indefinite strike
-
TG: నేటి నుంచి జూడాల నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్జీ సాయిశ్రీ హర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఐజాక్ న్యూటన్, చైర్పర్సన్ డాక్టర్ డి.శ్రీనా«థ్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అంతా ఈ సమ్మెలో పాల్గొంటారని వారు ప్రకటించారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో అనేక చర్చలు జరిగినప్పటికీ, తమ డిమాండ్లకు తగిన పరిష్కారం దొరకలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ సమ్మెకు దిగాల్సి వస్తోందని, తమ సమస్యలు సమగ్రంగా పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. రోగులు, సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల తాము చింతిస్తున్నామని, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. స్టైపెండ్లను సకాలంలో విడుదల చేసేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని, ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. -
అంగన్వాడీల్లో సమ్మె సైరన్!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన రిటైర్మెంట్ పాలసీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూనియన్ నేతలు... విధులు బహిష్కరించి ఉద్యమానికి ఉపక్రమిస్తున్నారు. ఈ నెల 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్కు సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె తేదీ కంటే ముందుగానే డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ల చిట్టాను సమర్పించింది. చర్చలకు విరుద్ధంగా రిటైర్మెంట్ పాలసీ... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించి పదవీ విరమణ ప్యాకేజీని ప్రకటించింది. 65 ఏళ్ల వయసును రిటైర్మెంట్ ఏజ్గా ఖరారు చేసిన ప్రభుత్వం... పదవీ విరమణ పొందిన టీచర్కు రూ.లక్ష, హెల్పర్కు రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రిటైర్మెంట్ అయిన వెంటనే టీచర్ లేదా హెల్పర్కు ఆసరా పెన్షన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గతవారం సంతకం చేయగా... అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్కు పూర్తి విరుద్ధంగా ఉందంటూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్లు ధ్వజమెత్తుతున్నాయి. హామీలకు.. అమలుకు పొంతన లేదు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లపై గత నెలలో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నేతలు పలు డిమాండ్లు మంత్రి ముందు ఉంచారు. ఈ క్రమంలో చర్చించి కొన్ని హామీలు ఇవ్వగా... ఇటీవల సీఎం సంతకం చేసిన ఫైలులోని అంశాలపై ఏమాత్రం పొంతన లేదంటూ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. మంత్రితో చర్చలు జరిపినప్పుడు టీచర్కు రూ.2లక్షలు, హెల్పర్కు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు అందులో సగానికి కోత పెట్టారంటూ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ... అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.26వేలుగా నిర్ధారించాలి విరమణ వయసు 60 ఏళ్లకు కుదించాలి విరమణ పొందిన టీచర్కు రూ.10 లక్షలు, హెల్పర్కు రూ.5లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ నాటికి తీసుకునే వేతనంలో సగం మేర పెన్షన్గా ఇవ్వాలి సీనియారిటీ ఆధారంగా వేతనాలను పెంపుతో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఐసీడీఎస్ పథకానికి నిధులు పెంచి మరింత బలోపేతం చేయాలి. కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలి సమాచార నమోదు కోసం కేంద్ర, రాష్ట్రాలు తెచ్చిన యాప్ల విషయాన్ని పరిశీలించాలి -
సమ్మె బాటన 20,000 మంది ఉద్యోగులు
బెంగళూర్ : వేతన పెంపుపై యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమవడంతో ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు చెందిన 20,000 మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన సవరణపై యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదని, తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్ఏఎల్కు చెందిన తొమ్మిది కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ వెల్లడించారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా 15 రోజుల కిందటే తాము సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. మరోవైపు సమ్మెను నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారని హెచ్ఏఎల్ పేర్కొంది. కాగా హెచ్ఏఎల్కు చెందిన బెంగళూర్, హైదరాబాద్, కోరాపుట్, లక్నో, నాసిక్లోని 5 ప్రొడక్షన్ కాంప్లెక్స్ల్లో 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా హెచ్ఏఎల్కు 4 పరిశోధన అభివృద్ధి కేంద్రాలున్నాయి. -
విలీనం చేసే వరకు సమ్మె
కవాడిగూడ: ప్రభుత్వంలో ఆరీ్టసీని విలీనం చేసే వరకు టీఎస్ఆరీ్టసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ ఆశ్వద్థామరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంస్థ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం ఆశ్వద్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వచ్చిందని తెలిపారు. బస్ రాయితీల రూపంలో ఆరీ్టసీకి ప్రభుత్వం రూ.కోట్లల్లో బకాయి పడిందని, తక్షణమే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5 నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెకు ప్రతి కారి్మకుడు మానసికంగా సిద్ధం కావాలని పేర్కొన్నారు. యూనియన్లకు అతీతంగా హక్కుల కోసం కారి్మకులు ఏకం కావాలన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కారి్మకులకు ప్రజాసంఘాలు, రాజకీయ పారీ్టలు, యూని యన్లు మద్దతు తెలిపాలని కోరారు. సకల జనుల సమ్మె సమయంలో రావాల్సిన జీత భత్యాల సవరణ చేయాలని అన్నారు. -
ఆశా కార్యకర్తల ఆందోళన పట్టదా?
