులో గాలంతో చేపలు పట్టేందుకు వెళ్లిన జానయ్య చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మునిగి మృతిచెందాడు. సాయంత్రం చెరువులో మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి భార్య యల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
సుభాష్నగర్: ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం రాజీవ్గృహకల్పకు చెందిన వెంకటరావు కుమార్తె అఖిల(17), సూరారం సాయిబాబానగర్కు చెందిన చంద్రమోహన్ కుమార్తె త్రిష (17)లు బహదూర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. బంధవులైన ఇద్దరు యువతులు రోజు మాదిరిగానే శనివారం కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సూరారం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. -
టాయిలెట్కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య!
రోడ్ ట్రిప్లంటే చాలామంది అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు. కుటుంబ సమేతంగా కారులో కూర్చుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడమంటే చాలామందికి ఇష్టం. ఓ భార్యాభర్తల జంట ఇలానే రోడ్ ట్రిప్కు బయలుదేరింది. కానీ భర్త చేసిన పొరపాటు కారణంగా భార్య నానా అవస్థలు పడింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రయాణంలో భర్త టాయిలెట్ కోసం కారు దిగాడు. పావుగంట తరువాత తిరిగి కారును స్టార్ట్ చేశాడు. అయితే ఆ సమయంలో కారులో తన భార్య లేదన్న విషయాన్ని అతను గమనించలేదు. ఆమె కారులో నిద్రపోతున్నదని అనుకున్నాడు. అయితే కొద్దిసేపటి తరువాత కారు వెనుక సీటులోకి చూశాడు. అక్కడ భార్య లేదు. అతను తన పొరపాటు తెలుసుకునే సరికే 160 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. భర్త పేరు బ్రూనో టామ్చామ్ (55), భార్య పేరు అమ్నుయ్ టామ్చామ్ (49). ఇద్దరూ థాయిలాండ్కు చెందినవారు. ఇద్దరూ తెల్లవారుజామున మూడు గంటలకు మహాసర్ఖా ప్రావిన్స్కు బయలుదేరారు. దారిలో బ్రూనో ఒక టాయిలెట్ కోసం దిగవలసి వచ్చింది. ఒక అడవికి సమీపంలో రోడ్డు పక్కగా కారును ఆపాడు. టాయిలెట్ ముగించి, తిరిగి కారులోకి వచ్చి కూర్చున్నాడు. అయితే బ్రూనో కారు దిగాక అతని భార్య కూడా కారు దిగి టాయిలెట్కు వెళ్లింది. అయితే అమ్నుయ్ తిరిగి వచ్చేసరికి, రోడ్డుపై కారు కనిపించలేదు. అమె దగ్గర డబ్బు, ఫోన్ కూడా లేవు. అవన్నీ కారులోనే ఉన్నాయి. దీంతో ఆమె ఎవరినైనా సాయం అడిగేందుకు ముందుకు నడక ప్రారంభించింది. దాదాపు 20 కిలోమీటర్ల దూరం నడిచాక తెల్లవారుజామున 5 గంటలకు అమ్నుయ్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. జరిగిన సంఘటనను పోలీసులకు తెలియజేసింది. దీంతో పోలీసులు బ్రూనోకు పలుమార్లు కాల్ చేశారు. అతను కాల్ ఎత్తలేదు. ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. తరువాత పోలీసు స్టేషన్కు వెళ్లి, తన భార్యను కలుసుకున్నాడు. ఇది కూడా చదవండి: కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు -
తన స్నేహితురాలు.. రూంకు వచ్చి చూసేసరికి..
సాక్షి, కరీంనగర్: నగరంలోని పాతబజారులో నివా సం ఉండే ఓ యువతి అదృశ్యమైంది. వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన టి.ప్రియాంక(22) ఇంటర్ పూర్తిచేసింది. పాతబజారు ప్రాంతంలో స్నేహితులతో అద్దెకుంటూ స్థానికంగా ఓ షాపింగ్మాల్లో పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం పని నిమిత్తం గదినుంచి బయటకు వెళ్లింది. రాత్రి తన స్నేహితురాలు రూంకు వచ్చిచూసేసరికి తాళం వేసి ఉండడంతో వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం వన్టౌన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డకు ఐస్క్రీం కోసం వెళ్లి తల్లి దుర్మరణం: రాత్రంతా తల్లి శవం వద్దే చిన్నారి
మహారాష్ట్రలో కనిపించకుండా పోయిన గర్భిణి ఉదంతం చివరికి విషాదాంతమైంది. రాజురా-బల్లార్పూర్ రోడ్డులోని వార్ధా నది వంతెన సమీపంలో సుష్మ మృతదేహం కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంతేకాదు సుష్మ మృతదేహం పక్కనే ఆమె నాలుగేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించిన దృశ్యం మరింత కలిచి వేస్తోంది. ఈ ఘనటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే చంద్రాపూర్కు చెందిన సుష్మా కక్డే బుధవారం రాత్రి అదృశ్యమైంది. ఐస్క్రీం కోసం తన నాలుగేళ్ల కుమారుడితో ఇంటినుంచి బైటికి వెళ్లి ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త, బ్యాంక్ ఉద్యోగి పవన్కుమార్, బంధువులు ఆమె కోసం వెతికారు. కానీ ఫలితం లేక పోవడంతో, బల్లార్పూర్ పోలీసులను ఆశ్రయించారు. గురువారం ఉదయం నది వంతెన సమీపంలో మృతదేహాన్ని గుర్తించామని పోలీసు ఉన్నతాధికారి రవీంద్ర సింగ్ పర్దేసి వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి వంతెనపై నుండి పడి బురద ప్రాంతంలో కూరుకుపోయి ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనా. అయితే, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామిన పరదేశి చెప్పారు. -
చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ యుగేంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నారపల్లికి చెందిన వారణాసి తరుణ్(24) తన స్నేహితుడు డీకొండ నితిన్తో కలిసి ఆదివారం బీబీనగర్లో ఉంటున్న మరో స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. స్నేహితుడిని కలిసిన తర్వాత తరుణ్, నితిన్ కలిసి బీబీనగర్ మండలంలోని వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. తరుణ్, నితిన్ చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. తరుణ్ చెరువులోరాళ్ల మధ్యన ఇరుక్కపోయాడు. నితిన్ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తరుణ్ కోసం గాలింపు చర్యలు ఆచూకీ లభించలేదు. సోమవారం చెరువులో తరుణ్ మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తరుణ్ ముఖంపై గాయాలు ఉండడంతో నితిన్పై అనుమానం ఉన్నట్లు మృతుడి తండ్రి గోవిందాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆ తార అస్తమయం వెనక...!
అది 2009. అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టుండి మాయమైంది. అది సైంటిస్టులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమీ కాదు. అరుదు అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశవంతంగా మారతాయి. అనంతరం సూపర్ నోవాగా పిలిచే బ్రహా్మండమైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తినంతా కోల్పోయి మరుగుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతర్ధానం చెందుతాయి. కానీ... సూర్యుని కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన ఎన్6946– బీహెచ్1 అనే నక్షత్రం మాత్రం ఏదో మంత్రం వేసినట్టు ఉన్నపళంగా మాయమైపోయింది! మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన సైంటిస్టులు, మరో సూపర్ నోవా చోటు చేసుకోనుందనే అనుకున్నారు. కానీ జరగకపోగా, అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమైపోయి ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతోంది. కృష్ణబిలం మింగింది.. కాదు... ఈ తార విచిత్ర అంతర్ధానాన్ని ’జరగని సూపర్ నోవా’గా అప్పట్లో కొందరు సైంటిస్టులు పిలిచారు. బహుశా ఆ నక్షత్రాన్ని ఏదో కృష్ణబిలం మింగేసిందని వారు ప్రతిపాదించారు. అలా అది కూడా కృష్ణబిలంగానే మారిందని సూత్రీకరించారు. ఆ ఉద్దేశంతోనే దాని పేరు చివరన బీహెచ్1 అని చేర్చారు. అయితే అది సరికాదని మరికొందరు సైంటిస్టులు తాజాగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల సేకరించిన పరిణామాల్ని విశ్లేíÙంచిన మీదట ఆ వాదనకు బలం చేకూరుతోంది. బీహెచ్1 తార ఉన్న చోట అతి ప్రకాశవంతమైన పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ గమనించింది. అది మూడు వేర్వేరు రకాల కాంతి అని కూడా చెబుతున్నారు. బహుశా పలు నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి పెను తారగా మారాయనేందుకు ఇది నిదర్శనమని అంటున్నారు. కానీ సూపర్ నోవాగా మారకుండా అది ఎలా అంతర్ధానం అయిందన్న కీలక ప్రశ్నకు మాత్రం ఇంకా బదులు దొరకాల్సే ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సిక్కిం కుంభవృష్టి.. 102 మంది మిస్సింగ్
గాంగ్టక్: భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం వణికిపోతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది పౌరులు మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 102 మంది గల్లంతయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కనిపెట్టేంందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరో 25 మంది క్షతగాత్రులు సహా వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించామని తెలిపాయి. ⚡️⚠️ 𝐄𝐍𝐃 𝐓𝐈𝐌𝐄 𝐒𝐂𝐄𝐍𝐀𝐑𝐈𝐎⚠️⚡️ 𝐃𝐞𝐯𝐚𝐬𝐭𝐚𝐭𝐢𝐧𝐠 𝐟𝐥𝐨𝐨𝐝 𝐢𝐧 𝐒𝐢𝐤𝐤𝐢𝐦,𝐈𝐧𝐝𝐢𝐚 As many as 10 civilians have died and 82 people, including 22 Army personnel, are missing after a cloudburst over the Lhonak Lake in north Sikkim caused it to overflow,… pic.twitter.com/rBOrPhUjkK — {Matt} $XRPatriot (@matttttt187) October 5, 2023 కూలిన 14 వంతెనలు సింగ్తామ్ వద్ద వరద ప్రవాహంలో మొత్తం 23 మంది ఆర్మీ జవాన్లు కొట్టుకుపోగా బుధవారం సాయంత్రం నాటికి ఓ సైనికుడిని సహాయక బృందాలు రక్షించాయి. రాష్ట్రంలో 14 వంతెనలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో దాదాపు 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరద బీభత్సం ప్రారంభమైంది. బుధవారం చుంగ్థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత భీతావహంగా మారిందని తెలియజేశాయి. सिक्किम में सेना के 23 जवान लापता। उत्तरी सिक्किम में अचानक बादल फटने से तीस्ता नदी में बाढ़ आ गई। अचानक आई इस बाढ़ के कारण सेना के 23 जवान लापता हो गए हैं। खोज एवं बचाव अभियान जारी है। ईश्वर से सभी की कुशलता के लिए प्रार्थना 🙏🏽#sikkimflood#IndianArmy#TeestaRiver#Sikkim pic.twitter.com/Gy7Nv1ooZP — JAGDISH PALIWAL (@JAGDISH_BAP) October 5, 2023 లోతట్టు ప్రాంతాలు జలమయం రాజధాని గాంగ్టక్కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్తామ్ ఉక్కు వంతెన బుధవారం తెల్లవారుజామున పూర్తిగా కొట్టుకుపోయిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. సిక్కిం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర భూభాగంతో అనుసంధానించే పదో నెంబర్ జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా ధ్వంసమైంది. People being rescued and taken to a safe shelter. They didn’t have any say in large infrastructure project, but pay the price of the disaster. #Sikkim pic.twitter.com/KdKu3yIOdT — Aparna (@chhuti_is) October 4, 2023 జనం అప్రమత్తంగా ఉండాలని సూచన వర్షాలు, వరద విలయాన్ని సిక్కిం ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. మాంగాన్, గాంగ్టక్, పాక్యోంగ్, నామ్చీ జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 8 దాకా సెలవు ప్రకటించింది. ఉత్తర బెంగాల్కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. తీస్తా నది ప్రవాహ ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుంగ్తాంగ్లోని తీస్తా స్టేజ్ 3 డ్యామ్ వద్ద పనిచేస్తున్న దాదాపు 14 మంది కార్మికులు ఇప్పటికీ టన్నెల్లో చిక్కుకొని ఉన్నారు. చుంగ్తాగ్, ఉత్తర సిక్కింలో చాలా వరకు మొబైల్ నెట్వర్క్లు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది.. చుంగ్తాంగ్లోని పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసం అయ్యింది. #earthquake #GayatriJoshi #SikkimCloudburst #SanjaySinghArrested #ElvishYadav #AishwaryaRai #ChampionsLeague 14 Dead, 102 Missing In Sikkim Flash Flood, Missing Armyman Rescued Over 3,000 tourists are feared stranded, said a government official. The Army said it has rescued… pic.twitter.com/AleFmJgiL3 — shakir Berawala (@shakirBerawala) October 5, 2023 -
వరదలో కొట్టుకుపోయిన 23 మంది ఆర్మీ సిబ్బంది..
-
జీడిమెట్లలో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో చెప్పాపెట్టకుండా ఇద్దరు బాలికలు వెళ్లిపోయిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.పవన్ చెప్పిన వివరాల ప్రకారం.. చింతల్ ద్వారకానగర్కు చెందిన శ్రీనివాస్, విజయ్ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. శ్రీనివాస్ కుమార్తె దీక్షిత 9వ తరగతి, విజయ్ కుమార్తె పూజ పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ.. పొరుగు ఇళ్లలో ఉండటంతో స్నేహితులయ్యారు. పూజ రెండు రోజుల క్రితం వినాయక మండపం వద్దకు వెళ్లడంతో తల్లిదండ్రులు మందలించారు. మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లేందుకు యూనిఫాం వేసుకుంది. పాలు తాగుతుండగా అవి మీద పడటంతో డ్రెస్ మార్చుకుంది. పక్కింట్లో ఉండే దీక్షిత బయట నుంచి గడియపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరూ ప్రణాళిక ప్రకారమే 8 గంటల కంటే ముందే ఇళ్లలోంచి వెళ్లిపోయారు. దీక్షిత బాత్రూంకు గడియ పెట్టడం, పూజ డ్రెస్ మార్చుకోవడంపై అనుమానం వచి్చన ఇరువురి తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఇద్దరు బాలికలు సికింద్రాబాద్లో రైలు ఎక్కి వరంగల్ వెళ్లినట్లు గుర్తించారు. వరంగల్ నుంచి ఆంధ్రాకు గాని చెన్నైకి గాని వెళ్లే అవకాశం ఉందని, ఓ బాలిక బంధువు సంగారెడ్డికి చెందిన యువకుడికి పూర్తి విషయాలు తెలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు యువకుడిని ప్రశ్నించేందుకు జీడిమెట్ల ఠాణాకు తీసుకువచ్చినట్లు సమాచారం. -
ఆ యుద్ధ విమానాన్ని పైలెట్ గాలిలో ఎలా వదిలేశాడు? నిజంగా ఏం జరిగింది?
