సాక్షి, హైదరాబాద్: ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సోమవారం నుంచి విద్యుత్సౌధలో ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. జేఏసీ నేతలు ఎం.అమర్ సింగ్, షేక్ జహురుల్లా, హరికిషణ్, ఎన్.బాలకృష్ణ, జి.రమేశ్ ఆమరణ దీక్షలో పాల్గొంటారని వెల్లడించింది.