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్లో ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్) కార్యకర్తలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొత్తం దేశంలో దాదాపు పది లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉండగా వారిలో 93,687 మందితో దేశంలోనే రెండో స్థానంలో బిహార్ ఉంది. వీరంతా 12 డిమాండ్లతో డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి. డిసెంబర్ 13, 14 తేదీల్లో ఆశా కార్యకర్తలు జిల్లా ఆస్పత్రులను, సివిల్ సర్జన్ కార్యాలయాలను దిగ్బంధం చేశారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. రాష్ట్రంలోని మూడు ఆశా యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆశా సంయుక్త్ సంఘర్శ్ మంచ్ పిలుపు మేరకు ఆశా కార్యకర్తల సమ్మె దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద వారు రాత్రనక, పగలనకా భైఠాయింపు సమ్మె చేస్తున్నారు. వారికి మద్దతుగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. వారు ఆశా కార్యకర్తలకు అన్న పానీయాలను అందించడంతోపాటు రాత్రిపూట చలిని తట్టుకునేందుకు బ్లాంకెట్లు కూడా తెచ్చి ఇస్తున్నారు. తమకు కూడా ప్రభుత్వ హోదా కల్పించి కనీసవేతనంగా 18 వేల రూపాయలు ఇవ్వాలని, పింఛను సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారిని ఆరోగ్య కార్యకర్తలుగా ప్రభుత్వం పరిగణస్తూ టోకున గౌరవ వేతనం చెల్లిస్తుండగా, ఇక గ్రామీణ ప్రజలేమో ఇప్పటికీ వారిని సామాజిక కార్యకర్తలుగా పరిగణిస్తున్నారు. తమ డిమాండ్లు ఇప్పుడే చేస్తున్న కొత్త డిమాండ్లేవి కావని, 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నవేనని ఆశా కార్యకర్తల నాయకులు తెలియజేస్తున్నారు. నెలవారి జీతాలను, పని పరిస్థితులను హేతుబద్ధం చేయడానికి 2015లో ఉన్నత స్థాయి కమిటీని వేశారని, ఆ కమిటీ చేసిన సిఫార్సులను కూడా నేటికి అమలు చేయడం లేదని నాయకులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని తరగతుల వారు, పట్టణ ప్రాంతాల్లో పేద వాళ్లు, దిగువ తరగతి వాళ్లు ఆశాను నమ్ముకొని బతుకుతున్నారు. ‘జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి ఒకరు చొప్పున ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా వారు ప్రతిరోజు 18 గంటలపాటు పనిచేస్తున్నారు. -
చర్చలు విఫలం.. నిరవధిక సమ్మెలో ఓలా, ఊబర్ డ్రైవర్లు
ముంబై : గురువారం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నిరవధికంగా సమ్ మెను కొనసాగించాలని క్యాబ్ డ్రైవర్లు నిశ్చయించుకున్నారు. క్యాబ్ సంస్థల యాజమాన్యం డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఓలా, ఉబర్ సంస్థలు తమకు చెల్లించే వాటాను పెంచాలని, దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్లతో ముంబై నగరంలోని క్యాబ్ డ్రైవర్లు గత పదకొండు రోజులుగా సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఓలా, ఊబర్ సంస్థల యాజమాన్యం తమ డిమాండ్లను పట్టించుకోవటంలేదని ‘‘మహారాష్ట్ర రాజ్య రాష్ట్రీయ కమ్గర్ సంఘ్’’(ఎమ్ఆర్ఆర్కేఎస్) ఆరోపించింది. ఎమ్ఆర్ఆర్కేఎస్ అధ్యక్షుడు గోవింద్ మోహితే మాట్లాడుతూ.. ఓలా, ఊబర్ సంస్థల యాజమాన్యం పోలీసు అధికారుల సమక్షంలో తమ సమస్యలపై సానుకూలంగా స్పందించినా.. చర్చల్లో ఇందుకు భిన్నంగా నడుచుకున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. జీతాలు పెంచుతానని చెప్పి తమని మోసం చేసిన ఓలా, ఊబర్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. చదవండి : మూడో రోజుకు చేరిన ఓలా, ఉబర్ స్ట్రైక్ -
ఎలా గెలుస్తారో చూస్తాం...