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్ ఎఫ్-35 గత ఆదివారం తప్పిపోయింది. ఒక రోజు తర్వాత దాని ఆచూకీ లభ్యమయ్యింది. ఈ విషయాన్ని మిలటరీ అధికారులు ధృవీకరించారు. ఫైటర్ జెట్ అదృశ్యమైన తర్వాత దానిని కనుగొనేందుకు స్థానికులు సాయం చేయాలని సంబంధిత అధికారులు కోరారు. సౌత్ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తరువాత దాని జాడ తెలియరాలేదు. నివేదిక ప్రకారం విమానం ఎగురుతున్నప్పుడు దానిలో లోపం తలెత్తగా పైలట్ దానిని ఎజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఫైటర్ జెట్ నుండి పైలట్ తనను తాను ఎజెక్ట్ చేసినప్పుడు, అతను యుద్ధ విమానాన్ని ఆటో-పైలట్ మోడ్లో ఉంచాడు. విమానం నుంచి బయటకు వచ్చిన పైలట్ను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అదే సమయంలో గాలిలో ఎగురుతున్న రెండవ ఎఫ్-35 సురక్షితంగా స్థావరానికి తిరిగి వచ్చింది. సైనిక అధికారులు అదృశమైన యుద్ధవిమాన శకలాలను గుర్తించారు. 100 మిలియన్ డాలర్ల విలువైన విమానానికి సంబంధించిన శకలాలు గ్రామీణ విలియమ్స్బర్గ్ కౌంటీలో లభ్యమైనట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికతరహాలోని అమెరికాకు చెందిన మొట్టమొదటి స్టెల్త్ ఫైటర్ జెట్ విమానం. ఈ విమానం రహస్య మిషన్లను అత్యంత వేగంగా పూర్తి చేయగలదు. ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు ఎఫ్-35 లైట్నింగ్ 2. ఇది ఆల్-వెదర్ స్టీల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానం అదృశ్యమైనప్పుడు, దాని భాగాలు అమెరికా శత్రు దేశాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు ఆందోళన చెందారు. విమానాన్ని కనుగొనడంలో స్థానికుల సహాయాన్ని కోరుతూ, జాయింట్ బేస్ చార్లెస్టన్ ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే అతని విజ్ఞప్తి అనంతరం అతనిపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఈ సంఘటన ఇంకా విచారణలో ఉంది. దర్యాప్తు ప్రక్రియ సమగ్రతను కాపాడటానికి మేము అదనపు వివరాలను అందించలేకపోతున్నామని తెలిపారు. BREAKING: The pilot ejected out of the $100 million F-35 jet that went missing due to "bad weather" according to the pilot (allegedly). One of the most advanced fighter jets in the world crashed because of bad weather... they think you are dumb. “He’s unsure of where his plane… pic.twitter.com/PNZShVok3M — Collin Rugg (@CollinRugg) September 20, 2023 కాగా ఎఫ్-35 జెట్ యుద్ధ విమానం ఖరీదు 100 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో 830 కోట్ల రుపాయలు. పైలెట్ తెలిపిన వివరాల ప్రకారం అననుకూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. పైలెట్ తాను నడుపుతున్న విమానం ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేక పోయాడని, ఈ విషయాన్ని అతను చార్లెస్టన్ కౌంటీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కాల్లో చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలియజేసింది. కాగా అంతకుముందు ఆగస్టు చివరి వారంలో అమెరికాకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఆగస్టు 27న ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న టీవీ దీవుల్లో శిక్షణ సమయంలో విమానం కూలి ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. అంతకుముందు యూఎస్ మెరైన్ కార్ప్స్ ఎఫ్/A-18 హార్నెట్ ఫైటర్ జెట్ పైలట్ శాన్ డియాగో సమీపంలో ప్రమాదంలో మరణించాడు. ఇది కూడా చదవండి: మెన్స్ అండర్వేర్ విక్రయాలు ఎందుకు తగ్గాయి? మాంద్యంతో సంబంధం ఏమిటి? -
చేతివాచీని పోగొట్టుకున్న పైలట్.. ఐదు నిముషాల్లో దక్కిందిలా!
హనా మొహ్సిన్ ఖాన్ అనే కమర్షియల్ పైలట్ ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తన రిస్ట్వాచీని పోగొట్టుకున్నారు. అయితే దానిని సురక్షితంగా అందజేసిన ఎయిర్పోర్టు సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకున్నారు. హనా మొహ్సిన్ ఖాన్ దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపును సందర్శించారు. భద్రతా తనిఖీ సమయంలో తన చేతి గడియారాన్ని తీసినప్పుడు.. అక్కడే మరచిపోయారు. కొద్దిసేపటి తరువాత తన గడియారం మిస్సయిన సంగతి గ్రహించారు. తన గడియారం పోయినట్లేనని, ఇక దొరకదని మొదట్లో అనుకున్నారు. అయితే మిస్సయిన చేతివాచీ కోసం ఒకసారి ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో ఆమె దుబాయ్లోని గ్రౌండ్ స్టాఫ్ను సంప్రదించారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లోని లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్కి ఈ-మెయిల్ పంపారు. ఈ నేపధ్యంలో ఆ డిపార్ట్మెంట్ బృందం ఆమె రిస్ట్వాచీని కనుగొంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఆమె తన వాచీని తిరిగి తీసుకోగలిగారు. దీంతో లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్ బృందాన్ని ఆమె అభినందించారు. దుబాయ్ విమానాశ్రయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన పోస్ట్ను ముగించారు. ఈ పోస్టును చూసిన యూజర్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తాము మిస్సయిన, తిరిగి పొందిన వస్తువుల గురించిన వివరాలను షేర్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్తో 14 ఏళ్ల బాలుడు మృతి! Last month while operating a Dubai back flight I had gone to the duty free. During the security check I had taken my watch off and forgot to pick it up. I had thought it was forever lost when I was flying back and discovered that I no longer had it. I contacted my ground staff in… pic.twitter.com/GDP2vpBcsO — Hana Mohsin Khan | هناء (@girlpilot_) September 4, 2023 -
తొమ్మిదేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు
వేలూరు: తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని నెల్లూరు గ్రామానికి చెందిన ఏలుమలై కూలీ. ఇతని భార్య చినపాప. వీరికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారు. ఆఖరి కుమార్తె ప్రియ. తొమ్మిదేళ్ల క్రితం తల్లిదండ్రులతో బయటకు వెళ్లిన ప్రియ అదృశ్యమైంది. తల్లిదండ్రులు పలు చోట్ల గాలించినా ఎటువంటి ఆచూకీ తెలియరాలేదు. అటవీ ప్రాంతంలో నివశిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆరేళ్ల ప్రియను ఒక మహిళ రాణిపేట జిల్లా షోలింగర్లోని ప్రైవేటు ఆశ్రమంలో చేర్పించింది. ఈ క్రమంలో అధికారులు ఆశ్రమంపై విచారణ జరిపిన సమయంలో ఆశ్రమానికి అనుమతి లేనట్లు తెలియడంతో వేలూరు అల్లాపురంలోని ప్రభుత్వ ఆశ్రమంలో చేర్పించారు. ప్రియకు తన తల్లిదండ్రుల పేర్లు బాగా తెలియడంతో తరచూ తన తల్లిదండ్రులను చూడాలని ఆశ పడేది. మూడేళ్ల క్రితం ఆమె సొంత గ్రామం జ్ఞాపకానికి వచ్చినట్లు ఆశ్రమం మేనేజర్ వద్ద తెలిపింది. దీంతో అధికారులు ప్రియ చెప్పిన నెల్లూరు గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులను విచారణ జరిపి ప్రియ బతికి ఉన్నట్లు తెలపడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. అనంతరం ప్రియ నిజమైన తల్లిదండ్రులు అవునా కాదా అనే కోణంలో అధికారులు 2021వ సంవత్సరంలో తండ్రి ఏలుమలై, చిన్నపాపకు డీఎన్ఎ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ప్రియకు నిజమైన తల్లిదండ్రులని తేలింది. వీటిపై సమగ్రమైన సమాచారాన్ని అధికారులకు అందజేసి సోమవారం సాయంత్రం ప్రియను తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ప్రియను కౌగిలించుకుని కన్నీరు మున్నీరయ్యారు. తనను తల్లిదండ్రుల వద్ద చేర్చిన అధికారులకు ప్రియ చేతులు జోడించి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. -
వారం రోజులు దాటింది.. మా బిడ్డ జాడ చెప్పండి!
రంగారెడ్డి: కళాశాల హాస్టల్ నుంచి తమ కుమారుడు అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మిస్సింగ్కు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ శనివారం స్టూడెంట్ యూనియన్లతో కలిసి ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ విద్యాసంస్థల్లో డిప్లొమా సెకండియర్ చదువుతున్న ఆంజనేయులు.. ఈనెల 20న కళాశాలకు చెందిన హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. వారం రోజులుగా కుమారుడి జాడ లేకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, యాజమాన్యం స్పందించి ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కాకతీయ కాలువలో హెడ్ కానిస్టేబుల్ గల్లంతు.. ఆచూకీ దొరక్కపోవడంతో..
కరీంనగర్: ఎల్ఎండీ రిజర్వాయర్ను ఆనుకొని ఉన్న కాకతీయ కాలువలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గల్లంతయ్యాడు. తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు.. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) శుక్రవారం సాయంత్రం కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లాడు. తినుబండారం తిని కాలువలో చేతులు కడుక్కునేందుకు మెట్ల నుంచి దిగాడు. చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. స్థానికులు గమనించి అతడ్ని కాపాడేందుకు తాడు వేసినా సమయానికి అందుకోకపోవడంతో పాటు కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడు. మల్లయ్య కరీంనగర్ భగత్నగర్లో నివాసం ఉంటూ హెడ్ కానిస్టేబుల్గా పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వద్ద గన్మెన్గా పని చేశాడు. ఈత వచ్చినా.. దుండే మల్లయ్యకు 50 ఏళ్ల వయసు ఉన్నా యువకుడిలా యాక్టీవ్గా ఉండేవాడు. మృదుస్వభావి, మంచికి మారుపేరుగా ఉండడంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టుబట్టి అతడ్ని గన్మెన్గా పెట్టుకున్నారు. అతడికి ఈత వచ్చినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. గల్లంతు అయ్యే సమయంలో మత్స్యకారులు తాళ్లు విసిరివేసే క్రమంలో మల్లయ్య కొద్దిదూరం ఈత కొట్టినట్లు సమాచారం. ఈదుకుంటూ కట్టవైపు రాకపోవడంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళుతూ మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కెనాల్లో నీటిని నిలిపివేసినా మల్లయ్య ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై మల్లయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
ఆంజనేయులు ఎక్కడ?.. బ్రిలియంట్ కాలేజీలో ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థి ఆంజనేయులు గత ఆదివారం నుంచి కాలేజ్ హాస్టల్ నుంచి అదృశ్యం అయినప్పటికీ ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులు భారీ ధర్నాకు దిగారు. కొడంగల్కి చెందిన ఆంజనేయులు ఆ కళాశాలలో డిప్లమో రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి అదృశ్యానికి యాజమాన్యమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆంజనేయులుకు అతని తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో.. స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానంతో తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడి గురించి అడగ్గా, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇంత పెద్ద కాలేజీలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: విశాఖ: చైనా వెళ్తున్నానని చెప్పి లాడ్జిలో.. -
100 మందితో గర్ల్స్ హాస్టల్.. రాత్రుళ్లు 89 మంది మిస్సింగ్..
లక్నో: 100 మంది ఉన్నట్లు రిజస్టర్ చేసిన బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో రాత్రిళ్లు 89 మంది మిస్ అయ్యారు. ఈ మేరకు రాత్రిపూట అధికారులు తనిఖీలకు వెళ్లగా.. విషయం వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన బాలికలపై ప్రశ్నించగా.. హాస్టల్ వార్డెన్ సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని పరాస్పూర్ ప్రాంతంలో ఉన్న కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మా సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. రిజిస్టర్లో 100 మంది పేర్లు నమోదు చేయగా.. కేవలం 11 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ సరైన సమాధానం ఇవ్వేలేకపోయారు. దీంతో దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా బేసిక్ శిక్షా అధికారి ప్రేమ్ చంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఓ టీచర్, హాస్టల్ వార్డెన్, వాచ్మెన్, ఓ జవాన్ పేర్లను నమోదు చేశారు. డిపార్టెమెంట్ కూడా సదరు వ్యవహారంపై చర్యలు తీసుకుంటోందని ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. ఇదీ చదవండి: Onion Price Hike: ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
సినిమాల మోజుతో ఇంటి నుంచి విద్యార్థి పరారీ
కురబలకోట : సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో నటించాలన్న మోజుతో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. హైదరాబాదులో ఉన్న అతన్ని ముదివేడు ఎస్ఐ ముబీన్ తాజ్ రప్పించి బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు...కురబలకోట మండలం తెట్టు గ్రామం శ్రీరాములవారిపల్లెకు చెందిన వి. రవికుమార్ అంగళ్లు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఇతను ఇంటి వద్ద టీవీలో సినిమాలు చూడటం ఆపై టీవీలో వచ్చే జబర్దస్త్, ఇతర కార్యక్రమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. తాను కూడా వారిలాగే నటించాలని కలలుగన్నాడు. దీంతో ఈనెల 9న స్కూల్కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించలేదు. కుటుంబీకులు ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి నుండి అదృశ్యమైన ఇతను కాండ్లమడుగు ద్వారా బి.కొత్తకోటకు వెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి మైసూర్ చేరుకున్నాడు. ఓ వాహనదారుడి సహకారంతో హైదరాబాదు చార్మినార్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ అదే సమయానికి సినీ షూటింగ్ జరుగుతుండడంతో యూనిట్లోని కుర్రాళ్లతో మాట కలిపి వారి వద్ద వర్కర్గా చేరాడు. తాను సినిమాల్లో నటించడానికి హైదరాబాదు వచ్చానని రెండు రోజుల క్రితం ఇంటికి ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని బుధవారం హైదరాబాదు నుండి రప్పించారు. కౌన్సెలింగ్ ఇచ్చి ఎస్ఐ ముబీన్ తాజ్ అతన్ని కుటుంబీకులకు అప్పగించారు.కాగా ఇంటి నుంచి బాలుడు వెళ్లే సమయంలో అతని చేతిలో చిల్లిగవ్వ కూడాలేదు. కేవలం దారిన వెళ్లే వాహనదారులను లిఫ్ట్ అడుగుతూ అతను ఊర్లన్నీ చుట్టేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. -
విజయవాడ: వెలుగులోకి షాకింగ్ ఘటన.. తమ పెళ్లి చేసిన మిత్రుడినే..
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని యనమలకుదురులో కోల్డ్బ్లడెడ్ మర్డర్ జరిగింది. భార్యాభర్తలు కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత ఆ మృతదేహాన్ని గోదావరి నదిలో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్సింగ్నగర్కు చెందిన గ్రంథి పురుషోత్తం (41) పాత కార్లు కొని విక్రయించే వ్యాపారం చేస్తాడు. అతను అవివాహితుడు. గత నెల 31వ తేదీన కారు కొనడానికి రాజమండ్రి వెళ్తున్నానని తన సోదరుడు నాగేశ్వరరావుకు చెప్పాడు. కాని ఆరోజు రాజమండ్రి వెళ్లకుండా మొగల్రాజపురం వద్ద మిత్రుడు బలగం మొహిందర్ను కలసి అతని కారు ఎక్కి యనమలకుదురు నేతాజీనగర్లో ఉన్న మొహిందర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిద్దరూ అర్ధరాత్రి వరకు పూటుగా మద్యం తాగారు. ఆ తరువాత పురుషోత్తం జాడ తెలియలేదు. ఈ విషయమై మొహిందర్ను పురుషోత్తం కుటుంబ సభ్యులు అడగ్గా.. పని ఉందని చెప్పి మధ్యలోనే పురుషోత్తం వెళ్లిపోయాడని బదులిచ్చాడు. పురుషోత్తంకు చెందిన రెండు ఫోన్లకు కుటుంబ సభ్యులు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చాయి. దీంతో పురుషోత్తమ్ సోదరుడు నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెలుగు చూసిన ఘోరం పెనమలూరు పోలీసులకు పురుషోత్తం మిస్సింగ్ కేసుపై అనుమానం తలెత్తింది. దీంతో పోలీసులు మొహిందర్ అతని భార్య శశికళను తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. పురుషోత్తం మొహిందర్ సన్నిహిత మిత్రులు. మొహిందర్ విజయవాడలో ఒక కార్ల కంపెనీలో పనిచేసే సమయంలో శశికళతో పరిచయమై వారిద్దరూ ప్రేమించుకోగా, వారి వివాహం పురుషోత్తం దగ్గరుండి జరిపించాడు. అప్పటి నుంచి ఆ మొహిందర్ ఇంటికి తరచుగా పురుషోత్తం వచ్చి వెళుతుంటాడు. మొహిందర్కు ఇటీవల అప్పులు ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలో శశికళ, మొహిందర్ కలిసి పురుషోత్తంను హత్య చేయటానికి పథకం రచించారు. అందులో భాగంగా గత నెల 31వ తేదీన పురుషోత్తంను యనమలకుదురులోని తమ ఇంటికి మొహిందర్ తీసుకువెళ్లి అక్కడ ఫుల్గా మద్యం తాగించాడు. అదును చూసి మొహిందర్ తన భార్య శశికళ సహకారంతో పురుషోత్తం మెడకు వైరు బిగించి హత్య చేశారు. పురుషోత్తం వద్ద ఉన్న సుమారు రూ.3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశారు. అనంతరం కారులో పురుషోత్తం మృతదేహాన్ని ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు తీసుకెళ్లి గోదావరిలో పడేశారు. పురుషోత్తం వద్ద అపహరించిన బంగారు ఆభరణాలను గుంటూరులో విక్రయించి అప్పులు తీర్చుకున్నారు. ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ తమకు ఏమీ తెలియనట్లు నటించారు. పెనమలూరు పోలీసులు కేసును ఛేదించి హత్య ఘటనను వెలుగులోకి తీసుకొచ్చారు. పురుషోత్తం మృతదేహం కోసం గోదావరిలో పోలీసులు వెతికినా దొరకలేదు. బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. భార్యాభర్తలపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
వెళ్లి పోయావా మిత్రమా!
