ఐదురోజులుగా వైఎస్ అవినాష్ రెడ్డి దీక్ష, విషమంగా ఆరోగ్యం!
Published Fri, Aug 23 2013 9:04 PM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టినద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ అవినాశ్రెడ్డి ఆరోగ్యం విషమంగా మారింది. గత ఐదు రోజులుగా వైఎస్ అవినాశ్రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అవినాశ్ రెడ్డిని వైద్యులు పరీక్షించారు. ఐదు రోజుల దీక్షలో బ్లడ్ షుగర్, సోడియం లెవల్ ఎక్కువ మోతాదులో తగ్గాయని వైద్యులు తెలిపారు.
దీక్ష విరమించాలని, లేకపోతే అవినాశ్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమంగా మారే ప్రమాదముంది అని వైద్యులు హెచ్చరించారు. అయితే వైద్యుల, పార్టీ నేతల విజ్క్షప్తిని వైఎస్ అవినాష్ రెడ్డి తిరస్కరించారు.
Advertisement
Advertisement