విజయనగరం మున్సిపాలిటీ: సమస్యలు పరిష్కారమిస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హమీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుంచి కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశీ స్పష్టం చేశారు. ఇదే తరహాలో వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు. స్థానిక వీటీ అగ్రహారం సబ్స్టేషన్ వద్ద జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా జేఏసీ నాయకులు బి.గోవిందరావు, సంతోష్కుమార్, ఎం.వెంకటఅప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వేదికపై ఉన్న అతిథులంతా చేయి చేయి కలిపి సమరశంఖం పూరించారు. రాష్ట్రంలో 35 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తన మేనిఫేస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న తమ గురించి పట్టించుకోకపోవటం దారుణమన్నారు. మరో వైపు పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి తమ సమస్యలపై విన్నవించినా పట్టించుకున్న వారు లేకపోయారన్నారు. చివరికి గత నెల 25 వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా... సమ్మెను వాయిదా వేయాలని... ఈనెల 4లోగా సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇవ్వగా.. ఎటువంటి స్పందన లేదన్నారు. 15 నుంచి 20 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ప్రాణాలకు తెగించి వెట్టి చాకిరి చేస్తున్న తమకు పీసు రేటు పెట్టి బానిసలుగా చూస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన కనీస వేతనాలు అమలు చేయలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి మా కుటుంబాలకు చెందిన ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నేడు ప్రభుత్వం వైఖరి చూస్తుంటే వ్యతిరేక ఓటు తప్పనిసరిగా మారిందన్నారు. తక్షణమే పీసు రేటును రద్దు చేయాలని, కాంట్రాక్టు్ట ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 20 నుంచి మరోమారు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతుగా వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బికెవి.ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అప్పలసూరి, సీపీఐ జిల్లా కార్యదర్శి వి.కృష్ణంరాజు తదితరులు మద్దతుగా మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని, ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించేంత వరకు వెన్నంటే ఉంటామంటూ సంఘీభావం తెలిపారు. అధిక సంఖ్యలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
-
వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అగ్రిగోల్డ్ బాధితులు మంగళవారం కలిశారు. మార్చి 3 నుంచి కృష్ణా జిల్లా విజయవాడలో తాము చేపట్టనున్న నిరవధిక దీక్షకు మద్దతివ్వాలని వైఎస్ జగన్ ను అగ్రిగోల్డ్ బాధితులు కోరారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అగ్రిగోల్డ్ బాధితులు వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీ్దకరించాలి
కరీంనగర్సిటీ : కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వా, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ డిమాండ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు నిరవధిక సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్ష సోమవారం 5వ రోజుకు చేరింది. దీక్షాశిబిరాన్ని విశ్వా, డాక్టర్, నగేశ్, జిల్లా మా జీ అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మా జీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సందర్శించి మద్ద తు పలికారు. గతంలో కేసీఆర్ కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్పై హామీ ఇచ్చిన వీడియో క్లిప్ను ప్రదర్శించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశార ని విమర్శించారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తామన్న కేసీఆర్ నేడు ముఖం చాటేశారని, కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్లు సాధించుకునేంత వరకు ఈ పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్ ఉన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవేందర్, నర్సింహరాజు, నాయకులు రాజమహేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆందోళన బాటలో ఎల్పీజీ డీలర్లు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్లక్ష్య వైఖరికి నిరనసగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు భారత ఎల్పీజీ డీలర్ల సమాఖ్య ప్రకటించింది. ఢిల్లీలో సమావేశమైన అన్ని రాష్ట్రాలకు చెందిన సమాఖ్య ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపింది. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లే, వినియోగించే వారికి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, రకరకాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కొత్త డిస్ట్రిబ్యూటర్లను నియమించరాదని, కమీషన్ పెంచాలని, పటిష్టమైన లాకింగ్ కలిగిన సిలిండర్లు మాత్రమే సరఫరా చేయాలని, 5 కిలోల సిలిండర్లను అందుబాటులోకి తేవాలనే తదితర డిమాండ్లను సమాఖ్య చాలా కాలంగా చేస్తోంది. వీటిని ఆయిల్ కంపెనీలు, పెట్రోలియం శాఖలు పట్టించుకోకపోవడంతో ఆందోళన ప్రణాళిక రూపొందించినటు సమాఖ్య జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రావు, పవన్సోని తెలిపారు. నవంబరు 5 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఆరంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను చైతన్య పరిచేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తారు. నవంబరు 22న అర్ధరోజు పాటు డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలు మూసివేస్తారు. నవంబర్ 29, డిసెంబర్ 1న పూర్తిరోజు కార్యాలయాలు మూసివేస్తారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో డిసెంబరు 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతారు. -