కోనసీమ: ఊహకు ఊపిరిలా.. ఆశకు శ్వాసలా.. మది నిండా మధుర జ్ఞాపకాలతో సందడి చేశారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చుకున్నారు.. స్నేహితుల దినోత్సవం వేళ దోస్తులంతా కలసి చేసిన సందడి కొద్ది క్షణాల్లోనే ఆవిరి అయ్యింది. తమ స్నేహితుడు కళ్ల ముందే కాలువలో గల్లంతైన ఘటన చూసిన సహచరులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటన ఎస్.యానం కట్టు కాలువ వద్ద జరిగింది. స్నేహితులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో కొత్త కాలనీకి చెందిన చిత్రి ముఖేష్ కుమార్ (19) తన పదకొండు మంది మిత్రులతో కలసి ఎస్.యానం బీచ్కు వెళ్లాడు. అక్కడ ఆట పాటలతో సముద్ర స్నానాలు చేసి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు. తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంటికి వెళుతూ ఒంటిపై ఉన్న ఇసుకను తొలగించుకునేందుకు బీచ్ను ఆనుకుని ఉన్న కట్టు కాలువలో స్నానాలకు దిగారు. సముద్ర పోటు సమయం కావడంతో కాలువలో నీరు ఎక్కువగా ఉంది. దీంతో ముఖేష్ కుమార్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు చూస్తుండగానే అతను నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితులు చేతనైన సాయం చేద్దామనుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల దినోత్సవం రోజునే తమ మిత్రుడు ఇలా కొట్టుకుపోతుంటే తట్టుకోలేక హాహాకారాలు చేశారు. ఈ సంఘటనను తెలుసుకున్న ఎస్సై జి.వెంకటేశ్వరరావు, పోలీసులు, గ్రామస్తులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ముఖే‹Ùకుమార్ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి వరకూ గాలింపు కొనసాగింది. ముఖేష్ కుమార్ సోదరుడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వరరావు వివరించారు. -
ఇప్పటకీ అంతుతేలని కేర్టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?
అది 1999 జూలై 15. తెల్లవారుజామున మూడు కావస్తోంది. అమెరికా మిస్సోరీ, సెయింట్ లూయీలోని రిచ్మండ్ హైట్స్లో 1600 బ్లాక్ ముందు ఉన్నట్టుండి అలజడి రేగింది. అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు.. పోలీస్ హారన్స్తో ఉలిక్కిపడి లేచారు. చాలాసేపటి నుంచి తమ పక్క ఇంట్లో పసికందు ఏడుపు వినిపిస్తోందని.. తమకేదో అనుమానంగా ఉందని ఓ కుటుంబం.. ఎమర్జెన్సీ కాల్ చేయడంతోనే పోలీసులు అక్కడికి వచ్చారు. సదరు కుటుంబమిచ్చిన సమాచారంతో.. అంతా ఆ అనుమానాస్పద ఇంటి తలుపు తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. లోపల బిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే బయటున్నవారందరికీ హృదయం ద్రవించిపోతోంది. తీరా తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఆ పసిపాప తప్ప ఇంకెవరూ కనిపించలేదు. దాంతో అంతా షాకయ్యారు. ఇరుగూ పొరుగూ ఆ పాపని సేదతీర్చే పనిలో పడ్డారు. కాసేపటికి పోలీసు కన్ను పడకగదిలో రక్తపుచుక్కల్ని పసిగట్టింది. వెంటనే ఇల్లంతా శోధించారు. రక్తం మరకలున్న చేతి రుమాలు, చెత్తబుట్ట వెనుక రక్తంతో తడిసిన తలదిండ్లు ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు.. అదో మిస్టీరియస్ కేసుగా మిగలబోతోందని అక్కడున్న వారెవ్వరికీ తెలియదు. ఈ పాప తల్లిదండ్రులు.. డానా మాడెన్(తల్లి), క్రిస్టోఫర్ హెర్బర్ట్(తండ్రి) అనే దంపతులు. వాళ్లు ఆఫీసులకు వెళ్లినప్పుడు పాపని చూసుకోవడానికి ఎవరో తెలిసిన వాళ్ల అమ్మాయిని కేర్ టేకర్గా పెట్టి వెళ్తారని.. కనీసం ఆ అమ్మాయి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని.. పోలీసులకు స్థానికుల్లో కొందరు చెప్పారు. అసలు చంటిపాపను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఎవరు? అని ఆరా తీస్తే.. పన్నెండేళ్ల హెదర్ కులోర్న్ అని.. తను, మాడెన్ స్నేహితురాలైన క్రిస్టీన్ కులోర్న్ కూతురని తేలింది. బ్లో మిడిల్ స్కూల్లో చదువుతున్న ఆ పాప.. మాడెన్ కూతురికి కేర్టేకర్గా ఉండేదట. క్రిస్టీన్, మాడెన్, హెర్బర్ట్లతో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి పాపతో ఆ ఇంట్లో ఉన్నది హెదరేనని పోలీసులకు స్పష్టమైంది. రెండు రోజులకు ఆ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ను డీఎన్ఏ పరీక్షకు పంపిస్తే.. ఆ రక్తం హెదర్దేనని తేలింది. అసలు హేథర్కి ఏమైంది? ‘కేవలం మా పసిబిడ్డను చూసుకోవడానికే ఆ బాలికను ఇంట్లో ఉంచాం. ఆ రాత్రి మేము ఆ ఇంట్లో లేకపోవడం వల్ల ఏం జరిగిందో? హెదర్ని ఎవరు ఏం చేశారో? మాక్కూడా తెలియదు’ అని చెప్పుకొచ్చారు మాడెన్ దంపతులు. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆ అపార్ట్మెంట్ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దుప్పట్లో ఏదో బరువైనది మోసుకుని వెళ్లడాన్ని తాను చూసినట్టు ఓ సాక్షి చెప్పాడు. అయితే ఆ దుండగుడ్ని అతడు గుర్తించలేకపోయాడు. ఆ దుప్పట్లో ఉన్నది హెదర్ మృతదేహం కావచ్చని కొందరు నమ్మారు. కానీ అందుకు ఎటువంటి ఆధారాల్లేవు. హెదర్ కోసం ఆమె తల్లి క్రిస్టీన్ గుండెలవిసేలా ఏడ్చింది. ‘నా బిడ్డకు మధుమేహం ఉంది.. తనకు మందులు అందకపోతే ఎక్కువ కాలం బతకలేదు. రోజువారీ ఇన్సులిన్ ఇస్తూ, తరచుగా రక్తపరీక్ష చేస్తూ ఉండాలి. దయచేసి నా బిడ్డను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వదిలిపెట్టండి’ అంటూ మీడియా ముఖంగానే వేడుకుంది. అయినా హెదర్ సమాచారం బయటికి రాలేదు. ఆ తల్లి వ్యథ ఎందరినో కంటతడి పెట్టించింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. ప్రీప్లాన్గానే ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారని.. అది హేథర్కి తెలిసినవారి పనేనని.. రక్తపు ఆనవాళ్లు ఉన్నాయంటే చంపేసి ఉంటారని కూడా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే మృతదేహం దొరక్కపోవడంతో క్రిస్టీన్ తన న్యాయపోరాటాన్ని ఆపలేదు. తొమ్మిది నెలలు గడిచినా కేసులో ఎలాంటి పురోగతిలేదు. దాంతో ‘హెదర్ ఎక్కడ?’ అంటూ.. మాడెన్, హెర్బర్ట్లను అరెస్ట్ చేసి.. గట్టిగా నిలదీశారు. కానీ ఆ దంపతులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. మాడెన్ ఆ రాత్రి నైట్ షిఫ్ట్లో ఉందని తేలినప్పటికీ.. హెర్బర్ట్ ఎక్కడున్నాడనే దానిపై సరైన క్లారిటీ రాలేదు. అతడు పొంతన లేని ఎన్నో సమాధానాలిచ్చి.. ఆధారాలు లేక నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే క్రిస్టీన్ మాత్రం.. ‘తన కూతురు మాయం కావడానికి అసలు కారణం మాడెన్ దంపతులకు కచ్చితంగా తెలిసే ఉంటుంది’ అని నమ్మింది. ఆ క్రమంలోనే దర్యాప్తులో మరో నిజం బయటపడింది. మిస్సోరీలోని ప్రధాన డ్రగ్స్ మూలాలు ఆ అపార్ట్మెంట్లోనూ ఉన్నాయనే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అంటే అపార్ట్మెంట్లో రహస్యంగా ఉన్న చట్టవిరుద్ధమైన ఆ ల్యాబ్ గురించి హెదర్కి తెలిసి ఉంటుందని.. అపార్ట్మెంట్ గ్యారేజీలో మాదకద్రవ్యాల కార్యకలాపాలను ఆమె కళ్లారా చూసి ఉంటుందని.. అందుకే బలవంతంగా అపహరించి, హత్య చేసి ఉంటారని విశ్వసించారు. ఇది పరిష్కారం కాకుండానే.. క్రిస్టీన్ 2017 డిసెంబర్ 16న కన్నుమూసింది. ఏదైమైనా హెదర్కి ఏమైందనేది మాత్రం బయటపడలేదు. ఒకవేళ సీరియల్ కిల్లర్ దాడి చేసి ఉంటాడా? మాడెన్ భర్త హెర్బర్ట్ దురుద్దేశంతో హెదర్ మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి, చంపేశాడా? లేదంటే హెదర్ తన స్నేహితుల్ని గుడ్డిగా నమ్మి.. ఆ ఇంటికి ఆహ్వానించి మోసపోయిందా? అనేది మాత్రం నేటికీ తేలలేదు. 12 ఏళ్ల హెదర్ కులోర్న్ అదృశ్యమై.. 24 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కేసులో హెదర్ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప మిస్టరీ అయితే వీడలేదు. సంహిత నిమ్మన (చదవండి: ఆ దేశంలోని టొమోటా ధర వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
తండ్రి బైక్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై.. ఎవరికీ చెప్పకుండా..
హైదరాబాద్: బైక్ కొనివ్వమంటే తల్లిదండ్రులు నిరాకరించారని అలిగి ఓ బాలుడు ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోనీ గౌరీ శంకర్ కాలనీ సరస్వతి స్కూల్ సమీపంలో నివసించే సి.గోవర్ధన్ గత నెల 31వ తేదీన తండ్రి వెంకటయ్యను తనకు బైక్ కొనివ్వాలంటూ అడిగాడు. అయితే తనకు ఆ స్థోమత లేదని తండ్రి చెప్పాడు. ఇక ఎప్పటికీ బైక్ కొనివ్వలేడని మనస్తాపానికి గురైన గోవర్ధన్ అదే రోజు రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. గత నాలుగు రోజుల పాటు తల్లిదండ్రులు కొడుకు కోసం అన్ని ప్రాంతాలు గాలించినా ఫలితం లేకపోవడంతో తన కొడుకు కనిపించడం లేదంటూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని బాలుడికోసం గాలిస్తున్నారు. -
నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు
భోపాల్: సాటి మనిషి మీద దయ చూపని ఈ సమాజంలో కొందరు మాత్రం జంతువులు మీద కూడా అంతులేని ప్రేమను చూపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం, ఉత్తరప్రదేశ్లో సరస్ క్రేన్, ఒక వ్యక్తి మధ్య స్నేహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్లోని దామోహ్ నుండి ఈ తరహా ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీపక్ సోనీ తన తప్పిపోయిన చిలుక కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. అంతేకాకుండా తన చిలుక ఆచూకీతో తెలిపితే ₹ 10,000 నగదు బహుమతిని అందజేస్తూ, పట్టణం అంతటా పోస్టర్లు వేశాడు. తప్పిపోయిన పక్షిని కనుగొనే ప్రయత్నంలో నగరం అంతటా పోస్టర్లు అంటించేందుకు అతను ఒక ఆటోరిక్షా డ్రైవర్లకు సహాయం తీసుకున్నాడు. అందుకు వారికి డబ్బులు కూడా చెల్లించాడు. ‘గత నెలలో ఎగిరిపోయి దానికదే ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. ఇంకా తిరిగి రాలేదు. వీధి కుక్కలు దానికేమైనా హాని చేశాయోనని భయపడుతున్నాము. చిలక అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం. దాని ఆచూకీ తెలిపిన వారికి పదివేలు, అంతకంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధం. దానిని కనుగొన్న వారు నా నంబర్కు కాల్ చేయగలరు ’ అని వారి ప్రాంతంలో పోస్టర్లు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్గా మారింది. -
10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో..
-
10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో..
ఉత్తరప్రదేశ్లోని బలియాలో హృదయాలను ద్రవింపజేసే ఒక కథ వెలుగుచూసింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళుతోంది. ఆ సమయంలో ఆమెకు ఆసుపత్రి బయట మానసికంగా కుంగిపోయిన ఒక వ్యక్తి కనిపించాడు. ఆమె ఆతనికి దగ్గరగా వెళ్లి పరిశీలనగా చూడగా, అతను మరెవరో కాదు తన భర్తే అని గుర్తించింది. 10 ఏళ్ల క్రితం ఆమె భర్త కనిపించకుండా పోయాడు. ఇప్పుడు భర్తను ఇటువంటి పరిస్థితిలో చూసిన ఆమె అతనికి తల దువ్వడంతో పాటు శరీరాన్ని శుభ్రపరుస్తూ స్నానం చేయించింది. అలాగే ఆమె ఏడుస్తూ పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భర్త ఇతనేనని చుట్టుపక్కల వారికి తెలియజేసింది. ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లిపోయారు? ఏమైపోయారు? అని అతనిని అడుగుతూ కనిపించింది. అయితే అతను అమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. మౌనంగా ఆమెను అలా చూస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆ మహిళ ఇంటిలోని వారికి ఫోను చేసి, తండ్రికి దుస్తులు తీసుకురావాలని కోరింది. కొద్దిసేపటి తరువాత బైక్పై వచ్చిన ఒక యువకుడు ఆ మహిళను, అతనిని తనతో పాటు తీసుకువెళ్లిపోయాడు. కాగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 2020లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఒక డీఎస్పీ రోడ్డు పక్కక బిచ్చగాని మాదిరిగా కనిపించాడు. అతని బ్యాచ్మేట్ అతనిని గుర్తించారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ప్రోగ్రాం ఉందని మొహర్రం సెలవు రద్దు..! -
‘అడ్రస్’లేని భూములకు సర్వేనంబర్
ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్కార్డు, ఫోన్నంబర్లు ఆ స్లాట్లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం. కోకాపేట సమీపంలో ఉండడంతోనే... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు. కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు. అంతా కలిసి.. ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి... ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శేరిగూడ భూములపైనా కన్ను సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుమతించింది కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్ -
కొడుకా..! ఎక్కడున్నావురా..?
నల్గొండ: కొడుకా.. ఎక్కడ ఉన్నావురా..మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లావు.. ఇంటికిరా.. అంటూ కన్నీరుమున్నీరవుతోంది.. ఆ గిరిజన కుటుంబం. పరీక్షలో తప్పావని దిగులు చెందకు కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లతో అభయమిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్ –సైదమ్మల దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో పెద్దవాడు ధనావత్ కార్తీక్, కుమార్తె సాత్విక. ధనావత్ ఉమ్లానాయక్ వ్యవసాయ పనులు చేసుకుంటుండగా తల్లి సైదమ్మ చింతలపాలెంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. రెండు సబ్జెక్టులు తప్పాడనేనా..? ధనావత్ కార్తీక్ సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కార్తీక్ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే, కార్తీక్ మనస్తాపం చెందాడో మరో కారణమో తెలియదు కానీ ఈ నెల 17న రాత్రి 7:40 గంటలకు కళాశాల హాస్టల్ నుంచి బయటికి వచ్చాడు. అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి వైజాగ్ వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్లు చూపిస్తున్నాయి. 18వ తేదీ రాత్రి 9: 30గంటలకు రైలు దిగి నడుచుకుంటూ ఆర్కే బీచ్ వరకు వెళ్లి సమీపంలో గల ఫేమస్ బేకరీలో 10:30గంటలకు తినుబండారాలు కొనుగోలు చేశాడు. అనంతరం తిరిగి బీచ్ వైపు వెళ్లి 2.38గంటల వరకు తిరిగినట్లు సీసీ ఫుటేజ్ చూయించింది. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో.. ఈ నెల 18న అర్ధరాత్రి దాటిన తర్వాత 2:58 గంటలకు బీచ్ సమీపంలోనే కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడి నుంచి కార్తీక్ ఎక్కడికి వెళ్లాడనేది అంతుచిక్కకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఈ నెల 19న సంగారెడ్డిలోని ఐఐటీ కళాశాలకు వెళ్లి విషయం ప్రిన్సిపాల్ దృష్టి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తల్లిదండ్రులు సంగారెడ్డిలోని కంది పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటికే వైజాగ్లో ఉన్న వారి బంధువులకు సమాచారం ఇచ్చిన ఉమ్లానాయక్–సైదమ్మలు 21న వైజాగ్కు వెళ్లారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు వైజాగ్ పోలీసులను ఆశ్రయించగా 60మంది బృందాలుగా ఏర్పడి కార్తీక్ కోసం ఐదు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గుండెలు బాదుకుంటున్న నాయనమ్మ, తాతయ్య నాకు ఒక్కడే కుమారుడు, నా కుమారుడికి ఒక్కడే కుమారుడు అంటూ కార్తీక్ నాయనమ్మ–తాతయ్య ధర్మి, వాలు కన్నీరుమున్నీరవుతున్నారు. కార్తీక్ అదృశ్యం అయినప్పటి నుంచి బంధువులు వస్తుండటంతో వారి కన్నీటిని అపడం ఎవరితరం కావడం లేదు. మనుమడా ఎక్కడా ఉన్నా రా.. అయ్యా అంటూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
వివాహిత అదృశ్యం !
సంగారెడ్డి: కూర బాగాలేదని భర్త మందలించడంతో ఓ వివాహిత ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండలగూడలో నివాసం ఉండే అంజయ్య కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూర బాగాలేదని బార్య ప్రసన్నలక్ష్మీతో గొడవపడ్డాడు. దీంతో ఆమె అదే రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల ఇంట్లో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సీరియల్స్, సినిమాల్లో నటించాలనే కోరిక.. ఫ్రెండ్ ఇంట్లో పూజ ఉందని చెప్పి..
సాక్షి, హైదరాబాద్: బాలిక మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే మధురానగర్ పోలీసులు పరిష్కరించారు. వివరాలివీ... రహమత్నగర్లో నివాసం ఉండే డి.సంతోషి కుమార్తె బుధవారం ఉదయం స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లింది. గురువారం వరకు కూడా తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గురువారం రాత్రి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ అయినందున పోలీసులు బాలికను కనిపెట్టే విషయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఫోన్ ఆధారంగా యాదాద్రిలో ఉన్నట్టు గుర్తించారు. శుక్రవారం ఉదయం ఆ బాలిక యాదాద్రిలో తనకు తెలిసిన లక్ష్మీ అనే మహిళతో కలిసి తిరుగుతుండగా ఎస్ఐ నరేందర్, సిబ్బంది వెళ్లి పట్టుకున్నారు. బాలికను విచారించగా సీరియల్స్, సినిమాలలో నటించాలని కోరిక ఉందని, అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్లో చిన్న క్యారెక్టర్స్లో కూడా నటించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో లక్ష్మీ అనే మహిళ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పడంతో యాదాద్రికి వచ్చినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసులు బాలికను మధురానగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. -
హైదరాబాద్: టీవీ సీరియల్ నటి అదృశ్యం
వెంగళరావునగర్(హైదరాబాద్): స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకుండా అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధురానగర్ పోలీసుల సమాచారం మేరకు... రహమత్నగర్లో నివాసం ఉండే సంతోషి, నీలకంఠ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె 8వ తరగతి వరకు చదివి బడి మాసేసింది. ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడూ సీరియల్స్లో షూటింగ్కు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో ఈ నెల 12న మధ్యాహ్నం తల్లి ఇంట్లో లేకపోవడంతో తన స్నేహితురాలు ఇంట్లో పూజ ఉంది వెళ్లివస్తానని సోదరుడు భరత్కుమార్కు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో సంతోషి కుమార్తెకు ఫోన్ చేయగా తాను యూసుఫ్గూడ చెక్పోస్ట్ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నానని చెప్పింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా నెంబర్ కలవలేదు. చదవండి: నవదీప్తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్ రాత్రంతా ఎదురు చూసినా ఇంటికి రాలేదు. గురువారం బంధువులు, స్నేహితులను విచారించి, పలు ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. దీంతో మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వయసు దాదాపు 16 ఏళ్లు ఉంటాయని, సుమారు 5 అడుగుల ఎత్తు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎర్ర రంగు డ్రెస్, తెలుపు చున్నీ ధరించిందని, తెలుగు, హిందీ మాట్లాడగలదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
అమెరికా ఆర్మీ క్యాంపుల్లో కొందరు నేరగాళ్లు
అమెరికాలోని శాన్ డియాగోలోగల మెరైన్ కార్ప్స్ బేస్ క్యాంప్ పెండిల్టన్లోని బ్యారక్స్లో గతంలో తప్పిపోయిన 14 ఏళ్ల బాలిక ఆచూకీ లభ్యం కావడంతో ఒక యూఎస్ మెరైన్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బాధిత బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆ బాలికను ఎవరో అక్రమంగా విక్రయించారని, ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. శాన్ డియాగో కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మతిస్థిమితం లేని ఒక బాలిక జూన్ 9 న ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయి, ఇంటికి తిరిగి రాలేదని జూన్ 13 న ఆ బాలిక అమ్మమ్మ పోలీసుకు ఫిర్యాదు చేసింది. కాగా ఆబాలిక అదృశ్యమైన 20 రోజుల తర్వాత జూన్ 28న మిలటరీ పోలీసులు ఆమెను బ్యారక్స్ లోపల కనుగొన్నారని ఆమె అత్త కాసౌండ్రా పెరెజ్ తెలిపారు. ‘ఆ బాలిక ఆచూకీ మిలటరీ పోలీసులకు బ్యారక్లో లభ్యమయ్యింది. లైంగిక కార్యకలాపాల కోసం ఆమెను ఎవరో సైనికునికి విక్రయించారు’ అని పెరెజ్ టిక్టాక్ వీడియోలో తెలిపారు. మెరైన్ బేస్ క్యాంప్లో బాలిక ఉందని షెరీఫ్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా ఆ బాలిక గతంలోనూ ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోయేదని, అయితే త్వరగా ఇంటికి తిరిగి వచ్చేదని ఆమె అమ్మమ్మ మీడియాకు తెలిపారు. నేవల్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ సర్వీస్ కు చెందిన షెరీఫ్ విభాగం, శాన్ డియాగో హ్యూమన్ ట్రాఫికింగ్ టాస్క్ ఫోర్స్ సాయంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. కంబాట్ లాజిస్టిక్స్ బెటాలియన్ 5, 1వ మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్లో సభ్యుడైన ఒక మెరైన్ను జూన్ 28న ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్ కెప్టెన్ చక్ పామర్ తెలిపారు. కాగా పేరు వెల్లడికాని ఆ మెరైన్పై ఇంకా అభియోగాలు మోపలేదు. మెరైన్ కార్ప్స్ చేతికి సంకెళ్లి వేసి పోలీసులు తీసుకెళ్లిన ఫోటో ఇలీవల సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. కాగా తన మేనకోడలిపై జరిగిన అత్యాచారాన్ని సైన్యం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని పెరెజ్ ఆరోపించారు. ఈ ఘటనకు బేస్ క్యాంప్దే బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. వారే ఆ బాలికను బేస్లోకి తీసుకురావడానికి అనుమతించారు. అక్కడ అతను ఆమెతో లైంగిక సంబంధం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉన్నందున అడ్డుకోలేకపోయిందని పెరెజ్ అన్నారు. కాగా అధికారులు ఆ బాలికను ఆమె అమ్మమ్మకు అప్పగించారు. ఇది కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు -
HYD: హిమాచల్ వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా డాక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: వాతావరణంలో నెలకొన్న అనూహ్య పరిణామాలతో ఉత్తర భారతాన్ని ఎడతెరిపి ఇవ్వని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎటు చూసినా వరద పోటెత్తిన దృశ్యాలు.. మనుషులు, వాహనాలు, భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల ధాటికి 72 మంది మృతిచెందగా.. 10 మంది అదృశ్యమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఉస్మానియాకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో ఉస్మానియాకు చెందిన డాక్టర్ బానోత్ కమల్లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామానికి చెందిన మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్కు చెందిన ఓ ఫ్యామిలీ సైతం ఉత్తరాది భీకర వర్షాల్లో చిక్కుకుపోగా.. ఆదివారం నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అయితే.. చివరికి వాళ్లు సురక్షితంగా నగరానికి తిరుగు పయనమైనట్లు తేలింది. మంత్రి హరీష్ ఆరా ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. కృష్ణా నది ట్రిబ్యునల్, నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారాయన. అదే సమయంలో.. హిమాచల్ వరదల్లో ఉస్మానియా వైద్యులు చిక్కుకుపోయిన పరిణామంపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ఆరా తీశారు. వైద్యులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారాయన. ఇదీ చదవండి: హిమాన్షు పెద్ద మనసు.. కోటి రూపాయలతో.. -
6 టన్నుల ఐరన్ బ్రిడ్జి అలా మాయమైంది!