ప్రజారోగ్యం పట్టదా?
ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి సిగ్గు రాలేదు దారుణ పరిస్థితులున్నా మంత్రులు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్సీ గేయానంద్ ధ్వజం సర్వజనాస్పత్రి ఎదుట నిరవధిక దీక్ష అనంతపురం సిటీ : ‘ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా అనంతలో చిన్నపాటి జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గుగా అనిపించడం లేదు. సర్వజనాస్పత్రిలో 350 పడకల మీద 1,006 మంది రోగులను ఎలా పడుకో బెడతారో అర్థంకావడం లేదు. 50 పడకలున్న చిన్న పిల్లల వార్డులో 200 మంది చేరారు. వారిని ఇక్కడ చేర్చుకోకుండా వైద్యులు బయటకు పంపలేరు కదా! ప్రభుత్వం ప్రతిదానికీ వైద్యులపై పడే బదులు.. ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే ఏ సమస్యా ఉండద’ని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ సోమవారం స్థానిక ఆస్పత్రి ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి వచ్చిన ఎమ్మెల్సీ.. చిన్న పిల్లల వార్డును తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు చికిత్స అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను వైద్యులు ఏకరువు పెట్టడంతో ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు నేరుగా ఆస్పత్రి ముఖద్వారం వద్దకు చేరుకుని బైఠాయించారు. రాత్రి వర్షంలోనే దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లా మొత్తానికి ఏకైక దిక్కయిన సర్వజనాస్పత్రిని ఇంతటి దారుణస్థితిలో ఉంచుతుందా అని ప్రశ్నించారు. పాతికేళ్లకు పైగా సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అనేకమార్లు వచ్చివెళుతున్నా సర్వజనాస్పత్రి సమస్యలు మాత్రం తీర్చడం లేదన్నారు. అనంతపురం బోధనాస్పత్రిలో పడకల పెంపు, 510 ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన 124 జీవోను తక్షణం అమలు చేయాలని ఇప్పటికే చాలాసార్లు మంత్రులను కలిసి విన్నవించామన్నారు. అయితే ఎవరూ స్పందించడం లేదన్నారు. విష జ్వరాలతో చిన్న పిల్లలు చనిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే దాకా నిరవధిక దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. దీక్షకు వైఎస్సార్సీపీ నేత చవ్వా రాజశేఖరరెడ్డి, ప్రజాసంఘాల నాయకులు, రచయితలు, మేధావులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకులు అంజి, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేడు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల అనంతపురం సెంట్రల్ : ఈ నెల 25లోగా గొల్లపల్లి రిజర్వాయర్ వరకూ నీటిని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో మంత్రి సునీత కూడా నీటి విడుదలపై ప్రకటన చేశారు.lసీఎం మాట నెగ్గించుకునేందుకు హడావుడిగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా ఫేజ్–2 కాలువకు మంగళవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నామని హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ జలంధర్ తెలిపారు. ప్రస్తుతం 90 కిలోమీటరు వరకు నీటిని తీసుకుపోతామన్నారు. నెల, రెండు నెలల తర్వాత పనులు పూరై్తతే గొల్లపల్లి రిజర్వాయర్ వరకూ నీటిని తీసుకుపోతామన్నారు. ఓ వైపు హెచ్చెల్సీ సాగులో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. మరో వైపు రెండేళ్లుగా పంటల సాగుకు నోచుకోక ఆయకట్టు బీడుగగా మారింది. రూ. కోట్లు ఖర్చు చేసి శ్రీశైలం జలాశయం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. ఒక్కో టీఎంసీ తీసుకురావడానికి రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత విలువైన జలాలను కాలువల్లో పారించడం కోసమేనా ? అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుంది. కనీసం తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఆర్బాటం కోసం మాత్రమే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి చెరువులకు నీరు విడుదల అనంతపురం సెంట్రల్ : మిడ్పెన్నార్ సౌత్ కెనాల్ కింద ఉన్న చెరువులకు మంగళవారం నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ కెనాల్ కింద దాదాపు 23 చెరువులు ఉన్నాయన్నారు. హంద్రీనీవా నుంచి వచ్చే నీటిని బట్టి హెచ్చెల్సీ సౌత్, నార్త్ ఇతర కాలువ కింద ఆయకట్టుకు నీరు వదలాల వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తామని వివరించారు. -
‘మహా ప్రభో..మా గోడు వినండి’
- నిరవధిక సమ్మెలో ఏజీ వర్సిటీ టైమ్స్కేల్ ఉద్యోగులు - రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ఏల ఊసెత్తని ప్రభుత్వం - డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ సాక్షి ప్రతినిధి, తిరుపతి ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కేంద్రాల్లో పనిచేసే టైమ్స్కేల్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడచిన నెల రోజులుగా వీరు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నెల రోజుల్లోగా డిమాండ్లను పరిష్కరిస్తామన్న వర్సిటీ అధికారులు మళ్లీ ఉద్యోగుల ముఖం చూసింది లేదు. దీంతో టైమ్స్కేల్ ఉద్యోగులంతా డిమాండ్ల సాధన కోసం రోజుకో పద్దతిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం 900 మంది టైమ్స్కేల్ ఉద్యోగులున్నారు. వీరంతా మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగాల్లో నియమితులైన వారే. అప్పట్లో మొత్తం 1650 మంది ఉద్యోగాల్లో చేరగా, 2014 నాటికి 900 మంది మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ప్రభుత్వం వీరికి మూలవేతనం, డీఏలను మాత్రమే చెల్లిస్తోంది. ఇవి రెండూ కలిపి ఒక్కొక్కరికీ నెలకు రూ. 14 వేల వరకూ అందుతున్నాయి. వీరి నియామకాల సమయంలో హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్సులపై ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంతేకాకుండా జీవో నెంబరు 119 కింద వీరి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా వీరి సమస్యలపై స్పందించనే లేదు. ఇప్పటికి పలు మార్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు, వర్సిటీ రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణలను కలిసిన టైమ్స్కేల్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేశారు. వారి నుంచి సరైన స్పందన కరువవడంతో గుంటూరులోని వర్సిటీ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. గుంటూరు,తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, కడప, కర్నూలుల్లో వర్సిటీ పరిధిలోని టైమ్స్కేల్ ఉద్యోగులు రోజుకో విధంగా నిరసనలు, ఆందోళనలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని యూనివర్సిటీ టైమ్స్కేల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ మురళీ కోరుతున్నారు. -