ముంబై: ముంబై శివారు మలాడ్(పశ్చిమ)లో 6 వేల కిలోల బరువైన ఇనుప వంతెనను మాయం చేసిన ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భారీ విద్యుత్ కేబుళ్లను అటూఇటూ జరిపేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 90 అడుగుల పొడవైన ఇనుప వంతెనను ఏర్పాటు చేసింది. అక్కడే శాశ్వత వంతెనను నిర్మించడంతో ఇనుప బ్రిడ్జిని గత కొన్ని నెలల క్రితం మరో ప్రాంతంలోని మురుగు కాల్వపైకి తరలించారు. ఈ వంతెన కనిపించకుండా పోయిందంటూ అదానీ సంస్థ జూన్ 26న బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జూన్ 6వ తేదీ నుంచే ఆ బ్రిడ్జి మాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రాంతంలో సీసీటీ కెమెరాలు లేవు. సమీప ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా జూన్ 11వ తేదీన వంతెన వైపుగా ఒక భారీ లారీ వచ్చిన విషయం రికార్డయింది. ఆ లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కూపీ లాగారు. అందులోనే గ్యాస్ కటింగ్ యంత్రాలను తీసుకువచ్చి 6 టన్నుల ఇనుప వంతెనను కట్ చేసి ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. ఆ బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఉద్యోగే సూత్రధారి అని తేలడంతో అతడిని, సహకరించిన మరో ముగ్గురిని గత వారం అదుపులోకి తీసుకున్నారు. ఎత్తుకుపోయిన ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
Hyderabad: పెళ్లైన నెలకే.. పారిపోయిన యువతి
సాక్షి, హైదరాబాద్: పెళ్లైయిన నెల రోజులకు తల్లిగారింటికి వచ్చిన యువతి కుటుంబ సభ్యుల కళ్లుగప్పి పరారైన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్నాటక బీదర్కు చెందిన పార్వతి ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి గోపన్పల్లి తండాలో నివాసం ఉంటోంది. పెద్ద కూతురు జగ్దేవికి ఔరత్కు చెందిన పవార్తో మే నెల 29న వివాహం జరిగింది. కొద్ది రోజుల క్రితం జగ్దేవి తల్లి గారింటికి వచ్చింది. జూన్ 29న సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి, కూతుళ్లు బయటకు వచ్చారు. వారి కళ్లు గప్పి జగ్ధేవి పారిపోయింది. సమీప ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్
విశాఖ: నగరంలో ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. గాజువాక శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. అదే రోజు కె. కోటపాడు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు. ఆపై అదృశ్యమయ్యారు. కె. కోటపాడు నుంచి తిరుగు పయనం అయినప్పటికీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కె. కోటపాడు పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ మాత్రం దొరకలేదు. -
ఫ్లైట్లో పోగొట్టుకున్నా.. ప్లీజ్ తెచ్చి ఇవ్వండి: ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తన అంద చందాలతో నెట్టింట కుర్రకారుకు హీటెక్కిస్తుంది ఈ బీ టౌన్ చిన్నది. ఈ నటి ఇటీవలే ప్రపంచంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అవార్డును కూడా అందుకుంది. ఈ విషయాన్ని ఊర్వశి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పింది. తాజాగ మరోసారి సోషల్ మీడియాలో ఆమె చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) ఇటీవల విమానంలో దూర ప్రయాణం చేసిన ఊర్వశి తన వద్దనున్న రెండు ఐఫోన్లను ఫ్లైట్లోనే మరచిపోయి వచ్చేసిందట. అది వెతికేందుకు సహాయం కోరుతూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ను ఇలా పెట్టింది. 'డియర్ విస్తారా నేను నా రెండు ఐఫోన్లను యూకే 772 విమానంలో మరచిపోయాను. వాటి వాల్ పేపర్లో మా తల్లిదండ్రుల ఫొటో ఉంటుంది. దయ చేసి మీరు దాన్ని వెతికేందుకు సహాయం చేస్తారా' అంటూ రాసుకొచ్చింది. కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ సినిమాల్లోనూ మెరుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వాల్తేరు వీరయ్యలో చిరు సరసన 'బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ' అంటూ స్టెప్పులేస్తూ.. యూత్ ఫాలోయింగ్ను పెంచుకుంది . ప్రస్తుతం ఆమె లో బోయపాటి-రామ్ పోతినేని సినిమాతో పాటు 'బ్రో' లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరవనుంది. (ఇదీ చదవండి: రాధికా ఆప్టేతో రోమాన్స్ చేసిన ఈ నటి గురించి తెలుసా?) -
సస్పెన్స్ థ్రిల్లర్లా టైటాన్ రెస్క్యూ ఆపరేషన్
-
అధికవడ్డీ ఆశచూపి... రూ.15 కోట్లకు పైగా వసూలు చేసిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
నాగర్కర్నూల్: మధ్యతరగతి కుటుంబాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉంటారు. అధిక వడ్డీ ఇస్తామంటూ నమ్మబలికి మధ్యతరగతి కుటుంబాలను రోడ్డుపాల చేయడం, మోసాలకు పాల్పడడం నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే జిల్లాలో తాజాగా చోటుచేసుకుంది. గుట్టుచుప్పడు కాకుండా బాధితుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశాడు ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. నాగర్కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి హైదరాబాద్లో నివాసముంటున్నాడు. అయితే నాగర్కర్నూల్లో ఉంటున్న తన తమ్ముడికి ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని గత సంవత్సరం క్రితం ఈ మోసానికి తెరలేపాడు. రూ.లక్షకు రూ.20వేలు వడ్డీ ఇస్తానంటూ.. అండమాన్తోపాటు ఇతర ప్రాంతాల్లో రియల్ఎస్టేట్తోపాటు కాపీ తోటలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని దీనికి రూ.లక్షకు 20వేల వడ్డీ ఇప్పిస్తానని నమ్మబలికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాడు. నమ్మకం కుదిరేందుకు దాదాపు నాలుగైదు నెలలు చెప్పినట్లుగానే వడ్డీని ఇప్పించాడు. అనంతరం ఇంత వడ్డీ రాదని రూ.లక్షకు రూ.9వేలకు వరకు వస్తుందని బాధితులకు చెప్పి వారిని ఒప్పించారు. ఒప్పించడంతోపాటు వారికి పరిచయం ఉన్న వ్యక్తులను కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాడు. దాదాపు జిల్లా వ్యాప్తంగా రూ.15కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవల డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సదరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిపై వత్తిడి తేవడంతో ఇప్పుడు, అప్పుడంటూ కొన్ని రోజులు గడిపాడు. చివరికి నాగర్కర్నూల్లో ఉన్న ఓ ప్లాట్ను విక్రయించి సెల్ఫోన్ను స్విచ్ఆఫ్ చేశాడు. దీంతో జిల్లా కేంద్రంలో ఉన్న అతని సోదరుడి వద్దకు బాధితులు వెళ్లి ఆరా తీశారు. అతని అన్న చిరునామా చెప్పాలంటూ ఒత్తిడి తేవడంతో రెండు రోజులు సమయం ఇవ్వాలని, తనని వదిలిపెట్టాలని వేడుకోగా కనికరించిన వెళ్లిపోయారు. తాజాగా అతని తమ్ముడు కూడా సెల్ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఇంట్లో నుంచి పరారయ్యాడు. ● ఇద్దరు సోదరులను నమ్మి డబ్బులు అప్పజెప్పిన బాధితులకు తిరిగి డబ్బు ఇవ్వకపోగా వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 18న ఇద్దరు సోదరుల్లో తమ్ముడిని సదరు బాధితులు పట్టుకుని వారి సొంత ఊరైన గుడిపల్లికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే తన అన్న అడ్రస్ చెబుతానని, తనకు రెండు రోజులు సమయం ఇవ్వాలని బాధితులను వేడుకోవడంతో మధ్యాహ్నం 3గంటల సమయంలో బాధితుల్లో ఒక వ్యక్తి సదురు వ్యక్తిని ఇంటి వద్ద వదిలివేయడం జరిగింది. అనంతరం 5గంటల సమయంలో బాధితుల్లో ఒకరికి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ తన భార్య ఫిర్యాదు చేసిందని ఫోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో బాధితులుంతా ఖంగుతిన్నారు. అనంతరం పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించగా బాధితుల్లో ఒకరు సదరు వ్యక్తిని ఇంటి వద్ద దిగబెట్టడం స్పష్టంగా కనిపించినట్లు తెలిసింది. ఇదిలాఉండగా, ఈ సంఘటనపై నాగర్కర్నూల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ఇద్దరు సోదరులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు వసూలు చేసిన సంఘటనలో బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. లక్ష్మణ్ అనే వ్యక్తి మిస్సింగ్పై అతని భార్య ఫిర్యాదు ఇచ్చింది. ఈ విషయంపై అన్నికో ణాల్లో విచారణ చేస్తున్నాం. – విజయ్ కుమార్ ఎస్ఐ, నాగర్కర్నూల్ -
Titanic Sub: ఆక్సిజన్ అయిపోతోంది.. టైటాన్ జాడేది?
దాదాపు రెండు రోజులు గడిచాయి. సమయం గడిచే కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రాణవాయివు కొద్దిగంటలకే సరిపడా ఉండడంతో.. అదృశ్యమైన మినీ జలంతర్గామిలోని వాళ్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన నెలకొంది. దీంతో అట్లాంటిక్ లోతుల్లో వెతుకులాటను వేగవంతం చేశారు. కానీ, రెండు మైళ్ల కంటే ఎక్కువ లోతులో.. 20వేల చదరపుకిలోమీర్ల విస్తీర్ణం ఉన్న ఆ ప్రాంతంలో అదంతా సులువు అయ్యే పనేనా?. చిమ్మచీకట్లు.. గడ్డకట్టుకుపోయే చలి.. పైగా సముద్రపు బురద.. ఆ అగాథంలో ఎదురుగా ఏమున్నదనేది ఎంత వెలుగుతో వెళ్లినా కనిపించని స్థితి.. మొత్తంగా అంతరిక్షంలోకి వెళ్లినట్లే ఉంటుందట అక్కడి పరిస్థితి. అట్లాంటిక్ మహా సముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఉంది. ఆ మినీ సబ్మెరైన్లో కొద్దిగంటలపాటు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో గంట గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. జలాంతర్గామిని కనుగొనేందుకు అమెరికా, కెనడా రక్షణ బృందాలు రంగంలోకి దిగినా.. కష్టతరంగా మారింది రెస్క్యూ ఆపరేషన్. బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్ హార్డింగ్, పాకిస్థాన్ బిలియనీర్ షాజాదా దావూద్.. ఆయన కొడుకు సులేమాన్, మరో ఇద్దరు ఉన్నారు. ఏం జరిగింది.. ఓషన్గేట్ అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో టైటానిక్ శకలాల సందర్శన ఓ భాగం. ఇందుకోసం 22 అడుగుల పొడవైన మినీ జలాంతర్గామిని వాడారు. దాని పేరు టైటాన్. ఒక్కో టికెట్ ధర 2 లక్షల యాభై వేల డాలర్లు. ఐదుగురు సభ్యులతో కూడిన టైటాన్.. న్యూఫౌండ్లాండ్ నుంచి మొదలైంది. 400 నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్ల్యాండ్లోని సెయింట్ జాన్స్కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్.. మహా సాగరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. రెండు గంటల్లోపే.. టైటాన్ భాగం.. కార్బన్ ఫైబర్తో రూపొందింది. సాధారణ జలాంతర్గాములు సొంతంగా రేవు నుంచి బయల్దేరి వెళ్లి, తిరిగి అక్కడికి చేరుకోగలవు. సబ్మెర్సిబుల్గా పేర్కొనే ఈ మినీ జలాంతర్గామిని మాత్రం సాగరంలోకి పంపడానికి, వెలికి తీయడానికి ఒక నౌక అవసరం. ఇందుకోసం కెనడాకు చెందిన పోలార్ ప్రిన్స్ అనే షిప్ సేవలను ఓషన్గేట్ సంస్థ ఉపయోగించుకుంది. అయితే.. గంటా 45 నిమిషాల్లోనే ఆ జలాంతర్గామితో పోలార్ ప్రిన్స్కు సంబంధాలు తెగిపోయాయి. టైటానిక్ చూసేందుకు.. 1912లో మంచుకొండను ఢీకొట్టి టైటానిక్ నౌక అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 2,200 మంది ప్రయాణికులు, 700 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ శకలాలను తొలిసారి 1985లో గుర్తించారు. వాటిని చూసేందుకు 2021లో కొందరు పర్యాటకులు లక్ష నుంచి లక్షన్నర డాలర్లు చెల్లించి సముద్రగర్భంలోకి వెళ్లారు. ఇప్పటి యాత్రలో మాత్రం ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల డాలర్ల వరకూ ఓషన్గేట్ సంస్థ వసూలు చేసినట్లు తెలుస్తోంది. టైటాన్ ఇదివరకూ ఇలాంటి యాత్రలు చేపట్టినా.. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని కంపెనీ చెబుతోంది. Surface search underway for the OceanGate Titan Submersible. The five people stuck inside the Titanic submarine: Paul-Henry Nargeolet, 73 Stockton Rush, 61 Hamish Harding, 58 Shahzada Dawood, 48 Sulaiman Dawood, 19 pic.twitter.com/hzwBbQf9jY — quinn (@outtaminds) June 20, 2023 NEW. ⚠️Crews searching for the #Titan submersible heard banging sounds every 30 minutes Tuesday and four hours later, after additional sonar devices were deployed, banging was still heard, according to an internal government memo update on the search. (1/4) #titanic #Submersible pic.twitter.com/b6iItRINqB — Josh Benson (@WFLAJosh) June 21, 2023 టైటాన్ సబ్మెరీన్ కోసం వెతికే ప్రయత్నంలో సెర్చ్ టీంకు లోపల ఏదో పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయట. మంగళవారం ప్రతీ అరగంటకొకసారి.. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆ సౌండ్లు వినిపించాయట. యూఎస్ కోస్ట్గార్డ్ దీనిని ధృవీకరించింది కూడా. ఇంకోవైపు ఓషన్గేట్ సంస్థ నిర్వాహణ తీరుపై తీవ్ర విమర్శలతో పాటు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. Oceangate Expeditions remote control 2.0 for the Titan #Titanic pic.twitter.com/pYCucKq2Ba — Jewel Runner (@tosnoflA) June 21, 2023 The passengers on #Titan rn. #Titanic #titanicsubmarine #titanicsubmersible pic.twitter.com/z98uvzEQdx — kaleb (@medikaii) June 21, 2023 Coming soon..#OceanGate #Titanic #titanicsubmarine pic.twitter.com/uHq9BpzVNW — Maximus (@incognito_joe2) June 21, 2023 -
గ్రీస్ పడవ విషాదం.. 500 మందికి పైగా గల్లంతు!
ఏథెన్స్: గ్రీస్ సమీపంలోని మెస్సేనియా పైలోస్ తీరంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో 78 మంది మృతి చెందగా సుమారు 500 మంది గల్లంతై ఉంటారని అదే ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఇద్దరు యువకులు సిరియాకు చెందిన హసన్(23) పాకిస్తాన్ కు చెందిన రాణా(24) తెలిపారు. ఈ పడవలో 15 మంది సిబ్బంది, మొత్తంగా 700 మంది శరణార్థులు ప్రయాణిస్తున్నారని వారన్నారు. లిబియా నుండి అనేక మంది అక్రమ రవాణాదారులు చాలా ఏళ్లుగా శరణార్థులను ఇలా తరలిస్తూ ఉన్నారని, అక్కడ తనకు చాలా తక్కువ వేతనం లభిస్తుండటంతో జర్మనీ వెళ్లాలన్న ఆలోచనతో ప్రయాణమయ్యానని హసన్ అన్నాడు. మరో శరణార్థి రాణా తానూ ఇటలీ వెళ్లడం కోసం లిబియా అక్రమార్కులకు చాలా పెద్ద మొత్తంలో చెల్లించానని, కానీ వారు మాకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా చాలీచాలని నీళ్లు, ఆహారం ఇచ్చి నాలుగు రోజులు ప్రయాణంలో సర్దుకోమని చెప్పారన్నాడు. పడవలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. మూడో రోజు పడవలోకి ఒక పక్క నుండి నీళ్లు రావడంతో జనమంతా కంగారుగా రెండో పక్కకు కదిలారు. అంతే క్షణాల్లో పడవ నీటమునిగింది. గ్రీస్ కోస్ట్ గార్డ్ బృందం వచ్చి కాపాడేంతవరకు మాకైతే ఏమీ తెలియలేదని వాళ్లిద్దరూ తెలిపారు. బోటులో సుమారుగా 500 మంది ప్రయాణిస్తున్నారని వారిలో 79 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించామని 104 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారని మిగిలిన వారు గల్లంతై ఉంటారని వారు ప్రాణాలతో దొరికే అవకాశాలున్నాయని గ్రీస్ కోస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇతర బోట్లతో పాటు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. ఇది కూడా చదవండి: 3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది! -
రూ.88 వేల కోట్లు మిస్సింగ్! అన్నీ రూ.500 నోట్లు..
భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకంగా రూ.88,032.5 కోట్లు గల్లంతయ్యాయి. అన్నీ రూ.500 నోట్లు. ప్రింట్ అయ్యాయి కానీ ఆర్బీఐకి చేరలేదు. ఏమయ్యాయి ఈ నోట్లన్నీ? మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాలు ఈ వ్యత్యాసాన్ని బయటపెట్టాయి. ప్రింట్ అయినవెన్ని.. ఆర్బీఐకి చేరినవెన్ని? దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే యూనిట్లు మూడు ఉన్నాయి. అవి బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్, నాసిక్లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్లోని దేవాస్లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్. దేశంలోని ఈ మూడు మింట్లూ కొత్తగా డిజైన్ చేసిన రూ.500 నోట్లను 8,810.65 మిలియన్ల నోట్లను ముద్రించి సరఫరా చేశాయి. అయితే వీటిలో ఆర్బీఐకి చేరినవి 7,260 మిలియన్లు మాత్రమేనని మనోరంజన్ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పొందిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే రూ. 88,032.5 కోట్ల విలువైన 1,760.65 మిలియన్ల రూ.500 నోట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ గణాంకాల ప్రకారం.. 2016-2017లో నాసిక్ మింట్ 1,662 మిలియన్ నోట్లు, బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ మింట్ 1,953 మిలియన్ నోట్లను ఆర్బీఐకి సరఫరా చేసింది. మూడు మింట్ల నుంచి సరఫరా అయిన మొత్తం నోట్లు 8,810.65 మిలియన్లు. అయితే ఆర్బీఐకి అందినవి మాత్రం 7260 మిలియన్ నోట్లే. గల్లంతైన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లు నాసిక్ మింట్లో 2015 ఏప్రిల్ - 2016 మార్చి మధ్య ముద్రితమయ్యాయి. ఆర్టీఐ ప్రకారం.. రఘురామ్ రాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఈ నోట్లు ఆర్బీకి సరఫరా అయ్యాయి. సీఈఐబీ, ఈడీలకు లేఖలు కరెన్సీ నోట్ ప్రెస్లలో ప్రింట్ అయిన నోట్లు, ఆర్బీఐకి చేరిన నోట్లకు మధ్య వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు మనోరంజన్ రాయ్ లేఖలు కూడా రాశారు. అయితే కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరాలో భారీ లాజిస్టిక్స్ ప్రమేయం ఉన్నందున ఈ అసమతుల్యత సాధారణమే అని కొందరు సీనియర్ ఆర్బీఐ అధికారులు సమర్థించినట్లుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. -
మరణించాడనుకుంటే, మోమోలు తింటూ కనిపించాడు
భాగల్పూర్: బిహార్లో భాగల్పూర్కు చెందిన నిశాంత్ కుమార్ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులందరూ ఆయన మరణించాడనే భావించారు. అయితే హఠాత్తుగా ఒక రోజు నోయిడాలో మోమోలు తింటూ ఆయన బావమరిదికే దొరకడం విశేషం. భాగల్పూర్లోని నౌగాచికి చెందిన నిశాంత్ కుమార్ ఒక పెళ్లి కోసం తన అత్త మామల ఇంటికి ఈ ఏడాది జనవరిలో వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో సుశాంత్ తండ్రి తన కుమారుడిని అతని అత్తింటి సభ్యులే హత్య చేశాడని ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య రచ్చ వీధికెక్కింది. సుశాంత్ బావమరిది ఒక రోజు నోయిడా వెళితే అక్కడ మోమోలు అమ్మే దుకాణం దగ్గర ఒక బిచ్చగాడు కనిపించాడు. అతను ఆకలేస్తోందని మోమోలు అడిగితే దుకాణం దారుడు అతనిని పొమ్మని కసురుకుంటున్నాడు. దీంతో జాలిపడ్డ రవిశంకరే డబ్బులు ఇచ్చి అతనికి మోమోలు ఇమ్మని చెప్పాడు. ఆ తర్వాత అతని పేరేంటని అడగ్గా నిశాంత్ కుమార్ అని తమది బిహార్ అని చెప్పడంతో నిర్ఘాంత పోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిశాంత్ నోయిడాకి ఎలా చేరాడో, ఎందుకు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడో పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. -
సీఏ మిస్కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్కాల్లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
Bihar Bridge Collapse: కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు..
బిహార్లో భాగల్పూర్లో రూ. 1700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తీగల వంతెన ఆదివారం పేకమేడలా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ మేరకు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..గతేడాది ఏప్రిల్ 30న ఈ వంతెన కొంతభాగం కూలిపోయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత దీని నిర్మాణ విషయంపై అధ్యయనం చేయడం కోసం ఐఐటీ రూర్కీ నిపుణలను సంప్రదించాం. ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది. అధ్యయనం చేసిన నిపుణుల ఈ నిర్మాణంలో కొద్దిపాటి లోపాలున్నాయని మాకు తెలియజేశారు. అందుకు సంబంధించిన వాటినన్నింటిని తొలగించాం. అయనప్పటికీ ఆదివారం జరిగిన ఘటన తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోందని తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులైన అధికారులపై తప్పక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వంతెన దగ్గర పనిచేస్తున సెక్యూరిటీ గార్డు కూడా ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయినట్లు తెలిపారు. రెస్క్యూ అధికారులు అతని ఆచకి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి కూలిన తర్వాత నుంచి గార్డు కనిపించ లేదని, అతడి మృతదేహం కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి డిమాండ్ చేశారు. ఆయన పాలనలో జరుగతున్న అవినీతి కారణంగానే ఇలాంటి దుర్ఘటన జరిగిందని ఆరోపణలు చేశారు. మరో సహచర బీజేపీ నాయకుడు సయ్యద్ షానవాజ్ కూడా ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. (చదవండి: బిహార్లో కూలిన తీగల వంతెన) -
హైదరాబాద్లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది?
నల్లకుంట(హైదరాబాద్): ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ ఎల్రక్టీషియన్ సయ్యద్అసద్ తన కుటుంబసభ్యులతో కలిసి విద్యానగర్ అంజయ్యనగర్లో నివాసం ఉంటున్నాడు. తన పెద్ద కుమార్తె వహెద ఉన్నీస(18) అడిక్మెట్ అచ్యుతారెడ్డి మార్గ్లోని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. రోజూలాగే ఈనెల 26న ఉదయం 10 గంటల సమయంలో తండ్రి తన బైక్పై కుమార్తెను స్కూల్ వద్ద వదిలి వచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు చూసినా.. స్కూల్కు వెళ్లిన కుమార్తె ఇంటికి రాలేదు. దీంతో తండ్రి కుమార్తె పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లి విచారించగా.. ఆమె ఉదయం 10.15 గంటల సమయంలో పాఠశాల నుంచి వెళ్లిపోయిందని పాఠశాల యాజమాన్యం చెప్పారు. దీంతో ఆయన శుక్రవారం రాత్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం.. -
తల్లీకుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు
మునగపాక: మండలంలోని చూచుకొండ గ్రామానికి చెందిన వివాహిత సుజాత, ఆమె కూతురు దీక్షిత కనిపించడం లేదంటూ మునగపాక పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మళ్ల అప్పారావు సమీపంలోని ఎస్ఈజెడ్లో పనిచేస్తుంటాడు. అతని భార్య సుజాత అచ్యుతాపురం మండలం హరిపాలెంలో తాపీమేసీ్త్ర వద్ద కూలీగా పనిచేస్తోంది. ఎప్పటిలాగానే ఈ నెల 19న అప్పారావు తన బైక్పై భార్య, కుమార్తెను తీసుకువచ్చి హరిపాలెంలో దించాడు. తిరుగు ప్రయాణంలో తీసుకెళ్లేందుకు రాగా, వారు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికాడు. ఇంతవరకూ ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆచూకీ తెలిసిన వారు 8464825574, 9391564128, 9703330403 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన లహరి పతివాడ(25) అనే భారతీయ-అమెరికన్ మహిళ శవమై కనిపించింది. సరిహద్దు రాష్ట్రమైన ఓక్లహోమాలో దాదాపు 322 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. నివేదికల ప్రకారం.. టెక్సాస్లోని కాలిన్స్ కౌంటీలోని మెకిన్నే ప్రాంతంలో నివాసం ఉంటున్న లహరి పతివాడ చివరి సారిగా డల్లాస్ పరిసరాల్లోని ఎల్ డొరాడో పార్క్వే , హార్డిన్ బౌలెవార్డ్ బ్లాక్ ప్రాంతాల్లో టయోటా కారు నడుపుతూ కనిపించారు. వావ్ అనే స్థానిక టెక్సాస్ సంస్థ ద్వారా ఆమె అదృశ్యమైన వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. మే 12న ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆమె స్నేహితులు ఓక్లహోమాలో ఆమె ఫోన్ను ట్రాక్ చేశారు. ఆమె ఫేస్బుక్ పేజీ ప్రకారం.. లహరి ఓవర్ల్యాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో పనిచేసేవారు. బ్లూ వ్యాలీ వెస్ట్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. ఇదీ చదవండి: Viral Video: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం -
అన్నదమ్ముల అదృశ్యం..!
-
17 ఏళ్ల క్రితం తప్పిపోయి..
అనంతగిరి: సుమారు 17 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తి అనూహ్యంగా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇది కలనా.. నిజమా అని వారు సంభ్రామాశ్చర్యంలో మునిగి తేలారు. ఒక కేసు వీరిని ఒకే వేదికపై తీసుకొచ్చింది. ఈ సంఘటన తాండూరు మహిళా పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన షేక్ పీర్సాబ్– జైబున్సిసా దంపతులకు ఏడుగురు సంతానం, వీరిలో నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. రెండో కుమారుడు షేక్మస్తాన్ 17 సంవత్సరాల క్రితం తన మేనమామ అబ్దుల్ రహీం వెంట హైదరాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరి ఆచూకీ దొరకలేదు. కుటుంబ సభ్యులు కొన్నాళ్లు వెతికినా ఫలితం లేకుండా పోవడంతో చేసేదేమి లేక ఆశలు వదులుకున్నారు. కాగా మొదటి భార్యతో విడిపోయిన షేక్ మస్తాన్ తాండూరుకు చెందిన తబస్సుం బేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త తరచూ వేధిస్తున్నాడని తబస్సుమ్ తల్లిగారింటికి వచ్చింది. వికారాబాద్ మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్లోని మౌలాలిలో నివాసం ఉంటున్న మస్తాన్ను పోలీసులు కౌన్సెలింగ్కు పిలిచారు. పోలీస్స్టేషన్ దగ్గర తన చిన్ననాటి మిత్రుడు శివ అతన్ని గుర్తించాడు. విషయాన్ని మరో మిత్రుడు ఇమ్రాన్కు సమాచారం అందించాడు. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో హోటల్ నడుపుతున్న షేక్ మస్తాన్ కుటుంబ సభ్యులకు అతను సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు వికారాబాద్ సీఐ ప్రమీలను సంప్రదించారు. ఈ నెల 5న కౌన్సెలింగ్ ఉందని, మీరు రావాల్సిందిగా కోరడంతో వారు శుక్రవారం వచ్చారు. మస్తాన్ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. భార్యతో సఖ్యతతో ఉండాలని కుమారుడికి తల్లిదండ్రులు హితవు పలికి ఇద్దరిని కలిపారు. -
చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన జరిగింది. కెన్నెడీ నదీ తీరంలో చేపల వేటకు వెళ్లిన కెవిన్ డార్మోడీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను కన్పించకపోవడానికి ముందు అరుపులు, కేకలు విన్పించినట్లు అక్కడున్న వాళ్లు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే అతనికోసం సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. అయితే కెవిన్ అదృశ్యమైన ప్రాంతంలో రెండు భారీ రాక్షస మొసళ్లను గుర్తించారు అధికారులు. అవేమైనా అతడ్ని చంపి తిని ఉంటాయా అనే అనుమానంతో వాటిని షూట్ చేశారు. ఈ రెండు మొసళ్లలో ఒకటి 4.1 మీటర్ల పొడవు ఉండగా.. మరొకటి 2.8 మీటర్ల పొడవు ఉంది. వీటిలో ఓ మొసలి కడుపులో కెవిన్ మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు అతడ్ని అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం రెండోసారి అని జాలర్లు తెలిపారు. గతంలోనూ ఓ వ్యక్తిని మొసళ్లు చంపాయని వెల్లడించారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. కెవిన్ వయసు 65 ఏళ్లు. ఓ హోటల్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఇతనికి చాలా కాలంగా చేపలు పట్టడం అలవాటని, ఇందులో ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా బాగా తెలుసుని స్నేహితుడు తెలిపాడు. కానీ కెవిన్ ఇలా చనిపోతాడని అసలు ఊహించలేదన్నాడు. చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే ఇద్దరూ మృతి -
19 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీగానే! ఎవరీ బ్రియానా?
ఈ రంగుల ప్రపంచంలో చీకటి లోకమనేది ఒకటుంటుందని, అందులో దేనికైనా తెగించే మనుషులుంటారని తెలుసుకోలేరు కొందరు. కేవలం తమ కలల ప్రపంచం వైపు పరుగులు తీస్తూ జీవితాలనే పోగొట్టుకుంటుంటారు. బ్రియానా మైట్ల్యాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి తన జీవితంలో అదే పొరబాటు చేసింది. అమెరికాలోని బర్లింగ్టన్ వర్మోంట్లో కెల్లీ, బ్రూస్ దంపతులకు 1986లో బ్రియానా జన్మించింది. ఈస్ట్ ఫ్రాంక్లిటన్ అనే చిన్న పట్టణంలో తన అన్నతో కలిసి పెరిగింది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులతో పాటు తమ పొలాల్లోనే పనులకు వెళ్తూ, స్కూల్లో చదువుకునేవారు. ఇంట్లో అంతా ఆమెని ముద్దుగా బ్రీ అని పిలిచేవారు. బ్రీకి తన జీవనశైలి ఏమాత్రం నచ్చేది కాదు. పొలం పనులకు, పల్లె జీవితానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తనకు 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంటికి 15 మైళ్ల దూరంలో ఉన్న ఎనోస్బర్గ్ ఫాల్స్ హైస్కూల్లో చేరతానని పేరెంట్స్పై ఒత్తిడి తెచ్చింది. అక్కడే పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటానని పట్టుబట్టింది. మొదట సంకోచించిన పేరెంట్స్ చివరికి బ్రీ కోరికను కాదనలేకపోయారు. ఆరు నెలలు గడిచేసరికి ఆ హైస్కూల్ నుంచి డ్రాప్ ఔట్ అయ్యి.. ఇంకాస్త పైస్థాయికి వెళ్లేందుకు ఎఉఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అందుకోసం మోంట్గోమేరీకి దగ్గరల్లో తన చిన్ననాటి స్నేహితురాలు జిలియన్తో కలిసి రూమ్లో ఉంటూ, జాబ్ చేసుకుంటూనే చదువుకునేది. తనున్న పట్టణం తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి, ఉద్యోగానికి, భవిష్యత్తులో ఎదుగుదలకూ అనువైనదని ఆమె నమ్మింది. 2004 మార్చి 19 శుక్రవారం ఉదయాన్నే తన తల్లిని కలిసిన బ్రీ.. తనకు మరో పార్ట్ టైమ్ జాబ్ దొరికిందని, మర్నాడే డ్యూటీలో జాయి¯Œ అవుతానని చెప్పింది. ఆ ఆనందంలోనే కెల్లీని రెస్టారెంట్కి తీసుకెళ్లింది. అప్పుడే తన కెరీర్ గురించి తల్లితో మాట్లాడింది. మధ్యాహ్నం మూడున్నర దాటే సరికి రూమ్ దగ్గర డ్రాప్ చేసి, కెల్లీ వెళ్లిపోయింది. కెల్లీ బ్రీని చూడటం అదే చివరిసారి. అదేరోజు ఈవినింగ్ డ్యూటీకి వెళ్లిన బ్రీ సోమవారం వరకూ రాకపోయేసరికి రూమ్ మేట్ జిలియన్కి భయమేసి బ్రీ కుటుంబానికి, పోలీసులకు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు బ్రీ శుక్రవారం రాత్రి 11:20కే డ్యూటీ నుంచి తన రూమ్కు బయలుదేరిందని తెలుసుకున్నారు. డ్యూటీ తర్వాత పార్టీకి రమ్మని పిలిచిన కొలిగ్స్తో ‘రేపు ఉదయాన్నే న్యూ జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇప్పుడు త్వరగా వెళ్లి రెస్ట్ తీసుకోవాలి’ అందట. మరో రెండు రోజులు గడిచేసరికి ఓ షాకింగ్ నిజం అక్కడ మీడియాని షేక్ చేసింది. అప్పటికే కేసు నమోదైన యాక్సిడెంట్ కారు ఎవరిదో కాదని, కనిపించకుండా పోయిన ‘బ్రీ’దేనని తేలింది. మార్చి 20 శనివారం ఉదయానికి మోంట్గోమెరీ రోడ్ నం. 118లో పాడుబడిన ఇంటిని చాలా విచిత్రంగా వెనుక నుంచి ఢీ కొట్టి ఉందట ఆ కారు. ఎవరో తాగుబోతు యాక్సిడెంట్ చేసి, పారిపోయి ఉంటాడని భావించిన ఓ పోలీసు దాన్ని స్థానిక గ్యారేజ్కి తరలించాడట. ఆ ఇల్లు ఓ నిర్మానుష్యమైన దారిలో పెద్ద మలుపు దాటగానే ఉంటుంది. అదేం ప్రమాదకరమైన మలుపు కూడా కాదు. అయితే ఈ వార్తలు వెలుగులోకి రావడంతో చాలామంది సాక్షులు ఆ కారుని తాము చూశామంటూ ముందుకొచ్చారు. ఆ రాత్రి పన్నెండుంపావుకి ఆ ఇంటిముందు హెడ్ లైట్స్ వెలుగుతున్న కారుని గమనించానని ఒకరు, పన్నెండున్నరకి లైట్స్ వెలగడంతో కారు టర్న్ చేస్తున్నారేమో అనుకున్నానని మరొకరు చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ రాత్రి రెండున్నర తర్వాత బ్రీ మాజీ బాయ్ ఫ్రెండ్ రోబాటియాలే కూడా ఆ కారుని చూశాడు. ఆగి, అక్కడ ఎవరూ లేకపోవడంతో కారు లైట్స్ ఆఫ్ చేసి, డోర్స్ క్లోజ్ చేసి, తన దారిన తాను వెళ్లిపోయాడట. ‘అది బ్రీ కారని నీకు తెలుసా?’ అని అడిగితే అప్పటికి తెలియదని చెప్పాడు. ఏది ఏమైనా 11.20కే కారులో బయలుదేరిన బ్రీ, పన్నెండుంపావుకే ఆ కారులో లేదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశం తన ఆఫీస్కి చాలా దగ్గర్లో ఉంది. అంటే గంట సమయంలోనే తను మిస్ అయ్యింది. ఇక మరుసటి రోజు మార్చి 20న ఆ పోలీసు కారుని గ్యారేజ్కి పంపించకముందు ఓ బృందం విహారయాత్రకు వెళ్తూ ఆ కారుని చూసి ఆగింది. వారంతా తమ కెమేరాల్లో చాలా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలే తర్వాత ఈ క్రైమ్సీన్ కి కీలక సాక్ష్యాలయ్యాయి. అయితే ఆ పర్యాటకులు కారు పక్కనే విరిగిన బ్రేస్లెట్ చూసినట్లు చెప్పారు. కానీ అది పోలీస్ రికార్డుల్లో లేదు. మొదట అనుమానం రోబాటియాలే మీదకు మళ్లింది. అయితే అతడు విచారణ కొనసాగుతుండగానే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో కేసుకు ముందు సాగలేదు. బ్రీ మిస్సింగ్కి ఐదువారాల ముందు మౌరా ముర్రే అనే అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లోనే గల్లంతైంది. బ్రీ కారు దొరికిన ప్రదేశానికి సరిగ్గా 90 మైళ్ల దూరంలోనే ముర్రే కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దిశగా విచారణ జరిపినా ఫలితం లేదు. మిస్సింగ్కి 3 వారాల ముందు ఒక పార్టీలో బ్రీకి తన మాజీ స్నేహితురాలు లాక్రోస్కి మధ్య గొడవ జరిగిందట. లాక్రోస్ ఆ గొడవలో బ్రీని ముక్కు విరిగేలా కొట్టిందట. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న బ్రీ.. లాక్రోస్పై తన ప్రతాపాన్ని చూపించకుండా వదిలిపెట్టిందట. ఆ కథ తెలుసుకున్న పోలీసులు, లాక్రోస్ని కూడా విచారించారు. కానీ ఏ ఆధారం దొరకలేదు. ఇలా ఎంతమందిని ప్రశ్నించినా? నిజానిజాలు బయటపడలేదు. చాలామంది బ్రీ పారిపోయి ఉంటుందని నమ్ముతారు. కానీ అది నిజం కాదని వాదించేవారు, ఇదో మానవ అక్రమ రవాణా కేసని నమ్ముతారు. బ్రీ ఎవరి నుంచో తప్పించుకునే క్రమంలో కారు వెనక్కి టర్న్ చేసుకునేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, అందుకే లైట్స్ వెలుగుతూ, డోర్స్ ఓపెన్ లోనే ఉన్నాయని ఊహిస్తుంటారు. పైగా కరాటేలో నిష్ణాతురాలైన బ్రీని ఒకరు కిడ్నాప్ చేయలేరని ఎక్కువ మందే ఉండి ఉంటారనేది డిటెక్టివ్స్ మాట. 2022 మార్చి 18న ఇప్పటి దాకా దొరకని కొత్త డీఎన్ఏ దొరికిందని వెళ్లడించడంతో అది క్రిమినల్ది అయ్యే అవకాశం ఉండొచ్చని ఆశ మొదలైంది. పదిహేడేళ్లప్పుడు మాయం అయిన బ్రీకి ఇప్పుడు సుమారు 36 ఏళ్లు ఉండి ఉండొచ్చు. అయితే గత 19 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ∙సంహిత నిమ్మన -
ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు
-
బాలిక ఆచూకీ తెలపండి
శింగనమల: మండలంలోని కల్లుమడి గ్రామానికి చెందిన డి.శిల్ప ఈ నెల 18వ తేదీ నుంచి కనిపించడ లేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 93460 10558, 93460 10580కు సమాచారం అందించాలని కోరారు. -
తాళాల పంచాయతీ.. ‘ఇది కుట్ర ప్రకారమే జరిగింది..’