'చంద్రబాబు నాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు'
కాకినాడ : దీక్ష సమయంలో తనను దారుణంగా హింసించారని కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ పద్మనాభం సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో చంద్రబాబు సర్కార్ చూపించిందని తెలిపారు. దీక్ష సమయంలో తన భార్య, కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని విమర్శించారు. తన చిన్న కుమారుడుని కొట్టుకుంటూ లాక్కెళ్లారని చెప్పారు. పెద్ద కుమారుడుకి ఇటీవలే వెన్నుముక ఆపరేషన్ జరిగిందని... అతడిని కూడా లాక్కెళ్లాలని చూస్తే... ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడని ముద్రగడ తెలిపారు. తుని ఘటనకు ముమ్మాటికీ చంద్రబాబు సర్కారే కారణమన్నారు. కాపులను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర చేసి కేసుల్లో ఇరికించారని విమర్శించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అమలు చేయమంటున్నామని ముద్రగడ స్పష్టం చేశారు. తుని ఘటనపై లోతుగా పరిశీలిస్తామని చెప్పి... మాట తప్పారని చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. తుని ఘటనపై సీబీఐ విచారణకు పట్టుబట్టొద్దని ప్రభుత్వ పెద్దలే తనని కోరారని ఈ సందర్భంగా ముద్రగడ గుర్తు చేశారు. తుని ఘటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా... తనతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. తమ ఉద్యమానికి బీసీలు, దళితుల మద్దతు కూడా ఉందని ముద్రగడ తెలిపారు. బీసీలకు నష్టం జరగకుండానే రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తాను మంజునాథ కమిషన్పై ఆశావాహ దృక్పథంతోనే ఉన్నానని చెప్పారు. జులై చివరికల్లా సర్వే పూర్తి చేస్తారని భావిస్తున్నట్లు ముద్రగడ తెలిపారు. ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణను జేఏసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. తమ జాతికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. -
జూలై 11 నుంచి రైల్వే నిరవధిక సమ్మె నోటీసు
రైల్ నిలయం వద్ద నేడు బహిరంగ సభ హైదరాబాద్: ఏడో వేతన సంఘం సిఫార్సులు రైల్వే కార్మికులకు తీవ్ర నిరాశను కలిగించాయని..ఈ సిఫార్సులకు నిరసనగా జూలై 11 నుంచి అఖిల భారత రైల్వే నిరవధిక సమ్మెకు రైల్వే సంఘాలు పిలుపునిచ్చినట్లు రైల్ మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుభాష్ మాల్గి తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మజ్దూర్ యూనియన్ సభ్యులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూలై 11 నుంచి అఖిల భారత రైల్వే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తూ రైల్వేలోని రెండు గుర్తింపు సంఘాలు నోటీసులు జారీచేశాయన్నారు. రైల్వే ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సాధించుకొనేందుకు ఈ సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. సమ్మె విజయవంతం చేయడానికి సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని అన్ని సంఘాల నాయకులను కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గీరం రాంప్రభు, హరిబాబు, పి. మోహన్, ఆదినారాయణ, మధుసూదన్రెడ్డిలు పాల్గొన్నారు. -
త్వరలో దేశవ్యాప్తంగా మందుల దుకాణాల బంద్
అఖిల భారత కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సంఘం ప్రకటన సాక్షి, హైదరాబాద్: మందుల దుకాణాదారులకు నష్టం కలిగించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా త్వరలో దేశవ్యాప్తంగా మందుల దుకాణాల బంద్ చేపడతామని అఖిల భారత కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సంఘం ప్రకటించింది. సంఘం అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్లో జరుగనుంది. సమావేశం ఎజెండాను సంఘం అధ్యక్షుడు జేఎస్ షిండే, ప్రధాన కార్యదర్శి సురేష్గుప్తా, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటపతి శనివారం ఇక్కడ విలేకరులకు వెల్లడించారు. బంద్ తేదీని సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేయాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. కేంద్రం 344 అత్యవసర మందులను నిషేధించిందని, అయినా కొందరు స్టే తెచ్చుకొని వాటిని విక్రయిస్తున్నారన్నారు. ఆన్లైన్లో విక్రయాల వల్ల యువత నిద్ర మాత్రలు, మత్తు కలిగించే ఇతరత్రా మందులను కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగా నష్టపోతారన్నారు. అందుకే ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలన్నారు. లెసైన్స్ ఫీజును రూ.3 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీన్ని ఉపసంహరించుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. -
జూలై 11 నుంచి రైళ్లుండవ్..!