జగిత్యాల/జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్రూం తాళపు చెవులు మాయం కావడంపై సోమవారం విచారణ జరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఇందులో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్రూంలో భద్రపర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి స్ట్రాంగ్రూమ్ తాళం తెరిచేందుకు ఈనెల 12న ప్రయత్నించారు. అయితే మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు. తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
గడ్డకట్టిన సముద్రం మీదుగా 150 మైళ్ల ప్రయాణం..నెల తర్వాత ఇంటికి..
అలాస్కా: ఏడాది వయస్సు ఆ్రస్టేలియన్ షెపర్డ్ కుక్క పిల్ల పేరు ననుక్. దీని సాహసం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. యజమాని కుటుంబంతోపాటు టూర్కెళ్లి తప్పిపోయింది. గడ్డకట్టిన బేరింగ్ సముద్రం మీదుగా 150 మైళ్లు ప్రయాణించింది. మధ్యలో సీల్స్, మంచు ఎలుగుబంట్ల దాడిలో గాయపడింది. చివరికి నెల తర్వాత అలాస్కాలోని గాంబెల్లో యజమాని మాండీ ఇవోర్రిగన్ ఇంటికి చేరుకుంది. మాండీ కుటుంబం గత నెలలో బేరింగ్ జలసంధిలోని సెంట్ లారెన్స్ దీవిలో సవూంగా ప్రాంతానికి వెళ్లింది. అక్కడే మాండీ కుటుంబానికి చెందిన ననుక్, స్టార్లైట్ అనే కుక్కలు తప్పిపోయాయి. కొద్ది రోజులకు స్టార్లైట్ ఇంటికి చేరుకుంది. కానీ, ననుక్కు దారి దొరకలేదు. సోషల్ మీడియాలో ననుక్ గురించి మాండీ కుటుంబం పోస్టులు పెట్టింది. చివరికి అక్కడికి 150 మైళ్ల దూరంలోని వేల్స్లో ఉన్నట్లు తెలిసింది. విమానయాన సంస్థల సహకారంతో ననుక్ను సొంతూరికి రప్పించారు. శరీరంపై కొద్దిపాటి గాయాలే తప్ప మొత్తమ్మీద ఆరోగ్యంగా ఉన్న ననుక్ను చూసి మాండీ కుటుంబంలోని చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే, ననుక్ అంతదూరం ప్రయాణించడం మాత్రం మిస్టరీయేనని కుటుంబీకులు చెబుతున్నారు. చదవండి: ఈకల్లో విషం.. తాకితే మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులను గుర్తించిన సైంటిస్టులు -
నా ఫోన్ పోయింది: పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు
సాక్షి, కరీంనగర్/ హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫోన్ ఎక్కడుంది? అనేది చర్చనీయాంశమయ్యింది. కలకలం రేపిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుట్రలో సూత్రధారిగా అనుమానిస్తూ పోలీసులు సంజయ్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా అరెస్టు అయినప్పటి నుంచి ఆయన ఫోన్ కన్పించకుండా పోయింది. అయితే బెయిల్పై విడుదలైన సంజయ్..ఆదివారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు సమయం నుంచి తన వ్యక్తిగత ఫోన్ కన్పించడం లేదని పేర్కొంటూ పట్టణ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిని ఎలాగైనా వెదికి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఆ ఫోన్ తన సోదరి పేరు మీద ఉందని, భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో తాను ఆమె పేరు మీద ఉన్న సిమ్కార్డు వాడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆదివారం రాత్రి పార్టీ లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సంజయ్.. తన ఫోన్ను పోలీసులే మాయం చేశారని ఆరోపించడం గమనార్హం. కాగా రాత్రి పార్టీ లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సంజయ్..తన ఫోన్ను పోలీసులే మాయం చేశారని ఆరోపించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అరెస్టు అనంతరం సంజయ్ను పోలీసులు బొమ్మల రామారం తీసుకెళ్తున్న క్రమంలో ఆయన ఫోన్ కనిపించకుండా పోయింది. వరంగల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ ఫోన్ సాయంతోనే ఏ–2 ప్రశాంత్తో సంజయ్ (ఏ–1) పదేపదే సంభాషించారు. ఈ కేసు ఛేదనకు ఎంతో కీలకమైన సాంకేతిక ఆధారం కావడంతో కుట్ర కేసు మొత్తం ఫోన్ చుట్టే తిరుగుతోంది. అయితే ఆ ఫోన్ సంజయ్ సమీప అనుచరుడైన బోయినపల్లి ప్రవీణ్ రావు వద్ద ఉండి ఉంటుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. బ్యాటరీ అయిపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయి ఉంటుందని, చివరిగా అది సిద్దిపేట టవర్ లొకేషన్ చూపించిందని, తప్పనిసరిగా బండి అనుచరులే దాన్ని దాచారని, ఆధారాలు దొరక్కుండా ఇప్పటికే ధ్వంసం చేసి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అది పోలీసుల పనే..: సంజయ్ తన సెల్ఫోన్ను పోలీసులే మాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి సిద్దిపేట వెళ్లే వరకు తన చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తర్వాత మాయం అయ్యిందని పేర్కొన్నారు. మాయం చేసినవారే తనను ఫోన్ అడగడం సిగ్గు చేటన్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు ఆదివారం రాత్రి రాష్ట్ర లీగల్ సెల్ నేతలతో భేటీ అయిన సందర్భంగా బండి మాట్లాడారు. కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు.. ‘మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఆ విషయం తెలిసి సీఎం కేసీఆర్ మూర్ఛపోయారు. నా ఫోన్ బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే భయంతో కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నట్టున్నారు. ఇతరుల ఫోన్ల సంభాషణలు వినడమే ఆయన పని..’అని సంజయ్ ఆరోపించారు. ‘బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరు. దేశం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారు. పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా విషయంలో కేసీఆర్ కుటుంబానికో న్యాయం? ఇతరులకో న్యాయమా?..’అని ప్రశ్నించారు. నిర్బంధాలు పెరిగే అవకాశం ‘రాబోయే రోజుల్లో బీజేపీ కార్యకర్తలపై నిర్బంధాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందువల్ల లీగల్ సెల్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలి. మీరున్నారనే ధైర్యం, కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. మీరు మాకు అండగా ఉండండి..’అని సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని సంజయ్ తప్పుపట్టారు. ‘ప్రధాని మోదీని అవమానించేలా తిడతారు. ఆయన దిష్టి»ొమ్మలను తగలబెడతారు. వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారు. కేసీఆర్ను తిడితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారు..’అని ధ్వజమెత్తారు. చదవండి: ఈనెల 14న తెలంగాణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బండి సంజయ్ ఫిర్యాదు కాపీ -
విద్యార్థిని అదృశ్యం
తాడిపత్రి అర్బన్: పట్టణంలోని నందలపాడుకు చెందిన ఓ విద్యార్థిని అదృశ్యమైనట్లు పట్టణ ఎస్ఐ ధరణీబాబు తెలిపారు. ఎస్ఐ వివరాలమేరకు.. నందలపాడుకు చెందిన సమీరా (14) ప్రగతి కాన్సెప్ట్ స్కూల్ల్లో 7వ తరగతి చదువుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తల్లి షాకీరాబాను నిద్రలేచి చూడగా కనిపించకపోవడంతో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఆదిలాబాద్: ఊట్నూర్లో పదో తరగతి ఆన్సర్షీట్లు మిస్సింగ్
సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూరు ootnur మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్కు తీసుకు వస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పోస్టల్ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా? అనే తేల్చే పనిలో ఉన్నారు ఎస్సై భరత్. మరోవైపు అవి ఏ సెంటర్ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ స్పందించింది. సాక్షితో డీఈఓ ప్రణీత మాట్లాడుతూ.. ‘‘ఉట్నూరు పదవ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయి. పదిహేను మంది విద్యార్థుల తెలుగు జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించాం. పోస్టాఫీస్ నుంచి బస్టాండ్కు తరలిస్తుండగానే అవి పోయాయి. కాబట్టి, పోస్టల్ అధికారులదే బాధ్యత. వాళ్లకు ఆన్సర్షీట్లు అప్పగించినట్లు మా దగ్గర రిసిప్ట్ కూడా ఉంది. ఇది కేవలం వాళ్ల నిర్లక్ష్యమే. ఇందులో మా తప్పిదం ఏం లేదు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారామె. ఇదీ చదవండి: పరీక్ష ప్రారంభమైన కాసేపటికే.. టెన్త్ పేపర్ అవుట్! -
కృష్ణానది ఏటిపాయలో ప్రమాదం
పెనమలూరు: మిత్రులంతా కలసి సరదాగా మద్యం సేవించి ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం ఘాట్ కృష్ణానదిలో చోటుచేసుకుంది. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్నగర్లోని జారా రెస్టారెంట్ యజమాని అబ్దుల్రహీంబాషా (34) గురువారం రాత్రి తాను కొత్తగా కొన్న ఏపీ 39 ఆర్క్యూ 0786 కారులో విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన మిత్రులు ఈవెంట్స్ నిర్వహించే షేక్ ఖలీషా అలియాస్ పండు (30), కస్తూరిబాయిపేటకు చెందిన తాళ్లూరి కిరణ్ (37)తో కలిసి గురువారం రాత్రి చోడవరం ఘాట్ వద్దకు వచ్చారు. వీరు ఘాట్ సమీపంలో కృష్ణానది పాయ వద్ద మద్యం సేవించారు. ఆ తరువాత ముగ్గురు కృష్ణానదిలో ఈతకు దిగారు. ఈతకు దిగిన ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ఉదయం వెలుగు చూసిన ఘటన.. కాగా శుక్రవారం ఉదయం నదిలో చేపలు పట్టడానికి వచ్చిన వ్యక్తులకు నది పాయవద్ద ఖరీదైన కారు, మద్యం సీసాలు, దుస్తులు కనబడ్డాయి. వారికి అనుమానం వచ్చి నదిలో చూడగా అప్పటికే ఖలీషా మృతదేహం నదిలో తేలుతూ కనబడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి కారు వివరాలు మహిళా సంరక్షణ కార్యదర్శుల వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. గ్రూపుల్లో ఈ సమాచారం వ్యాపించడంతో కారు యజమాని అబ్దుల్రహీంబాషా వివరాలు తెలిశాయి. దీంతో కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న దుస్తులు, చెప్పులు చూసి తమ వారేనని ధ్రువీకరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. నీటిలో తేలుతున్న ఖలీషాను ఆ తరువాత వీరి గాలింపులో కారు యజమాని రహీంబాషా మృతదేహాన్ని బయటకు తీశారు. గల్లంతైన కిరణ్ ఆచూకీ తెలియలేదు. గల్లంతైన కిరణ్ కోసం శనివారం నదిలో గాలిస్తామని అధికారులు తెలిపారు. -
ఘోర గని ప్రమాదం.. ఆరుగురు మృతి.. 47 మంది ఆచూకీ గల్లంతు..
బీజింగ్: చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని అల్గ్జా లీగ్ గని కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరో 47 మంది జాడ తెలియాల్సి ఉందని చైనా అధికార వార్తాసంస్థ గురువారం తెలిపింది. భారీగా మట్టిచరియలు విరిగిపడటంతో బుధవారం ఆగిపోయిన సహాయక చర్యలను గురువారం తిరిగి ప్రారంభించారు. ఇప్పటివరకు ఐదుగురు చనిపోయినట్లు ధ్రువీకరించారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. 47 మంది జాడ గుర్తించాల్సి ఉంది. ఇటీవలికాలంలో చైనాలో గని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత ఏడాది జరిగిన 367 గని ప్రమాద ఘటనల్లో 518 మంది చనిపోయినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం వెల్లడించింది. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
వణికిపోతున్న చైనీయులు.. సంచలనంగా మారిన జిన్పింగ్ ప్లాన్?
కొద్ది నెలల క్రితం డ్రాగన్ కంట్రీ చైనాను కరోనా వైరస్ మరోసారి వణికించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో పాటిజివ్ కేసులు, మరణాలు సంభవించడంతో చైనా ప్రభుత్వం చైనీయులపై కఠిన ఆంక్షలు విధించింది. కాగా, జిన్పింగ్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అయితే, కరోనా వ్యాప్తి సమయంలో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న చాలా మంది చైనీయులు కనిపించకుండా పోతున్నారు. దీంతో, ఈ విషయంతో చైనాతో పాటు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా, ఈ విషయాన్ని విదేశీ మీడియా కనిపెట్టింది. ఇక, మిస్ అవుతున్న వారిలో ఎక్కువగా చైనా మహిళలు ఉండటం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై జిన్పింగ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల ప్రకారం.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై ఇప్పుడు జిన్పింగ్ చర్యలకు దిగుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చైనా ప్రభుత్వం ఇప్పటివరకు 100 మందిని చడీచప్పుడు చేయకుండా అదుపులోకి తీసుకుని అజ్ఞాతంలోకి తరలించిన వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. వీరిలో చాలా మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా వీరంతా అమెరికా, బ్రిటన్లో చదువుకుని వచ్చిన రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, సంగీతకారులు ఉన్నట్లు సమాచారం. అయితే, ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులపై జిన్పింగ్ ప్రభుత్వం కన్నేసి ఉంచింది. వీరితో ఆందోళనలకు దిగేలా ప్రేరేపించిన వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు కాలంలో తనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిన్పింగ్ వ్యూహాల్లో భాగంగానే నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. -
Bao Fan: చైనా బ్యాంకర్ మిస్సింగ్ సంచలనం! ఇంతకీ ఎవరతను?
చైనాలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం చోటుచేసుకుంటూనే ఉంటుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు. తాజాగా చైనా ప్రముఖ బ్యాంకర్ బావో ఫాన్ అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. బావోఫాన్ను సంప్రదించలేకపోతున్నట్టు బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ చైనా రినయిసెన్స్ ప్రకటించింది. ఈ వార్త వెలువడిన వంటనే ఆ కంపెనీ షేర్ ధర 50 శాతం పడిపోయింది. ఈ సంస్థలో అవినీతిపై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బావోఫాన్ కనిపించకుండా పోవడం వెనుక ఆ దేశ ప్రభుత్వ హస్తం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న చైనాలో వ్యాపార దిగ్గజాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వ్యాపారవేత్తలు ఇలా కనిపించకుండా పోవడం కొత్తేమీ కాదు. బావో ఫాన్కు ముందు కూడా అనేకమంది ఉన్నత వ్యాపార నిర్వాహకులు గల్లంతయ్యారు. 2015లోనే కనీసం ఐదుగురు అదృశ్యమయ్యారు. వాస్తవానికి బావోకు కొన్ని రోజుల ముందు, రియల్ ఎస్టేట్ సంస్థ సీజెన్ గ్రూప్ వైస్ చైర్మన్ కనిపించకుండా పోయారు. కొంతకాలం క్రితం చైనా టాప్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్మా గల్లంతయ్యారు. ఎవరీ బావోఫాన్? చైనాలో ప్రఖ్యాతిగాంచిన బ్యాంకర్లలో బావోఫాన్ ఒకరు. షాంఘై నగరంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చైనా ప్రభుత్వంలో పనిచేసేవారు. అయినప్పటికీ అమెరికాలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు బావోఫాన్. షాంఘైలోని ఫుడన్ యూనివర్సిటీ, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి డిగ్రీలు పొందారు. 1990వ దశకంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కెరీర్ను ప్రారంభించిన ఆయన మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూయిస్ గ్రూప్ల కోసం పనిచేశాడు. అనంతరం షాంఘై, షెంజెన్లలోని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో అడ్వయిజర్గా పని చేశారు. 2005లో కేవలం ఇద్దరితో చైనా రినయిసెన్స్ను ప్రారంభించారు. వెంచర్ కేపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు సేవలందించారు. ఆ తర్వాత అండర్రైటింగ్, సేల్స్, ట్రేడింగ్లకు తన సేవలను విస్తరించారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2018లో హాంగ్ కాంగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఏకంగా 346 మిలియన్ల డాలర్లను సేకరించింది. చైనాలోని ప్రధాన ఫుడ్ డెలివరీ సర్వీసులు మీటువాన్-డయాన్పింగ్, ట్రావెల్ సంస్థలు సీ ట్రిప్-క్యూనర్ విలీనాల్లో బావోఫాన్ కీలక పాత్ర పోషించారు. పలు నివేదికల ప్రకారం.. బావోఫాన్ నికర విలువ సుమారు 1.7 బిలియన్ డాలర్లు. -
ఎంపీ గల్లా జయదేవ్ కనిపించడం లేదు
సాక్షి ప్రతినిధి గుంటూరు: గుంటూరు ప్రజల ఓట్లతో గెలుపొందిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరులో మాత్రం కనిపించడం లేదంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శుక్రవారం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో తమ డివిజన్లలో పనులు జరగడం లేదంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రస్తావిస్తుండగా మేయర్ కావటి మనోహర్నాయుడు జోక్యం చేసుకుని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్లుగా తాము కూడా పారీ్టలకతీతంగా, కులాలు, ప్రాంతాలకతీతంగా నగరాభివృద్ధి చేపట్టామని, టీడీపీ వారు గెలిచిన డివిజన్లలో కూడా రూ.3 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం గెలిచిన 38వ డివిజన్లో నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా, ఎంపీ కేవలం పది లక్షల రూపాయలు ఇచ్చారని అనడంతో తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెలుగుదేశం సభ్యుడొకరు లేచి తాము నిధులు కావాలని అడుక్కుంటే ఇచ్చారని, మీరు కూడా వస్తే ఇస్తారంటూ వాదనకు దిగారు. దీనిపై అధికార పార్టీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు ఎంపీ అందరిని సమానంగా చూడాలని, కేవలం మీ పార్టీ సభ్యులకే నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. తాము గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకూ ఎంపీని తాము చూడలేదని, ఎంపీ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అసలు గుంటూరులో ఉండని వ్యక్తిని ఢిల్లీ వరకూ వెళ్లి నిధులు అడగాలా? అంటూ ప్రశ్నించారు. దీంతో మాటామాట పెరిగి తీవ్ర వాగి్వవాదానికి, తోపులాటకు దారితీసింది. టీడీపీ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లను సైతం తోసే ప్రయత్నం చేయడంతో ఎస్సీ మహిళ కార్పొరేటర్లు మల్లవరపు రమ్య, బూసి రాజలత టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీ గల్లాపై మిస్సింగ్ కేసు నమోదు చేయించాలని మేయర్ను కోరారు. అనంతరం మేయర్ కావటి మనోహర్నాయుడు జోక్యం చేసుకుని ఎంపీ గల్లా జయదేవ్ తనకు రూ.2.50 కోట్ల దాకా ఎంపీ ల్యాండ్స్ నిధులు వస్తే దానిలో కేవలం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా టీడీపీ వార్డు సభ్యులకు మాత్రమే మంజూరు చేశారని లెక్కలు చూపడంతో టీడీపీ నాయకులు మిన్నకుండిపోయారు. -
ఆశలు ఆవిరి.. టర్కీలో భారతీయ యువకుడు మృతి
సాక్షి, బెంగళూరు: టర్కీలో అదృశ్యమైన భారతీయ యువకుడు విగత జీవిగా మారాడు. వ్యాపార పనుల నిమిత్తం టర్కీ వెళ్లిన భారత్కు చెందిన ఓ యువకుడు ఫిబ్రవరి 6న అక్కడ సంభవించిన వరుస భూకంపాల తర్వాత అదృశ్యమైన విషయం తెలిసిందే. భూకంపం సంభవించి నాలుగు రోజులైనా అతని ఆచూకీ తెలియలేదు. అయితే విజయ్ కుమార్ బస చేసిన హోటల్ శిథిలాల వద్ద శుక్రవారం అతని పాస్పోర్టు ఇతర వస్తువులు లభించాయి. తాజాగా శనివారం విజయ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అతడు బస చేసిన మలత్వాలోని హోటల్ శిథిలాల కింద విజయ్ కుమార్ మృతదేహం గుర్తించినట్లు టర్కీలోని భారత రాయబార కార్యాలయం దృవీకరించింది. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. విజయ్ మృదేహాన్ని అవశేషాలను అతని కుటుంబానికి వీలైనంత త్వరగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. We inform with sorrow that the mortal remains of Shri Vijay Kumar, an Indian national missing in Turkiye since February 6 earthquake, have been found and identified among the debris of a hotel in Malatya, where he was on a business trip.@PMOIndia @DrSJaishankar @MEAIndia 1/2 — India in Türkiye (@IndianEmbassyTR) February 11, 2023 అసలేం జరిగిందంటే కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రాంతానికి చెందిన ఇంజినీర్ టర్కీలో చోటు చేసుకున్న భూ కంపంలో గల్లంతయ్యాడు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన విజయ్కుమార్ బెంగళూరులో పీణ్యలోని నైట్రోజన్ ఉత్పత్తి సంస్థలో తమ్ముడితో కలిసి ఇంజినీర్గా పని చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇద్దరూ నివాసం ఉంటున్నారు. ఫ్యాక్టరీకి అవసరమైన పరికరాల కోసం విజయ్కుమార్ నాలుగు నెలల క్రితం టర్కీకి వెళ్లారు. తుర్కియేలోని తూర్పు అనటోలియా ప్రాంతం మలత్యాలోని అవ్సర్ హోటల్లో దిగాడు. టర్కీలో భూకంపం వచ్చినప్పటినుంచి విజయ్కుమార్ నుంచి ఫోన్ రాలేదని తమ్ముడు అరుణ్కుమార్ తెలిపారు. ఈ క్రమంలో టర్కీలో అదృశ్యమైన విజయ్కుమార్ పాస్పోర్ట్, వస్తువులు లభించాయి. అతను బస చేసినట్లు భావిస్తున్న హోటల్ శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగించిన తర్వాత స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అద్భుతం: 90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల చిన్నారి -
వివాహిత అదృశ్యం.. ఏం జరిగిందో?
పరవాడ(విశాఖపట్నం): పెదముషిడివాడ శివారు గండివానిపాలెం గ్రామానికి చెందిన మడక దేవి (30) ఈ నెల 7 నుంచి కనిపించడం లేదని ఆమె భర్త రాము పరవాడ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. దేవి తల్లిదండ్రులు గండివానిపాలెంలో నివసిస్తున్నారు. వారి ఇంటి నుంచి ఆమె ఈ నెల 7న సాయంత్రం 5 గంటలకు బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి సమాచారం లేదని తెలిపారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పరవాడ సీఐ పి.ఈశ్వరరావుకు 9440796038 నంబర్లో సమాచారం అందజేయాలని స్టేషన్ హెచ్సీ శ్రీనివాసరావు కోరారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. -
నాగార్జున సాగర్లో ముగ్గురు యువకుల గల్లంతు
సాక్షి, నల్లగొండ: హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వచ్చిన ముగ్గురు యువకులు నాగార్జున సాగర్లో గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని చంద్రకాంత్ (20), నాగరాజు(39), వాచస్పతి(26)గా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరు నల్గొండ వాసులు కాగా, మరొకరు హాలియకు చెందిన వ్యక్తి. ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్నీరుమున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. -
వేరే మహిళ నుంచి ఫోన్.. భర్త మిస్సింగ్.. అసలు ఏం జరిగింది?
డాబాగార్డెన్స్(విశాఖపట్నం): తన భర్త రెండు నెలలుగా కనిపించడం లేదని అల్లిపురం వేంకటేశ్వరమెట్ట ప్రాంతానికి చెందిన తాటిపూడి మహేశ్వరి వాపోయింది. ఈ విషయమై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని మీడియాను ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో తన గోడు వెలిబుచ్చింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం ప్రాంతానికి చెందిన మహేశ్వరి తండ్రి 30 ఏళ్ల కిందట చనిపోవడంతో తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ చేరుకున్నారు. అల్లిపురం వేంకటేశ్వరమెట్ట వద్ద తల్లితో నివసిస్తూ సమీపంలోని గాజుల షాపులో మహేశ్వరి పనిచేసేది. ఈ క్రమంలో ఆమెకు పెందుర్తి చిన్నతాడివలస ప్రాంతానికి చెందిన అశోక్తో పరిచయం ఏర్పడి, అది శారీరక బంధానికి దారి తీసింది. తర్వాత పెళ్లికి అశోక్ ముఖం చాటేయడంతో ఆమె పెద్దలను ఆశ్రయించగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప సంతానం. ఈ క్రమంలో రెండు నెలల కిందట వేరే మహిళ నుంచి ఫోన్ వచ్చిందని, అప్పటి నుంచి అశోక్ కనిపించకుండా పోయాడని మహేశ్వరి వాపోయింది. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని, ఇప్పటికైనా నా భర్తను అప్పగించాలని ఆమె వేడుకుంది. -
కనిపించకుండా పోయిన కిమ్.. ఆఖరికి సైనిక వార్షికోత్సవానికి..
తరుచుగా వార్తలో నిలిచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా అదృశ్యమై మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందువల్లే.. గతకొద్ది రోజులుగా ఆర్మీ ముందుకు రావడం లేదంటూ ఉహగానాలు హల్చల్ చేస్తున్నాయి. అదీగాక ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో పీపుల్స్ ఆర్మీ వ్వవస్థాపక వార్షికోత్సవ పురస్కరించుకుని సాముహిక కవాతులను నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆయన కనిపంచకపోవటం ఉత్తర కొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే కిమ్ అనుహ్యంగా గత నెల రోజులుగా బహిరంగంగా కనిపించటం లేదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అఖరికి ఆదివారం జరిగిన పొలిబ్యూటో సమావేశాన్ని కూడా కిమ్ దాటవేసినట్లు సమాచారం. వాస్తవానికి కిమ్ ఇలా గతంలో 2014లో దాదాపు 40 రోజుల పాటు పబ్లిక్గా కనిపించకుండా ఉన్నట్లు ఉత్తర కొరియా స్థానిక మీడియా పేర్కొంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లేదా బుధవారం ప్యోంగ్యాంగ్లో సాముహిక కవాతులు నిర్వహించనుంది. అయితే వార్షికోత్సవంలో కనిపిస్తాడా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. అలాగే కిమ్ కూడా ఈ సాముహిక కవాతు ప్రదర్శన ద్వారా తన యుద్ధ సన్నద్ధత సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉత్సుకతతో ఉన్నారు కూడా. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ వార్షికోత్సవాన్ని కిమ్ అడ్వాంటేజ్గా తీసుకుని తన అణ్వాయుధాల క్షిపణి సామర్థాన్ని ప్రదర్శిస్తుందేమనని యూఎస్ దాని మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అదీగాక ఇటీవలే దక్షిణ కొరియా, యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే యూఎస్ సైనిక ఎత్తుగలను తిప్పికొట్టేలా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బెదిరింపులకు దిగింది కూడా. అంతేగాక ఉత్తరకొరియా 2022లోనే దాదాపు 70 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో దక్షిణ కొరియాలోని లక్ష్యాలను చేధించడానికి లేదా యూఎస్ ప్రధాన భూభాగాన్ని చేరుకునేనే సామర్థ్యం ఉన్న అణ్వయుధాలు ఉన్నాయి. (చదవండి: యూఎస్లో పోలీసులకు పట్టుబడ్డ తెలుగు అబ్బాయ్)