న్యూఢిల్లీ : వచ్చే నెల 11 నుంచి పట్టాలపై రైళ్లకు బ్రేక్ పడనున్నాయి. జూలై 11 నుంచి రైల్వేల నిరవధిక సమ్మెకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) పిలుపునిచ్చింది. కొత్త పెన్షన్ స్కీమ్ పై రివ్యూ , ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వంటి పలు డిమాండ్ లతో రైల్వే యూనియన్లు ఈ నిరవధిక బంద్ చేపట్టనున్నాయి. రైల్వే యూనియన్లు గురువారం బంద్ నోటీసును ప్రభుత్వానికి అందజేశాయి. అన్ని జోనల్ రైల్వేస్ జీఎంలకు, ప్రొడక్షన్ యూనిట్లకు నేడు నిరవధిక సమ్మె నోటీసులు అందనున్నాయి. ఈ నోటీసు ప్రకారం జూలై 11 ఉదయం 6గంటలనుంచి 13లక్షల మంది రైల్వే వర్కర్లు సమ్మె పాటించనున్నారని ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్(ఏఐఆర్ఎఫ్) జనరల్ సెక్రటరీ ఎస్ గోపాల్ మిశ్రా తెలిపారు. ఏడవ వేతన సిఫారసు మేరకు కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000 కు పెంచాలని మిశ్రా డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలల క్రితం అంటే 2015 డిసెంబర్ లో తమ డిమాండ్లను తెలుపుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ పంపామని, అయితే ప్రభుత్వం స్పందించిన తీరు చాలా నిర్లక్ష్యంగా, నిరాశకంగా ఉందని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఎమ్.రాఘవయ్య తెలిపారు. ఈ నిరవధిక సమ్మె కాలంలో ఎలాంటి రైల్వేలు పట్టాలపై నడవబోవని ఎన్ఎఫ్ఐఆర్ తెలిపింది. ఎన్ఎఫ్ఆర్ఐ, ఏఐఆర్ఎఫ్ రెండు యూనియన్లు ఈ నిరవధిక సమ్మెకు సంయుక్తంగా మద్దతు తెలుపుతున్నాయని, ఈ రెండు యూనియన్ల డిమాండ్లు ఒకటేనని రాఘవయ్య చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. -
నేటి నుంచి టి.విద్యుత్ ఉద్యోగుల ఆమరణదీక్ష
సాక్షి, హైదరాబాద్: ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సోమవారం నుంచి విద్యుత్సౌధలో ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. జేఏసీ నేతలు ఎం.అమర్ సింగ్, షేక్ జహురుల్లా, హరికిషణ్, ఎన్.బాలకృష్ణ, జి.రమేశ్ ఆమరణ దీక్షలో పాల్గొంటారని వెల్లడించింది. -
దీక్ష విరమించిన చలసాని
అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్తో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చేపట్టిన దీక్ష బుధవారం విరమించారు. ప్రత్యేక హోదా కోసం ఆదివారం నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన తీవ్ర అనారోగ్యం పాలైతే... పోలీసులు ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా ఆయన ప్రత్యేక హోదా కోసం దీక్షను విరమించలేదు. బుధవారం ఆస్పత్రికి చేరుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిమ్మరసం ఇచ్చి చలసాని శ్రీనివాస్ చేపట్టిన దీక్షను విరమింపజేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ మేరకే తాను చేపట్టిన దీక్ష విరమిస్తున్నట్లు చలసాని శ్రీనివాస్ ప్రకటించారు. -
సమర స్ఫూర్తి
రైల్వేజోన్ సాధనే ఏకైక లక్ష్యం అమర్నాథ్ నిరవధిక దీక్ష {పారంభం పార్టీలు, ప్రజా సంఘాల సంఘీభావం భారీ ర్యాలీలో హోరెత్తిన జోన్ నినాదాలు పాలకుల నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహ జ్వాలలు ఫోన్ చేసి భరోసా ఇచ్చిన వై.ఎస్.జగన్ భానుడి భగభగలను తలదన్నేలా ఉద్యమస్ఫూర్తి రగిలింది.. రైల్వే జోన్ కోసం నేను సైతం.. అంటూ నినదించింది. ఉక్కు సంకల్పం.. సమర దీక్షగా మారింది. పోరాడితే పోయేదేం లేదు.. రైల్వే జోన్ సాధించడం తప్ప.. అన్నట్లు వేల గొంతుకలు ఒక్కటై జోన్ దీక్షకు జై కొట్టాయి. పదం పదం కలిపి ర్యాలీగా అడుగులు కదిపి దీక్షాస్థలికి చేరుకున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాల దీప్తి.. దివంగత మహానేత వైఎస్ పోరాట స్ఫూర్తి.. సీఎస్ రావులాంటి పెద్దల ఆశీస్సులు తోడుండగా అమర్నాథ్ నిరవధిక దీక్షకు అంకురార్పణ జరిగింది. రాజకీయాలకతీతంగా సంఘీభావం కొండంత అండగా నిలిచింది. విశాఖపట్నం మండుటెండ మంటపెడుతున్నా లెక్క చేయకుండా రైల్వే జోన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విశాఖకు రైల్వేజోన్ సాధనే ఏకైక లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గురువారం ప్రారంభించిన నిరవధిక దీక్షకు ఉత్తరాంధ్ర నుంచి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంటరాగా అమర్నాథ్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి వేలాదిమందితో భారీ ర్యాలీగా జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షా వేదికకు చేరుకున్నారు. రిటైర్డ్ ఐఈఎస్ అధికారి సీఎస్ రావు ఆశీర్వాదం తీసుకుని ఉదయం 11గంటలకు అమర్నాథ్ దీక్ష చేపట్టారు. సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమర్నాథ్కు ఫోన్ చేసి మరీ దీక్షకు పార్టీ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ సీనియర్నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఈ దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, వి.కళావతి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డిశాంతి తదితరులు కూడా హాజరై మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, మళ్ల విజయ్ ప్రసాద్, గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్. నర్సింగరావు, లోక్సత్తా భీశెట్టి బాబ్జీలతోపాటు పలు ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక, జర్నలిస్టు సంఘాలు, ఎన్జీవోలు కూడా ఈ దీక్షకు పూర్తి సంఘీభావం తెలపడం విశేషం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ముప్పేట దాడి విశాఖ రైల్వేజోన్ ప్రకటించకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతున్న టీడీపీ, బీజేపీలపై ఈ దీక్షలో వక్తలు విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి లోపానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంపై ఉన్న శ్రద్ధ సీఎం చంద్రబాబుకు రైల్వేజోన్ సాధన మీద లేదని మండిపడ్డారు. దీక్షకు సంఘీభావం ప్రకటించమని కోరినప్పటికీ టీడీపీ, బీజేపీలు ఎందుకు ముఖం చాటేశాయని పలువురు వక్తలు నిలదీశారు. గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షకు భారీ సంఖ్యలో వివిధ పార్టీల నేతలు, ఇతర వర్గాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, ఉమాశంకర్ గణేష్, రాష్ట్ర గిడ్డంగులు సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, శ్రీకాంత్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోకు, రాష్ట్ర పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ మహిళా విభాగం ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ వరుదు కల్యాణి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉషాకిరణ్, షరీఫ్, వాసు, బోని శివరామకృష్ణ, బదరీనాథ్, రాధ, తిప్పల వంశీ, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు, పార్టీ నేతలు రొంగలి జగన్నాథం, అల్ఫా కృష్ణ, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, నిర్మలా రెడ్డి, పరదేశీ, హేమంత్కుమార్లతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా బీసీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, నగర కార్యదర్శి గంగారామ్, సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్, లోక్సత్తా భీశెట్టి బాబ్జీ, రైల్వే శ్రామిక యూనియర్ జోనల్ అధ్యక్షుడు చలసాని గాంధీ, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ శివశంకర్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వర్మ తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. -
సమ్మె విరమించిన బంగారం వర్తకులు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని బంగారు వర్తకులు నిరవధిక సమ్మెను విరమించారు. బుధవారం నుంచి షాపులు తెరిచి వ్యాపారం కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం సాయంత్రం వరకూ న్యూఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వ్యాపార సంఘ ప్రతినిధులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్, చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్లు ఢిల్లీ నుంచే ఫోన్ల ద్వారా సమాచారం పంపారు. బుధవారం నుంచి షాపులు తెరవాలని వివిధ జిల్లాల వ్యాపార సంఘ ప్రముఖులకు మెసేజ్లు పంపారు. కేంద్రం విధించిన ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నుకు నిరసనగా రాష్ట్రంలోని బంగారు వ్యాపారులు మార్చి 29 నుంచి రెండో దశ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న విషయం విదితమే. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 వేల షాపులు మూతపడ్డాయి. రోజుకు రెండున్నర వేల కోట్ల వ్యాపారం నిలిచిపోయింది. కొన్ని పట్టణాల్లో కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు సమ్మెకు కలిసి రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. కొత్త రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మార్చి 29న విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశించినా వ్యాపారులు ఖాతరు చేయలేదు. ఎక్సైజ్ డ్యూటీ పరిధిలోకి వచ్చే వ్యాపారులందరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు చేసిన సూచననూ పట్టించుకోలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ ఆఖరుకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. మార్చి నెల ఒకటో తేదీ నుంచి వీటిని చేయించుకోవాల్సి ఉండగా, నెల రోజులు గడిచినా 20 శాతం రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి కాలేదు. మంగళవారం ఢిల్లీలో కేంద్రంతో జరిపిన చర్చలు ఆశాజనకంగా లేకపోవడంతో ఆందోళన చెందిన రాష్ట్రానికి చెందిన వ్యాపార సంఘం ప్రతినిధులు గత్యంతరం లేక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
సమరమే..
రైల్వే జోన్ కోసం ఆందోళన ఉధృతం నేడు వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశం 14 నుంచి నిరవధిక దీక్షకు ‘గుడివాడ’ సిద్ధం విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే అ తిపెద్ద్ద డివిజన్ వాల్తే రు. రైల్వే జోన్ మొత్తమ్మీద వచ్చే ఆదాయంలో సగానికి పైగా ఈ డివిజన్ నుంచే వస్తోంది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా ద్వారా వాల్తేరు డివిజన్కు దాదాపు రూ.7 వేల కోట్ల రాబడి సమకూరుతోంది. ఒక్క సాధారణ టిక్కెట్ల ద్వారానే రోజుకు రూ.25 లక్షలు తెస్తోంది. అయినా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యమే చూపుతోంది. ఏళ్ల తరబడి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా మునుపటి, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలోనూ వాల్తేరు జోన్ ఏర్పాటు అంశాన్ని పేర్కొనడంతో 2015, 2016 రైల్వే బడ్జెట్లలో ప్రకటిస్తారని ఆశించినా ఫలితం లేదు. వాల్తేరు డివిజన్ రైల్వేకి ఆదాయాన్ని తెచ్చే బంగారు బాతుగుడ్డులా మారడంతో దీనిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఎంపీలే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీలు చిక్కినప్పుడలా జోన్ ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తోందంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు నానా హడావుడీ చేసేస్తున్నారు. చివరికి మొండి చేయే చూపిస్తున్నారు. విశాఖపట్నం డివిజన్ను ప్రత్యేక జోన్ చేయడానికి అర్హతలు లేవా? అంటే మిగతా జోన్లకంటే ఎక్కువ అవకాశాలు, అర్హతలు దీనికే ఉన్నాయి. కానీ విశాఖకంటే తక్కువ వనరులు, డివిజన్లున్న ఇతర రాష్ట్రాల్లో రైల్వే జోన్లు ఏర్పాటు చేసేశారు. పైగా ఏ కమిటీలు వేయకుండానే ఆయా రాష్ట్రాల్లో జోన్లు ఏర్పాటవగా, విశాఖ జోన్ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ఓ కమిటీ వేసి కాలయాపన చేస్తూ వస్తున్నారు. చత్తీస్గఢ్లో రాయ్పూర్, బిలాస్పూర్ డివిజన్లున్నాయి. కానీ అక్కడ బిలాస్పూర్ డివిజన్ ఇచ్చారు. తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లుండగా హైదరాబాద్ జోన్ ఏర్పాటు చేశారు. కర్నాటకలో హుబ్లి, మైసూర్, బెంగళూరు డివిజన్లతో హుబ్లి జోన్ ఇచ్చారు. ఒడిశాలో సంబల్పూర్, ఖుర్దా డివిజన్లకు భువనేశ్వర్లో జోన్ ఏర్పాటు చేశారు. కానీ విశాఖకు విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో కలిపి నాలుగు డివిజన్లున్నా జోన్కు నోచుకోవడం లేదు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా ఆదాయం ఏటా సుమారు 12 వేల కోట్లు. ఇందులో సగానికి పైగా అంటే రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12-14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ పాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోర్టు ట్రస్టు, మరొక ప్రయివేటు పోర్టు, అతిపెద్ద స్టీల్ప్లాంట్, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్ వంటివి ఇక్కడే ఉన్నాయి. ఇన్ని ఉన్నా లేనివల్లా అధికార పార్టీ నేతల్లో చిత్తశుద్ధి.. ఉద్యమస్ఫూర్తి. అర్ధ శతాబ్దం నుంచి... విశాఖపట్నానికి జోన్ ఏర్పాటు డిమాండ్ ఈనాటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల క్రితం అప్పటి లోక్సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం తొలిసారిగా పార్లమెంటులో జోన్ డిమాండ్ను లేవనెత్తారు. అప్పట్నుంచి జోన్ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా అవేమీ కేంద్రం చెవికెక్కడం లేదు. యూపీఏ ప్రభుత్వం 2013 మార్చిలో విశాఖకు రైల్వే జోన్పై ఓ కమిటీ వేసింది. ఆ నివేదికపై అతీగతీ లేదు. 2003కి ముందు దేశంలో 9 జోన్లుండేవి. అవి కాలక్రమంలో 17 జోన్లకు పెరిగాయి. కానీ వాటికేమీ కమిటీలు వేయలేదు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో అవి ఏర్పడిపోయాయి. కానీ విశాఖకు జోన్ విషయానికి వచ్చేసరికి ఏటేటా ఏవేవో పితలాటకాలతో వాయిదా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 3, ముంబైలో రెండు జోన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క జోన్ కూడా లేదు. అయినా విశాఖకు జోన్ ఇవ్వడం లేదు. జోన్తో ప్రయోజనాలివీ.. విశాఖకు జోన్ వస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. కొత్తగా రైల్వే లైన్లు వస్తాయి. కొత్త ప్రాజెక్టులూ మంజూరవుతాయి.రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) సెంటరు ఏర్పాటవుతుంది. దీనిద్వారా ‘సి’ తరగతి ఉద్యోగాల నియామకాలకు వీలుంటుంది.రైల్వే రిక్రూట్మెంట్ సెంటరు కూడా వస్తుంది. దీంతో నాలుగు తరగతి (సి) నియామకాలు జరుపుకోవచ్చు.జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటవుతుంది. దీంతో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్తగా రెండు, మూడు వేల క్వార్టర్ల నిర్మాణం జరుగుతుంది.డిమాండ్ ఉన్న ప్రాంతాలకు రైల్వే బోర్డుతో పనిలేకుండా కొత్త రైళ్లను వేసుకోవచ్చు. దీంతో కొత్త రైళ్ల కోసం బోర్డుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.లోకల్ ట్రైన్లకు కూడా నడుపుకోవచ్చు. విశాఖలో ప్లాట్ఫారాల సంఖ్య పెరుగుతుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు పెరుగుతాయి. జోనల్ హాస్పిటల్ ఏర్పాటవుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, అంతకు మించి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. -
34వ రోజుకు జువెలర్స్ సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపునకు నిరసనగా జువెలర్స్ చేస్తోన్న నిరవధిక సమ్మె సోమవారం నాటికి 34వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు జువెలరీ అసోసియేషన్స్ సోమవారం కూడా పలు చోట్ల ధర్నాల రూపంలో నిరసనను తెలియజేశాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ జైన్ తెలిపారు. -
తొమ్మిదో రోజుకు చేరినజువెలర్స్ సమ్మె
పరిశ్రమకు రూ.60వేల కోట్లకు పైగా నష్టం! ముంబై: జువెలర్స్ నిరవధిక సమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరింది. దీంతో ఇప్పటిదాకా జువెలరీ పరిశ్రమకు రూ.60,000 కోట్లకు పైగా ఆదాయపు నష్టం వచ్చింటుందని అంచనా. తాజా బడ్జెట్లోని ఎక్సైజ్ సుంకం ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని జువెలరీ ట్రేడ్ సహా ఇతర అనుబంధ వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 358 అసోసియేషన్స్కు చెందిన రిటైలర్లు, హోల్సెల్లర్స్, ఆభరణాల తయారీదారులు ఈ నెల 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే రూ.2 లక్షలు, అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలు లావాదేవీలకు పాన్ నిబంధన తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వ చర్యనూ వ్యతిరేకిస్తున్నారు. జెమ్స్ అండ్ జువెలరీ రంగపు రోజూవారీ ఆదాయం రూ.7,000 కోట్లు గా ఉంటుందని, ఈ ప్రతిపాదికన ఇప్పటిదాకా రూ.60,000 కోట్లకుపైగా నష్టం వచ్చింటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ శ్రీధర్ తెలిపారు. -
బంగారు వర్తకుల నిరవధిక సమ్మె
ముంబై: బంగారం వ్యాపారులు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. 2016 ఆర్థిక బడ్జెట్ లో బంగారు ఆభరణాలపై అమ్మకం పన్ను విధించడానికి వ్యతిరేకంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. బంగారు ఆభరణాలపై నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ అమ్మకపు పన్ను విధించడాన్ని వర్తక సంఘం వ్యతిరేకించింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్టు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగార వినియెగాదారుగా ఉన్న ఇండియాపై దీని ప్రభావం మరింతగా పడనుందని వాదిస్తున్నారు. ఇప్పటికే బంగారం ధరలు బాగా పెరగడంతో గత రెండు మూడు నెలలుగా డిమాండ్ బాగా తగ్గిందన్నారు. కొనుగోళ్లు పడిపోవడంతో నష్టాలను చవి చూస్తున్నామని, ఈ పరిస్థితుల్లో అమ్మకంపన్ను విధించడంతో తమపై మరింత ప్రభావం పడుతుందని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారతదేశం బులియన్ మరియు జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి కేతన్ ష్రాఫ్ విజ్ఞప్తి చేశారు. కాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2016 లో బంగారం, వజ్రాల ఆభరణాల 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే.